
లగేజ్ కౌంటర్ల వద్ద భక్తుల నిరీక్షణ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 18 నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,157 మంది స్వామిని దర్శించుకోగా, 31,445 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment