సాక్షి,విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని విచారించారు.
ఈ విచారణపై సమాచారం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ దైవప్రసాద్... కృష్ణలంక పోలీస్ స్టేషన్కు టాస్క్ఫోర్స్ ఏసీపీ లతాకుమారిని పిలిపించుకున్నారు. ప్రస్తుతం కృష్ణలంక స్టేషన్లో ఏసీపీ దైవప్రసాద్తో పాటు ఆయన నేతృత్వంలోని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బృందం లతాకుమారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


