Varavarao
-
వరవరరావుకు ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన కవి, సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఈ నెల 28 దాకా తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి్సన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 26న విచారణ చేపడతామని వెల్లడించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న లొంగిపోవాల్సి ఉండగా, బెయిల్ గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్పై బయట ఉన్నప్పుడు హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, బెయిల్ గడువును పెంచాలన్న వరవరరావు వినతిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వ్యతిరేకించింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరవరరావు ప్రస్తుతం ముంబైలో భార్యతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ గడువును పొడిగించాలన్న వరవరరావు విజ్ఞప్తి పట్ల న్యాయస్థానం గురువారం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 28 దాకా లొంగిపోవాలి్సన అవసరం లేదని వెల్లడించింది. -
28న ఖమ్మంలో రాజ్యహింస వ్యతిరేక సభ
హైదరాబాద్ : ప్రజా పోరాటాలపై రాజ్యహింస, ఎన్కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఖమ్మంలో అమరుల బంధుమిత్రులసంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో బుధవారం జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్చి 2న ఛత్తీస్ఘడ్లోని పూజారి పరా– కాంకేర్ (తడపలగుట్ట) ఎన్కౌంటర్లో అమరులైన 10 మంది విప్లవకారుల సంస్మరణ సభను ఈ నెల 28న ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ‘విప్లవోద్యమంలో ఆదివాసీ మహిళల పాత్ర’అంశంపై సామాజిక కార్యకర్త సోనిసోరి, కాత్యాయని విద్మహే (ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక) మాట్లాడతారని చెప్పారు. -
పోలీసుల అదుపులో ముగ్గురు నక్సల్స్!
-
పోలీసుల అదుపులో ముగ్గురు మావోయిస్టులు!
వరంగల్ : వరంగల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఘటన మరవక ముందే...మరో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏటూరు నాగారం మండలం చిట్యాలలో మావోయిస్టులతో పాటు ఓ గ్రామస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిన్న ఉదయం మహేశ్, కిష్టన్న, విమల్తో పాటు శేఖర్ అనే గ్రామస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. మావోలకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లాలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
కళా కృషీవలుడు కానూరి
తొంభైతొమ్మిది దాటితే నూరులో ప్రవేశించినట్లే. 1916లో పుట్టిన కానూరి వెంకటేశ్వ రరావు - కానూరితాత ఖమ్మంలో 2015 మార్చి 10వ తేదీన కన్నుమూశారు. 1915లో గురజాడ కన్నుమూసిన ఏడాదికి కళ్లు తెరచిన కానూరి వరంగల్లో తాను రాసిన గుర జాడపై ‘మహోదయం’ బుర్రకథతోనే నాకు పరిచయమయ్యారు. అట్లూరి, కానూరి, కాశీవిశ్వనాథంల కుటుం బాలు, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 1956లో ములుగు ఘనపురానికి భూములు కొనుక్కొని వచ్చినారు. ములుగు ప్రాంతపు పోరాట యోధుడు రామనర్సయ్య సహకారంతో ఈ కుటుంబాలన్నీ ములుగు ఘనపురంలో వ్యవసాయ జీవితంలో స్థిరపడి రామనర్సయ్య రాజకీయాలతోపాటు మార్పువైపు పయనిస్తూ వచ్చాయి. కానూరి దమయంతమ్మ దంపతులను ఎప్పుడు చూసినా నాకు ఆ బాల్యంలో మనసుమీద నిలిచిపోయిన రైతుల ముఖాలే గుర్తుకొచ్చేవి. అయితే మమ్మల్ని గాఢానుబంధంలోకి తెచ్చింది వ్యవసాయ విప్లవం, విరసం. కానూరి విప్లవ సాంస్కృతిక రంగంలో క్రమశిక్షణ గల నికార్సయిన కార్యకర్తగా కనిపించడమే కాదు, ఆఖరిశ్వాస దాకా రుజు వు చేశాడు. పాటలు, గేయరూపకాలు, నాటకాలు, నాటికలు రాయ డం, పాడడం, శిక్షణ ఇవ్వడంలో ఆయనకు ఐక్య కమ్యూనిస్టు పార్టీ నేర్పిన దృఢమైన, సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. ఆయ నకు ప్రముఖ కమ్యూనిస్టు నేతలతో, ప్రజానాట్య మండలి నాయకులతో కలిసి పని చేసిన అపారమైన అనుభవం ఉండేది. ‘కృష్ణ’ పేరుతో కేఎస్ రాసిన ‘ప్రజానాట్య మండలి’ అనుభవాలు ఆయనకు చాలా ఇష్టమైన పుస్తకం. వరంగల్ విరసంకు కానూరి సాంస్కృతిక సేనానిగా ఒక పెద్ద దిక్కయ్యాడు. 1970 జూలై 4న హైదరాబాద్లో విరసం ఏర్పడగానే నిండు హృదయంతో స్వాగతం పలికి అక్టోబర్లో ఖమ్మం పాణిగ్రాహినగర్లో ప్రథమ మహాసభలకు వచ్చి కానూరి, అట్లూరి, కాశీలు విరసంలో చేరిపోయారు. 1985లో డాక్టర్ రామనాథం హత్యదాకా పదిహేనేళ్లు మేము రెడ్డికాలనీలో, కుమార్పల్లిలో నిత్య సాంస్కృతిక సహ బాటసారులం. డాక్టర్ రామనాథంగారి హత్యతో వరంగల్లో విప్లవ, ప్రజాస్వామిక బుద్ధిజీవుల కుటుంబాలు చాలా వర కు చెల్లాచెదురయ్యాయి. వెంటనే నేను, నా కుటుంబం 90లో వరంగల్ వదిలేయాల్సి వచ్చింది. 1985లోనే కానూరి విరసం నుంచి కూడా నమ్ము మొదలైన వారితోపాటు వెళ్లిపోయాడు. అరుణోదయ సాంస్కృ తిక సమాఖ్య స్థాపన నుంచి తాను కన్నుమూసే దాకా ఆయనే దానికి చుక్కాని. విరసంకు జనసేన, చెరబండరాజు, ఎన్కేలతోపాటు ఒక గాయక, సాంస్కృతిక కాణాచి కానూరి. అంతేకాదు గంగిరెడ్డి రాసిన ‘నాంది’ తర్వాత, అంటే 1972 తర్వాత మళ్లా బుర్రకథలు, నాటికలు, నాటకాలు విరసం సభ్యులకెందరికో నేర్పి ‘ప్రగతి బాగోతం’ ప్రదర్శన లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పించినవాడాయనే. కమ్యూనిస్టు రాజకీయాలకు 70 ఏళ్లు, విప్లవ రాజకీయాలకు 45 ఏళ్లు కళా సాంస్కృతిక రంగాల్లో ప్రచారం చేసిన ఏకైక సాంస్కృతిక యోధుడాయన. భారతదేశంలో కష్టజీవికి వ్యక్తీకరణ కానూరి. ప్రేమ్ చంద్ నవలల్లోని రైతువలె కనిపిస్తాడు. నిరాడంబరుడు. కావి రంగు బట్టలు. ముక్కుసూటి మనిషి. కాళోజీకి వలెనే ముక్కు మీద కోపం. అంతట్లోనే వర్షం వెలిసిన ఆకాశంలోని ఎరడా లువలె నిష్కల్మషమైన స్నేహం. 1946 నుంచి 51 దాకా నిషే ధింప బడిన కమ్యూనిస్టు పార్టీ సంబంధాల వలన అజ్ఞాత జీవితం, అరెస్టు, చిత్రహింసలు. తోటివారందరూ తళనియప్పన్ హంతకచర్య లకు బలి అయిపోతే కింది అధికారులు కళాకారుడనే సానుభూతితో కానూరిని మృత్యుముఖం నుంచి కాపాడారు. 1956లో మళ్లా ఘనపు రంలో ప్రారంభమైన వ్యవసాయ జీవితం నుంచి రామనర్సయ్య సాన్ని హిత్యం ఆయనను మళ్లీ 1968 నుంచీ విప్లవంలోకి లాగింది. విరసం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, గత ముప్పైఏళ్లుగా పూర్తికాలపు విప్లవ సాంస్కృతిక జీవితం ఇంచుమించు దేశ సంచారంలో పార్టీ ఆఫీ సులో గడిచిపోయింది. ఖమ్మంలో న్యూడెమోక్రసీ ఆఫీసులో చనిపోయి నప్పుడు సంచీలో మిగిలిన సాహిత్యమే ఆయన మిగిల్చుకొని సాంస్కృ తిక వారసులకు ఇచ్చిన ఆస్తి. (నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కానూరి సంస్మరణ సభ) వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు : సెల్:9676541715 -
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
విరసం నేత వరవరరావు హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు స్మారక సదస్సు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించారు. ‘వ్యవసాయ రంగంలో మార్పులు’ అనే అంశంపై జరిగిన సదస్సులో వరవరరావు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో విద్యుత్ కోతలు మరింత నష్టాన్ని మిగిల్చాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో భూమి ఉన్న రైతులు సైత ం కూలీలుగా మారే పరిస్థితి నెలకొందన్నారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే చేతి వృత్తులు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇసుక, గ్రానైట్, కలప, ఫైనాన్స్, సారా వంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయన్నారు. గ్రామాల్లోని వనరులపై వారికే హక్కులేని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహా రెడ్డి, విరసం కార్యదర్శి వరలక్ష్మి, హెచ్సీయూ అధ్యాపకులు జి.విజయ్, ఆర్.విజయ్, భారతి, మురళి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.