undavalli village
-
ప్రజావేదిక కూల్చివేత
-
ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభం
-
ప్రజావేదిక కూల్చివేత
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేశారు. అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామగ్రి, పూల మొక్కలు కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పూల కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులన్నింటినీ సచివాలయానికి తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీని కూలగొట్టారు. తెల్లారే సరికి మొత్తం ప్రజావేదిక భవనాన్ని కూల్చేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉండవల్లి చేరుకున్న చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఉండవల్లిలోని ప్రజావేదికను సీఆర్డీఏ అధికారులు కూలగొడుతుండతుండడంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడకు చేరుకోవడంతో విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హడావుడి చేశారు. చంద్రబాబుతో పాటు కార్యకర్తలు, నేతలు కూడా ఉండవల్లికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు కృష్ణా కరకట్ట వద్ద వారిని అడ్డుకున్నారు. కరకట్టపైన చంద్రబాబు కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఇకపై నెలలోగా భూవివాదాలకు పరిష్కారం
సాక్షి, అమరావతి/విజయవాడ: వివాదాస్పదంగా ఉన్న ఆరు రకాల భూములకు సంబంధించిన సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 80 వేలకు పైగా ఉన్న చుక్కల భూముల కేసులు, 24 వేల ఈనాం భూముల కేసులు, లక్ష వరకు ఉన్న సొసైటీ భూముల కేసులతో పాటు ఇతర వివాదాస్పద భూములన్నింటినీ పరిశీలించి అవి ఎవరి పేరుపై ఉంటే వారికి పట్టాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి భూమికి 11 అంకెల విశిష్ట సంఖ్యను అందించే భూధార్ పోర్టల్ను ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుక్కల భూములను నెల రోజుల్లోనే ఎవరి స్వాధీనంలో ఉన్నాయో చూసి వారికి యాజమాన్యపు పట్టాలిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ‘భూసేవ’ పేరుతో ప్రవేశపెడుతున్న ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా షేర్లు అమ్ముకున్నంత సులభంగా భూ క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని చెప్పారు. భూధార్ కార్యక్రమంలో కృష్ణా, అనంతపురం జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయ్కృష్ణన్ను సీఎం అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాద రహితంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికల్లా రాష్ట్రవ్యాప్తంగా భూసేవ ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేస్తామని ఐటీ సలహాదారు, ఉడాయ్ ఛైర్మన్ జె సత్యనారాయణ తెలిపారు. రూ.30 నుంచి రూ.60 లోపు ఖర్చు పెట్టి ఇసేవా కేంద్రాలలో భూధార్ కార్డులను తీసుకోవచ్చన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ మన్మోహన్ సింగ్, భూసేవ మిషన్ డైరెక్టర్ విజయ్ మోహన్ పాల్గొన్నారు. తొలుత ‘భూసేవ’ పోర్టల్, ఇ–భూధార్, మొబైల్ ఆధార్ కార్డులు, భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెక్యురిటీ పాలసీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. https:// bhuseva. ap. gov. in లింకు నుంచి వెళ్లి భూసేవ పోర్టల్ సేవలను అందుకోవచ్చని తెలిపారు. నజీమా అనే మహిళకు భూధార్ తొలికార్డును ముఖ్యమంత్రి అందించారు. ప్రాజెక్టులో భాగంగా భూముల వివరాలు శాటిలైట్ మ్యాప్స్తో అనుసంధానం చేస్తున్నారు. భూసేవ ప్రాజెక్టు కోసం రూ.26.75 కోట్ల వ్యయం చేశారు. దీనికోసం రూపొందించిన ప్రత్యేక సాంకేతికత ‘కోర్స్’ కోసం రూ.32.50 కోట్ల ఖర్చయింది. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరగాలి పట్టణాల్లోని ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్ హౌసింగ్పై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించి ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ప్రతీ వారం ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్ష జరుపుతానని, ప్రతీ కుటుంబానికి అన్ని వసతులతో కూడిన ఇంటిని ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5 లక్షల ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారు? ఎన్ని ఇళ్లకు ప్రారంభోత్సవాలు జరిగాయి..? తదితర అంశాలను ఆన్ లైన్ లో ఉంచాలని ఆదేశించారు. -
అమరావతికి దారేది?
గుంటూరు: ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన నూతన రాజధాని అమరావతికి రాత్రికి రాత్రి రోడ్డు మార్గం లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు..గుంటూరు కార్పొరేషన్ అధికారులు నగరానికి నీరందించేందుకు పైప్లైన్ను శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి సమాచారం లేకుండా తవ్వారు.అయితే, ఈ పైప్లైన్ ఉండవల్లి గ్రామం గుంటూరు కెనాల్ సమీపంలో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే మార్గాన్ని రెండుగా చీల్చింది. దీంతో ఈ విషయం తెలియని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై ఆర్ఆండ్బీ అధికారి మధుబాబును వివరణ కోరగా ఎలాంటి అనుమతులు లేకుండా పైప్లైన్ తవ్వకాలు జరిపినట్లు ఆయన చెప్పారు. తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పైప్లైన్ పనులు చేపట్టడంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. (తాడేపల్లి) -
మోదీకి రాజధాని ప్రాంత రైతుల లెటర్లు