Advertisement
womens suffer
-
'మహాలక్ష్మి' కోసం మహిళల నిరీక్షణ..
నిజామాబాద్: అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500ల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని రేవంత్రెడ్డి సర్కారు ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఫలితంగా ఈ పథకం కింద సాయం కోసం ఎంతో మంది మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రధానంగా ఆసరా పథకం కింద పింఛన్ అందుకోలేని మహిళలు తమకు మహాలక్ష్మి సాయం కొండంత అండగా ఉంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా ఆర్థిక సాయం అందిచడం ఒకటి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,196 కోట్లను కేటాయించింది. ఆసరా పథకం కింద జిల్లాలో 77,158 మంది వితంతువులు, 10,520 మంది ఒంటరి మహిళలు, 96,264 మంది బీడీ కారి్మకులు ప్రతినెలా పింఛన్లను అందుకుంటున్నారు.వృద్ధాప్య, వికలాంగులు పింఛన్లలోనూ కొంత మంది అర్హులైన మహిళలు ఉన్నారు. జిల్లాలో 7,18,603 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆసరా పింఛన్లను అందుకోలేని మహిళలు మహాలక్ష్మి సాయం ద్వారా లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో మహాలక్ష్మి సాయం ఎంత మందికి వస్తుంది, ఎవరు అర్హులనే విషయం తేలుతుంది. అసలు మహాలక్ష్మి పథకం అమలు చేస్తారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే జరపకపోవడం, అర్హుల ఎంపికకు చర్యలు తీసుకోకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తంతు ఎలాగూ ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో కోడ్ ఎత్తివేసే అవకాశం ఉంది. అప్పటికైనా మహాలక్ష్మి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.ఇవి చదవండి: సీఎం రేవంత్రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్ -
డ్వాక్రా..టోకరా
డ్వాక్రా రుణ మంజూరు తీరు ఇలా... 2016–17 ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.1,346.24 కోట్లు అర్ధ సంవత్సరంలో ఇచ్చింది రూ.250 కోట్లే... ఇవ్వాల్సింది ఇంకా 1096 కోట్లు 2014–15లో రూ.1,240 కోట్లు లక్ష్యం ఆ ఏడాదిలో ఇచ్చింది రూ.367 కోట్లు సభ్యులకు చేరని సొమ్ము రూ.873 కోట్లు 2015–16లో రూ.1730 కోట్లు లక్ష్యం సభ్యులకు చేరిందీ రూ.1296 కోట్లు ఇవ్వగలిగారు... చేరని సొమ్ము...రూ.434 కోట్లు కాకినాడ సిటీ : జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)కు మంజూరు చేసే రుణ లక్ష్య ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 89,994 డ్వాక్రా సంఘాలుండగా, వీటి పరిధిలో 8,77,586 మంది సభ్యులుగా ఉన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 59,587 సంఘాలకు రూ.1,346.24 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13,353 సంఘాలకు రూ.250 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. రుణ మంజూరులో ఈ అర్ధ వార్షిక ప్రగతిని పరిశీలిస్తే..ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. లక్ష్య సాధనలో విఫలం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు రుణాల కల్పనలో మొండిచేయి చూపించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించి, కేవలం 11,326 సంఘాలకు రూ.367.25 కోట్ల మేరకు మాత్రమే రుణాలిచ్చింది. దీంతో లక్ష్యసాధనలో అధికారులు చతికిలపడ్డారు. అలాగే 2015–16లో 46,986 సంఘాలకు రూ.1,730.71 కోట్లు లక్ష్యం కాగా, 42,835 సంఘాలకు రూ.1,296.71 కోట్ల రుణాలు ఇవ్వగలిగారు. రుణాలు కల్పన లక్ష్యం మేరకు ప్రగతి సాధించలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో, రుణ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసింది. మ్యాచింగ్ గ్రాంటూ లేదు ఒక్క పైసా కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాఫీ కాదు, రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ మ్యాచింగ్ గ్రాంట్కూ దిక్కులేకుండా పోయింది. చివరికి సంఘంలోని ఒక్కో సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూల నిధిగా సంఘ ఖాతాలో జమచేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు మాయమాటలు నమ్మి æవాయిదాలు చెల్లించడం మానేసిన సంఘాలకు వడ్డీ లేని రుణం కాదు కదా, కనీసం పావలా వడ్డీ రాయితీ కూడా కోల్పోయారు. మరోపక్క బ్యాంకర్లు కొత్త రుణాల మంజూరు విషయంలో స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. వడ్డీ వ్యాపారులే దిక్కు! గతంలో బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా రుణాలు తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల కోసం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఐదు, పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా అవసరాల కోసం వారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. లక్ష్యం మేరకు రుణాల మంజూరు డ్వాక్రా సంఘాలకు నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం. తీసుకున్న రుణంతో ఆర్థికంగా సంఘాలు నిలదొక్కుకునేలా వివిధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాం. – శ్రీనివాస కుమార్, ఏపీడీ, డీఆర్డీఏ