
సాక్షి, అమరావతి: మార్చి 3న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 7కు వాయిదా పడింది. దివంగత మంత్రి గౌతమ్రెడ్డి పెద్ద ఖర్మ దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 7న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే.. మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు.