Top Stories
ప్రధాన వార్తలు

పోసానికి బిగ్ రిలీఫ్.. రేపు విడుదలయ్యే అవకాశం!
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో ప్రముఖ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి రేపు(బుధవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. పోసానిపై పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈరోజు(మంగళవారం), ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా, నిన్న(సోమవారం) నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే పోసానిపై పెట్టిన మొత్తం 17 కేసుల్లో మిగత వాటిల్లో బీఎన్ఎస్ చట్టం 35(3) కింద నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. దాంతో పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. కాగా, మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్లో పోసానిని అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు. ఏపీ ప్రభుత్వం కుట్రలు..ఏళ్ల కిందట ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలకు ఇప్పడు కేసులు పెట్టారు. పోసానికి న్యాయపరమైన ఊరట లభించకుండా ప్రభుత్వం పన్నాగం పన్నింది. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడెక్కడ కేసులు పెట్టింది కూడా బయటకు రానీయకుండా పోలీసులతో సర్కారు కుట్రలు చేసింది. తద్వారా బెయిల్స్ పిటిషన్లు వేయకుండా ప్రయత్నాలు చేసింది. వందల కిలోమీటర్లు తిప్పారు..ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోరుతూ పోసానిని వందలకొద్దీ కిలోమీటర్లు తిప్పారు పోలీసులు.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు..తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, తర్వత గుంటూరుకు, అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు తిప్పారు. అపై అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. అయితే 67 ఏళ్ల వయసులో, హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న పోసానిని అనారోగ్య సమస్యలున్నా వేధించింది ప్రభుత్వం. ఈ కుట్రను వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ హైకోర్టుకు నివేదించి సమర్థవంతంగా వాదనలు వినిపించింది. పోసానిపై నమోదైన కేసులో 35(3)నోటీసు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విశాఖపట్నం ఒన్టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలిచ్చింది.పోసానికి అండగా వైఎస్సార్సీపీహైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆశ్రయించింది. పోసానికి పూర్తిగా అండగా ఉంది వైఎస్సార్ సీపీ. దాంతో అన్ని కేసుల్లోనూ పోసాని బెయిల్ పొందడంతో రేపు విడుదలయ్యే అవకాశం కనబడుతోంది.

ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్-2021 తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. తిరిగి సీఎస్ఎ లీగ్తో పునరాగమనం చేశాడు. ఈ లీగ్లో టైటాన్ లెజెండ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్.. బుల్స్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఏబీడీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే బౌండరీల వర్షం కుర్పించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ కేవలం 28 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 15 సిక్స్లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో బుల్స్ లెజెండ్స్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో టైటాన్ లెజెండ్స్ను విజేతగా ప్రకటించారు.డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మే 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరికి ఏబీడీ షాకిచ్చాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్లో ఆడాలని డివిలియర్స్ భావించాడు. కానీ అతడి అభ్యర్థనను క్రికెట్ దక్షిణాఫ్రికా తిరస్కరించింది. డివిలియర్స్కు అంతర్జాతీయ క్రికెట్లో 20,014 పరుగులు ఉన్నాయి. అదేవిధంగా 47 ఇంటర్ననేషనల్ సెంచరీలు అతడి పేరిట ఉన్నాయి.డివిలియర్స్కు ఐపీఎల్లో కూడా మంచి రికార్డు ఉంది. 2011-2021 వరకు 11 ఏళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున ఆడాడు. అంతకుముందు కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ డెర్డేవిల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో మొత్తం 184 మ్యాచ్ల్లో 39.71 సగటు, 151.69 స్ట్రైక్రేట్తో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి.చదవండి: #R Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్

Amrutha : ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే
సాక్షి,హైదరాబాద్ : నల్లగొండలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు (Pranay Murder case) నిందితులకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు శిక్ష విధించింది. ప్రణయ్ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ పెరుగుతున్నాడని, అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నట్లు తెలిపారు. దయచేసి తమను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అమృత కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు సంచలన తీర్పుతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అమృత వర్షిణి-ప్రణయ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేసి ప్రణయ్ను అంతమొందించాడు. 👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది.👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది.👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు.👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్ను అస్ఘర్ అమలు పరిచాడు.

మక్కీకి మక్కీ దిశ యాప్ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్ను నిర్విర్యం చేసింది. తాజాగా అదే యాప్ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్ రూపొందించింది. ఆ యాప్ వివరాల్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో దిశ యాప్ని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎగతాళి చేశారు. అదే దిశ యాప్ని కాపీ కొట్టి నేడు అమలు చేయడం గమనార్హం

రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ తెలిపారు. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు.

‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, బడ్జెట్ లో పోలవరంకు కేటాయించిన నిధులు, పెరిగిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు, విద్యారంగం తదితర అంశాలపై వైఎస్సార్సీపీ తన గళం వినిపించింది. ఉభయ సభల్లోనూ వైఎస్సార్సీపీ ఎంపీలు కొన్ని కీలకాంశాలు లేవనెత్తారు.ఈరోజు(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ గురుమూర్తి.. లోక్సభలో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది. దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి.ఇటీవల బడ్జెట్లో పోలవరంకు అరకొరగా రూ. 5936 కోట్లు మాత్రమే కేటాయించారు. పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?, పోలవరం సిఈఓ ఆఫీస్ ను ఏపీకి తరలించాలి. ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం లేఖతో కడప మెడికల్ కాలేజీ పర్మిషన్ ను ఉపసంహరించారు.మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారా లేదన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇస్తారా లేదో చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ హామీని నిలుపుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే. అమరావతికి ఇచ్చే 15000 కోట్ల రూపాయలను ఎవరు చెల్లిస్తారు?, అమరావతి అప్పులను ఎవరు చెల్లిస్తారనేది స్పష్టం చేయాలి’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధి కృషి చేశారురాజ్యసభలో విద్యాశాఖ పద్దులపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ‘ వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలలను నందనవనంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయి. కాలేజీ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాలేజీలో కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఎలాంటి నైపుణ్యాలు లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు’ అని ఎంపీ గొల్ల బాబురావు స్పష్టం చేశారు.

ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

బీట్రూట్ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..?
మాములుగా బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.బీట్రూట్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బీట్రూట్లో ఉండే కొన్ని రకాల ఐరన్లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్లను అందిస్తుంది. మంచి గట్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్ పెప్టైడ్లను అందిస్తుంది. వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. ఇలా బీట్రూట్ బట్టర్మిల్క్ మిక్సింగ్ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్ టానిక్లా పనిచేస్తుంది. (చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!)

రైతన్న దగా.. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
సాక్షి,విజయవాడ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రైతన్నను దగా చేసింది. అన్నదాత సుఖీభవపై యూటర్న్ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు రైతులకు ఇచ్చేది రూ.14వేలేనని తేల్చి చెప్పింది. అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలుతో కలిపి రూ.20 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాము అంటూ అబద్ధాలు చెప్పారు. అయితే, మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కేంద్రం సహాయం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రస్తావించలేదు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రైతులకు ఎగనామం పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.14 వేలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్లో స్టార్లింక్.. ఎలాన్ మస్క్తో ఎయిర్టెల్ డీల్
ఢిల్లీ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. తన వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్ఎక్స్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్లో ఎయిర్టెల్ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రెస్నోట్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ మిట్టల్ మాట్లాడుతూ.. భారత్లో ఎయిర్టెల్ కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేఎక్స్తో పనిచేయడం ఓ మైలురాయి. ముఖ్యంగా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందేందుకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ పొందవచ్చు. దీంతో పాటు భారత్లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడనుందని తెలిపారు. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా యూజర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది.
Amrutha : ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే
సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలు
నిలువ నీడ లేకుండా.. కుప్పంలో పేదల ఇళ్లపై దౌర్జన్యం!
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
‘అమరావతి అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు’
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. అన్నీ మారుతాయి: అఫ్రిది
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..!
తమకూ ఏదైనా పదవి రాకపోతుందా అని ప్రాక్టీస్ చేస్తున్నార్సార్!
ఇతర దేశాలకు ఆడుతున్న టాప్-10 భారత సంతతి క్రికెటర్లు
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
రూమ్ నంబరు 229లో ఏమి జరిగింది?
గ్రూప్–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
Amrutha : ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే
సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలు
నిలువ నీడ లేకుండా.. కుప్పంలో పేదల ఇళ్లపై దౌర్జన్యం!
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
‘అమరావతి అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు’
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. అన్నీ మారుతాయి: అఫ్రిది
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..!
తమకూ ఏదైనా పదవి రాకపోతుందా అని ప్రాక్టీస్ చేస్తున్నార్సార్!
ఇతర దేశాలకు ఆడుతున్న టాప్-10 భారత సంతతి క్రికెటర్లు
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
రూమ్ నంబరు 229లో ఏమి జరిగింది?
గ్రూప్–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
సినిమా

25 రోజులు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా ఉంచలేదు: ప్రియదర్శి
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). ఈ సంక్రాంతికి థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. శంకర్ దర్శకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్ తీసుకొని.. సినిమాను దారణంగా తీశాడని మండిపడ్డారు. అయితే ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ పెరగడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆరిస్టుల ఎంపిక కూడా ఒకటని చెప్పొచ్చు. చిన్న చిన్న పాత్రలకోసం మంచి గుర్తింపు ఉన్న నటీనటులను పెట్టాడు. పోనీ ఆ పాత్రలకు అయినా న్యాయం చేశాడా అంటే అదీలేదు. చాలా మంది నటీనటులను ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. అలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకడు. ఆ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ‘బలగం’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి కేవలం రెండు సీన్లలో వచ్చివెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై ప్రియదర్శి స్పందించాడు.ఆయన నటించిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’లో తను అంత చిన్న పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ‘బలగం’ కథ వినకముందు ఓకే చేశాను. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తుండేవాడిని. గేమ్ ఛేంజర్లో కూడా అలాంటి పాత్రే. 25 రోజుల పాటు నేను కాల్షిట్లు ఇచ్చాను. షూటింగ్ చేశారు. కానీ ఎడిటింగ్లో ఆ సీన్లు మొత్తం తొలగించారు. నాది చిన్న పాత్ర అని తెలిసినా.. ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం శంకర్. అలాంటి డైరెక్టర్తో పని చేసే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే చిన్న పాత్ర అయినా చేశాను. 25 రోజుల పాటు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా తెరపై చూపించలేదు. శంకర్గారితో పని చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. దానికోసమే ఆ సినిమా చేశాను’అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

బాధలో 'కాంతార' హీరోయిన్.. పోస్ట్ వైరల్
'కాంతార' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటి సప్తమి గౌడ (Sapthami Gowda) బాధపడుతోంది. తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. పెడ్ డాగ్ తో ఉన్న బోలెడన్ని జ్ఞాపకాల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?)బెంగళూరుకి చెందిన సప్తమి గౌడ.. 2020 నుంచి సినిమాల్లో నటిస్తోంది. 'కాంతార'తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమైంది. గతేడాది 'యువ' అనే మూవీ చేసింది. ప్రస్తుతం 'కాంతార' మూవీ సీక్వెల్ లో నటిస్తోంది. ఇకపోతే తన ఇంట్లో 2010 నుంచి పెంచుకుంటున్న పెంపుడు కుక్క సింబా చనిపోయిందని సప్తమి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda)

సల్మాన్ ఖాన్ సికందర్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం సికందర్. ఈ మూవీలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లోనూ రష్మిక హవా కొనసాగుతోంది. ఇటీవలే ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించిన భామ.. రంజాన్ కానుకగా మరోసారి అభిమానులను అలరించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.తాజాగా సికందర్ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. భమ్ భమ్ భోలే అంటూ సాగే పాటను విడుదల చేశారు. హోలీ పండుగ రంగుల నేపథ్యంలో రూపొందించిన ఈ పాట సల్మాన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, జోహ్రా జబీన్ పాటకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్లో కాజల్ అగర్వాల్ కూడా అభిమానులను మెప్పించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రంజాన్ కాననుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

'ప్రపంచ క్రికెట్ని భారత్ శాసిస్తుంది’
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ది ప్రత్యేక శైలి. స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ లోనూ అదే మేధస్సును ప్రదర్శించాడు. గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన 38 అశూ.. ఆటను విశ్లేషించడంలో మాంచి దిట్ట. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత భారత్ జట్టు 1990- 2000లలో దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ని ఎలా శాసించిందో.. అదే రీతిలో విజయ పరంపర కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)ని గెలుచుకున్న తర్వాత ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశ్విన్ మాట్లాడుతూ.. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ విజయం సాధించడం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది భారత బౌలింగ్ లైనప్ బలాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించాడు.బౌలింగ్ వల్లేటీమిండియా ఈసారి బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్లే ఈ ట్రోఫీ గెలిచిందని. .ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా గ్రాస్ రూట్ స్థాయిలో బౌలర్లకు మరింత మద్దతు, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని అశ్విన్ పిలుపునిచ్చాడు. బుమ్రా లేకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధిండానికి భారత్ బౌలర్ల చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించక తప్పదని అశ్విన్ తెలియజేసాడు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ అశ్విన్ భారత జట్టుకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను అశ్విన్ గుర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి భారత్ జట్టులో తప్పనిసరిగా ఉండాలని అశ్విన్ సూచించాడు. వారి ముగ్గురితో కూడిన బౌలింగ్ ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.రచిన్ కాదు వరుణ్ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూ జిలాండ్ అల్ రౌండర్ రచిన్ రవీంద్ర ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రకటించడం పై అశ్విన్ విభేదించాడు. రచిన్ రవీంద్రకి బదులుగా, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఆ గౌరవం దక్కాల్సిందని అశ్విన్ పేర్కొన్నాడు. రచిన్ 263 పరుగులతో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. "ఎవరేమి చెప్పినా, ఏం చేసినా, నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కచ్చితంగా వరుణ్ చక్రవర్తి. అతను ఈ మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. కానీ ఆడిన రెండు మూడు మ్యాచ్ లలోనే చాల కీలక భూమిక వహించాడు. వరుణ్ చక్రవర్తి లేకుంటే, ఈ భారత్ కి ఈ టోర్నమెంట్ చాల భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. అతను భారత్ జట్టులో 'ఎక్స్ ఫ్యాక్టర్'.. జట్టు బౌలింగ్ కి వైవిధ్యాన్ని అందించాడు’’ అని అశ్విన్ స్పష్టంచేశాడు .ఆతిధ్య పాకిస్తాన్కి తలవంపులు ఓ వైపు భారత్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోగా, ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చి చివరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ పరిస్థితి చాల దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చిన గౌరవం దక్కకపోగా, ఆ జట్టు వైఫల్యంతో అవమానంతో తలవంపులు తెచ్చుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ దుబాయ్ లో భారత్, న్యూ జిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ కి హాజరుకాకపోవడం మరో దుమారానికి దారితీసింది. భారత్ అన్ని మ్యాచ్ లను 'హైబ్రిడ్ మోడల్'లో దుబాయ్లో ఆడింది. దీనితో పాటు భయానకమైన ఎయిర్ షోలు, ఖాళీ స్టేడియంలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థలు ఐసీసీ టోర్నమెంట్కు పాకిస్తాన్ అధ్వాన్నస్థితిని బయటపెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరసన తెలిజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో జరిగిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆహ్యానించకపోవడం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐసీసీ వెలిబుచ్చిన కారణాలతో మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.

మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొంభైవ దశకంలో జరిగిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ దారుణాలను తాను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నాడు. తాను రాస్తున్న పుస్తకంలో ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతానంటూ 90s ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేలా చేశాడు.‘‘నేను ఒక పుస్తకం రాయడటం మొదలుపెట్టాను. ఇందులో 90వ దశకంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రాయబోతున్నాను. అప్పట్లో ఇది తారస్థాయిలో ఉండేది. ఎవ్వరి గురించి దాచేదిలేదు. అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టేస్తాను.మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తాఅందులో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది కూడా చెప్తాను. ఏ మాజీ కెప్టెన్ అయితే.. అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం ఎదురుచూశాడో.. అతడి గురించి కూడా పూర్తి వివరాలు అందిస్తా’’ అని రషీద్ లతీఫ్ ‘ది కరెంట్ పీకే’కు వెల్లడించాడు.అంతకు ముందు జియో న్యూస్తో మాట్లాడుతూ.. తొంభైవ దశకంలో ఆడిన వాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ అంటే 90s ఆటగాళ్లకు నచ్చదు. వారి వల్లే వరల్డ్కప్ గెలవడం ఆలస్యమైంది.దయచేసి వీరందిని పాక్ క్రికెట్కు దూరంగా ఉంచండి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. పాక్ క్రికెట్కు సేవ చేసీ చేసీ వాళ్లు అలసిపోయారు. కాబట్టి ఇకనైనా వారికి విశ్రాంతినివ్వండి’’ అని రషీద్ లతీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.చాలా వరకు స్క్రిప్టెడ్ఇక క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లోనూ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు తెలిసి.. క్రికెట్ మ్యాచ్లలో చాలా వరకు స్క్రిప్టెడ్. సినిమాలు, నాటకాల మాదిరే క్రికెట్ కూడా!.. టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు రాబట్టాలి. ఎన్ని ఓవర్లు వేయాలి.. ఇలాంటివన్నీ ముందే చెప్తారు.ప్రతి ఒక్క ఆటగాడు తన భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. దీర్ఘకాలంపాటు జట్టులో కొనసాగలేమని అందరికీ తెలుసు. అందుకే డబ్బులు వచ్చే మార్గం కనిపించినపుడు ఇలా అడ్డదారులు తొక్కడం సహజమే. ఏదేమైనా ఒక ఆటగాడు స్వార్థపరుడైతే అతడు కచ్చితంగా అక్రమార్కుల వలలో చిక్కుకుంటాడు.తొలి ఐదేళ్లలో ఇది జరుగుతుంది. నా దృష్టిలో ప్రతిభలేని ఆటగాడి కంటే.. టాప్ ప్లేయర్ మరింత స్వార్థంగా ఉంటాడు’’ అని రషీద్ లతీఫ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా 1990లో పాక్ క్రికెట్ను ఫిక్సింగ్ ఉదంతం కుదిపేసింది. జస్టిస్ మాలిక్ మొహమద్ ఖయ్యూం నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ.. సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ కెప్టెన్ సలీం మాలిక్, పేసర్ అటా ఉర్ రెహ్మాన్లను దోషులుగా తేల్చింది. దీంతో వారిపై జీవితకాల నిషేధం పడింది. ఘోర అవమానం ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా వ్యవహరించిన పాకిస్తాన్కు ఘోర అవమానం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకిదిగిన మెన్ ఇన్ గ్రీన్.. కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖర్లో బంగ్లాదేశ్పైనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దు కావడంతో విజయమన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. మరోవైపు.. తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడిన టీమిండియా చాంపియన్గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్

అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండగ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్-2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది క్యాష్రిచ్ లీగ్ సీజన్లో పాల్గోనే మొత్తం పది జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టేశాయి.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమైన భారత ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో చేరుతున్నారు. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే పది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంకా తమ కెప్టెన్ వివరాలను వెల్లడించలేదు. గతసీజన్ వరకు తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను ఐపీఎల్ మెగా వేలంలోకి ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది.నో చెప్పిన రాహుల్..ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్కు ఢిల్లీ తమ జట్టు పగ్గాలను అప్పగిస్తుందని అంతాభావించారు. అంతా అనుకున్నట్లే అతడిని కెప్టెన్గా ఎంపికచేసేందుకు ఢిల్లీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ రాహుల్ మాత్రం కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతానని సున్నితంగా తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చెపడాతడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.రేసులో డుప్లెసిస్..అయితే ఢిల్లీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిట్సల్ మెనెజ్మెంట్ డుప్లెసిస్ను పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా డుప్లెసిస్కు కెప్టెన్గా చాలా అనుభవం ఉంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా డుప్లెసిస్ వ్యవహరించాడు. అతడు కెప్టెన్సీలో ఐపీఎల్-2022,24 సీజన్లలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆర్హత సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్గా కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్చదవండి: Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం

Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
భారత క్రికెట్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్ను భారత్కు సౌరవ్ గంగూలీ అందించగా.. ఆ తర్వాత 2013 ఎంస్ ధోని సారథ్యంలో తిరిగి మళ్లీ ఛాంపియన్స్గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భారత్ సొంతమైంది. టీమిండియా ఛాంపియన్స్గా నిలవడంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీలక పాత్ర. ఈ టోర్నీ అసాంతం తన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు వెన్నముకగా నిలిచాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్పై కూడా సంచలన స్పెల్ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజయాన్ని తన దివంగత తండ్రికి హార్దిక్ పాండ్యా అంకితమిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు."నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజయాలను చూసి మా తల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూరమైనప్పటికి.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హార్దిక్, కృనాల్ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.అదేవిధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు చాలా విజయాలు సాధించింది. ఏదేమైనప్పటికి ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత జట్టులో సీనియర్లు, జూనియర్లు అంటూ తారతామ్యాలు ఉండవు.. డ్రెసింగ్ రూమ్లో అందరం కలిసిమెలిసి ఉంటాము. నా పదేళ్ల కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటాను. అది అతడికి మాత్రమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే.339 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా చతికలపడింది. హార్దిక్ పాండ్యా 76 పరుగులతో ఫైటింగ్ నాక్ ఆడినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ను చిత్తు చేసి గత ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్
బిజినెస్

తీవ్ర ఒడిదొడుకులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,497 వద్దకు చేరింది. సెన్సెక్స్ 12 పాయింట్లు దిగజారి 74,102 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడి క్రమంగా పంజుకుంటున్న మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టైటాన్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, టాటా మోటార్స్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, జొమాటో, హెచ్యూఎల్, పవర్గ్రిడ్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంమార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండడంతో భారత మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు నిధులు తరలిపోతున్నాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్ల వాల్యుయేషన్ ఆందోళనల వల్ల ఆయా సెగ్మెంట్లు తీవ్ర దిద్దుబాట్లకు లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ స్కామ్(పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక రకమైన సైబర్ క్రైమ్) నుంచి కంపెనీకి చెందిన 38 కోట్ల మంది సబ్స్కైబర్లకు మెరుగైన భద్రత అందించేందుకు కొత్త సాంకేతికతను అమలు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.కొత్త టెక్నాలజీ అమలు సుమారు 80 శాతం పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చర్యల వల్ల వన్ టైమ్ పాస్వర్డ్ల(ఓటీపీ) దుర్వినియోగాన్ని నిరోధించడం, హానికరమైన లింక్లను కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించడం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైమ్లో కస్టమర్లకు వచ్చే మోసపూరిత కాల్స్, స్కామ్ మెసేజ్లను గుర్తించి వాటిని అరికడుతుంది. దాంతో వినియోగదారులు ఆన్లైన్ మోసానికి గురవుతామనే భయం లేకుండా కమ్యూనికేట్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుందని సంస్థ పేర్కొంది.పరిష్కారం పరిమితంగానే..ఈ టెక్నాలజీ పరిష్కారం పరిధి ప్రస్తుతం ఎస్ఎంఎస్, కాల్ ఆధారిత మోసాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ కారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ల నుంచి ఉత్పన్నమయ్యే స్పామ్, మోసాలకు ఈ సాంకేతికత పరిష్కరించదని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాలపై అవగాహనలేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల డిజిటల్ మోసాలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎయిర్టెల్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు రక్షణ కల్పించేందుకు రెగ్యులేటరీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. ఓటీటీ యూజర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, ఈ ప్లాట్ఫామ్లను సెంట్రలైజ్డ్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్లోకి ఇంటిగ్రేషన్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?ఏకీకృత విధానం అవసరం..డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి టెలికాం ఆపరేటర్లు, రెగ్యులేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లతో సహా వాటాదారుల మధ్య సహకారం అవరసమని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్టెల్ తన ప్రయత్నాలతో ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ముందడుగు వేసినప్పటికీ, ఓటీటీ ద్వారా ఉత్పన్నమయ్యే మోసాలపై పోరాటానికి, అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లను రక్షించడానికి ఏకీకృత విధానం అవసరమని చెబుతున్నారు.

యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్పులు ఇవేనా..రాబోయే యాపిల్ సాఫ్ట్వేర్లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్కు ఏకీకృత డిజైన్ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ సాఫ్ట్వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!వ్యూహాత్మక లక్ష్యాలుసంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను జూన్లో జరిగే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించనున్నారు.

మూడేళ్ళలో.. రెండు లక్షల మంది కొన్న కారు ఇది
అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్మిషన్లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్రూఫ్తో కూడిన వేరియంట్లను ఎంచుకున్నారు.ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.
ఫ్యామిలీ

మహిళలు.. మహారాణులు..!
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.సోలార్ప్లాంట్ ఆలోచనలో ఉన్నాంప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు.– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆరి్థకాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేíÙంచి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉందిమా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం

మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!
ఒత్తిడి ఉంటేనే కొన్ని పనులు పూర్తవుతాయని కొందరి అభిప్రాయం. కానీ అది మితిమీరితే వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కాసేపు ఒత్తిడిని భరిస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ అప్పటి ఒత్తిడి... ఆ అనంతరం కాలంలోనూ తన దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు... మానసిక ఒత్తిడి అన్నది అలా చాలాకాలం పాటు అలా కొనసాగుతుంటే అది శారీరకంగా కూడా అనేక సమస్యలను... ముఖ్యంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టే అనేక శారీరక సమస్యలూ, వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి ఎప్పుడూ తాత్కాలికం కాదు. దాని వల్ల శరీరంలో అనేక ప్రతికూలమైన మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు తావిస్తుంది. ఫలితంగా ఎన్నిరకాల వ్యాధులు వస్తాయో చూద్దాం. ప్రధాన ప్రభావం...వ్యాధి నిరోధక వ్యవస్థపైనే! మామూలుగా ఎవరికైనా ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం (వాపు వచ్చి ఎర్రబారి మంటగా అనిపించడం) మామూలే. సాధారణంగా దేహంలో ఎక్కడ గాయమైనప్పటికీ ఇలా జరుగుతుంది. గాయాన్ని మానేలా చేయడమనే ప్రక్రియలో వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు వల్ల ఇలా వాపు, మంట రావడమనేవి సహజంగా జరుగుతాయి. ఆ తర్వాత అవి మెల్లగా తగ్గిపోతాయి. అయితే ఎవరిలోనైనా అపరిమితమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మానడం అనేది బాగా ఆలస్యమవుతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాల ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ప్రభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెలుగుచూసింది. నిజానికి ఎవరిలోనైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ నిరోధక అంశాలు మెల్లగా ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిపోవాలి. కానీ అదేపనిగా చాలాకాలం పాటు ఒత్తిడి కొనసాగుతూపోతూ ఉంటే ఆ కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. ఇది మాత్రమే కాకుండా... ఇంకొన్ని ఉదాహరణల ద్వారా కూడా ఈ థియరీ వాస్తవమని తేలింది. సాధారణంగా ఎవరికైనా జలుబు వస్తే, ఒకటి రెండు రోజుల్లో అది దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం ΄ాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం పడుతుంది. ఒత్తిడి ప్రభావం కారణంగా వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడటమే ఇందుకు కారణం. ఇలా చూసినప్పుడు మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా అది శారీరక సమస్యలైన స్థూలకాయం వంటి వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్క బరువు పెరగడమనే కారణమే కీళ్లనొప్పులూ వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు... గుండెజబ్బులు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, డిప్రెషన్, ఆస్తమా, అలై్జమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు స్పష్టంగా తెలుసుకున్నారు.ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడమిలా...కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియక΄ోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలివి.. ఆకలి లేకపోవడం బాగా ఆలస్యంగా నిద్రపట్టడం లేదా అస్సలు నిద్రపట్టకపోవడం (నిద్రలేమి) మాటిమాటికీ తలనొప్పి వస్తుండటం తరచూ కండరాలు పట్టేస్తుండటం (మజిల్ క్రాంప్స్) తరచూ గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇవి చాలా సాధారణంగా కనిపించేవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి ఊపిరి అందకుండా చేసే ఆస్తమాను ప్రేరేపిస్తుందని వైద్య పరిశోధనల్లో అనేక సార్లు వెల్లడైంది. ఇలా జరగడాన్ని సైకలాజికల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. నిజానికి పెద్దల్లో ఒత్తిడి కలగడం వల్ల అది వాళ్లకు మాత్రమే పరిమితం కాదు... తల్లిదండ్రుల ఒత్తిడి చూసి, పిల్లలూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో అది వారి చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ప్రభావం చూపి, ఆ చిన్నారుల్లోనూ ఆస్తమా రూపంలో వ్యక్తమయ్యే అవకాశమున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్న గర్భవతులనూ, అలాగే తీవ్రమైన కాలుష్యం నెలకొని ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న ఇంకొందరిని ఒక అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన సంతానం కంటే... తీవ్రమైన ఒత్తిడికి లోనైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో చాలా మందికి ఆ తర్వాతికాలంలో ఆస్తమా వస్తుండటం పరిశోధకలను అబ్బుర పరిచింది. అంటే కాలుష్య ప్రభావం కంటే తీవ్రమైన ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావాలే ఎక్కువనేది గత కొంతకాలం కిందట తెలిసి వచ్చిన వాస్తవం.గుండెజబ్బులు : తీవ్రమైన ఆవేశానికి లోనైనవాళ్లు గుండెపట్టుకుని కుప్పకూలిపోతుండటం సినిమాల్లో చాలా తరచుగా చూసే దృశ్యం. అయితే అది పూర్తిగా సత్యదూరం కాదంటున్నారు పరిశోధకులు. ఏవైనా సమస్యల ఒత్తిడి కారణంగా గట్టిగా అరుస్తుండేవాళ్లు, త్వరగా వాదనల్లోకి దిగేవాళ్లు, త్వరగా కోపగించుకునేవాళ్లలో అనేక మంది ఆ ఒత్తిడి తాలుకు దుష్ప్రభావానికి లోనై గుండె జబ్బులు తెచ్చుకుంటారనేది నిపుణుల మాట. ఒత్తిడి తాలూకు ప్రతికూల ఫలితాలు గుండెజబ్బుల రూపంలో వ్యక్తమవుతుంటాయంటున్నారు కొందరు పరిశోధకులు. గుండెజబ్బులు ఉన్నవారిలో చాలామందిని పరిశీలించి, వారిపై అధ్యయనాలు నిర్వహించినప్పుడు వాళ్లలో నిత్యం భావోద్వేగాలకు లోనయ్యేవాళ్లూ, త్వరగా కోపం వచ్చేవారే ఎక్కువగా ఉంటారని ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. అలా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు వస్తుండటంతోపాటు అవే ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు అధ్యయనవేత్తలు, గుండెజబ్బుల నిపుణులు. స్థూలకాయం: శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే... సాధారణంగా పోట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్) వంటి భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. వీటన్నింటిలో తొడలు, పృష్టభాగంలో పేరుకునే కొవ్వు కంటే... పోట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడమన్నది... ఒత్తిడి అనుభవించే వారిలోనే ఎక్కువగా జరుగుతుందని స్పష్టమైందని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు. మామూలుగా ఇతర చోట్లలో కొవ్వు పేరుకునేవారికంటే పొట్టలో కొవ్వు పేరుకోవడం వల్ల (ఆబ్డామినల్ ఒబేసిటీ) వల్ల ఎక్కువగా హాని జరుగుతుందని తేలడం వల్ల... ఒత్తిడి అనేది మొదట పోట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకునేందుకు దారితీయడంతోపాటు ఆ తర్వాత అది గుండెజబ్బుల వంటి వాటి ద్వారా తీవ్రమైన హానిచేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అధిగమించడం మేలు...అది చేయాల్సిందిలా...మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా ఆ సమస్యను అధిగమించడానికీ లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయని తేలింది.ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని బాగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలివి... ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మేలు. అలా మార్చుకునే అవకాశం లేక΄ోతే ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం అవసరం. అవి... బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దాంతోపాటు యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి ∙ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడానికి ప్రయత్నించడం పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. సమస్యలను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. లేదంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడే నిపుణులను సంప్రదించాలి దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మెదడులో దేహాన్ని రిలాక్స్ చేసే, ఆహ్లాదంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవేవీ పనిచేయనప్పుడు అవసరమైతే వృత్తినిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్స్ను సంప్రదించాలి.డయాబెటిస్ : తీవ్రమైన మానసిక ఒత్తిడి డయాబెటిస్కు దారితీయవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా పెరిగే ఆకలి వల్ల అప్పటికప్పుడు దొరికే... తినడానికి ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలైన వేపుళ్లు, నిల్వ పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత మళ్లీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడంతో బాధితులు అనారోగ్యానికి గురవుతారు. డయాబెటిస్ కారణంగా ఇదొక సైకిల్లా సాగుతూ అనారోగ్యానికీ, చక్కెర పెరుగుదలకూ దారితీస్తుంది.వయసు త్వరగా పైబడటం : ఒత్తిడి వల్ల వయసు పైడాల్సిన సమయం కంటే ముందే వృద్ధులై΄ోయే మరో దుష్పరిణామానికి అవకాశముంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైన వారు, వారి తల్లిదండ్రులతో పోలిస్తే మీరే త్వరగా వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. నిర్దిష్టంగా చె΄్పాలంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న కొందరు ఆ వయసుకు కనపడాల్సిన లక్షణాలను చాలా త్వరగా అంటే... 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.అల్జిమర్స్ డిసీజ్ : ఒత్తిడి వల్ల మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ తీవ్రం కావడంతో ΄ాటు దానివల్ల వచ్చే మరుపు మరింత వేగవంతం కావడం చాలా త్వరత్వరగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అలై్జమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని స్పష్టమవుతోంది.చాలా ముందుగా మరణించడం (ప్రీ–మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం చాలా సాధారణ ప్రజలు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ‘ఆయన ఇప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కాదు. ఇంకా చిన్నవయసు’ లాంటి వ్యాఖ్యానాలు చేస్తుండటం కొందరి విషయంలో వింటుండటం పరిపాటే. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..)

చీరకట్టు.. కనికట్టు : ఎన్ని రకాలో!
చీర.. దాన్ని కట్టుకుంటే వచ్చే అందమే వేరు! దాని ముందు ఎన్ని మోడర్న్ డ్రెస్లు అయినా దిగదుడుపే.. అవెంత సౌకర్యాన్నిచ్చినా! అందుకే అందం, అనుకూలత రెండిట్లోనూ అన్నితరాలకూ చీర ఆల్టైమ్ ఫేవరెట్ అండ్ ఫ్యాషన్ కాస్ట్యూమ్గా మారింది. అలాంటి మన సంప్రదాయ కట్టుకు ప్రాంతానికో తీరు ఉంది. కొన్నిటికి వాటి వెనుక పర్యావరణహితాలు కారణాలైతే కొన్నిటికి వాతావరణ పరిస్థితులు కారణాలుగా కనపడుతున్నాయి. ఇంకొన్నిటికి భౌగోళిక స్వరూపాలు కారణంగా నిలుస్తున్నాయి. కేరళలో కనిపించే ఆఫ్ వైట్ విత్ గోల్డెన్ బార్డర్ శారీ (ముండు)నే తీసుకుంటే.. ఆ ప్యాటర్న్ రంగుల్లో కనిపించదు. కేవలం క్రీమ్ కలర్లోనే కనిపిస్తుంది. కేరళ తీరప్రాంతం కాబట్టి.. రంగుల అద్దకంతో ఆ నీటిని కలుషితం చేసుకోకూడదనే పర్యావరణ స్పృహతో ముండును పర్మినెంట్గా క్రీమ్కలర్లో ప్యాక్ చేశారు. కూర్గ్కి వెళితే అక్కడ కొడగు కట్టు కనిపిస్తుంది. పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గ్ను కన్నడాలో కొడగు అని పిలుస్తారు. కొడగు చీర కట్టులో పమిట కుడివైపు, కుచ్చిళ్లు వెనుకవైపు ఉంటాయి. ఇది హిల్ స్టేషన్ కాబట్టి.. నడవడానికి, రోజూవారి పనులకు సౌకర్యంగా ఉండేందుకే ఇక్కడి స్త్రీలు చీరను అలా కట్టుకుంటారు. తమిళనాడులోని బ్రాహ్మణ స్త్రీలు మడిసర్ చీరకట్టులో కనిపిస్తారు. ఇది తొమ్మిది గజాల చీర. ఇదీ అంతే... రోజూవారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తొమ్మిది గజాలంటే గుర్తొచ్చింది.. తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో.. మహారాష్ట్రలోనూ తొమ్మిది గజాల చీరకట్టు కనపడుతుంది. దీనికి గోచీ చీర అనే వ్యవహార నామమూ ఉంది. ఈ చీరకట్టు కనిపించే ప్రాంతంలోని స్త్రీలు (దాదాపుగా) పొలాల్లో పనిచేసేవారే! చేలల్లో దిగి పనిచేయడానికి అనువుగా ఉండేలా ఈ కట్టును కనిపెట్టుకున్నారని శారీ చరిత్రలో కనిపిస్తున్న సాక్ష్యం. గోవాకు వెళితే.. కున్బీ కట్టు కనిపిస్తుంది. ఇది తొమ్మిది గజాల కట్టుకు ఆధునిక రూపం. మూలాలను మరవకుండా ఆధునికతనూ అలంకరించుకోవాలనే ఆసక్తిగల ఆడవాళ్లకు ఇష్టమైన కట్టు కున్బీ. ఇలాంటి వైవిధ్యమైన కట్టులతపాటు దేశం మొత్తమ్మీద 21 రకాల టెక్స్టైల్స్ కూడా ఉన్నాయని, ఇక్కడ కనిపించే రంగులకూ మన ప్రకృతి, పండే పంటలే ప్రేరణ, స్ఫూర్తి అని చెబుతారు రచయిత, హిస్టారియన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, శారీ లవర్ మాళవికా సింగ్.

Ramadan ఉపవాసాల అసలు లక్ష్యం
పవిత్ర రమజాన్ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లింలు ఎంతో ఉత్సాహంతో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. చిన్నపిల్లలు సైతం ‘రోజా’ పాటించడానికి ఉబలాట పడుతున్నారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఉపవాసంఎందుకుండాలి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయ భక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును, అసహ్యాన్ని ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధి కంగా మొగ్గుచూపే స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవా సాల అసలు ఉద్దేశ్యం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతశ్శుద్ధిని కూడా పాటించాలి. నోటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మాట్లాడే అవసరం లేకపోతే మౌనం పాటించాలి. ఇతరులెవరైనా అకారణంగా రెచ్చగొట్టినా తాము ఉపవాస దీక్ష పాటిస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఈ స్పృహ ఉన్నప్పుడే అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉపవాస దీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లు కాదు. కేవలం పస్తులుండడంతో సమానం. ఉపవాసదీక్షల పేరుతో ఇలా ఆకలిదప్పు లతో పడి ఉండటం పట్ల దైవానికి ఏమాత్రం ఆసక్తిలేదు. మహ మ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పారు: ‘ఉపవాస దీక్ష పాటించే చాలా మందికి, తమ ఉపవాసాల ద్వారా ఆకలిదప్పుల బాధ తప్ప, మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’. ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవ విధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉంచడం. పవిత్ర రమజాన్లో ఏ విధంగా అన్ని రకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దాన ధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో... అలాగే మిగతా కాలమంతా సమాజంలోశాంతి, న్యాయం, ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిద్ధించాలన్నది అసలు ధ్యేయం.– యండి. ఉస్మాన్ ఖాన్
ఫొటోలు
National View all

Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ వెలుగుల

‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, బడ్జెట

జట్కా మటన్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది?
హలాల్ గురించి మాంసం ప్రియులకు తెలిసే ఉంటుంది. ముస్లింల దుకాణాల్లో హలాల్ చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు.

‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ

రాజధానికి కేంద్రం నిధులపై స్పష్టత లేదు: వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్
International View all

రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గం

పాక్లో ట్రైన్ హైజాక్.. బందీలుగా 182 మంది..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేప

బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ , ఖైబర్ పక్తున్ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు

రాజా.. ఐ లవ్ యూ రాజా!
బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు.

స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?.
NRI View all

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ
క్రైమ్

అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీలో 10 మంది అరెస్టు
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వినుకొండ కాలేజీలో లీక్.. ఏఎన్యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించారు.కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్వర్డ్ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్కుమార్ సాహులకు చేరింది. వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు. అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు.

ప్రణయ్ హంతకుడికి ఉరి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఐపీసీ సెక్షన్ 302, 129 (బీ), 109 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ కింద నిందితులకు శిక్షలు ఖరా రు చేస్తూ.. నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు.ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావు నాలుగేళ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. ఏ2గా ఉన్న సుభాష్ కుమార్శర్మకు మరణశిక్ష విధించారు. ఏ3గా ఉన్న మహ్మద్ అజ్గర్అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ నిజాంలకు జీవిత ఖైదు విధించారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురవగా.. సుమారు ఆరున్నరేళ్ల విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేక.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతీరావు, గిరిజ దంపతులకు అమృత వర్షిణి ఒక్కరే కూతురు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్. ఇద్దరూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో 2018 జనవరి 30న హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసు కున్నారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన తండ్రి మారుతీరావు నుంచి రక్షణకల్పించాలని అమృత వర్షిణి పోలీసులను కోరారు. దీని తో పోలీసులు ప్రణయ్, అమృత ఇద్దరి తల్లి దండ్రులను మిర్యాలగూడ డీఎíస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం అమృత ప్రణయ్తో కలసి ముత్తిరెడ్డికుంటలోని ఇంటికి వెళ్లారు.తర్వాత ప్రణయ్ కుటుంబం ఆధ్వర్యంలో వారు వివాహ రిసెప్షన్ చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్తో హత్య..: కూతురు ప్రేమ వివాహం, పట్టణంలోనే రిసెప్షన్ చేసుకోవడాన్ని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్కు రూ.కోటి ఇచ్చి ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారు. అప్పటికే అమృత, ప్రణయ్ వివాహమై 8 నెలలు గడిచింది.అమృత 5 నెలల గర్భిణి కూడా. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ తల్లితో కలసి అమృతను మెడికల్ చెకప్ కోసం పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న బిహారీ సుపారీ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో ప్రణయ్పై దాడి చేశాడు. అజ్గర్ అలీ, నిజాం అతడికి సాయం చేశారు. ప్రణయ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 1,200 పేజీలతో చార్జిషిట్.. ప్రణయ్ పరువు హత్య అప్పట్లో జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఆ సమయంలో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా మిర్యాలగూడ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. 4 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 9 నెలల పాటు దర్యాప్తు చేసి, 78 మంది సాక్షులను ప్రశ్నించి 2019 జూన్ 19న 1,200 పేజీలతో చార్జిషిట్ను దాఖలు చేశారు. 8 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. తాజాగా సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఏ2 సుభా‹Ùకుమార్ శర్మకు న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్ 302, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, సెక్షన్ 27 (3), ఆయుధ నిరోధక చట్టం కింద మరణశిక్ష విధించారు. హత్యలో పాలుపంచుకున్న ఏ3 అజ్గర్ అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 మహ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్ సముద్రాల శివ, ఏ8 ఆటోడ్రైవర్ ఎంఏ నిజాంలకు ఐపీసీ 302 రెడ్విత్ 120 (బీ), 109, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద జీవిత ఖైదు విధించారు. ఇక రూ.10 వేల నుంచి రూ.15 వేలు జరిమానాలు చెల్లించాలని, లేదంటే 4 నెలలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో వెల్లడించారు.కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత: ప్రణయ్ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడు తుందని తెలిసిన ప్రజా సంఘాల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీనితో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, సిబ్బంది, నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించాక.. నింది తుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. తన తండ్రి ఎలాంటి నేరం చేయలేదని, అయినా శిక్ష పడిందంటూ.. తిరునగరు శ్రవణ్కుమార్ కూతురు శ్రుతి బోరున విలపించింది. కాగా.. కోర్టు తీర్పు పరువు హత్యలకు పాల్పడే వారికి చెంప పెట్టు వంటిదని ప్రణయ్ హత్య కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ పేర్కొన్నారు.అమృతకు బాసటగా కౌసల్య మిర్యాలగూడ అర్బన్: ప్రణయ్ హత్య ఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేప డంతో.. ఇదే తరహాలో బాధితురాలిగా మారిన తమిళనాడు మహిళ కౌసల్య మిర్యాలగూడకు వచ్చి అమృతకు బాసట గా నిలిచారు. కౌసల్య గతంలో శంకర్ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివా హం చేసుకుంది. ఇది తట్టుకోలేని కౌసల్య తండ్రి.. శంకర్ను హత్య చేయించాడు. తన భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పోరాటం చేసిన కౌసల్య నిందితులకు శిక్షపడేలా చేసింది.ప్రణయ్ ఘటన విషయం తెలిసి మిర్యాలగూడకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం, ఆ కేసులో నిందితులకు పడిన శిక్షలను అమృతకు వివరించి ధైర్యం చెప్పింది. తమిళ నాడులోని కేసుకు సంబంధించిన ఫైల్ కాపీని సైతం ఆమె ఇక్కడి పోలీసులకు అందజేసినట్టు సమాచారం.కేరళ ఎంపీ డిమాండ్తో..: కేరళకు చెందిన దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, ఎంపీ సోం ప్రసాద్ మిర్యాల గూడకు వచ్చి.. అమృతను పరామర్శించారు. దేశంలో పరువు హత్యలను నివారించడానికి ప్రణయ్ చట్టం తేవాలని ఆయన పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేశారు. దానితో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.

ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి!
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్నగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది.