వీఆర్వో ఇంట్లో చోరీ
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగౌనూరు వీఆర్వో ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. 30 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరణకు గురైందని వీఆర్వో, పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.