Advertisement
Tourism sector development
-
ఈ దశాబ్దం చివరి నాటికి 10 కోట్ల ఉద్యోగాలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి వీలు కల్పించే ఆలయ కారిడార్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత పర్యాటక రంగం బాగా పెరిగింది.2021లో ఆధ్యాత్మిక పర్యాటకుల సంఖ్య 677 మిలియన్లు. ఇది 2022 నాటికి 1439 మిలియన్లకు పెరిగింది. ఆదాయం కూడా 7.9 మిలియన్ డాలర్ల నుంచి.. 16.2 మిలియన్ డాలర్లకు పెరిగిందని పర్యాటకశాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఈ రంగంలో జీవనోపాధి కూడా పెరుగుతోందని వెల్లడించారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో వంద మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.హై-స్పీడ్ రైళ్ల ద్వారా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, చిన్న నగరాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కృషి చేశాయి.విదేశీ పర్యాటకుల కోసం మాల్స్, షాప్స్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలకు వడ్డీ రహిత ఋణాలు మంజూరు చేశారు. ఈ రకమైన అభివృద్ధిని ఆర్థిక ప్రోత్సాహకంగా మాత్రమే కాకుండా, మరింతగా చూడటం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు ఆధ్యాత్మిక శ్రేయస్సును కోరుతున్నారు. -
పర్యాటక ప్రాధాన్యంతో రాజధాని మాస్టర్ ప్లాన్
సింగపూర్ అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యం లభించేలా రాజధాని మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో రాజధాని మాస్టర్ ప్లాన్పై సింగపూర్ ప్రతినిధి బృందం.. ముఖ్యమంత్రి సమక్షంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. 200 చదరపు కి.మీ పరిధిలోని రాజధాని ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలు, ప్రాధాన్యతలపై గల ఎనిమిది అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీ విద్యా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ వైద్య ఆరోగ్య సంస్థలతో వైజ్ఞానిక కేంద్రంగా రూపుదిద్దుకునేలా మాస్లర్ప్లాన్ను రూపొందించాలన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలుపుతూ రింగురోడ్లు, రేడియల్ రోడ్ల నిర్మాణంపై సింగపూర్ ప్రతినిధి బృందానికి పలు సూచనలు చేశారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి, నందిగామ తదితర పట్టణాలు మాస్టర్ప్లాన్లో ఎలా ఉండాలనే విషయమై కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు నివాసంలో హోలీ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు బంజారాలతో కలిసి డప్పు కొట్టి, నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో అమెరికా సంస్థ డెరైక్టర్ భేటీ విశాఖపట్నంలో వైమానిక నగర నిర్మాణంపై అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సౌత్ అండ్ ఈస్ట్ ఏసియా ప్రాంతీయ సంచాలకులు హెన్రీ స్టీన్ గాస్ బుధవారం సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించారు.