breaking news
Tollywood Actress
-
చిన్నప్పుడు డబ్బులు దొంగతనం చేశా: మంచు లక్ష్మీ
టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఏర్పాటు చేసిన ఈవెంట్కు హాజరైన ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. మా నాన్న మోహన్ బాబుకు సేవాగుణం మొదటి నుంచే ఉందన్నారు. ఆయన తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేశారని తెలిపారు. నాన్నలాగే నాకు సేవాగుణం ఎక్కువేనని అన్నారు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ పర్సులో నుంచి డబ్బులు దొంగతనంగా తీసుకుని చాలా మందికి ఇచ్చేదాన్ని అంటూ ఫన్నీగా మాట్లాడారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ..'నా లైఫ్లో ఆదర్శం నాన్నే. నా చిన్నప్పుడు మా ఇంటికి చాలామంది వచ్చేవాళ్లు. దాదాపు రెండు నెలలపాటు ఉండేవాళ్లు. తిరిగి వెళ్లేటప్పుడు నాన్నను ఏదో ఒకటి కావాలని అడిగేవారు. ముక్కు, మొహం తెలియని వాళ్లకు కూడా సాయం చేశారు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా ఎంతో చేశారు. విద్యానికేతన్ ద్వారా ఎంతోమందికి విద్యనందిస్తున్నారు. అలా మమ్మీ పర్సులో డబ్బులు తీసి ఎంతోమందికి ఇచ్చేదాన్ని. స్లమ్స్లోకి వెళ్లనప్పుడు వారి జీవన విధానం చూసి బాధపడేదాన్ని. నా వంతు సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటా' అని చెప్పుకొచ్చింది. కాగా.. అంతకు ముందు ఈవెంట్కు హాజరైన మంచు లక్ష్మీ తన డ్యాన్స్తో అదరగొట్టింది. రాను బొంబైకి రాను.. అంటూ సాగే ఫేమస్ ఫోక్ సాంగ్కు స్టెప్పులేసింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ మంచు లక్ష్మీ డ్యాన్స్కు ఫిదా అవుతున్నారు. -
చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)
-
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
-
'చిన్నప్పుడు ఎన్నో కష్టాలు.. నా బిడ్డకు అలా జరగకూడదు': సమంత
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ తన సొంత బ్యానర్లోనే నిర్మించింది. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే సామ్పై కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. గత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళంటే నాకెంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా' అని అన్నారు.కాగా.. సామ్ ఇటీవల మూవీ ప్రమోషన్స్లో శారీలో కనిపించారు. బేబీ బంప్తో ఉండడం వల్లే ఆమె అలా ఈవెంట్స్కు హాజరయ్యారని నెటిజన్స్ భావిస్తున్నారు. సమంత- రాజ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
-
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
-
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
-
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
-
డిఫరెంట్ పోజుల్లో శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
-
సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు
-
మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ఖాతాలో హిట్ పడిందా?
టైటిల్: మా ఇంటి బంగారంనటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులుదర్శకత్వం: నందిని రెడ్డినిర్మాణ సంస్థ: ట్రాలాలా పిక్చర్స్మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్విడుదల తేదీ: 19 జూన్ 2026టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించింది. అభిమానుల అంచనాల మధ్య జూన్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. సామ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.కథేంటంటే..స్వర్ణ(సమంత) , అనిరుధ్ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఇది అనిరుధ్ ఫ్యామిలీ కి నచ్చకపోవడంతో కొన్నాలపాటు దూరంగా ఉంటారు. అయితే అనిరుద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో స్వర్ణ, అనిరుద్ ఇంటికి తిరిగి వస్తారు. సాంప్రదాయ కుటుంబం కావడంతో వారికి నచ్చేలా ఉండేందుకు స్వర్ణ ప్రయత్నిస్తుంది. అదే సమయంలో స్వర్ణ గురించి జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) ఆరా తీస్తాడు. ఆమె కోసమే జైలు నుంచి తప్పించుకొని వస్తాడు. అసలు స్వర్ణకు జైల్లో ఉన్న కరుణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వర్ణ గతం ఏంటి? ఝాన్సీ ఎవరు ? కరుణ నుంచి తన ఫ్యామిలీకి ఆపద ఉందని తెలిసిన తర్వాత స్వర్ణ ఏం చేసింది? చివరకు తన ఫ్యామిలీని ఎలా రక్షించుకుంది? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందిని రెడ్డి , సమంత కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో మా ఇంటి బంగారంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదని చెప్పాలి. అలా అని తీసిపారేసే సినిమా ఏమి కాదు. ఓ బేబీ మాదిరే ఇది కూడా కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్.సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక సంప్రదాయ కుటుంబంలోకి కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఇంట్లో జరిగే రోజువారీ ఫ్యామిలీ డ్రామా, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో సమంత గతానికి సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.అసలు సమంత ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది. సెకండాఫ్లో ఆమె ఫ్లాష్బ్యాక్, గుల్షన్ దేవయ్య పాత్రతో ఆమెకు ఉన్న పరిచయం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం చుట్టూ కథ నడుస్తుంది. ఫస్టాఫ్ కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిన సెకండాఫ్ మాత్రం కొంతమేర సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దానికి తోడు విలన్ ట్రాక్ బలంగా లేకపోవడంతో చాలా సన్నివేశాలు అనవసరంగా పెట్టారన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం చాలావరకు అతడు సినిమాను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకుని.. మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..సమంత వన్ ఉమెన్ షో చూపించింది. ఈ మూవీలో కొత్త కోడలి పాత్రలో.. అలాగే యాక్షన్ సీక్వెన్స్లలో సమంత అద్భుతంగా నటించింది. శ్రీముఖి తన పాత్రలో ఒదిగిపోయింది. గుల్షన్ దేవయ్య మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బాగుంది. బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
-
సమంతకు ప్రెగ్నెన్సీ.. అందుకే అలా కనిపించారా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ సామ్ హిట్ కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇదే సమయంలో సమంతపై సోషల్ మీడియాలో రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. మా ఇంటి బంగారం ప్రమోషన్ల తర్వాత సామ్పై ఓ టాక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఆమెను చూస్తుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలుస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదే నిజమైతే సమంత ఫ్యాన్స్కు ఆనందం డబుల్ అని పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత టీమ్ నుంచి ఎలా స్పందన రాలేదు.చీరకట్టు వల్లే..ముఖ్యంగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లకు సమంత చీరకట్టులోనే హాజరయ్యారు. ఏ ఈవెంట్కు నిండు చీరలో అందంగా కనిపించారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఈవెంట్స్కు చీరలో వెళ్లడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సామ్ సంప్రదాయబద్ధంగా శారీలో కనిపించడం ప్రెగ్నెన్సీ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. కొందరైతే నెటిజన్ ఏకంగా సామ్ బేబీ బంప్తో ఉందని.. అందుకే కనిపించకుండా శారీలోనే ప్రమోషన్లలో పాల్గొన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రూమర్స్పై సమంత కానీ.. ఆమె టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో సామ్- రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. -
తీరు మారని దర్శకేంద్రుడు.. నెటిజన్ల విమర్శలు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు గానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో మెగా హీరోయిన్ నిహారిక కొణిదెలతోనూ ఈయన ప్రవర్తించిన విధానంతో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అనుమతి లేకుండా ఒక మహిళని తాకడం, ముట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేశారు. వెంకీ-అనిల్ రావిపూడి మూవీ లాంచ్ ఈవెంట్లోనూ రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమవుతోంది.గురువారం జరిగిన వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ పూజా కార్యక్రమంలో రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా హీరోయిన్ కృతి శెట్టి భుజంపై చేతులు వేయడం, తర్వాత కూడా హీరోయిన్ల చేతులు పట్టుకుని కనిపించడంపై కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మరికొందరేమే షూటింగ్ ప్రక్రియలో భాగమే అంటున్నారు.తాజాగా ఓ నెటిజన్ నిహారికతో దర్శకుడు రాఘవేంద్రరావు వ్యవహరించిన వీడియోను షేర్ చేసింది. అసలు ఈ ముసలాయన ఎవరు? అలా ఎందుకు చేస్తున్నారు? మహిళల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ఆమెకు మద్దతుగా పలువురు పోస్టులు పెడుతున్నారు. Who is this old idiot ? Who gave him the right to touch women without their consent ? pic.twitter.com/e0CSI1SguT— Prashanth Rangaswamy (@itisprashanth) June 18, 2026 #VenkyAnil5 Begins🎬Venkatesh, Keerthy Suresh, Kalyan Ram, Kriti Shetty. pic.twitter.com/a9iSg28COA— Christopher Kanagaraj (@Chrissuccess) June 18, 2026 यह बूढ़ा कौन है? जो ऐसा कर रहा हैउसे महिलाओं की मर्ज़ी के बिना उन्हें छूने का अधिकार किसने दिया? pic.twitter.com/lpWdDGOJEb— Preeti (@Preeti__agm) June 18, 2026 -
అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)
-
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో ఒకే సినిమా చేసింది(ఫొటోలు)
-
రమ్యకృష్ణ సెకండ్ లవ్.. ఇలా షాకిచ్చిందేంటి?
ఓటీటీలు వచ్చాక ఇబ్బడిముబ్బడిగా సినిమాలు, సిరీస్లు క్యూ కడుతున్నాయి. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తున్నాయి. అయితే ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యే సినిమాల్లో కేవలం చిన్న హీరోల చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్ల విషయానికొస్తే పెద్దగా స్టార్స్ కనిపించరు. కొంత పేరున్న నటీనటులే ఉన్నప్పటికీ అగ్రతారలెవరు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసిన సందర్భాలు చాలా తక్కువే.కానీ ఇప్పుడంతా సీన్ మారిపోయింది. ఒకప్పటి స్టార్స్ సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం ఓటీటీల్లోకి అరంగేట్రం చేస్తోంది. దీంతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ సెకండ్ లవ్. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. సెకండ్ లవ్ అంటే ప్రేమ, వ్యామోహం అనే కాన్సెప్ట్తోనే ఈ సిరీస్ ఉండనుందని టైటిల్ వింటేనే అర్థమవుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏదేమైనా రమ్యకృష్ణ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ అభిమానులు షాకవుతున్నారు. -
శ్రీముఖి నీ పెళ్లెప్పుడు?.. యాంకర్ ఫుల్ క్లారిటీ..!
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది. పట్టుచీరలో కనిపించి తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్కు హాజరైన శ్రీముఖిని మరో స్టార్ యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది.మామూలుగా బంగారం ఎప్పుడు కొంటారని శ్రీముఖిని సుమ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో బంగారం ఎక్కువగా కొంటారని చెప్పింది. మరి నీ పెళ్లెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. దీనికి శ్రీముఖి సరదాగా సమాధానం ఇచ్చింది. సమంతను చూపిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజై పెద్ద బ్లాక్బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నా అని నవ్వుతూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. దీంతో శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది. -
ఆ టైమ్లో నాలో అహంకారం పెరిగింది: సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకులను పలకరించనుంది. తన సొంత బ్యానర్లో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో సామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక సమయంలో స్టార్డమ్ అనే మత్తుకు బానిసయ్యానని సమంత చెప్పుకొచ్చింది. తన సినిమాలు వరుస హిట్స్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చిందని సామ్ పేర్కొంది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి స్టార్డమ్ దక్కడం నాకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది. ఓకే ఏడాదిలో ఐదు సినిమాలు చేశా.. అన్నీ హిట్ కావడంతో నాది ‘గోల్డెన్ లెగ్’ అని అందరు అనేవారని గుర్తు చేసుకుంది. అలా నాపై ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నా.. నటిగా నా కెరీర్లో ముగింపు ఉండదనుకున్నానని సామ్ తెలిపింది.అయితే అనారోగ్యం, సినిమాలకు బ్రేక్ రావడం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత తెలిపింది. అప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెల్లడించింది. విరామం తర్వాత తన జీవితం, కెరీర్ను కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొంది. కాగా.. 2022 నుంచి సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. -
బ్లాక్ డ్రెస్లో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ఫోటోలు
-
మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ
-
ప్రియుడితో టాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్.. ఫోటోలు డిలీట్
ప్రస్తుత రోజుల్లో డేటింగ్, బ్రేకప్స్ చాలా సర్వసాధారణమైపోయాయి. ఇది సినీ రంగంలో కాస్తా ఎక్కువే. తాజాగా మరో నటి బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సునయన.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే ఆమె తన ప్రియుడితో విడిపోయినట్లు సమాచారం. కాగా.. యునైటెడ్ అరబ్ ఎయిరైట్స్కు చెందిన కఖలిత్ అల్ అమెరికా అనే వ్యక్తి ప్రేమలో పడిన సునయన.. వీరి ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. తాజాగా వీరిద్దరి రిలేషన్కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అర్థమవుతోంది. ఆమె తన ప్రియుడితో ఉన్న ఫోటోలను ఇన్స్టా నుంచి డిలీట్ చేసింది. దీంతో బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై సునయన గానీ.. ఆమె ప్రియుడు గాని స్పందించకపోవడం గమనార్హం.కాగా.. నాగ్పూర్కు చెందిన సునయన ఎల్లా మోడల్గా తన కెరీర్ ప్రారంభించింది. 2005లో తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళం, కన్నడ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అదేవిధంగా కాదలిల్ విళిందేన్ అనే చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టింది. ధనుశ్, నాగార్జున నటించిన కుబేర మూవీలోనూ మెరిసింది. తమిళంలో మాసిలామణి ,వంశం, నీర్ పారైవ, సమర్ వంటి పలు చిత్రాల్లో నటించారు. -
'ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ నటన ఆకట్టుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు సామ్ భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలో చాలా సినిమాలు చేశానని.. కానీ ఈ మూవీకి వస్తున్నంత రెస్పాన్స్ ఎక్కడా చూడలేదన్నారు. తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి.. మా అమ్మ కాలేజీ దగ్గర హోర్డింగ్స్ పెట్టారని తెలిసింది. నేను ఫస్ట్ టైం ఇంత హడావిడి చూస్తున్నానని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు. . -
సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)
-
నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
అలా వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా, పాగల్, రెడ్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో అలరించిన బ్యూటీ నివేదా పేతురాజ్. 2023లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీలో కనిపించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన సింగ్ గీతంలో మెరిసింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అనుకున్నాననని తెలిపింది. 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి తన ప్లాన్ అంతా రాంగ్ రూట్లోనే వెళ్లిందని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సింగ్ గీతంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. కానీ నాగ్ అశ్విన్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. లేదంటే ఇప్పటికే హిమాలయాల్లో ఉండేదాన్నేమోనని కామెంట్స్ చేసింది. కాగా.. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. నాగ్ అశ్విని నిర్మించారు.చదవండి: పెళ్లి రద్దుపై తొలిసారి స్పందించిన హీరోయిన్ -
యూరప్ ట్రిప్లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
-
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్
సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం ‘హిట్ అండ్ రన్’. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో హీరోయిన్ నటాషా సింగ్ రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
-
పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
-
కలర్ఫుల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
-
పక్కా తెలుగమ్మాయిని
-
పెళ్లయిన కొత్తలో రెస్టారంట్ కి వెళ్తే ..
-
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
-
బ్లాక్ డ్రెస్లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
-
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
క్యూట్నెస్తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
-
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
త్రిషకు మెగా కోడలి సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
హీరోయిన్ త్రిషకు మెగా ఫ్యామిలీ సర్ప్రైజ్ ఇచ్చింది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన నుంచి ప్రత్యేక బహుమతిని అందుకుంది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ పొందింది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియాలో పంచుకుంది. థ్యాంక్ యూ ఉపాసన.. ది సమ్మర్ స్పెషల్ గిఫ్ట్.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది.కాగా.. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ ఈ వంటకాలు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచారు. ఇందులో కేసరి, పొంగల్, ఉప్మా, రసం లాంటి వంటకాలు ఉండనున్నాయి. అత్తమ్మాస్ కిచెన్లో పులిహోర వంటకం ఎక్కువగా ఫేమస్ అయింది. త్రిషకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్లో రుచికరమైన ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు కూడా ఉన్నాయి. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇక త్రిష విషయానికొస్తే.. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోనుందని రూమర్స్ కూడా వస్తున్నాయి. వాటన్నింటికీ త్రిష సైతం తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూనే ఉంది. ఇటీవల నా కుక్కకు మాత్రమే వ్యక్తగత విషయాల్లో అనుమతి ఇస్తానని రూమర్స్ను ఉద్దేశించి పోస్ట్ చేసింది. -
చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)
-
భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)
-
ఆయన బతికుంటే నా లైఫ్ మారిపోయేది: నటి హేమ ఎమోషనల్
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దుస్థితిని చూసి అందరూ షాకయ్యారు. ముళ్లకంపలతో నిండి ఉన్న ఆ సమాధి వద్ద శుభ్రం చేసేందుకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఓ యాంకర్ పోస్ట్ చేసిన వీడియో చూసిన వెంటనే తన టీమ్తో కలిసి చెవేళ్లకు చేరుకుని క్లీనింగ్ చేపట్టారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం దాసరిని గుర్తు చేసుకున్నారు. మే 30న దాసరి వర్ధంతి కావడంతో నటి హేమ సైతం నివాళులర్పించారు. ఆ వీడియో చూసి నాకు చాలా బాధ కలిగిందన్నారు. ఈ రోజు గురువుగారి వర్ధంతి అని నా మైండ్లో కూడా లేదని తెలిపింది. కానీ ఆ వీడియో చూసి మరో నలుగురిని పోగేసుకుని ఇక్కడికి వచ్చానని తెలిపారు. మా గురువు గారు మా చేతనే ఆయన సమాధిని శుభ్రం చేయించుకున్నారు.మా గురువు గారే బతికి ఉంటే నా లైఫ్ మరోలా ఉండేదని హేమ ఎమోషనలయ్యారు. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు నా మీద ఉంటాయని హేమ ఆనందం వ్యక్తం చేశారు. గురువు గారే నన్ను మర్చిపోయారా అని.. మమ్మల్ని పిలిపించుకున్నట్లు అనిపించిందని తెలిపారు. ఈ రోజు నుంచే నేను సినిమాల్లో బిజీగా ఉండాలని.. గొప్ప రాజకీయ నాయకురాలిని అవ్వాలని నన్ను ఆశీర్వదించాలని దాసరిని కోరుకున్నారు. -
బలగం నటి.. ఇంత గ్లామరస్గా మారిపోయిందేంటి?
ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన మూవీ బలగం. తెలంగాణ పల్లె సెంటిమెంట్తో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వేణు యెల్దండి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పల్లెటూరి సంప్రదాయాలను, రక్త సంబంధాలను ఒక్కసారిగా మళ్లీ గుర్తుకు తెచ్చింది. అచ్చ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ద్వారా పలువురు నటీనటులు ఫేమస్ అయ్యారు.అలా ఈ మూవీ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నవారిలో రూపాలక్ష్మి ఒకరు. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను అందరూ తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు. హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. యితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. బలగం తర్వాత రూపలక్ష్మి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో బిజీగా మారిపోయింది.తాజాగా రూపాలక్ష్మి ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత గ్లామరస్గా కనిపించింది. అసలు బలగం నటి రూపానేనా అన్నంతలా మారిపోయింది. కారు నడుపుకుంటూ వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యూ జర్నీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్రామ్లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. View this post on Instagram A post shared by Rupa Lakshmi Vaishnava Sri (@rupalakshmi23) -
యషిక ఆనంద్ బోల్డ్ లుక్స్.. ఆర్జీవీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు..!
ఆర్జీవీ హీరోయిన్ ఆరాధ్య స్టన్నింగ్ లుక్స్..సాగర తీరాన బాలీవుడ్ భామ నోరా ఫతేహీ..హీరోయిన్ యషిక ఆనంద్ బోల్డ్ గ్లామర్..రెడ్ శారీలో ఫరియా అబ్దుల్లా అందాలు.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Aaradhya🦋 (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు)
-
అతిలోక సుందరిలా ఆషిక రంగనాథ్ (ఫొటోలు)
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ HD స్టిల్స్
-
బ్లాక్ డ్రెస్లో ప్రెట్టీ లుక్లో ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)
-
చిట్టి గౌనులో నజ్రియా క్యూట్ లుక్స్(ఫోటోలు)
-
మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్
-
ఓ మై శ్రీలీల.. వాట్ ఏ గ్లామర్ (ఫొటోలు)
-
చీరలో యువరాణిలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
-
కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్
-
రుక్మిణి వసంత్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామరస్ పిక్స్(ఫోటోలు)
-
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..పర్పుల్ కలర్ డ్రెస్ టాలీవుడ్ నటి బిందు మాధవి సమ్మర్ పోజులు..లైట్ కలర్ శారీలో ఆదితి గౌతమ్ మతిపొగొట్టే అందాలు..సిస్టమ్ టీమ్తో జ్యోతిక చిల్..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by @natasastankovic__ -
గ్రీన్ డ్రెస్లో బుట్టబొమ్మ పూజా హేగ్డే అందాలు (ఫొటోలు)
-
దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..!
టాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. -
పెళ్లి కంటే ఆ పని చేయడం వందరెట్లు బెటర్: టాలీవుడ్ హీరోయిన్
స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. -
లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ.. అవికా గోర్ ఏమన్నారంటే..?
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో చిన్న వయసులోనే స్టార్డమ్ అందుకున్న నటి అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..తొలి చిత్రంతోనే భారీ హిట్ని అందుకుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాదిలో పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ అవికాను ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’గానే చూస్తారు. తాజాగా ఈ బ్యూటీ ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందమైన లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే పుకార్లపై స్పందించింది. లుక్ కోసం తాను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని స్పష్టం చేసింది.మొటిమల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాలుక్ కోసం నేనెప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా మొటిమలు పోగోట్టుకోవడానికి. టీనేజ్లో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవి. వాటిని తొలగించుకునేందుకు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు(నవ్వుతూ). ఇప్పటికీ నా ముఖంపై మొటిమలు ఉన్నాయి. సర్జరీలు ఏం చేసుకోలేదు కానీ..స్కీన్ పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా. నేనే కాదు ప్రతి ఒక్క నటీనటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను 7 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చా. చిన్నప్పటి నుంచే మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే సన్స్క్రీన్ ఎక్కువగా వాడేదాన్ని.అమ్మ తిట్టేది.. లుక్ కోసం ట్రీట్మెంట్ కాదు..కనీసం నా హెయిర్ కట్ చేసుకుంటా అని చెప్పిన అమ్మ తిట్టేది. ఇక టాటూ వేసుకుంటా అన్నప్పుడు అయితే పెద్ద గొడవే జరిగింది. అలాంటిది నేను లుక్ కోసం ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటా? వయసు పెరిగేకొద్ది మన ముఖంలో మార్పులు వస్తాయి. నేను చిన్నప్పటి నుంచే అందరికి తెలియడంతో పెద్దయ్యాక నా ముఖంలో వచ్చిన మార్పులు చూసి సర్జరీ చేయించుకుందనే పుకార్లను సృష్టించారు. అంతేకాదు నేను బరువు పెరిగి తగ్గడం వల్ల కూడా ఇలాంటి పుకార్లకు కారణం అయింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’ అని అవికా స్పష్టం చేసింది. -
చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)
-
రమణి కళ్యాణం : చీరలో మెరిసిపోతున్న నటి దీప్షిక చంద్రన్ (ఫొటోలు)
-
వైట్ డ్రెస్లో మౌనీ రాయ్.. స్పెయిన్ వీధుల్లో ఆషిక..!
కర్రసాము చేస్తోన్న సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి ..వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ అందాలు..స్పెయిన్ వీధుల్లో ఆషిక రంగనాథ్ చిల్.. ఎల్లో శారీలో బిగ్బాస్ రీతూ చౌదరి అందాలు.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్బాబు మేనకోడలు (ఫోటోలు)
-
తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్..!
కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్తో ఓ సినిమా చేస్తోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ వైరల్గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్పై డేటింగ్ రూమర్స్కు చెక్ పడినట్లైంది. -
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.పర్సనల్ లైఫ్..కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్తో లవ్లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. -
తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్..!
కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.(చదవండి: రామ్ చరణ్ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్!)తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్తో డేటింగ్ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.ఏడాదిగా రూమర్స్.. శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. -
'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్
టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్కు వెళ్లినప్పుడు.. షూట్లో లేకుండా మీరు షాపింగ్కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్ వరకు వచ్చాక మీరు షూటింగ్ లోకేషన్లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్ఎక్స్లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా మెప్పించింది. -
బర్త్డే సెలబ్రేషన్స్.. ఆహా అనిపిస్తున్న అనసూయ (ఫొటోలు)
-
క్యూట్ లుక్స్తో కవ్విస్తున్న నటి పూజిత పొన్నాడ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్లో మంచు లక్ష్మీ.. కేన్స్లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్లో అనన్య పాండే..జిమ్లో బిగ్బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మేకప్ లేకున్నా అదే అందం.. సాయిపల్లవి జపాన్ ట్రిప్ (ఫొటోలు)
-
#HBDAnasuya : రంగమ్మత్త (అనసూయ) జర్నీలో ఎన్ని మలుపులో! (ఫొటోలు)
-
స్టైల్ మార్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (ఫొటోలు)
-
బిగ్బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్కు వరల్డ్ వైడ్గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. -
అంజలి కీలక పాత్రలో 'ముసలోడికి దసరా పండుగ'.. రిలీజ్కు రెడీ
నాజర్, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సందర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకముంది. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు. -
బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
హీరోయిన్ లయ చెస్ ఛాంపియనా?.. పోస్ట్ వైరల్
అప్పట్లో హీరోయిన్గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
అరుణాచలం ట్రిప్లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'నలుగురు పిల్లల అమ్మాయితో పెళ్లి'.. ఆసక్తిగా టీజర్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్తో ఈ సినిమా తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి సినిమానే. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్లు చాలా ప్యాషన్తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ కీలక పాత్రల్లో నటించారు. -
'తప్పు నాదే.. ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు'.. లయ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ లయ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హిట్ పెయిర్ అయిన శివాజీ సరసన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అంటోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అప్పట్లో తాను ఓ సినిమా చేసినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. స్వయంవరం తర్వాత వడ్డే నవీన్ సరసన మా బాలాజీ అనే మూవీలో విడో పాత్రలో కనిపించానని వివరించింది. అయితే ఆ సినిమా కథ రెమ్యునరేషన్ గురించి తాను అడగలేదని తెలిపింది. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని తర్వాత అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం కోడి రామకృష్ణ గారిపై ఉన్న గౌరవంతో కథ వినకుండానే చేశానని తెలిపింది. ఆ సినిమాను ఇప్పటి వరకు తాను చూడలేదని లయ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడో పాత్రలో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. -
వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ.. భర్తకు స్నేహా స్పెషల్ విషెస్..!
నిన్నుకోరి మూవీ రీ రిలీజ్ ఆనందంలో నివేదా థామస్..భర్తకు హీరోయిన్ స్నేహ స్పెషల్ విషెస్..ఎల్లో డ్రెస్లో టాలీవుడ్ నటి బిందు మాధవి హోయలు..వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు..కూతురితో బిగ్బాస్ శివజ్యోతి మదర్స్ డే సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Divya Arundati (@divya_arundathi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Vennela Manthri (@vennelamanthri) -
'సినిమా ఛాన్స్.. ఫామ్హౌస్కు వస్తే రూ.25 లక్షలు..' బిగ్బాస్ కిర్రాక్ సీత
బిగ్బాస్ షోతో ఫేమస్ అయిన టాలీవుడ్ బ్యూటీ కిర్రాక్ సీత. బిగ్బాస్ సీజన్-8 కంటెస్టెంట్గా అభిమానులను మెప్పించింది. మొదట యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించిన సీత 7 ఆర్ట్స్ సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. అంతే కాకుండా బేబీ మూవీలో హీరోయిన్ పక్కన ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నెగిటివ్ రోల్లో అద్భుతంగా నటించింది. బిగ్బాస్ షో మరింత ఫేమ్ తెచ్చుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తనకెదురైన అనుభవాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టింది. ఓ సారి సినిమా ఛాన్స్ అని కాల్ చేసి అడిగారని తెలిపింది. 7 ఆర్ట్స్లో చేసే సమయంలోనే సినిమా ఛాన్స్ ఉందని ఫోన్ చేసి చెప్పారని గుర్తు చేసుకుంది. అయితే ఫామ్ హౌస్కి రావాలిని పిలిచారని తెలిపింది. మొదట సరే అన్నా.. కానీ నేను వెళ్లలేదు.. మళ్లీ రెండు రోజుల తర్వాత కాల్ చేసి అడిగారని పేర్కొంది. ఇక్కడికి వస్తే మీకు రూ.25 లక్షలు ఇస్తారని చెబితే నేను సున్నితంగా తిరస్కరించానని సీత వెల్లడించింది.కొంతమంది ఇలా నంబర్ దొరికితే చాలు కాల్ చేస్తుంటారని కిర్రాక్ సీత తెలిపింది. కేవలం టైమ్పాస్కు కూడా ఇలా కాల్స్ చేస్తారని వివరించింది. ఎలా ఉంటది అని నేను అడుగుతా.. ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదా?? అని అంటారని పేర్కొంది. అప్పుడు నేను వెంటనే ఇలా అడగడానికి మీకు సిగ్గుందా? అని వెంటనే ఇచ్చిపడేస్తానని సీత వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
'నమ్మి డబ్బులిస్తే మోసం చేశారు'.. సంజనా షాకింగ్ కామెంట్స్
సంజనా గల్రానీ.. ఈ పేరు గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. గతేడాది తెలుగు బిగ్బాస్ సీజన్-9లో మెరిసింది. ఏకంగా టాప్-5 నిలిచిన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తనకెదురైన అనుభవాలను పంచుకుంది.తాజా ఇంటర్వ్యూలో సంజనా షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. నాకు తెలిసిన వాళ్లను నమ్మి దాదాపు రెండు కోట్లు మోసపోయానని తెలిపింది. నన్ను మోసం చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద నిర్మాత కూడా ఉన్నారని వెల్లడించింది. ఇప్పటికీ కూడా ఆ చెక్ బౌన్స్ కేసులు ఇంకా నడుస్తున్నాయని సంజనా గల్రానీ తెలిపింది. ఇప్పుడు ఎవరైనా నన్ను డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వట్లేదని వెల్లడించింది. అయితే తనకు డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. -
హైదరాబాద్లో జోరుగా హుషారుగా...
ఉదయం షూటింగ్కి వెళ్లడం... రాత్రికి ఇంటికి చేరుకోవడం... ఇలా లోకల్లో షూటింగ్ చేసినప్పుడు స్టార్స్ ఇంటిని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు స్టార్స్ అలా ఇంటిని మిస్ కాకుండా హైదరాబాద్లో జోరుగా హుషారుగా షూట్తో బిజీగా ఉంటున్నారు. ఆ స్టార్స్ ఏయే సినిమాల షూట్లో ఉన్నారో తెలుసుకుందాం.గండిపేటలో కింగ్తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. తన కెరీర్లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున ఫిల్మ్ జర్నీలో ఓ మైల్స్టోన్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తన అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నాగార్జునతో పాటు నటి టబు పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. –టబు కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అదే విధంగా ‘సిసింద్రి’ సినిమాలోనూ వీరిద్దరూ ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కింగ్ 100’ మూవీ కోసం వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరి రీ యూనియన్ మరోసారి ఆ మ్యాజిక్ను రిపీట్ చేయబోతోందని ఫిల్మ్నగర్ టాక్. నాగార్జున కెరీర్లో ఓ ల్యాండ్మార్క్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్ గా ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట ఆయన. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2027 జనవరికి విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జన్వాడలో...‘వీర సింహారెడ్డి’ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో ‘గుంటూరు కారం’ మూవీ సెట్లో జరుగుతోందని తెలిసింది.బాలకృష్ణతో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట గోపీచంద్ మలినేని. ఈ మూవీలో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి... వీరిద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారు? లేదంటే మరో హీరోయిన్ ఖరారు అవుతారా? అనేది వేచి చూడలి. ఇదిలా ఉంటే... ‘ఎన్బీకే 111’లో ఓ స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ చిందేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటని చిత్రీకరించనున్నారట మేకర్స్.అన్నపూర్ణలో ఆదర్శ కుటుంబం‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమాతో తన కెరీర్లోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు వెంకటేశ్. అంతేకాదు... ఈ మూవీ ద్వారా రూ. 300కోట్ల వసూళ్ల క్లబ్లో చేరి, సరికొత్త రికార్డును సృష్టించారాయన. ఈ చిత్రం తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకటేశ్ ఇమేజ్కి తగ్గ అందమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారట త్రివిక్రమ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పాటు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల హైదరాబాద్లో చిత్రీకరించిన ఓ హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందట. వెంకటేశ్ హీరోగా నటించిన పలు హిట్ సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన హీరోగా తన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో వెంకటేశ్కి జోడీగా కీర్తీ సురేష్ నటిస్తారు. అనిల్ రావిపూడి ట్రేడ్మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో రూపొందనున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. గండిపేటలో వారణాసిమహేశ్బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. మహేశ్ హీరోగా నటిస్తున్న 29వ సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన ఆయన గెటప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ఎపిక్ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు.‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఆర్ఎఫ్సీలో... ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ చేస్తున్న ఆయన మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్లో సమాంతరంగా పాల్గొంటున్నారాయన. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్న్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రభాస్తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ప్రభాస్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారట. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.పీరియాడికల్ యాక్షన్‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.పీరియాడికల్ యాక్షన్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్తో పాటు ఇతర తారాగణంపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అంతేకాదు... ముఖ్యంగా కోల్కత్తా ప్రస్తావన ఉంటుందట.ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్లో ఎన్టీఆర్ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీలో టు షేడ్స్లో కనిపించనున్నారట ఎన్టీఆర్. ఓ లుక్లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిట. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలో,్ల అటు ప్రేక్షకుల్లో బజ్ నెలకొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానుంది. అజీజ్నగర్లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంకల్ప్ రెడ్డి. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘భరత వర్ష’.గోపీచంద్ ఈ మూవీలో యోధుడి పాత్ర కోసం కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజెన్న్స్ అన్నీ కలిసి ఈ పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చేస్తాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. టెక్నికల్గా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ నటిస్తున్నారు. ఇన్నోవేటివ్ కథనాలు, హై టెక్నికాల్టీకి పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి... భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా తెరపై ఆవిష్కరించబోతున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘గోపీచంద్ 34’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్లో జరిగిన విషయం తెలిసిందే. ముచ్చింతల్లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘ఆయా షేర్...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ డ్రామా శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శగుతోంది.ఈ షెడ్యూల్లో శర్వానంద్పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంపత్ నంది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్న్స్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అద్భుతమై సంగీతం అందించారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శంకర్పల్లిలో... హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ 2023 జూన్ 28న విడుదలై థియేటర్లలో నవ్వులు కురిపించడంతో పాటు హిట్గా నిలిచింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హిలేరియస్ కామెడీ డ్రామా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమా ద్వారా ‘సామజవరగమన’ చిత్రాన్ని మించిన నవ్వులు పంచాలనే బలమైన ఆలోచనతో తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాలో ‘మోగ్లీ’ మూవీ ఫేమ్ సాక్షీ మదోల్కర్ కథానాయికగా నటించనున్నారని టాక్. ‘వెన్నెల’, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
జిమ్ డ్రెస్లో నభా నటేశ్.. అనన్య నాగళ్ల స్మైలీ లుక్స్..!
జిమ్ డ్రెస్లో హీరోయిన్ నభా నటేశ్..సద్గురు ఫౌండేషన్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..స్మైలీ లుక్స్తో హీరోయిన్ అనన్య నాగళ్ల పోజులు..వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్..వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Prakriti 💫 (@prakritikakar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
విష్ణుప్రియ స్టన్నింగ్ పోజులు.. శారీలో పుష్ప బ్యూటీ పావని..!
రెడ్ డ్రెస్లో యాంకర్ విష్ణు ప్రియ స్టన్నింగ్ పోజులు..ఏప్రిల్ జ్ఞాపకాలు నెమరు వేసుకున్న యషిక ఆనంద్..శారీలో మరింత అందంగా పుష్ప బ్యూటీ పావని..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ నుస్రత్..చీరతో ముసుగేసిన ఐటమ్ సాంగ్ గర్ల్ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
అనుకున్నదే అయింది.. సమంత బంగారం వాయిదా..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదల కానుందని ప్రకటించారు.ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. జూన్కు వాయిదా..అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ముందుగా ఊహించినట్లుగానే మా ఇంటి బంగారాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చేనెల అంటే జూన్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఈమె టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికీ ఇష్టముండదు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే అవే గుర్తుకొస్తాయి. 90స్ కిడ్స్కు మొబైల్ కెమెరాలు లేక సరిపోయింది కానీ.. ఇంకా ఎన్నో మధుర జ్ఞాపకాలను చూసుకుంటూ ఉండేవాళ్లం. ఎంత గొప్పవారికైనా అలాంటి అరుదైన ఫోటోలు, వీడియోలు చూస్తే ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోతాం. మనల్ని మనం చూసుకుంటూ అప్పుట్లో ఇలా ఉన్నామా అని సంబరపడిపోతాం. అలా తన పాత ఫోటోలను షేర్ చేసింది బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇండోర్లో జరిగిన లైవ్ షో ఫోటోలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చంది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె మన తెలుగింటి కోడలు అన్న సంగతి తెలుసు. ఆమె సిస్టర్ శిల్పా శిరోద్కర్ గురించి చాలామందికి తెలియదు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకైతే సుపరిచితమే. గతేడాది బిగ్బాస్లోనూ కంటెస్టెంట్గా పాల్గొన్న ఇటీవల బాగానే ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర్ మూవీలోనూ నటించింది. గతంలో టాలీవుడ్లో బ్రహ్మ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా 90స్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
అరుదైన దృశ్యం.. ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య..!
నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి విరూపాక్ష’ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఓకే వేడుకలో మెరిశారు. చైతూ తన భార్య శోభిత ధూళిపాళ్లతో పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఇదే రిసెప్షన్కు సమంత సైతం తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. వీరిద్దరు ప్రముఖ నిర్మాత, ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ హాజరు కావడం విశేషం.వీరిద్దరు విడిపోయి పెళ్లిళ్లు చేసుకున్నాక ఓ వేడుకలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఒక్కసారిగా అందరి కళ్లు వీరిద్దరిపైనే పడ్డాయి. ఇదే రిసెప్షన్లో నాగార్జున, అమల సైతం కనిపించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Naga Chaitanya and Sobhita Dhulipala at Simran (Sunil Narang's daughter) - Krish wedding reception. pic.twitter.com/zgVOmb4ABa— idlebrain.com (@idlebraindotcom) May 3, 2026 #TFNExclusive: All smiles as #Samantha along with her husband #RajNidimoru graced #SunilNarang’s daughter’s reception ❤️✨#SimranKrish #TeluguFilmNagar pic.twitter.com/twIKpdrAAz— Telugu FilmNagar (@telugufilmnagar) May 2, 2026 -
గ్రీన్ డ్రెస్లో నిహారిక కొణిదెల.. డిఫరెంట్ అవుట్ఫిట్లో సుప్రీత..!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..ఆరెంజ్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..పచ్చని డ్రెస్లో ప్రకృతిలో కలిసిపోయిన నిహారిక కొణిదెల..పార్టీలో యాంకర్ రష్మీ గౌతమ్ చిల్..డిఫరెంట్ అవుట్ఫిట్లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ సుప్రీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
మనుషులనే వదలరు.. కుక్కలను వదిలేస్తారా?.. రేణు దేశాయ్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మూగ జీవాలకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడైనా వాటిని హింసించినా.. హానీ తలపెట్టినా తన దృష్టికి వస్తే రియాక్ట్ అవుతూ ఉంటోంది. తాజాగా కొద్ది రోజులుగా కుక్కల రక్తం తీసి అమ్ముకుంటున్నారని ఓ వార్త తెగ వైరలవుతోంది. హైదరాబాద్లోనే ఈ దందా నడుస్తోందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ అయింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..'గత మూడు రోజులుగా మనం వింటున్నాం. అసలు ఈ రక్తం ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? ఇద్దరిదీ తప్పే. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేవారు కుక్కలను వదిలేస్తారా? కానీ కొంచమైనా భయం, భక్తితో ఉండండి. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ మన పిల్లకు తగులుతుందని మైండ్లో పెట్టుకోండి. కుక్కల రక్తంతో డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. వీధి కుక్కలతో ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కుక్కలు, పిల్లులతో ఇలా చేస్తే అది పెద్ద కర్మ. అందరికీ డబ్బు కావాలి. కానీ ఇలా సంపాదించడమనేది ఎంతవరకు సమంజసం' అంటూ మాట్లాడింది.నిన్న కూడా ఫస్ట్ టైమ్ నన్ను మోసం చేశారని రేణు తెలిపింది. మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే పగిలిన పోయినవి వచ్చాయని వెల్లడించింది. ముసలి వాళ్లను టార్గెట్ చేసి.. ఓటీపీలు తీసుకుని మోసాలు చేస్తున్నారు. రాక్షసులైతేనే ఇలాంటి పనులు చేస్తారని.. మనుషులైతే ఇలా చేయరని రేణు మండిపడింది. చెడు మార్గాలు, మోసాలు, గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నాలను ఆపాలని రేణు దేశాయ్ కోరింది. నిజాయితీగా, కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడని హితవు పలికింది. ఎందుకంటే కర్మ అనేది నిజం.. అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది. ఆ దేవుడు అంతా గమనిస్తూ ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందరు సురక్షితంగా ఉండాలని రేణు దేశాయ్ కోరింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డ్యూడ్, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV— prime video IN (@PrimeVideoIN) May 1, 2026 -
సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా?
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ టైమ్లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. -
పెళ్లి వేడుకలో సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉందో చూశారా?
సీనియర్ హీరోయిన్ శారద ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆమెను చూసిన మెగాస్టార్ దంపతులు దగ్గరికి వెళ్లి పలకరించారు. ప్రస్తుతం ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో శారద అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్ డైలాగ్స్తోనూ సినిమాల్లో మెప్పించారు. కాగా.. కన్యా శుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు. అయితే శారద మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటి అయినప్పిటికీ.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ రేంజ్కు ఎదిగారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు.. తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. తెలుగులో అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, స్టాలిన్, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు.సీనియర్ హీరోయిన్ శారద గారు...#Chiranjeevi Garu @KChiruTweets #Saradha #Actress pic.twitter.com/wzXLhpHaXs— Suresh Kondeti (@santoshamsuresh) April 29, 2026 -
సముద్ర తీరాన హన్సిక చిల్.. పెళ్లి కూతురిలా మెరిసిపోతున్న శ్రీలీల..!
సముద్ర తీరాన చిల్ అవుతోన్న హన్సిక..బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గ్లామర్ పోజులు..సమ్మర్లో మ్యాంగో తింటూ ఎంజాయ్ చేస్తోన్న సమీరా..బ్లూ డ్రెస్లో బిగ్బాస్ దివి అందాలు..పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
నటి సురేఖవాణి బర్త్ డే.. కూతురు సుప్రీత స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
'పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు'.. నిత్యామీనన్ బాటలో కట్టప్ప కూతురు
ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్టాపిక్గా మారాయి.వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. -
ఈవెంట్లో పాయల్ రాజ్పుత్ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పంజాబీలో చాలా సినిమాలు చేయడంతో పాటు హిందీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే పంజాబీ ఫిల్మ్ ఖుష్ కబరీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్(01-01-01) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైంది. ఈ సినిమాతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.పాయల్ కన్నీటి పర్యంతం..ఈ ఈవెంట్కు పాయల్ రాజ్పుత్ సినీ కెరీర్, ఆరోగ్య సమస్యల గురించి ప్రశ్నించారు. దీనికి పాయల్ స్పందించింది. తన అనారోగ్యంతో జైపూర్లో పది రోజులు చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. ఆ సమయంలో మా ఫాదర్కు క్యాన్సర్ సోకిందని తెలిపింది. నా లైఫ్లో రియల్ హీరో మా నాన్నే అంటూ ఎమోషనలైంది. తన తండ్రిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా సినిమాలు చూడాలని నాన్న ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూసేవాడని తెలిపింది. నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనేనని పాయల్ వెల్లడించింది. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని వేదికపై బోరున ఏడ్చేసింది. దీంతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారంది. కాగా.. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గతేడాది జూలై 28న క్యాన్సర్తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Actress Payal Rajput gets emotional while answering and walks away pic.twitter.com/ysuvKFdaxZ— idlebrain.com (@idlebraindotcom) April 28, 2026 -
సమంత బర్త్ డే స్పెషల్.. ఫుల్ యాక్షన్ వీడియో రిలీజ్
ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు కావడంతో స్పెషల్ వీడియో రిలీజైంది. సామ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రశంసలు కురిపించారు మా ఇంటి బంగారం టీమ్. ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసిన వీడియో సామ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సామ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.ఈ సందర్భంగా సామ్ నటనపై ప్రశంసలు కురిపించారు. సమంత స్టంట్స్ అదరగొట్టేశారని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ కొనియాడారు. సమంతను బీస్ట్ అంటూ ఆకాశానికెత్తారు. ఎలాంటి సీన్స్లోనైనా అద్భుతంగా చేయగలదని డైరెక్టర్ నందిని రెడ్డి ప్రశంసించారు. సామ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి అని డీవోపీ ఓంప్రకాశ్ అన్నారు. ఆమె యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. సామ్ భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైతం సమంత నటన ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందన్నారు. అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. కాగా.. సమంత తన సొంతం బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్లో ఓ పార్ట్ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్ లైఫ్ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. -
'నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే'.. అషురెడ్డి ఆడియో వైరల్
బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు కాజేసిందని ఆయన తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై అషురెడ్డి తండ్రి కూడా స్పందించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అషు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది అషురెడ్డి పెట్టిన ఆడియో అని వైరలవుతోంది.ఈ ఆడియోలో మాట్లాడుతూ.. 'ప్రవీణ అక్కకు ఫోన్ చేశావని నాకు కాల్ చేసింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. నాకు మే వరకు టైమ్ ఇస్తే రూ.1.5 కోటి ఇచ్చేస్తా. మిగిలిన డబ్బులు నా లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదు కుదరదు.. అంటే పెద్ద మనుషులకు ఫోన్ చేశావ్ కదా.. నా లైఫ్లో పెద్దమనిషి ప్రవీణ అక్కే.. నువ్వు ఎవరినీ పిలుచుకుంటావో నీ ఇష్టం. నేను ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. లేదు.. కుదరదు అంటే నేనే వేధింపుల కేసు పెడతా. మా అక్కను, అమ్మను ఇందులోకి లాగొద్దు. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి రావడమేంటి? నా తరఫున ప్రవీణ అక్క, వేణుస్వామి వస్తారు.. మే వరకు ఆ డబ్బులు సెటిల్ చేస్తా' అని ఉంది. ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
'మెగా ఇంటికి నా పిల్లలు.. వాళ్లకు చెప్పేది అదొక్కటే'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లోనే ఉంటోంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తోంది. అంతేకాకుండా మూగజీవాల కోసం తన వంతు పోరాటం చేస్తున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రేణు దేశాయ్.. హీరో పవన్ కల్యాణ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆద్య, అకీరా అనే పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్లకే ఆమె పవన్ కల్యాణ్తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సింగిల్గానే తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే పేరేంట్స్ విడిపోయినప్పటికీ పిల్లలు తన తండ్రి వద్దకు వెళ్తుంటారు. మెగా ఫ్యామిలీ ఇంటికి కూడా వెళ్తుంటారు. దీనిపై రేణు దేశాయ్ను ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలకు ఏం చెప్తారన్న ప్రశ్నకు రేణు స్పందించింది.మీరు అక్కడికి వెళ్లి ఎలా ప్రవర్తిస్తారో అదే నా పెంపకాన్ని సూచిస్తుందని వారితో చెప్తానని రేణు దేశాయ్ తెలిపింది. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పెంచిన తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారని పేర్కొంది. అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు.అందుకే మెగా ఇంటికి వెళ్లేముందు అక్కడ మీరు ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారనేది ముఖ్యమని.. ఒక తల్లిగా నేను సరిగా పెంచానా? లేదా అన్నది డిసైడ్ అవుతుందని వారితో చెప్పానని వెల్లడించింది. ఒక మదర్గా నా ఇద్దరు పిల్లలను పెంచడంలో చాలా హ్యాపీగా ఉన్నానని రేణు తెలిపింది. ఒక తల్లిగా తన పెంపకంపై మచ్చ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం తన పిల్లలకు నేర్పించానని రేణు అన్నారు. -
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్పుల్గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఆనాటి హీరోయిన్, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.భర్త మోసంపై ఒంటరి పోరాటం..వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది. ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
అలాంటి ప్రశ్న వేయడమే తప్పు : శ్రియ
ఇంతకుముందు హీరోయిన్లను వెంటాడే భయాల్లో ఒకటి పెళ్లి, మరొకటి వయసు. పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు పోతాయేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా వయసు మీరితే అందం కరిగిపోతుందనే భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడా భయం ఎవరిలోనూ కనిపించడంలేదు. పెళ్లి అయ్యి, నాలుగు పదుల వయసు దాటిన నటీమణులు కూడా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో శ్రియ ఒకరు. ఈ భామ దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందారు. కాగా వివాహానంతరం నటనకు కొద్ది కాలం దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు మళ్లీ నటించడంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించారు. ఈ భామను ఇటీవల 43 మూడేళ్ల వయసులో ఇంత అందాన్ని ఎలా మెయిన్టెయిన్ చేస్తున్నారు, ఎలా అవకాశాలను అందుకుంటున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రియ బదులిస్తూ వయసును బట్టి నటీమణులను అంచనా వేయరాదంటూ ఘాటుగా పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్న వేయడమే తప్పు అన్నారు. వయసుతో పని ఏముంది? పెళ్లి అయితే నటీమణుల పని అయిపోతుంది అన్న ఆలోచనే రాకూడదు అని అన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో సాధించడానికి వయసు ఆటంకమే కాదన్నారు. ప్రతిభ ముఖ్యమని, ప్రతి భావంతులైన కళాకారులు ఏ వయసులోనైనా సాధించగలరని అన్నారు. కాగా 43 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో ఆకట్టుకుంటున్న శ్రియ ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్లో నటించడానికి సిద్ధం అంటున్నారు. -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
రేర్ పిక్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫోటోలో ఎక్కడుందో తెలుసా?
మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్తో ఉన్న ఆనాటి రేర్ పిక్ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) -
కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్!
నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్ను ఆ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్గా టాలీవుడ్లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో ఆమెకు పెద్ద గ్యాపే వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. -
చాలా ఇష్టమంటోన్న బిగ్బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్ సినిమా
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026 -
డిఫరెంట్ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా?
కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా హీరోయిన్ టీనా శ్రావ్య. ఇప్పుడు మరోసారి గేదెల రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా ఆమెను ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేదెల రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో టీనా ఫర్మామెన్స్ చూస్తే ప్రామిసింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న క్యారెక్టర్స్లో టీనా అదరగొడుతోంది. టాలీవుడ్లో చిన్న బడ్జెట్ చిత్రాలకు ఈమె పర్ఫెక్ట్ ఆప్షన్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆమె డైలాగ్ డెలివరీతో పాటు అందం, అమాయకపు నటనా శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈనెల 24న విడుదల కానున్న గేదెల రాజు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
బ్లూ డ్రెస్లో హీరోయిన్ శ్రియా శరణ్..పాలరాతిలా మెరిసిపోతున్న హీరోయిన్ లక్ష్మీ ప్రణీత..శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..హ్యాపీ ఎర్త్ డే అంటోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'నా సోనును కోల్పోయా'.. బిగ్బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్తో హౌస్లో అలరించింది. ఈ షో ద్వారా టాలీవుడ్లో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటోంది.తాజాగా బిగ్బాస్ అశ్విని శ్రీ కన్నీటి పర్యంతమైంది. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిన విషాద వార్తను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ ఫుల్ ఎమోషనలైంది. సోనుకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లే చనిపోయాడని అశ్విని శ్రీ తెలిపింది. అశ్విని శ్రీ తన ఇన్స్టాలో రాస్తూ..'నేను నా సోను బాయ్ని కోల్పోయా.. ఈ బాధ భరించరానిది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నా అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
కథకు కీ అయ్యారు
ఈ తరం హీరోయిన్స్ సూపర్ స్మార్ట్. కేవలం కమర్షియల్ హీరోయిన్ అంటూ ఒకే జానర్కు పరిమితం కావాలనుకోవడం లేదు. యాక్షన్ సినిమాలకూ సై అంటున్నారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాల సవాళ్లను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు కథలో కీలక పాత్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉన్న సినిమాలో, కీలక పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న కొంతమంది హీరోయిన్ల గురించి ఓ లుక్ వేద్దాం.పవర్ఫుల్ రోల్ కథ నచ్చితే చాలు... హీరోయినా? లేక కీ రోలా? అని అస్సలు ఆలోచించరు శ్రుతీహాసన్. ఒకవైపు ప్రభాస్ ‘సలార్’ వంటి భారీ సినిమాలో హీరోయిన్గా చేశారు శ్రుతీహాసన్. ‘సలార్ 2’ చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ఇద్దరు చెల్లెళ్లు ఉన్న అక్క పాత్రలో శ్రుతీహాసన్ నటించారు. ఇప్పుడు మరోసారి మరో బలమైన కథలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారీ బ్యూటీ.అది ఏ సినిమా అంటే... ‘ఆకాశంలో ఒక తార’ అన్నమాట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోనే శ్రుతీహాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి, ఈ ఏడాదే ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. రాయ సిస్టర్ గంగ? చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో హీరోయిన్గా నటించారు నయనతార. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. బాలకృష్ణ కొత్త సినిమాలోనూ నయనతార హీరోయిన్గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారు. ఇలా హీరోయిన్గా వరుస అవకాశాలు లభిస్తున్నప్పటికీ నయనతార కథకు కీలకమైన ఓ కీ రోల్ చేశారు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2’ వంటి చిత్రాల తర్వాత యశ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్’. గోవా నేపథ్యంలో 1940–1970 కాలమానంలో సాగే పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇది.ఈ చిత్రంలో రాయ, టికెట్... ఇలా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు యశ్. ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథ ప్రధానంగా తండ్రీకొడుకుల మధ్య సాగే రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఈ కథలోనే రాయ పాత్రకు సిస్టర్ గంగ పాత్రలో నయనతార నటిస్తున్నారని తెలిసింది. కథకు ఎంతో కీలకమైన పాత్ర ఇది. ఇక ఈ సినిమాలోని మెయిన్ హీరోయిన్స్గా రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ నటిస్తున్నారని తెలిసింది. మెలిస్సాగా రుక్మిణీ వసంత్, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కాగా తారా సుతారియా, ఎలిజెబెత్గా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. మాన్స్టర్ మైండ్స్, కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.రాకాలో రష్మిక ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘రాకా’. ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల్లో అల్లు అర్జున్కు జోడీగా రష్మికా మందన్నా నటించారు. అయితే ‘రాకా’లోనూ రష్మికా మందన్నా ఉన్నారని తెలిసింది. కానీ ఆమెది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉండే విలన్ రోల్ అని తెలిసింది. కమర్షియల్ సినిమా హీరోయిన్గా సూపర్ హిట్ అయిన రష్మికా మందన్నా, ఇటీవల ‘ది గాళ్ఫ్రెండ్’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్లోనూ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు విలన్ రోల్లో తన సత్తా ఏంటో చూపించేందుకు రష్మికా మందన్నా రెడీ అవుతున్నట్లుగా తెలిసింది.ఆల్రెడీ రష్మిక ‘రాకా’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిసింది. ‘రాకా’ చిత్రీకరణ ఎక్కువగా ముంబైలో జరుగుతోంది. ఫిబ్రవరి నెల స్టార్టింగ్లో ముంబైలో జరిగిన ఈ సినిమా షూట్లో రష్మిక పాల్గొన్నారని, ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మరి... రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుంటే హీరోయిన్ ఎవరు? అనే డౌట్ రావొచ్చు. కథ రీత్యా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. రష్మికా మందన్నా నెగటివ్ రోల్ చేస్తుండగా, మరో కీలక పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ భాగమైన విషయాన్ని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్స్గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కనిపిస్తారని సమాచారం.ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారని, ఇందులో తండ్రి, ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలో ఓ విలన్గా కూడా అల్లు అర్జున్ కనిపిస్తారట. ఈ చిత్రానికి పునర్జన్మల కాన్సెప్ట్ ఉంటుందని, ఆడియన్స్ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లేలా ఈ చిత్రదర్శకుడు అట్లీ కథ తయారు చేశారని తెలిసింది. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం.. వంటి కారణాల చేత ‘రాకా’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని, షూటింగ్ మాత్రం ఈ ఏడాదే పూర్తి అవుతుందని తెలిసింది. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.సంబరాల్లో... తెలుగుతెరపై హీరోయిన్గా ‘మల్లేశం, పొట్టేల్’ వంటి చిత్రాలతో సక్సెస్ అయ్యారు హీరోయిన్ అనన్య నాగళ్ల. కానీ కుదిరినప్పుడల్లా కీలక పాత్రలూ చేస్తున్నారామె. ‘డార్లింగ్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు అనన్య. తాజాగా సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, సంజయ్ దత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా సాగుతోంది.కాకాజీ కుమార్తెగా? ‘వాల్తేరు వీరయ్య’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ్ర పారంభం కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు. అతి త్వరలోనే ఆరంభమవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, చిరంజీవి కుమార్తె పాత్రలో అనశ్వర రాజన్ నటిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. గత ఏడాది డిసెంబరులో విడుదలైన రోషన్ మేక ‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగులోకి వచ్చారు అనశ్వర రాజన్. ఆమె హీరోయిన్గా ఇటీవల వచ్చిన ‘విత్ లవ్’ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇంకా అనశ్వర హీరోయిన్గా నటించిన ‘ఇట్లు అర్జున, 7/జీ బృందావన కాలనీ 2’ చిత్రాలు రిలీజ్కు సిద్ధం అవుతున్నాయి. ఇలా హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తున్న అనస్వర ‘కాకాజీ ’ చిత్రంలో కథకు కీలకమైన కుమార్తె పాత్రలో నటించనుండటం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది ్ర పారంభంలో రిలీజ్ కానుందని సమా చారం. ఇలా కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. మరికొంతమంది హీరోయిన్స్ కథకు కీలకమైన పాత్రల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. – ముసిమి శివాంజనేయులు -
ధనుశ్తో డేటింగ్ రూమర్స్.. వీరిద్దరు ఆ పని చేయనున్నారా?
సీతారామం ఫేమ మృణాల్ ఠాకూర్ ఇటీవలే డకాయిట్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ గురించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుశ్ డైరెక్షన్లో ఆమె పని చేయనున్నారని లేటేస్ట్ టాక్. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కోసం మృణాల్ను సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా.. 1960 లేదా 1970ల కాలానికి సంబంధించిన ఒక 'పీరియడ్ డ్రామా'గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.అయితే తాజాగా వీరిద్దరి సినిమా గురించి టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు వీరి రిలేషన్పై చర్చ మొదలైంది. గతంలో మృణాల్- ధనుశ్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. గతేడాది ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్ వేడుకలో ధనుశ్ కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతకుముందు ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' సినిమా ముగింపు వేడుకలో మృణాల్ ఠాకూర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ధనుష్ కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో అవ్వడంతో వీరిద్దరు రిలేషన్కు మరింత బలం చేకూరింది. అయితే తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఎక్కడా నోరు విప్పలేదు. గతంలో తన మూవీ 'దో దీవానే షహర్ మే' ఈవెంట్లో పెళ్లిపై వస్తున్న రూమర్స్పై మృణాల్ ఠాకూర్ స్పందించారు. తనపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇటువంటి వార్తలు చాలా సందర్భాల్లో నిరాధారంగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ధనుశ్ నటించిన 'కారా' మూవీ విడుదల కానుంది. 1991 గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
దుర్గమ్మ సేవలో రంభ.. రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో తన అందచందాలతో స్టార్ హీరోయిన్గా మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత వెంటనే తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, బోజ్పురి ఏకంగా ఎనిమిది భాషల్లో 100కుపైగా చిత్రాల్లో నటించారు.ఇదిలా ఉంచితే తాజాగా రంభ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది వస్తానని తెలిపారు. నేను విజయవాడలోనే పుట్టాను.. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని హీరోయిన్ రంభ తెలిపింది. చిన్నప్పటి దుర్గమ్మ గుడికి వస్తున్నానని వెల్లడించింది.సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు రంభ స్పందించింది. ఇప్పుడైతే ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదని వెల్లడించింది. కొన్ని కథలు విన్నానని.. నాకు సరిపోయే రోల్స్ రాలేదని రంభ చెప్పింది. ఆ కథల్లో ఏవీ తనకు నచ్చలేదని పేర్కొంది. కాగా.. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఇంద్రకుమార్ అనే లండన్కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్
సామాజిక మాధ్యమాలలో టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్పై అసభ్యకర పోస్టులు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ లక్ష్యంగా అసభ్యకరమైన సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దొరెపల్లి చంటి(30)గా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను చంటిదొరెపల్లి అనే పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నారు.కాగా..ఇటీవలే జనార్ధన్ అనే నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 23న పలువురు సోషల్ మీడియాలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్ చేసి.. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 🚔 𝐂𝐑𝐀𝐂𝐊𝐃𝐎𝐖𝐍 𝐎𝐍 𝐂𝐘𝐁𝐄𝐑 𝐁𝐔𝐋𝐋𝐘𝐈𝐍𝐆 🚔The @CyberCrimesCyb Police have apprehended an individual for targeting actress Anasuya Bharadwaj with defamatory and obscene social media content.𝐐𝐮𝐢𝐜𝐤 𝐂𝐚𝐬𝐞 𝐅𝐚𝐜𝐭𝐬:𝐓𝐡𝐞 𝐀𝐫𝐫𝐞𝐬𝐭: Dorepalli Chanti… pic.twitter.com/mLQLVuTw3G— Cyberabad Police (@cyberabadpolice) April 20, 2026 -
శృతిహాసన్పై పబ్లిక్లో కామెంట్స్.. నటి ఆగ్రహం..!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న శృతిని రోడ్డుపై ఉన్న కొందరు కామెంట్స్ చేశారు. శృతిని చూసి మమ్మ అంటూ పబ్లిక్లో గట్టిగా అరిచారు. ఇది విన్న శృతి హాసన్ 'కౌన్ హై మమ్మ.. హమ్ నే మమ్మ హై.. ఏ మాట్లాడుతున్నారు మీరు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ బండి ఎక్కడ ఉంది అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. అడివి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా రజినీకాంత్ కూలీ చిత్రంలో కనిపించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని కోలీవుడ్లో వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే శృతి హాసన్కు రెండుసార్లు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. Kamal Haasan's daughter Shruti Haasan was heading to a party when someone called her “mumma.” She got angry and replied brutally 😭 pic.twitter.com/mi8rJfKVGe— Sunita Indian (@NationSpeax4j) April 19, 2026 -
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
మెగాస్టార్ నటించిన సినిమాల్లో క్లాసిక్ హిట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఆపద్బాంధవుడు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. 1992లో విడుదదలైన ఈ క్లాసిక్ సూపర్ హిట్ మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్గా మీనాక్షి శేషాద్రి కనిపించింది. ఈ మూవీ రిలీజై నేటికి 34 ఏళ్లవుతోంది. అప్పట్లో ఈ చిత్రంలో ఓ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అవురా అమ్మకు చెల్లా అంటూ సాగే పాట సినీ ప్రియులను అలరించింది. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆ సాంగ్ అభిమానులను మెప్పించింది.దాదాపు 34 ఏళ్ల తర్వాత హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా అవురా అమ్మకు చెల్లా పాటకు స్టెప్పులను రీ క్రియేటే చేశారు. అమెరికాలోని డల్లాస్లో తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె ఈ పాటకు చిందేశారు. 62 ఏళ్ల వయసులోనూ అదే స్టెప్పులతో అదరగొట్టారు. ఆమె డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీనాక్షి శేషాద్రి తన ఇన్స్టాలో రాస్తూ..' నా తెలుగు సినిమా 'ఆపద్భాంధవుడు'లోని ఈ అందమైన పాటను ఉగాది ఇన్స్టాలో పోస్ట్ చేద్దామనుకున్నా. కానీ కొంచెం ఆలస్యమైంది. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీ అందరి కోసం ఈ సాంగ్ తీసుకొచ్చా. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ చిత్రాన్ని హైదరాబాద్లో.. అప్పటి ఆంధ్రప్రదేశ్లోని పూడపల్లి అనే మారుమూల గ్రామంలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ పాటను కులు మనాలిలోని పచ్చని ప్రకృతిలో షూట్ చేశారు. డల్లాస్లోని నా బృందానికి ధన్యవాదాలు. ఈ మొత్తం లుక్ను రూపొందించడం చాలా సరదాగా అనిపించింది.' అని పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Meenakshi Seshadri (@iammeenakshiseshadri) -
హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. కోటి రూపాయల పరిహారం కోరుతూ హైకోర్ట్ను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ను కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతోనే తమన్నా పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీకి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. అసలేం జరిగిందంటే..పవర్ సోప్స్ అనే సంస్థతో 2008లో తమన్నా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే తమన్నాతో పవర్ సోప్స్కు అగ్రిమెంట్ కుదిరింది. కానీ గడువు ముగిసినా 2010, 2011లో కూడా ఆ సంస్థ తన ఉత్పత్తులతో పాటు ప్రకటనల్లో మిల్కీ బ్యూటీ ఫోటోలను వినియోగించింది. దీంతో ఒప్పందం అయిపోయినా కూడా తన ఫోటోలను ప్రకటనల్లో వాడారని ఆరోపిస్తూ తమన్నా ఇటీవలే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తమన్నా పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నా పిటిషన్ను హైకోర్ట్ తిరస్కరించింది. -
నేను ఏ తప్పు చేయలేదు.. చేయను కూడా..: సింగర్ మంగ్లీ
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.మధునాయక్ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)
-
'అలా అయితేనే ఒప్పుకుంటా': అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్గా వస్తోన్న మూవీ "లీసా". సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..' నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటా. డిఫరెంట్గా ఉంటేనే ఆ మూవీని ఒప్పుకుంటా. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా కొత్తదనాన్ని ఫీలయ్యా. హీరోయిన్స్గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ..' లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య ఫర్మామెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, దశరథ్, కిషోర్ దాస్, రవిరెడ్డి , సత్యశ్రీ, మాసం రత్నాకర్ రెడ్డి, హను శ్రీ, గీత, భాను కీలక పాత్రల్లో నటించారు. -
విష్ణు ప్రియ వివాదం.. మొహం చాటేసిన యాంకర్..!
టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై . ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించేందుకు యత్నించగా మొహం చాటేసుకున్నారు. మీరు ఎంత డబ్బులు సంపాదించారని కొందరు ఆమెను అడిగారు. దీంతో తన చేతులను మొహానికి అడ్డుగా పెట్టుకుని.. మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే?..ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Anchor :- #VishnuPriya గారిని ఎంత డబ్బులు సంపాదించారు#VishnuPriya : “Mummy” pic.twitter.com/zo5rP9h3w4— Milagro Movies (@MilagroMovies) April 13, 2026 -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ యాంకర్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్ను అనసూయ తన ట్విటర్లో షేర్ చేసింది. హమ్ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. Hmmmm…. pic.twitter.com/NlOfnWbt8l— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 9, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026 -
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
'చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా'.. రష్మిక ట్వీట్ వైరల్
ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్ రిలేషన్లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్పూర్లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్.. కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. My 30th birthday was kinda different this time. ❤️Went back home after a while. Went to the temple I’ve grown up going to.. ❤️Went to my school and saw it from outside (because of time constraints 🐒🙈) and revisited childhood for a quick bit.. ❤️Cut the cake amongst the… pic.twitter.com/5ZGxuBpUAD— Rashmika Mandanna (@iamRashmika) April 9, 2026 -
హన్సిక మాజీ వదినకు షాక్.. ఏకంగా రూ.2 కోట్లకు..!
దేశముదురు చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ నటించిన ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగానే 2022లో సోహైల్ను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం పటాపంచలైంది. ఈ ఏడాది మార్చి 11న ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఆ తర్వాత హన్సిక తీరుపై మాజీ వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్ విమర్శలు చేసింది. హన్సిక విడాకులను ఉద్దేశించి అంతా ఫేక్ ప్రపంచం అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. వాస్తవానికి హన్సికకు, ముస్కాన్కు గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.తాజాగా హన్సిక మాజీ వదినపై పరువునష్టం దావా వేసింది. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తోందని ముస్కాన్పై రూ.2 కోట్లకు పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ముస్కాన్.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ చేయకూడదని ముస్కాన్ నాన్సీ జేమ్స్కు సూచించింది. ఇటీవలే విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ టాపిక్ కాస్తా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.సినిమా కెరీర్.. హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. -
తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..!
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. -
ఈ సినిమా ఎంతో స్పెషల్ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్కు ఛాన్స్.!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా టాలీవుడ్లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. -
'నేనేం పాపం చేశా.. ఇలా తిట్టడం మంచిది కాదు..'రేణు దేశాయ్
సినీ నటి రేణు దేశాయ్ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రేణు దేశాయ్ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.సోషల్మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
దేవరకొండతో పెళ్లి తర్వాత తొలి బర్త్ డే.. సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. Surrounded by love & powered by happiness!🫶#RashmikaMandanna celebrates her birthday the sweetest way!❤️#VijayDeverakonda #VIROSH #TeluguFilmNagar pic.twitter.com/MA5BseCsce— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2026 -
'మీ హేమక్క ఎప్పుడు అలా చేయదు'.. వీడియో రిలీజ్
టాలీవుడ్ నటి హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ప్రెస్ మీట్లోనూ తనకు పాజిటివ్ రాకుండానే.. వచ్చిందని రాసుకొచ్చారని తన బాధను పంచుకుంది.తాజాగా నటి హేమ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ప్రస్తుతం కొండాపూర్లోని పబ్కి వచ్చానని తెలిపింది. పోలీసుల రైడ్లో కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అక్కడే ఉన్న నన్ను కూడా టెస్ట్ చేశారని.. కానీ నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'రేపు మళ్లీ ఈ వీడియోను పోస్ట్ చేస్తాను.. మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదు.. జెన్యూన్గా ఉంటుంది.. ముక్కుసూటిగా ఉంటది.. లవ్ యూ ఆల్' అంటూ వీడియోలో మాట్లాడారు హేమ.HYD కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్పై పోలీసుల రైడ్లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది అని చెబుతున్నారు.అక్కడ ఉన్న తనకు టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చిందని నటి హేమ వీడియో విడుదల చేశారు. హేమ ఎప్పుడు తప్పు చేయదు జెన్యూన్ గా ఉంటుంది..ముక్కు సూటిగా మాట్లాడుతుంది ..అని అన్నారు నటి హేమ… pic.twitter.com/gzH3Y6EhQn— Tupaki (@tupaki_official) April 3, 2026 -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్..!
ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై రాకాస అనే మూవీని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. -
ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత ఆమెను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వహించా ఈ సందర్భంగా ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా మానసికంగా కలచివేశాయని తెలిపింది. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు అంతలా నన్ను మానసికంగా కుంగిదీసిందని వెల్లడించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేసింది. నాపై వచ్చిన తప్పుడు వార్తల వల్ల తన కుటుంబం చాలా బాధపడిందన్నారు.మీట్ ది ప్రెస్లో హేమ మాట్లాడుతూ....'డ్రగ్స్ కేసులో కొందరు తనపై నిరాధార ఆరోపణలు చేశారు. వాటితో తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ఆ సమయంలో చాలా సఫర్ అయ్యా. అది నాకు చాలా కఠినమైన కాలం. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలనిపించింది' అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. -
ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనిపిస్తోంది.. హేమ ఆవేదన
టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తన గురించి తెలిసి కూడా అలా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో తనకు పాజిటివ్ అని రాకుండానే.. వచ్చిందని ప్రచారం చేశారని ఆరోపించింది. ఇదంతూ చూస్తుంటే ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగానని.. నేను మీ అందరికీ తెలుసు కదా అని ప్రశ్నించింది. నాకు కూడా ఫ్యామిలీ ఉందని.. మా బాధలు అర్థం చేసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఏదైనా నిర్ధారణ అయ్యాకే రాయాలని హేమ సూచించింది. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరని అన్నారు. సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. మరి అదే కేసును కోర్టు కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని తెలిపింది. -
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
'ఆయనను గురువులా భావిస్తా'.. సైన్ లాంగ్వేజ్లో అభినయ స్పీచ్ వైరల్
టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది. ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది. సైన్ లాంగ్వేజ్ లో నటి అభినయ స్పీచ్...నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని గారుసముద్రఖని గారు మంచి దర్శకులు అలాగే అంతకు మించి మంచి నటుడు: అభినయ#Abhinaya #CarmeniSelvam #Samuthirakani pic.twitter.com/lukFHtLVFJ— Filmy Focus (@FilmyFocus) March 26, 2026


