
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,445 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,81,794 కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.కోవిడ్ బారిన పడి గడచిన 24 గంటల్లో ఒక్కరు మరణించగా.. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7128కి చేరింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 423 మంది కోవిడ్ కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,74,954 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2,607 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 1,22,74,647 శాంపిల్స్ను పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment