‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం

Published Thu, Mar 6 2025 2:08 AM | Last Updated on Thu, Mar 6 2025 2:04 AM

‘తుమ్

‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం

నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్‌ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

నర్సాపూర్‌(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్‌ దినేష్‌ ఇల్లు బుధవారం షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. దినేష్‌ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్‌ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ సందర్శించి పంచనామా నిర్వహించారు.

తిమ్మాపూర్‌లో 800 కోళ్లు మృతి

భైంసారూరల్‌: మండలంలోని తిమ్మాపూర్‌లో పునేంధర్‌కు చెందిన ఫామ్‌లో బుధవారం 800 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి విఠల్‌ కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కోళ్లు తాగే నీటిలో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ల్యాబ్‌ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పునేంధర్‌ వాపోయాడు.

గంజాయి సేవిస్తున్న పలువురి అరెస్టు

చెన్నూర్‌: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న పలువురిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్‌ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్‌కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం1
1/1

‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement