viajaywada
-
ఐదో రోజు శ్రీమహాచండీ దేవిగా అమ్మవారి దర్శనం
-
ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సులు నిర్వహిస్తాం: శ్రీనాథ్రెడ్డి
సాక్షి, విజయవాడ: ప్రెస్ అకాడమీ సొంతంగా సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తుందని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో 6వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ఈయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టుల స్థితిగతులపై సమీక్షించామని, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తామని తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్సు పెడుతున్నామని చెప్పారు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సులు నిర్వహిస్తామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాలుగు సబ్జెక్ట్లను రూపొందించామని వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. గ్రామీణ జర్నలిస్టులకు మేలు చేసేలా అనేక పుస్తకాలు కూడా ప్రచురించామని, జర్నలిస్టులు వృత్తిలో భాగంగా యూనివర్సిటీలో చదివేందుకు కుదరడం లేదని చెప్పారు. అలాంటి వారికి మేలు చేసేలా యూజీసీ నిబంధనలకు అనుగుణంగా 3 నెలల సర్టిఫికెట్ కోర్స్ పెడుతున్నామని చెప్పారు. ప్రెస్ అకాడెమీ అద్వర్యంలో ఈ కోర్సులను నిర్వహిస్తామని, ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. వాటిలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాలుగు సబ్జెక్ట్స్ రూపొందించామని, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో పాటు సీనియర్ జర్నలిస్టులతో క్లాసులు చెప్పిస్తామన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ 3 నెలల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుందని, జర్నలిస్టులతో పాటు ఆసక్తి ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జర్నలిస్టులకు 1500, నాన్ జర్నలిస్టులకు 3000 ఫీజ్ ఉంటుందని, జర్నలిస్టుల ఫీజుతో సగం అకాడెమీ భరిస్తుందన్నారు. దేశంలో ఇంత తక్కువ ఫీజుతో సర్టిఫికెట్ కోర్స్ నిర్వహించడం ఇదే ప్రధమని, మంచి ప్రతిభ చూపిన వారికి ఇంటర్న్షిప్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మంచి ప్రతిభ ఉంటే ఉద్యోగాలు ఇప్పించడంలోనూ అకాడెమీ కృషి చేస్తోందని గుర్తుచేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రారర్ ఎల్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జర్నలిస్టులు యూనివర్సిటీల్లో జర్నలిజం చేసేందుకు ఎంఓయూలు చేసుకుని ఫీజ్ రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కోర్స్ వల్ల జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. -
సిద్ధమవుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, విజయవాడ: కరోనా కాలం.. వైరస్ కట్టడికి లాక్డౌన్ అస్త్రం ప్రయోగించారు. సుమారు రెండు నెలలు కావస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ భయం నుంచి ప్రజలు తేరుకుంటున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. (ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు) దీంతో ఆర్టీసీ నిబంధనలు మేరకు సేవలందించేందుకు ముందుకొచ్చింది. తొలుత వస్తువుల రవాణాకు కార్గో సేవలు అందిస్తోంది. వలస కార్మికులకు సర్వీసులను నిర్వహిస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులకు సేవలందించే దిశగా ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా సీటింగ్ను సెట్ చేస్తున్నారు. కార్మికులు మరమ్మతులు నిర్వహిస్తుండగా కొందరు బస్సులను శుభ్రం చేస్తున్న దృశ్యాలను విజయవాడ బస్సు డిపోలో ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
‘కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు’
సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ నాయకుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సభ్యతా సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు పేలుతున్నారని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. మైలవరంలో ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఇవ్వలేని సాగునీటి మంత్రి ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని, వాటికి నేడు కోట్లాది రూపాయల టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు. దానిపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తే ‘కృష్ణ ప్రసాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అంటూ దేవినేని ఉమా ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. మంత్రి ఉమా ఇరిగేషన్ శాఖను అవినీతి శాఖగా మార్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్లో జరుగుతున్న అవినీతిపై మంత్రి ఉమా ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ, దేవాలయ భూముల్ని బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తన అనుచరులతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో అనుమతులు లేకుండా 60 కోట్ల రూపాయలుతో రోడ్లు వేస్తున్నారని, వాటికి 150 కోట్ల రూపాయలకు బిల్లులు చేసుకోబోతున్నారని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి దేవినేని ఉమాకు లేదన్నారు. జగన్పై హత్యాయత్నం వెనుక అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో.. డ్రామా అంటూ దుస్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవినేని ఉమా త్వరలో విచారణను ఎదుర్కోడానికి సిద్దంగా ఉండు’ అంటూ హెచ్చరించారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి నిరూపణ కావటం ఖాయమన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న కవిత
-
దుర్గమ్మను దర్శించుకున్న కవిత
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను నిజామాబాద్ ఎంపీ కవిత శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గనడానికి వచ్చిన ఆమె సదస్సు అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.