Mekapati Goutham Reddy
-
YS Jagan: ఐ మిస్ యు గౌతమ్
-
ఐ మిస్ యూ గౌతమ్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీ మాజీ మంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారాయన. నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) మూడో వర్ధంతి సందర్భంగా.. నేను ఆయన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్ యూ గౌతమ్ అంటూ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్ మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజయం సాధించారు. -
పేరు తొలగించిన మాత్రాన..!
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్ద నేమ్ బోర్డులోంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం విమర్శలకు తావిస్తోంది.వైఎస్సార్ హయాంలో 2008లో బ్యారేజ్ పనులు ప్రారంభమైనప్పటికీ.. ఆయన మరణాంతరం ఆ పనులు అటకెక్కాయి. ఆయన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. రూ.131 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీని పూర్తి చేయించారు. అలాగే 1195 మీటర్ల పొడవుతో రెండు లైన్ల బ్రిడ్జి రోడ్ కూడా నిర్మించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.నాడు సీఎంగా బ్యారేజ్ వద్ద గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణలో వైఎస్ జగన్.. మేకపాటి కుటుంబ సభ్యులుఇక.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారు. ఆయన హఠాన్మరణం జిల్లావాసులను కలచివేసినా… గౌతంరెడ్డి పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యారేజ్కు ఆయనపేరు పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల నెల్లూరు వాసులు, రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. నేడు.. కక్షపూరితంగా ఆ పేరు తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరు చెరిపినా.. ప్రాజెక్టు కోసం ఎవరు నిజంగా కృషి చేశారనే చరిత్రను మాత్రం చెరపలేరని స్థానికులు అంటున్నారు. -
Mekapati Goutham Reddy: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం
ఆత్మకూరు: దివంగత మంత్రి, తన సోదరుడు మేకపాటి గౌతమ్రెడ్డి ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. పట్టణంలో ఏడీఎఫ్, ఎంజీఆర్ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్న ఈ సభలో ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి మాట్లాడారు. 1995లో లండన్లో చదువు పూర్తి చేసుకొని దేశంలో అడుగుపెట్టిన గౌతమ్రెడ్డి అప్పట్లో మాల్ లాంటివి లేకపోవడంతో అది ఏర్పాటు చేసే ఆలోచన చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్ బస్టాండ్ను ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలు వినతులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏడీఎఫ్ ద్వారా రూ.10 కోట్ల సొంత నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నుడా పరిధిలో చేరడం సంతోషకరమని, పేదలకు మరో 15 వేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు జాబ్మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, శనివారం మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 23 కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్లో మరో జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రి యల్ పార్కులో ఆరు నెలల్లో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని, అక్కడ 3 వేల మందికి ఉద్యోగాలు కల్పి ంచేలా పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఉండగా, మరో జాతీయ రహదారి రానుందన్నారు. వేర్హౌసింగ్, లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అనంతరం చెప్పుడు మాటలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడంతో ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి ఆ కుటుంబం వెంట నడిచామన్నారు. ఆత్మకూరు ప్రాంతానికి తమ కుటుంబం తరపున చిరుకానుకగా ఈ బస్టాండ్ను సొంత నిధులతో నిర్మించిన అందజేసినట్లు తెలిపారు. దివంగత వైఎస్సార్ వల్లనే వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైలెవల్ కెనాల్ రూపురేఖలు దాల్చాయని, వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వాదంతో తన సోద రుడు మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. 600 వాగ్దానాలిచ్చి, వాటి ని తుంగలో తొక్కి, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. తండ్రీ, కొడుకులు, దత్తపుత్రుడు అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించేందుకు పాదయాత్ర,బస్సుయాత్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరికితోడు పచ్చపత్రికలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత మంత్రి గౌతమ్రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె అనన్య, కుమారుడు అర్జున్, తల్లి మణిమంజరి పాల్గొన్నారు. -
టీడీపీ నిర్లక్ష్యం.. జగన్ సంపూర్ణం
లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి అన్నదాత ముఖాల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో దివంగత నేత వైఎస్సార్ సంగం బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వివిధ కారణాలతో బ్యారేజ్ నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ రైతులకు అవసరమైన మేర సాగునీరందించాలనే లక్ష్యంతో సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సంగం: రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగానే సంగం వద్ద మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మితమై రైతుల పొలాలకు సాగునీరు అందుతుండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 2004వ సంవత్సరంలో సంగంకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన ఆనకట్ట శిథిలమైందని, బ్యారేజ్ను నిర్మించాలని విన్నవించారు. అప్పటికే ఉన్న పాత ఆనకట్టను నిర్మించి 125 సంవత్సరాలు దాటడంతో ప్రమాదకరంగా తయారైంది. ఆనకట్ట దెబ్బతింటే లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడతారని గ్రహించిన ఆయన 2006లో సంగం వద్ద రూ.90 కోట్ల నిర్మాణ వ్యయంతో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేశారు. మొదట్లో బ్యారేజ్ నిర్మాణం గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ నిర్మాణం చేపట్టకపోవడంతో వైఎస్సార్ అధికారులతో చర్చించి 2008లో బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.110 కోట్లకు పెంచి మరో సంస్థకు పనులు అప్పగించారు. దీంతో నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 2009లో వైఎస్సార్ అకాల మృతితో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంగం బ్యారేజ్ నిర్మాణంపై శీతకన్ను వేయడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. టీడీపీ హయాంలో కాలయాపన 2009లో వైఎస్సార్ మృతి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు బ్యారేజ్ నిర్మాణంపై సక్రమంగా దృష్టి సారించలేదు. దీంతో పనులు నత్తనడకన సాగాయి. తదుపరి 2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం సైతం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోని అన్నదాతల దృష్టిలో వైఎస్సార్ దేవుడవుతారనే భయంతో పనులు సక్రమంగా జరగకుండా ప్లాన్, డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసింది. దీంతో బ్యారేజ్ నిర్మాణం ఇక జరగదని రైతులు భావించారు. హామీ ఇచ్చి.. ధైర్యం నింపి.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం వచ్చి అసంపూర్తిగా ఉన్న బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే త్వరగా బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ నేత మేకపాటి గౌతమ్రెడ్డి సైతం సంగం బ్యారేజ్ను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆనందంలో అన్నదాతలు నూతన బ్యారేజ్ను ప్రారంభించిన తరువాత రెండు పంటలు పండించుకుంటున్న అన్నదాతల్లో ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలోని ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి, నెల్లూరు, నెల్లూరురూరల్, కోవూరు నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా అధికార ఆయకట్టు రైతులకు, అనధికారికంగా మరో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు నూతన బ్యారేజ్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. కావలి, నెల్లూరు పట్టణ ప్రజలకు తాగునీరు సైతం ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు బ్యారేజ్ వద్ద 0.5 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో భూగర్భజలాలు పెరిగి సంగం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు తొలగిపోయాయని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను సమన్వయపరిచి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అంతేకాకుండా 850 మీటర్లు ఉన్న బ్యారేజ్ను 1185 మీటర్లకు పైగా పెంచి రూ.340 కోట్ల వ్యయంతో నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సైతం ఆత్మకూరు తన నియోజకవర్గం కావడంతో సంగం బ్యారేజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పూనుకున్నారు. ఇరిగేషన్శాఖ మంత్రిగా ఉన్న పి.అనిల్కుమార్యాదవ్ సైతం బ్యారేజ్ను పరిశీలించి పనులు వేగవంతం చేశారు. తండ్రి వైఎస్సార్ ఇచ్చిన మాటను కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తూ బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ సమయంలో ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో సంగం బ్యారేజ్కు ఆయన పేరు పెడుతూ 2022 సెప్టెంబర్ 6వ తేదీన బ్యారేజ్ను ప్రారంభించి స్నేహధర్మాన్ని సైతం చాటుకున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ వల్ల జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. పాత ఆనకట్ట శిథిలమైన సమయంలో సాగునీరు అందించాలంటే ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు సరఫరా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడం వల్ల జిల్లాలోని రైతాంగానికి పూర్తిగా సాగునీరు, అవసరమైన చోట్ల తాగునీటిని సైతం అందిస్తున్నాం. – మేకల అనిల్కుమార్రెడ్డి, రుణపడి ఉన్నారు సంగం బ్యారేజ్కు శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా రైతాంగం, ప్రజలు రుణపడి ఉన్నారు. 5 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుండడం చాలా సంతోషకరం. – పులగం శంకర్రెడ్డి. అన్నారెడ్డిపాళెం, సంగం అపర భగీరథుడు వైఎస్సార్ సంగం వద్ద పాత ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మా ప్రాంతానికి నీరందించేలా కృషి చేసిన అపర భగీరథుడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్యారేజ్ నిర్మాణాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. – మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సంగం -
నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మొదటి వర్ధంతి
-
మరువలేని నేత.. సదాస్మరామి.. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రథమ వర్ధంతి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో నిర్వహించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించారు. మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మికంగా మృతి చెంది ఏడాది అయినా ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. మరువలేని నేతను.. మరోసారి స్మరించుకునేందుకు అభిమానులు వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇందుకుతగ్గట్టుగానే కుటుంబ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మేకపాటి అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. రచయిత, జర్నలిస్ట్ విజయార్కె రాసిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరువేసుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి పాల్గొన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
స్థపతి వడయార్కు స్వర్ణ కంకణం బహూకరించిన సీఎం జగన్
సాక్షి, సోమశిల (నెల్లూరు): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కాంస్య విగ్రహాల రూపకల్పన చేసిన స్థపతి వడయార్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వర్ణ కంకణం బహూకరించారు. సంగంలో మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో విగ్రహాలు తయారు చేసిన స్థపతి వడయార్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్థపతి చేతికి స్వర్ణ కంకణాన్ని తొడిగి అభినందించారు. చదవండి: (నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పచ్చజెండా) -
Mekapati Goutham Reddy Sangam Barrage: పెన్నా పారవశ్యం!
సాక్షి, అమరావతి: పెన్నా యవనికపై చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జీవనాడులైన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రెండు బ్యారేజీలను పూర్తి చేసిన ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేశారు. తండ్రి చేపట్టిన రెండు బ్యారేజీలను తనయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల స్వప్నమైన రెండు బ్యారేజీలు సాకారమవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంగం బ్యారేజ్ కింద 3.85 లక్షల ఎకరాలు, నెల్లూరు బ్యారేజ్ కింద 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది. ఏటా ఇసుక బస్తాలకు భారీ వ్యయం ► నెల్లూరు జిల్లాలో కనిగిరి, కావలి, కనుపూరు కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా పెన్నా నదిపై సంగం వద్ద 1882–83లో 846 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల ఎత్తుతో బ్రిటీష్ సర్కార్ ఆనకట్ట నిర్మించింది. ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగించేవారు. సంగం ఆనకట్ట శిథిలమవడంతో 0.3 మీటర్ల ఎత్తున ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నాకు వరద వస్తే ఇసుక బస్తాలు కొట్టుకుపోయేవి. ఇసుక బస్తాల కోసం ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటికిపైగా వ్యయమయ్యేది. వరద వస్తే సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించేవి. ఆనకట్టలో నీళ్లు లేక తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యేవి. ► సంగం ఆనకట్టకు 20 కి.మీ. దిగువన నెల్లూరు సమీపంలో 1854–55లో 481.89 మీటర్ల పొడవు, 0.7 మీటర్ల ఎత్తుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటీష్ సర్కార్ సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించింది. 1862లో వరదలకు కొట్టుకుపోవడంతో అదే ఏడాది మళ్లీ కొత్తగా 621.79 మీటర్ల పొడవుతో ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట కూడా శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాలుగా మారింది. ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా వరద వస్తే కొట్టుకుపోయేవి. దీనికోసం చాలా ఖర్చయ్యేది. పెన్నాకు ఏమాత్రం వరద వచ్చినా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్టలో నీరు లేక నెల్లూరు దాహార్తితో తల్లడిల్లేది. ► సాగు, తాగునీరు, రవాణా, ముంపు ముప్పు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్టల స్థానంలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ను నిర్మించాలని వందేళ్లుగా నెల్లూరు ప్రజలు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2004 మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ సంగం, నెల్లూరు బ్యారేజ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. నాటికి, నేటికి ఇదీ తేడా... సంగం, నెల్లూరు బ్యారేజ్ల పనులను 2014 నుంచి 2016 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కమీషన్లు వసూలు చేసుకునేందుకు వీలున్న పనులను మాత్రమే చేపట్టారు. చివరకు రెండు బ్యారేజ్లను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టాక జలయజ్ఞం ప్రాజెక్టులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2008 ఏప్రిల్ 29న నెల్లూరు బ్యారేజ్ పనులకు శంకుస్థాపన చేసిన వైఎస్సార్ సంగం, నెల్లూరు బ్యారేజ్లను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కరోనా, పెన్నాకు మూడేళ్లుగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెండు బ్యారేజ్లను సీఎం జగన్ పూర్తి చేశారు. సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. బ్యారేజ్ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసిన నెల్లూరు బ్యారేజ్ మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ ఎక్కడ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా (సోమశిల రిజర్వాయర్కు 40 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం: 50,122 చదరపు కిలోమీటర్లు బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్కు అనుబంధంగా రెండు వరసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధం చేసిన స్టాప్ లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటి నిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : రూ.335.80 కోట్లు వైఎస్సార్ హయాంలో వ్యయం : రూ.30.85 కోట్లు టీడీపీ హయాంలో వ్యయం : రూ.86.10 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.131.12 కోట్లు నెల్లూరు బ్యారేజ్ ఎక్కడ : నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్కు 20 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం : 51,800 చదరపు కిలోమీటర్లు బ్యారేజ్ పొడవు : 640 మీటర్లు (బ్యారేజ్కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 51 (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు, 4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాప్లాగ్ గేట్లు: 6 గేట్ల నిర్వహణ : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 10,90,000 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 14.3 మీటర్లు గరిష్ట నీటి నిల్వ : 0.4 టీఎంసీలు కనీస నీటి మట్టం : 11.3 మీటర్లు ఆయకట్టు : 99,525 ఎకరాలు అంచనా వ్యయం : రూ.274.83 కోట్లు వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం : రూ.86.62 కోట్లు టీడీపీ హయాంలో చేసిన వ్యయం : రూ.71.54 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేశారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.77.37 కోట్లు. -
సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాలు
కొత్తపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దివంగత సీఎం వైఎస్సార్, దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డిల కాంస్య విగ్రహాలతో పాటు, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జి వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకు ఈ మూడు విగ్రహాలను తయారు చేసినట్టు రాజ్కుమార్ ఆదివారం ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో విగ్రహాన్ని 2.5 టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తుతో తయారు చేశానన్నారు. గౌతంరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తయారు చేయాల్సిందిగా తనకు సూచించారని గుర్తు చేసుకున్నారు. కానీ వైఎస్సార్ విగ్రహంతో పాటు గౌతంరెడ్డి విగ్రహాన్ని కూడా తయారు చేయాల్సి వచ్చిందని రాజ్కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. కొత్తపేట శిల్పశాలలో వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాలతో శిల్పి రాజ్కుమార్ -
సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ► ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగం చేరుకుంటారు. ► 11–1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించి, బహిరంగసభలో ప్రసంగిస్తారు. ► 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. ► 1.50–2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ► 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
సస్యశ్యామలం.. సిరుల పంటలకు సంగం బ్యారేజీ సిద్ధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సంగం బ్యారేజీ చివరి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి.. ఈ సీజన్లోనే ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. జలయజ్ఞంలో భాగంగా కొత్త బ్యారేజీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరర్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. బ్యారేజీ పనులు చేయడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతుల కలల బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బీడు భూముల్లో సిరుల పంటలు పండనున్నాయి. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు యోగ్యకరం కానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంకరార్పణ చేస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణ పనులు పూర్తిచేశారు. శిథిలావస్థలో ఉన్న 135 ఏళ్ల నాటి ఆనకట్ట కమ్ బ్యారేజీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. త్వరలో మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. బ్రీటీష్ కాలంలో సింహపురి ప్రాంత అన్నదాతల కోసం నిర్మించిన సంగం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకుంది. సాగునీటి కోసం అన్నదాతలు, తాగునీటి కోసం నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సంగం బ్యారేజీ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టారు. సంగం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిపక్షనేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంగం పర్యటించారు. అన్నదాతల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంగం వద్ద పెన్నానదిలో నూతన బ్యారేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.122.50 కోట్ల వ్యయంతో 2006లో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ అకాల మరణంతో బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయి. బ్యారేజ్పై రాకపోకల కోసం ఏర్పాట్లు నిర్మాణం పూర్తి సంగం నూతన బ్యారేజ్ నిర్మాణ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది. 1,195 మీటర్ల పొడవుతో పెన్నానదిలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్యారేజ్కి 85 గేట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణకు మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బ్యారేజ్ నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే నిర్మాణాలు పూర్తయ్యాయి. సంగం పాత ఆనకట్ట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిధుల వృథాకు చెక్ పాత ఆనకట్ట వల్ల కనుపూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువకు నీరు అందించేందుకు ప్రతి సంవత్సరం రూ.50 లక్షలకు పైగా నిధులతో ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి నీరు అందించేవారు. నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల ఇసుక బస్తాలతో పనిలేకపోవడంతో ప్రతి సంవత్సరం రూ.50లక్షలకు పైగా ప్రజాధనం వృథా కాకుండా నిలిచిపోతుంది. పైగా సంగం బ్యారేజ్ వద్ద 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. మరోవైపు భూగర్భజలాలు పెరిగి నీరు మోటార్లకు సైతం అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమస్యకు బ్రేక్ నిత్యం సంగం పాత బ్యారేజ్ పైన రాకపోకలు స్తంభించేవి. ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు ఉండేది. త్వరలో ఈ సమస్య తీరిపోనుంది. నూతన బ్యారేజ్ మీద రాకపోకల కోసం 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు. రెండు వైపులా వాహనాలు తిరిగే వీలు ఏర్పడింది. పాదచారులు నడిచేందుకు వీలుగా 1.5 మీటర్ల నడక దారిని సైతం నిర్మించారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సౌకర్యం మెరుగుపడుతుంది. ఆనందంలో అన్నదాతలు కలలు కార్యరూపం దాల్చడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి, పనులు పూర్తిచేసిన ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతన బ్యారేజ్కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెట్టడం జగన్మోహన్రెడ్డి మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని అన్నదాతలు, ప్రజలు హర్షాతిరేకాల మధ్య చెబుతున్నారు. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్సార్ సంగం బ్యారేజ్ స్థానంలో నూతన బ్యారేజ్కు శంకుస్థాపన చేసిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అపర భగీరథుడు. అన్నదాతల కష్టాలు తెలిసిన నేత నూతన బ్యారేజ్తో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సాగునీరు పొందిన ప్రతి రైతు ఆ మహానుభావుడి పేరును చిరకాలం గుర్తుంచుకుంటారు. – పులగం శంకర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తండ్రికి మించిన తనయుడు తండ్రి శంకుస్థాపన చేసిన సంగం నూతన బ్యారేజ్ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడు. అన్నదాతల కష్టాలు తీర్చిన తండ్రి, తనయులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. – కంటాబత్తిన రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం సంగం నూతన బ్యారేజ్కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం. దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎంతటి మర్యాదనిస్తారో తెలియచెప్పారు. అంతేకాకుండా తన దగ్గరి వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటారనే విషయం మరోమారు రుజువైంది. – ముడి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించారు. 1,37,289 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 64.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి ఆధిక్యత సాధించారు. సరాసరి ప్రతి రౌండ్లో 4 వేల ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు. అధికార పార్టీకి బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్లో సైతం వైఎస్సార్సీపీ సత్తా చాటింది. 208 పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 167 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, నోటాకు 3, బీఎస్పీకి 7, ఇతరులకు 10 ఓట్లు లభించాయి. ఫ్యాన్ గాలికి బీజేపీ గల్లంతు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సునామీకి బీజేపీ గల్లంతయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోధర్, కేంద్ర మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నేతలు ఆత్మకూరులో తిష్టవేసి కోలాహలంగా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార వైఎస్సార్సీపీపై అనేక అభాండాలు వేస్తూ ప్రచారం సాగించారు. బీజేపీ ఆరోపణలను ప్రజలు నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. కేవలం 19,353 ఓట్లు మాత్రమే దక్కించుకుని 14.1 «శాతానికి ఆ పార్టీ పరిమితమైంది. తిరుపతి పార్లమెంటు, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్టు కోల్పోయిన బీజేపీ.. తాజాగా మూడోసారి ఆత్మకూరులోనూ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొన్నప్పటికీ వారి ఆటలు సాగలేదు. ఓటర్లు ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ.. అనైతిక మద్దతుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న మేకపాటి విక్రమ్రెడ్డి అపారంగా పెరిగిన ఓటర్ల మద్దతు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్ల మద్దతు ఆపారంగా పెరిగింది. పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయినప్పటికీ మంచి మెజార్టీ సాధించడం ద్వారా నేతలు సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో 83.38% పోలింగ్ అయ్యింది. ఈ ఉప ఎన్నికలో కేవలం 64.26 శాతానికే పోలింగ్ పరిమితమైంది. ఓటర్లు పోలింగ్కు వెళితే వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తారనే కారణంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నేత, తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ట్రాక్టర్లలో నెర్రవాడ వెంగమాంబ తిరునాళ్లకు తరలివెళ్లేలా ప్రేరేపించారు. మర్రిపాడు, సంగం, ఆత్మకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తిరునాళ్లకు వెళ్లడంతో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం వైఎస్సార్సీపీకి దక్కాయి. 2019లో 53.22 శాతం ప్రజలు మద్దతుగా నిలిస్తే, ఇప్పుడు అందుకు అదనంగా 21.25 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్కుమార్పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ పరంపర తుది రౌండ్ వరకు కొనసాగింది. ఆత్మకూరు పరిధిలోని 6 మండలాల్లో గణనీయమైన మెజార్టీ దక్కింది. గౌతమ్ అన్న పేరు నిలబెడతా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, పేదల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణే నా విజయానికి కారణం. ప్రణాళికా బద్ధంగా ఆత్మకూరు ఉన్నతికి కృషి చేస్తాను. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నా విజయం కోసం విశేషంగా కృషి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు. – మేకపాటి విక్రమ్రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు -
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్కుమార్ నాన్లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారం
-
తండ్రి అండ.. అన్న ఆశయం నీడ
తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఇచ్చిన ఆత్మకూరు ప్రజల అండదండలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నామని చెప్పుకోవడం మినహా, ప్రధాన పార్టీలకు స్థానిక అభ్యర్థులు కరువయ్యారు. ఆత్మకూరులో బీజేపీ స్థానికేతరుడైన భరత్కుమార్ యాదవ్ను బరిలోకి దింపాల్సి వచ్చింది. మరో వైపు విక్రమ్రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని చూరగొన్న దివంగత గౌతమ్రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని పోలింగ్ తేదీ కోసం తహతహలాడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అతి తక్కువ సమయంలో ప్రజల అభిమాన పాత్రుడు అయ్యాడు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఆయన సోదరుడు విక్రమ్రెడ్డి పట్ల చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి విక్రమ్రెడ్డి సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. తన అన్నపై పెంచుకున్న అభిమానం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గౌతమ్రెడ్డి ఆశయాలు నెరవేరుస్తానని ఘంటాపథంగా చెబు తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీ–ఫారం ఇచ్చిన తర్వాత ఈ నెల 2న నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు రోజుల్లో 18 పంచాయతీల ప్రజల దరికి మేకపాటి విక్రమ్రెడ్డి చేరారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ స్థానికులతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూనే ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాన్ని బలపర్చాలని, సోదరుడు గౌతమ్రెడ్డి ఆశయ సాధన కోసం అంతా ఏకమై తీర్పు చెప్పాలని కోరుతున్నారు. గ్రామాల్లో అనూహ్య మద్దతు లభిస్తోండడంతో మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక రెఫరెండమ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి స్థానికేతరుడే దిక్కు భారతీయ జనతా పార్టీకి ఆత్మకూరులో అభ్యర్థి కరువయ్యారు. నోటిఫికేషన్ ప్రకటించక మునుపే ముందే పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఒకప్పుడు ఆత్మకూరులో బీజేపీ గణనీయమైన మద్దతు లభించింది. 1985, 89ల్లో స్వల్ప ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓటమి పాలైంది. అటువంటి నియోజకవర్గంలో ఈ దఫా డిపాజిట్లు కాదు కదా.. కనీస ఓట్లు కూడా పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూకుమ్మడిగా దివంగత మంత్రి గౌతమ్రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని ప్రజలు పార్టీలకతీతంగా భావిస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక నాయకులు పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి బాహాటంగా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికేతరులే దిక్కయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్ను బరిలోకి దింపారు. అపార మద్దతు లభిస్తోంది – మేకపాటి విక్రమ్రెడ్డి ప్రభుత్వం నుంచి రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సోదరుడు దివంగత మంత్రి గౌతమ్రెడ్డి ఆత్మకూరు ప్రజల్లో ఒక్కరుగా మమేకమయ్యారు. ఆత్మకూరును అన్నీ విధాలు అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. ఆయన మృతితో రాజకీయాలకు వర్గాలకతీతంగా ప్రజల నుంచి అపార మద్దతు లభిస్తోంది. అనంతసాగరం మండలం మినగల్లు పంచాయతీలో ప్రచారం అనంతరం వెంకటరెడ్డిపల్లె స్థానిక నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించాను. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ ప్రజాజీవితానికి అంకితం కానున్నట్లు ప్రకటించారు. సోదరుడి ఆశయసాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైనికుడిగా పని చేయనున్నట్లు వివరించారు. తన తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవాలను అనుసరించి ప్రజల కోసమే పని చేస్తాను. స్థానిక సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తాను. విక్రమ్ అన్నలో గౌతమన్నను చూసుకుంటున్నాం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం జీర్ణించుకోలేనిది. ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డిలో గౌతమ్ అన్నను చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో గౌతమన్న ఆశయాల సాధన కోసం విక్రమ్రెడ్డి ద్వారా సాధించుకోవాలని ప్రజలు ఆకాంక్షతో పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. – పెయ్యల సంపూర్ణమ్మ, అనంతసాగరం ఎంపీపీ భారీ మెజార్టీయే గౌతమన్నకు ఘన నివాళి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే ఘనమైన నివాళి. గౌతమన్న ప్రత్యేక పంథాతో వివాద రహితుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని దీవించి భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే గౌతమన్న ఆత్మ సంతోషిస్తుంది. – రాపూరు వెంకటసుబ్బారెడ్డి, అనంతసాగరం జెడ్పీటీసీ సభ్యుడు -
Mekapati Vikram Reddy: అమ్మ ఆశీర్వాదం.. సీఎం అభినందనలతో..
ఆత్మకూరు: ఆత్మకూరు శాసనసభకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డికి లక్ష ఓట్ల భారీ మెజార్టీ ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విక్రమ్రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా జరిగింది. ►విక్రమ్రెడ్డి తన తండ్రి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, తల్లి మణిమంజరి, భార్య వైష్ణవి, సోదరి ఆదాల రచనలతో కలిసి తొలుత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బైపాస్రోడ్డు వద్ద కొలువైన అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ►అనంతరం నెల్లూరుపాళెం మీదుగా ఆత్మకూరు పట్టణంలోకి ప్రవేశించిన అభ్యర్థి విక్రమ్రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు ఆర్టీసీ డిపో వద్ద ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ శ్రావణ్కుమార్ విక్రమ్రెడ్డికి శాలువా కప్పి భారీ పూలమాల వేశారు. ►అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రచార వాహనంలో విక్రమ్రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, రాజ్యసభసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, సూళ్లూరుపేట, కందుకూరు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, మానుగుంట మహీధర్రెడ్డి తదితరులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టి వాహనం ముందు సాగుతుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు. ►బీఎస్సార్ సెంటర్లోని సుల్తాన్ షాహిద్ దర్గాకు రాజమోహన్రెడ్డి, విక్రమ్రెడ్డి నాయకులతో కలిసి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిల్రోడ్డులోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ►కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అభయాంజనేయస్వామి గుడి వద్ద విక్రమ్రెడ్డిని కలిసి వైఎస్సార్సీపీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేశారు. ►తర్వాత ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా సాగింది. అక్కడి నుంచి ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి కాకాణి, ఆదాల ప్రభాకర్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ హరేంద్ర ప్రసాద్కు అందజేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, విజయ డెయిరీ చైర్మన్ కొండూరు రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ఎఫ్ఎఫ్సీ చైర్మన్ మేరిగ మురళి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆత్మకూరు మున్సి పల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఆశీర్వాదం తీసుకుని.. నెల్లూరు(సెంట్రల్): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం నెల్లూరులోని తన ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లే ముందు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చిత్రపటం వద్ద నామినేషన్ పత్రాలను ఉంచారు. తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి, తల్లి మణిమంజిరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. గౌతమ్రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయంలో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. అనంతరం తల్లి చేతుల మీదుగా నామినేషన్ పత్రాలు తీసుకుని ఆత్మకూరుకు బయలుదేరారు. విద్యాధికుడు సాక్షి, నెల్లూరు: ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి విద్యాధికుడు. తన సోదరుడు గౌతమ్రెడ్డి లాగే ఉన్నత చదువులు చదివారు. వ్యాపార రంగంలో ఉన్న విక్రమ్రెడ్డి మేకపాటి కుటుంబ వారసుడిగా ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన విద్యాభ్యాసం ఊటీలోని గుడ్షెపర్డ్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. ఆపై బీటెక్ (సివిల్) ఐఐటీ చెన్నైలో పూర్తి చేసి, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివారు. కేఎంసీ డైరెక్టర్గా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మేకపాటి కుటుంబంపై అభిమానం ఆత్మకూరు: ‘మేకపాటి కుటుంబంపై ఆత్మకూరు ప్రజలకు అపారమైన అభిమానం ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇది కనిపించింది.’ అని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. నామినేషన్ అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం అభినందించారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్రెడ్డి సూచించిన విక్రమ్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారన్నారు. బీఫారం అందుకునే క్రమంలో విక్రమ్రెడ్డి తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చూసిన విషయాలను, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎంతో ఆసక్తిగా ముఖ్యమంత్రికి వివరించారన్నారు. దీంతో ఆయన విక్రమ్రెడ్డిని అభినందించి ఆశీర్వదించినట్లు చెప్పారు. వారివి మచ్చలేని రాజకీయాలు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ మేకపాటి కుటుంబం మచ్చలేని రాజకీయాలు చేస్తుంటారని, అదే వారికి శ్రీరామరక్ష అని చెప్పారు. గౌతమ్రెడ్డి మంత్రిగా తన బా«ధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చారని, రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. విక్రమ్రెడ్డి విద్యావంతుడని, రాజకీయాల గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారని, తప్పనిసరిగా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటారన్నారు. దిగ్విజయంగా సాగుతారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరాడంబరంగా నిర్వహించాలని అనుకున్న నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు తరలిరావడం శుభపరిణామమన్నారు. పారిశ్రామికవేత్తగా దూసుకుపోతున్న విక్రమ్రెడ్డి రాజకీయాల్లో సైతం విజయపం«థాలో దిగ్విజయంగా సాగుతారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎంతో నమ్మకం అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామాల్లో, మున్సిపల్ పరిధిలో నాలుగు వార్డుల్లో తిరిగానన్నారు. సంక్షేమ పథకాలు పక్కాగా అందుతుండడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో తెలిసిందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తల అండతోనే నాయకులు తయారవుతారని, ఆ విషయం తాను గుర్తెరిగినట్లు, తప్పకుండా వారి మనోభావాల మేరకే పనిచేస్తానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల అండదండలతో విజయం సాధిస్తానని, 2024లో ఎన్నికలకు సమాయత్తమయ్యేలా ఈ రెండేళ్లు పనిచేస్తానని అన్నారు. -
ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని
సాక్షి, నెల్లూరు: మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ మేరకు బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి రాజమోహన్రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ వదిలేశారు. లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్కు ఘనమైన నివాళి ఇస్తాము. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: (ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి) -
చెరగని గౌతమ ముద్ర
ఎన్నికల క్షేత్రంలో ఆత్మకూరు గడ్డపై మహామహులు తలపడ్డారు. ఏడు దశాబ్దాల చరిత్రలో నేటితరం దివంగత నేత మేకపాటి గౌతమ్రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇందులో అత్యధిక మెజార్టీల రికార్డు ఆయనకే సొంతమైంది. అతి స్వల్ప మెజార్టీతో విజయ తీరానికి చేరిన చరిత్రను ఆనం సంజీవరెడ్డి దక్కించుకున్నారు. వరుసగా రెండేసి సార్లు గెలుపొందిన ముగ్గురిలో మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. ప్రజల మనస్సు దోచిన ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఉప ఎన్నికల్లోనూ గౌతమ్ ముద్ర సృష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయ యవనికపై ఎందరో నేతలు వస్తుంటారు.. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వారు ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని మూటకట్టుకున్న నేటి తరం నాయకుడు గౌతమ్ చెరగని ముద్ర వేశారు. వరుసగా రెండు దఫాలు అత్యధిక మెజార్టీలు దక్కించుకున్న నేతగా మేకపాటి గౌతమ్రెడ్డి ఈ నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయారు. 1952 నుంచి 2019 వరకు 16 దఫాలు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం ఇది రెండు దఫా అవుతుంది. 1958లో తొలిసారి ఆత్మకూరు ఉప ఎన్నికలు రాగా, మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి దివంగతులు కావడంతో రెండో దఫా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అత్యధికం గౌతమ్రెడ్డి.. అతి స్వల్పం సంజీవరెడ్డి ఆత్మకూరు ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ మేకపాటి గౌతమ్రెడ్డి సొంతం కాగా, అతి స్వల్ప మెజార్టీ ఆనం సంజీవరెడ్డి దక్కాయి. 1958లో బెజవాడ గోపాల్రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అప్పట్లో ఆయన సర్వేపల్లిలో కొనసాగుతూ ఆత్మకూరు శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అప్పట్లో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి జీసీ కొండయ్యపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డికి 22,358 ఓట్లు లభించగా, పీఎస్పీ అభ్యర్థి జీసీ కొండయ్యకు 22,313 ఓట్లు లభించాయి. ఆత్మకూరు చరిత్రలో ఇది అతి స్వల్ప మెజార్టీగా చరిత్రగా నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్రెడ్డి 31,412 ఓట్లు మెజార్టీ లభించింది. రెండో దఫా 2019 ఎన్నికల్లోనూ 22,276 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలు ఇవే కావడంతో ఆ రికార్డులు గౌతమ్రెడ్డికి దక్కాయి. స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్న వారిలో మరో ఇరువురు ఉన్నారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బి సుందరరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి కె ఆంజనేయరెడ్డిపై 334 ఓట్లుతో విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్షుమయ్యనాయుడిపై 2,069 ఓట్లతో విజయం సాధించారు. ఇవే తక్కువ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందిన ఎన్నికలు కావడం విశేషం. టీడీపీయేతరులే విజేతలు ఆత్మకూరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు 7 సార్లు ఎన్నికలు జరిగితే.. 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 1983, 94లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, రెండు సార్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన జాబితాలో ముగ్గురు ఆత్మకూరులో 16 దఫాలుగా ఎన్నికలు జరిగితే.. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వారు ముగ్గురే. ఇందులో మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. 1958, 1962లో వరుసగా రెండు సార్లు ఆనం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1978లో తొలిసారి విజయం సాధించిన బి సుందరరామిరెడ్డి 1983లో టీడీపీ అభ్యర్థి అనం వెంకటరెడ్డితో తలపడి ఓడిపోయారు. తిరిగి 1985, 89లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి సుందరరామిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 19ల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్రెడ్డి వరసగా రెండు సార్లు ఘన విజయం సాధించారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు చేశారు. విక్రమ్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్కు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి👉 సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి -
సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మేకపాటి విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్తో విక్రమ్రెడ్డి భేటీ అయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. చదవండి: (YSR Congress Party: వైఎస్సార్సీపీ ప్లీనరీ తేదీలు, వేదిక ఖరారు) -
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విక్రమ్రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు. 2వ తేదీన నామినేషన్ గురువారం మేకపాటి విక్రమ్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్రెడ్డి ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్రెడ్డి, తూమాటి విజయభాస్కర్రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు(అర్బన్): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జేసీ హరేంద్ర ప్రసాద్తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ సిద్ధం చేశామన్నారు. ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జేసీ హరేంద్ర ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన వారు 4,981 మంది, విభిన్న ప్రతిభావంతులు 4,777 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారు సజావుగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,000 ఓట్లుపైబడి ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాన్ని పెడతామన్నారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఇస్తామన్నారు. 648 బ్యాలెట్ యూనిట్స్ను, 593 కంట్రోల్ యూనిట్స్ను, 583 వీవీ ప్యాట్స్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనరాదని సూచించారు. ప్రవర్తనా నియమావళి (కోడ్) సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యను నియమించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హిమావతి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ∙ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ గురువారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ చక్రధర్బాబు ఎన్నికల నిర్వహణ గురించి చేపట్టిన చర్యలను వివరించారు. ఈవీఎం యంత్రాల గోదామును తనిఖీ చేశామన్నారు. జేసీ హరేంద్ర ప్రసాద్, ఏఎస్పీ హిమవతి పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు ఉప ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
Andhra Pradesh: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6. నామినేషన్ల పరిశీలన జూన్7న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 9. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 28న ఉప ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు ►ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్, అజాంఘర్) ►పంజాబ్: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్) ►త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు (అగర్తల, టౌన్ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్నగర్) ► ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు) ►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్ నగర్) ►జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం (మాందార్) -
కొలువుల ఖిల్లా నెల్లూరు జిల్లా.. కృష్ణపట్నం వద్ద రూ.5,783 కోట్లతో..
పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లా.. కొలువుల ఖిల్లాగా మారనుంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుకు బీజాలు పడ్డాయి. సింహపురి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. జిల్లా నలుదిశలా సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరయ్యాయి. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. నిర్దిష్టమైన పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. క్రిస్సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు సాధించింది. బయో ఇథనాల్ ఫ్లాంట్, వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. సాక్షి, నెల్లూరు: విశాల సముద్రతీరం.. అత్యధిక విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు.. అందుబాటులో రహదారి, జల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం తప్ప.. పారిశ్రామిక జాడల్లేని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీజాలు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణపట్నంపోర్టుకు అనుబంధంగా క్రిస్ సిటీకి ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాయి. క్రిబ్కో పరిధిలో బయో ఇథనాల్ ప్లాంట్, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో రూ.100 కోట్లతో ఆస్పత్రి, మెట్ట ప్రాంతం ఉదయగిరిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగాల వెల్లువ జిల్లాలో యువతకు వెల్లువగా ఉద్యోగాలు రానున్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు కానుంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 2.96 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు, 1.71 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. తొలి దశలో రూ.1,500 కోట్లతో 2,006 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు లభించాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాకాశాలు లభించనున్నాయి. చదవండి: (AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత) ఆక్వా ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నారాయునిపాళెం నుంచి తడ వరకు 169 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న 2 లక్షల మంది మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 46 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. రెట్టింపు స్థాయిలో ఎగుమతి చేసుకునే అవకాశాలను అందిపుచ్చుకునే చర్యలను చేపట్టుతోంది. అక్వా ఉత్పత్తులు ఆర్బీకేలకు అనుసంధానం చేసి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్ట ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగానికి ప్రయోజనకారిగా మారనుంది. విద్యార్థులకు యూనివర్సిటీ అందుబాటులోకి రావడమే కాకుండా పరిశోధనలు ద్వారా అదునాతున వంగడాలు మెట్ట ప్రాంతం ఉన్నతికి యోగ్యకరంగా మారనుంది. రూ.100 కోట్లతో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేటాయిస్తూ నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వద్ద నూతన ఆస్పత్రి నిర్మాణానికి 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం చొరవతో పారిశ్రామికాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కృష్ణపట్నంలో క్రిస్సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కావడం శుభ పరిణామం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అయిన కొద్ది రోజులకే రూ.560 కోట్లతో ప్లాంటు మంజూరు కావడం గర్వంగా ఉంది. ఈ ప్లాంటు వల్ల సుమారు 500 మందికి ఉద్యోగ, ఉపా«ధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఇది సంతోకరమైన విషయం. – రాగాల వెంకటేశ్వర్లు, రైతు, కృష్ణపట్నం పారిశ్రామిక ప్రగతి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలు పరిశ్రమలు రాగా, ప్రస్తుతం కృష్ణపట్నంలో క్రిస్ సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్తో పాటు కొడవలూరు మండలంలోకి మరో పరిశ్రమ రావడంతో జిల్లా పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడుస్తుంది. భవిష్యత్లో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుంటారు. – తలతోటి ప్రసన్నకుమార్, చంద్రశేఖర్పురం, కొడవలూరు మండలం ఉపాధి అవకాశాలు మెండు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పరిశ్రమలు వస్తున్నాయి. దీంతో మావంటి విద్యను అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది. ముఖ్యంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇది అభినందనీయం. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తే మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – కాగోల్లు పవన్, బీటెక్ విద్యార్థి, దండిగుంట, విడవలూరు మండలం -
మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి
మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్రెడ్డికి పరిచయం చేయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్లు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
మేకపాటి ఆత్మీయ పరిచయం
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్రెడ్డి శనివారం నుంచి ఆత్మీయ పరిచయ కార్యక్రమం చేపట్టనున్నారు. 14 రోజుల పాటు నియోజకవర్గంలో మండలాల వారీగా విస్తృతంగా పర్యటించి ప్రజలతో పాటు పార్టీ నేతలతో మమేకం కానున్నారు. తొలుత మేకపాటి సొంత మండలం మర్రిపాడు నుంచే ఈ పరిచయ కార్యక్రమం కొనసాగించనున్నారు. శనివారం సాయంత్రం మర్రిపాడు మండల కేంద్రంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నేతలు, మేకపాటి అభిమానులను ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి దగ్గరుండీ పరిచయం చేయనున్నారు. ఆదివారం ఆత్మకూరు మున్సిపాలిటీ, సోమవారం అనంతసాగరం మండలం, మంగళవారం ఆత్మకూరు రూరల్ మండలాల్లో స్థానిక నాయకులు పరిచయం చేసుకోనున్నారు. ఆ తర్వాత ఏఎస్పేట, సంగం, చేజర్ల మండలాల్లో పరిచయ కార్యక్రమంతో పాటు గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం చేపట్టనున్నారు. 14 రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేసి ప్రజలతో మమేకం కానున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఈ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతలకు తెలిపారు. గౌతమ్రెడ్డి వారసుడిగా.. ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా సోద రుడు మేకపాటి విక్రమ్రెడ్డి తెరపైకి వస్తున్నారు. బీటెక్ సివిల్ ఐఐటీ చెన్నైలో పూర్తి చేసి, స్పెషలైజ్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎంఎంస్ను ఆస్ట్రేలియాలో పూర్తి చేసిన విక్రమ్రెడ్డి కేఎంసీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. సోదరుడు గౌతమ్రెడ్డి అకాల మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. మేకపాటి కుటుంబానికి ఆత్మకూరు నియోజకవర్గంలో అపారమైన ఆదరణ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్రెడ్డి అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యేందుకు విక్రమ్రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందస్తుగా పరిచయ కార్యక్రమం చేపట్టుతున్నట్లు వైఎస్సార్సీపీ శ్రేణులు వివరిస్తున్నాయి. -
సీఎంను కలిసిన మేకపాటి విక్రమ్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్రెడ్డి ప్రజాసేవలో పాలు పంచుకోనున్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్రెడ్డితో కలసి గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. నియోజకవర్గ పర్యటనకు ముందుగా ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకునేందుకు విక్రమ్రెడ్డి వచ్చినట్లు రాజమోహన్రెడ్డి తెలిపారు. త్వరలోనే విక్రమ్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా సీఎం జగన్ను కలసినట్లు తెలిపారు. విక్రమ్ ప్రజాసేవలో నిమగ్నం కానున్నట్లు రెండు వారాల క్రితమే సీఎం జగన్కు తెలియజేశామన్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో తెలుస్తుందన్నారు. పోటీ పెట్టాలా? వద్దా? అనేది ఆయా పార్టీల ఇష్టమన్నారు. తొలుత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగనన్న నాకు ఆదర్శం: మేకపాటి విక్రమ్రెడ్డి ఇన్నాళ్లూ వ్యాపార రంగంలో నిమగ్నమైన తాను రాజకీయాల్లోకి ప్రవేశించి సోదరుడు గౌతమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మేకపాటి విక్రమ్రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి గౌతమ్రెడ్డి చేయాలనుకున్నది చేసి చూపిస్తానన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబం ఆశీస్సులు తీసుకుంటానన్నారు. జగనన్న ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని చెప్పారు. రాజకీయాల్లో తనకు ఆయనే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించి సీఎం జగన్ ఆదేశించినట్లుగా సచివాలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు. -
Sangam Barrage: చెప్పాడంటే.. చేస్తాడంతే..
సంగం బ్యారేజీ.. జిల్లా రైతాంగానికి వరప్రసాదిని. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈప్రాజెక్ట్ను పూర్తిచేసి తన హయాంలో రైతాంగానికి అంకితం చేసేందుకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తపించారు. ఆ కల నెరవేరకుండానే దూరమయ్యారు. సంగం బ్యారేజీకి తన స్నేహితుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా శాసనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చదవండి: అదుపులోకి విద్యుత్ కొరత సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజవర్గంలోని సంగం బ్యారేజీకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నామకరణం చేస్తూ తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ ప్రత్యేక జీఓ జారీ చేశారు. ‘మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ’గా శాసనం అయింది. గౌతమ్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న అకాల మరణం చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంత్యంత సన్నిహితుడు, సంగం బ్యారేజీ కోసం తపన పడిన గౌతమ్రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని భావించారు. చేస్తానని చెప్పాడు.. శాసనసభలో శాసనం చేశాడు. ఈ మేరకు ఇంజినీరింగ్ శాఖ అధికారులు ‘మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తూ మంగళవారం ప్రత్యేక జీఓ 13 జారీ చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ఇలా సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2014 లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. టీడీపీ హయాంలో బ్యారేజీ పనులు మందగించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సంగం బ్యారేజీ ఉండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే సీఎంతో ప్రారంభోత్సవం సంగం బ్యారేజీ ఇప్పటికే దాదాపు 95 శాతం పూర్తి కావచ్చింది. కాంక్రీట్ వర్కు పూర్తి చేశారు. ఇక ఎర్త్ వర్క్ 3,461 క్యూబిక్ మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సరీ్వస్ గేట్స్ ఒకటి మాత్రమే పెండింగ్లో ఉంది. స్టాఫ్ లెగ్ గేట్స్ పైబ్రిగేషన్ పూర్తయింది, ఎరిక్సిన్ మాత్రం ఏడు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డితో ప్రారం¿ోత్సం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్రెడ్డి నామకరణం
సాక్షి, అమరావతి: సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేశారు. గౌతమ్రెడ్డి అకాల మరణం అనంతరం గౌతమ్రెడ్డి గౌరవార్థం సంగం బ్యారేజ్కు ఆయన పేరును పెడతామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Medicine-Health: విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే లక్ష్యం: సీఎం జగన్ -
మరువలేని మిత్రుడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేకపాటి గౌతమ్రెడ్డి మన మధ్య లేరని నమ్మడానికి మనసుకు ఎంతో కష్టంగా ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం జగన్ హాజరై మాట్లాడారు. మేకపాటి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి గౌతమ్రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుమారుడిని తలచుకుని దుఃఖసాగరంలో మునిగిపోయిన గౌతమ్రెడ్డి తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తిని ఓదార్చారు. గౌతమ్రెడ్డిని స్మరించుకుంటూ దివ్యాంగుడు ఇంతియాజ్ రూపొందించిన భగవద్గీతను సీఎం అవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ‘‘ఇటువంటి పరిస్థితుల మధ్య మాట్లాడాల్సి వస్తుందని ఏరోజూ కలలో కూడా ఊహించలేదు. గౌతమ్ మన మధ్య లేడని నమ్మడానికి మనసుకి కష్టంగా ఉంది. తను ఇక రాడు.. ఇక లేడనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. గౌతమ్ గురించి చెప్పాలంటే.. నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. మంచి స్నేహితుడు. నాకు బాగా గుర్తుంది... రాజకీయాల్లోకి తను అప్పుడు ఇంకా అడుగుపెట్టలేదు. నేను రాకపోతే బహుశా గౌతమ్ కూడా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో నేను కాంగ్రెస్ను వీడి బయటికి అడుగులు వేసినప్పుడు 2009–10లో ఆ పార్టీతో ఒక యుద్ధం మొదలైంది. అప్పుడు రాజమోహన్రెడ్డి అన్న కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. నేను 2009లో అప్పుడే ఎంపీగా ఎన్నికయ్యా. గౌతమ్తో నాకున్న సాన్నిహిత్యమే ఆయన తండ్రి నావైపున ఉండేటట్టుగా చేసిందని చెప్పాలి. 2009–10 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులో గౌతమ్ నాకు తోడుగా, స్నేహితుడిగా ఉన్నాడు. నాకన్నా వయసులో గౌతమ్ ఏడాది పెద్ద అయినా ఎక్కడా కూడా తాను పెద్ద అనే భావం మనసులో ఉండేది కాదు. నన్ను ఒక సోదరుడిలా, అన్నగా భావించేవాడు. నువ్వు చేయగలుగుతావు.. మేమంతా ఉన్నామని నన్ను తట్టి ప్రోత్సహించేవాడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం ఈ రోజుకు కూడా జీర్ణం చేసుకోలేని అంశం. నాతోనే రాజకీయ అడుగులు రాజకీయాల్లోకి గౌతమ్రెడ్డిని నేనే తీసుకొచ్చా. నేను అడుగులు వేస్తేనే తను అడుగులు వేశాడు. ఆ తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్తో పాటు దాదాపు ఆరు శాఖలను సమర్థంగా నిర్వహించాడు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని తపించాడు. అందులో భాగంగానే దుబాయ్ వెళ్లేముందు నాకు కనిపించాడు. తిరిగి రాగానే నన్ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా అడిగాడు. ఆలోపే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మంచి స్నేహితుడిని, మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం కానీ.. ఆ కుటుంబానికి నేనే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తోడుగా ఉంటుంది. ఆ కుటుంబానికి దేవుడి తోడుగా ఉండాలని, అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నా. ప్రజల మదిలో నిలిచిపోయాడు ఎంత చెప్పినా.. ఎంత మాట్లాడినా ఆ లోటును భర్తీ చేయలేం. కానీ మనిషి వెళ్లిపోయిన తర్వాత ఎంతమంది మనసుల్లో నిలిచిపోయాడు అన్నది మాత్రం కచ్చితంగా నిలబడిపోతుంది. ఆ విషయంలో గౌతమ్ అగ్రస్థానంలో ఉంటాడు. గౌతమ్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆయన తండ్రి కొన్ని విషయాలు చెప్పారు. కళాశాలను ప్రభుత్వపరంగా తీసుకోవడం, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీ కింద మార్చడమే కాకుండా అవకాశం ఉంటే యూనివర్సిటీగా చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్–2లో ఉన్న ఉదయగిరి, బద్వేలు ప్రాంతాన్ని ఫేజ్–1లోకి తెస్తే ఆత్మకూరు, ఉదయగిరి రెండు నియోజకవర్గాలకూ మంచి జరుగుతుందని.. దాన్ని వేగవంతం చేయాలని కోరారు. దానివల్ల గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఇవన్నీ కచ్చితంగా జరుగుతాయి. సంగం బ్యారేజీ పనులన్నీ మే 15 లోగా పూర్తవుతాయని మంత్రి అనిల్కుమార్ చెప్పారు. మంచి రోజు చూసుకుని మళ్లీ నేను ఇక్కడికి వస్తా. మేకపాటి కుటుంబ సభ్యులతో కలసి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. గౌతమ్ జ్ఞాపకార్థం మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడతాం. తద్వారా గౌతమ్ చిరస్థాయిగా, ఎప్పుడూ మన మనసులో ఉంటారు. సీఎం కుటుంబానికి కృతజ్ఞతలు తమ ఇంట్లో విషాదం చోటుచేసుకున్నప్పుడు అండగా నిలిచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబం కల్పించిన భరోసా మరువలేనిదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. గౌతమ్రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా తన కోరికలకు సీఎం వెంటనే అంగీకరించారని తెలిపారు. తన కుమారుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించి సమర్థత రుజువు చేసుకునే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దానికి పైగా అనుబంధం పుష్కరకాలంగా గౌతమ్రెడ్డి అన్నతో అనుబంధం ఉందని మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నారు. జిల్లా నుంచి తామిద్దరం మంత్రులుగా ఉన్నప్పటికీ తననే ముందు నడిపించేవారన్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన అర్థాంతరంగా నిష్క్రమిస్తారని ఊహించలేదన్నారు. గౌతమ్రెడ్డి జ్ఞాపకాలతో కన్నీళ్లు వస్తున్నాయని, మంచి మిత్రున్ని కోల్పోయానని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత గౌతమ్రెడ్డితో తన అనుబంధాన్ని కలెక్టర్ చక్రధర్బాబు తెలియచేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్రావు, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, వాకాటి నారాయణరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, కమ్యూనిటీ బోర్డు డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
గౌతంరెడ్డి లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సీఎం జగన్
-
నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
CM Nellore Tour Updates: సీఎం జగన్ కీలక నిర్ణయం.. బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు
Updates: ► గౌతమ్ మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది. గౌతమ్ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం. -సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి ►ముందు నుండి వైఎస్ఆర్ కుటుంబం తమకు అండగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డికి తన కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందని ఈ సందర్భంగా తెలిపారు. తమ కుటుంబపై చూపిన ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. -మేకపాటి రాజమోహన్ రెడ్డి ► రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి ఎప్పుడూ వివాదాలకు పోలేదు. అందరు నేతలతో కలిసి మెలిసి ఉండేవారు. - మంత్రి అనిల్ ► గౌతం రెడ్డి మరణం పార్టీకి, నెల్లూరుకు తీరని లోటు. - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ► దివంగత మంత్రి గౌతమ్ రెడ్డిపై అభిమానంతో ఆయన చిత్ర పటాలతో ఇంతియాజ్ అనే దివ్యాంగుడు.. భగవద్గీతను తయారు చేశాడు. సంస్మరణ సభలో గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్ది చేతుల మీదుగా సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డికి ఆ భగవద్గీతను అందించారు. ► దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్మెహన్ రెడ్డి ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి సీఎం నివాళులు అర్పించారు. గౌతమ్రెడ్డి సంస్మరణ సభకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ► దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్మెహన్ రెడ్డి. ► నెల్లూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి ► రేణిగుంట నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి ► గన్నవరం నుండి సీఎం జగన్మెహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ► సీఎం వైఎస్ జగన్మెహన్ రెడ్డి.. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు రానున్నారు. దీంతో పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆదివారం నగరంలోని ఉమేష్చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో బందోబస్తు విధుల్లో పాల్గొననున్న సిబ్బందితో ఎస్పీ సీహెచ్ విజయారావు సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. సీఎం పర్యటన ఆధ్యంతం అప్రమత్తంగా ఉండాలన్నారు. హెలిప్యాడ్, కన్వెన్షన్ సెంటర్ వద్ద ముందస్తు అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే ముఖ్యమంత్రి వద్దకు అనుమతించాలన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనీఖలు చేయాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. సిబ్బంది అందరూ విధిగా యూనిఫాం, ఐడీలు ధరించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, విధులకు గైర్హాజరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం పర్యటన షెడ్యూల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.40 రోడ్డు మార్గాన బయలుదేరి 11.50కు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. 11.50 నుంచి 12.40 వరకు మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభలో పాల్గొంటారు. అనంతరం హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రేణిగుంటకు బయలుదేరి వెళుతారు. 1.20 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. సీఎం వెళ్లే మార్గంలో రాకపోకలను నిషేధించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. నగరంలో ట్రయల్ కాన్వాయ్ నెల్లూరు నగరంలో ఆదివారం ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ప్రారంభమైన ట్రయల్ కాన్వాయ్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని అక్కడ నుంచి తిరిగి పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్కు చేరుకుంది. ట్రయల్ కాన్వాయ్ను ఎస్పీ విజయారావు పర్యవేక్షించారు. హెలికాప్టర్ సైతం ట్రయల్రన్ నిర్వహించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ నెల్లూరు పర్యటన.. ఏర్పాట్లు పరిశీలన
-
మార్చి 28న నెల్లూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం (మార్చి 28) ఉదయం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకొని జిల్లా నాయకులతో మాట్లాడతారు. అనంతరం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకొని దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు. -
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
చారిత్రాత్మక త్యాగానికి సిద్దమైన మేకపాటి కుటుంబం
-
పారిశ్రామిక కృషీవలుడు
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన గొప్ప నాయకుడని, తుది శ్వాస వరకు పరిశ్రమలను రప్పించేందుకు కృషి చేశారని ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వివాదరహితుడు, అజాత శత్రువు, మర్యాదస్తుడైన గౌతమ్రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ప్రతి సమస్యపై క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడేవారని, ఏ ఒక్కర్నీ ఆయన విమర్శించిన దాఖలాలు లేవన్నారు. గౌతమ్రెడ్డి మృతికి సంతాపంగా మంగళవారం శాసన మండలిలో మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్తో సహా పలువురు సభ్యులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మేకపాటి కుటుంబం అభ్యర్థన మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని విద్యా సంస్థలను వ్యవసాయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్ది గౌతమ్రెడ్డి పేరుపెట్టాలని సభ్యులు కోరారు. ఆయనకు కోపం తెలియదు: మండలి చైర్మన్ గౌతమ్రెడ్డితో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆయన ఉన్నత విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు చెప్పారు. గౌతమ్రెడ్డిలో ఏనాడూ చిరునవ్వు మినహా కోపం చూడలేదని, ఎవరినీ నొప్పించేవారు కాదని గుర్తు చేసుకున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదించేలా చొరవ చూపారన్నారు. పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. గౌతమ్రెడ్డి ఉభయసభల్లో ఎంతో మర్యాదస్తుడని, ప్రతీ ఒక్కర్ని ఆప్యాయంగా పలకరించేవారని డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానం పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సీఎం జగన్ తపన దివంగత గౌతమ్రెడ్డిలో నిత్యం కనిపించేదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి దేవుడు పరిపూర్ణమైన జీవితాన్నివ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్సీ చక్రవర్తి తన ఎదుగుదలకు గౌతమ్రెడ్డి ఎంతో తోడ్పాటు అందించారని గుర్తు చేసుకుని ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి కన్నీటి పర్యంతమయ్యారు. స్నేహశీలి, వినయశీలి, మృదుస్వభావం లాంటి గొప్ప లక్షణాలున్న గౌతమ్రెడ్డి మరణం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీరని లోటని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. గౌతమ్రెడ్డి హఠాన్మరణం విషాదకరమని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ చెప్పారు. మంత్రినన్న దర్పం ఆయనలో ఏనాడూ కానరాలేదని ఎమ్మెల్సీ వి.గోపాలరెడ్డి తెలిపారు. ప్రజలతో ఎలా మెలగాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు, రూ.లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించేలా గౌతమ్రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్సీ మాధవరావు చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి పట్ల కూడా గౌతమ్రెడ్డి ఎంతో హుందాగా ఉండేవారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి తెలిపారు. హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం గౌతమ్రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 2 స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీలు గౌతమ్రెడ్డి కృషి ఫలితమేనని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు, వాకాటి నారాయణరెడ్డి, నరసింహారెడ్డి పేర్కొన్నారు. -
సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి
నెల్లూరు (సెంట్రల్): కుమారుడిని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న తమ హృదయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు మనోధైర్యాన్ని నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృతజీవనుడంటూ గౌతమ్కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి కోసం దివంగత మంత్రి గౌతమ్రెడ్డి తపన పడిన ప్రతి అంశాన్ని పూర్తిచేస్తామని సీఎం ప్రకటించడంపై జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు. తాను కోరిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తానని ప్రకటించడం తమ కుటుంబంపై వైఎస్ జగన్కు ఉండే అభిమానానికి నిదర్శనమన్నారు. ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. జగన్కు వెన్నంటి ఉన్న గౌతమ్రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గౌతమ్రెడ్డిది అరుదైన వ్యక్తిత్వం
దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. గౌతమ్రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మంగళవారం సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. గౌతమ్రెడ్డి లేకపోవడం శాసనసభకు లోటని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. – సాక్షి, అమరావతి గౌతమ్లో నిజంగా బుద్ధుని లక్షణాలు గౌతమ్రెడ్డిలో నిజంగా గౌతమ బుద్ధుడి లక్షణాలు ఉన్నాయి. గొప్ప సంస్కారవంతుడు, మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇన్నేళ్లలో ఆయన ఎవరినీ నొప్పించడం చూడలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఇన్ని మంచి లక్షణాలున్న గౌతమ్రెడ్డి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాం. ఆయన సీటు వైపు చూసినప్పుడు బాధ కలుగుతోంది. నిండైన విగ్రహం లేకపోవడం సభకు చాలా వెలితిగా ఉంది. పుత్ర వియోగం ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధాకరం. శ్రీకాకుళం జిల్లాలో టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ మెగా క్లస్టర్ గురించి ఆయన్ను అడిగితే ప్రతిపాదనను కేంద్రానికి పంపి ఒకసారి ఇద్దరం కలిసి ఢిల్లీ వెళదామన్నారు. ఈరోజు ఆ మనిషి లేరు. ఆయన ఆదర్శ జీవనం, హుందాతనం సభకు రోల్ మోడల్. ఆయన ఆలోచనల్ని ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి. – స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంతో సఖ్యతగా ఉండేవారు గౌతమ్రెడ్డి చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా వ్యవహరించేవారు. అందరితో ఎంతో సఖ్యతగా ఉండేవారు. జిల్లా ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంత గొప్ప లక్షణాలున్న వ్యక్తి చిన్న వయసులోనే మనల్ని వీడిపోవడం దురదృష్టకరం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏనాడూ దర్పం చూపలేదు సభలో నా పక్కనే గౌతమ్రెడ్డి కూర్చునేవారు. ఆయన ఇవాళ లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. ఒకే జిల్లాకు చెందిన వాళ్లం కావడంతో ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఒక జిల్లాకు చెందిన మంత్రులమైనా కూడా మా మధ్య భేదాభిప్రాయాలు, రాజకీయ విబేధాలు ఏ రోజూ చోటు చేసుకోలేదు. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానమున్న, సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చానన్న దర్పం ఆయనలో ఏ కోశానా కనబడేదికాదు. దేవుడు మంచి వాళ్లను త్వరగా తీసుకుపోతారంటారు. అందుకే ఆయన ఈ లోకాన్ని వీడారేమో. – అనిల్కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి పీడ కలలా ఉంది గౌతమ్రెడ్డి లేరు అన్న విషయాన్ని పీడ కలలాగా భావిస్తున్నాను. మేకపాటి కుటుంబంతో 35 ఏళ్ల అనుబంధం నాకు ఉంది. నేను నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా ఉండటంతో ప్రతి రెండు, మూడు రోజులకు ఓసారి గౌతమ్ ఫోన్ చేసి మాట్లాడేవారు. గౌతమ్ రెడ్డి మరణ వార్త విని వాళ్ల ఇంటికి వెళ్లగానే.. నన్ను చూసి ‘నా బంగారం లాంటి కొడుకు లేడయ్యా’ అంటూ ఆయన తల్లి రోదించిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. తుపాను సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడు సోమశిల వద్ద వరదల్లో దెబ్బతిన్న దేవాలయాన్ని పునఃనిర్మించాలని గౌతమ్ నాతో అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాను. దేవాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుని ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి ప్రత్యేక ముద్ర వేశారు గౌతమ్రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత కొన్ని పనులు మాకు అప్పజెప్పినప్పుడు ఇద్దరం కలిసి గంటలు, రోజులు చొప్పున కసరత్తు చేశాం. సీఎం జగన్ మొదటి డ్రీమ్ కేబినెట్లో మంత్రిగా ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. రాజకీయాల్లో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి అనతి కాలంలో మరణించడం బాధాకరం. – ఆదిమూలపు సురేశ్, విద్యా శాఖ మంత్రి కల్లాకపటం లేని మనిషి గౌతమ్రెడ్డి కల్లాకపటం లేని మనిషి. 2009 ఎన్నికల సమయం నుంచి నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. 2014 ఎన్నికల్లో కూడా కలిసి పని చేశాం. ఆయన ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. అరుదైన వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగిన వ్యక్తి. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోబుట్టువులా చూసేవారు రెండేళ్లు నేను ఏపీఐఐసీ చైర్పర్సన్గా ఉన్నాను. గౌతమ్రెడ్డి నన్ను ఎప్పుడూ తోబుట్టువులా చూసేవారు. గైడ్ చేసే వారు. సీఎం జగన్ కేబినెట్లోని మంత్రులు, నా తోటి ఎమ్మెల్యేలు ఆయన్ను బాహుబలి, ఆరడుగుల బుల్లెట్ అని, జిల్లా ప్రజలు నెల్లూరు టైగర్ అని పిలిచేవారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, క్రమ శిక్షణ కలిగిన గౌతమ్ అన్న లేరు అంటుంటే నమ్మశక్యం కావడం లేదు. – ఆర్.కె.రోజా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధిపై చర్చించారు నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని గౌతమ్రెడ్డి నిరంతరం పరితపించేవారు. ఈ అంశంపై జనవరి 3, 4 తేదీల్లో కూడా నాతో చర్చించారు. దుబాయ్ నుంచి తిరిగి రాగానే జిల్లా ప్రజాప్రతినిధులు సీఎంను కలుద్దాం అన్నారు. ఇంతలోనే ఆయన మరణించడం బాధ కలిగిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కంపెనీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఆ పనులు పురోగతిలో ఉండగానే ఆయన ఈ లోకం వీడారు. – ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విదేశీ పెట్టుబడులకు ఎనలేని కృషి రాజకీయాల్లో హుందాగా వ్యవహరించడంలో గౌతమ్రెడ్డికి ఎవరూ సాటిరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్రాన్ని నంబర్–1గా నిలపడం, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కృషి ఎనలేనిది. – అబ్బయ్య చౌదరి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కష్టకాలంలో అండగా నిలిచారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా పార్టీ ఇన్చార్జిగా గౌతమ్రెడ్డి వ్యవహరించారు. అప్పట్లో నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపారు. – హఫీజ్ ఖాన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అగాధం లాంటిదే మంత్రి పదవిని బాధ్యతలను అర్థం చేసుకుని, తనకు కేటాయించిన శాఖల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తి గౌతమ్రెడ్డి. ఆయన లేని లోటు పార్టీకి, ప్రభుత్వానికి అగాధం లాంటిదే. – ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సైనికుడిలా పనిచేశారు సీఎం వైఎస్ జగన్ ఆశయ సాధన కోసం గౌతమ్ రెడ్డి సైనికుడిలా పనిచేశారు. తండ్రి వారసత్వంగా గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదు. జగనన్న సైనికుడిగానే వచ్చారు. – కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్ఞాపకాలు అనేకం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయసాధన కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి గౌతమ్రెడ్డి. ఆయన నియోజకవర్గంలో జగన్ పర్యటన సమయంలో నన్ను సంప్రదించారు. చాలా గొప్పగా నిర్వహించడానికి నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు. వారం రోజులు ఆయనతోనే ఉండి ఆ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేశాం. ఇలాంటి జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలా.. నిజమా అనుకున్నా గౌతమ్రెడ్డి మృతి చెందారనే విషయం తెలిశాక.. ఇది కలా నిజమా అనుకున్నా. చాలా బాధపడ్డాం. విధేయత, వినయం కలిగిన మంచి వ్యక్తి. ఆయన అలంకరించిన ఉన్నత పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి. కొప్పర్తి పారిశ్రామికవాడని గొప్ప విజన్గా ఆయన చెప్పేవారు. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వే కోడూరు పెద్దలను గౌరవించేవారు గౌతమ్రెడ్డి ఎంతో సంస్కారవంతుడు. పెద్దలను ఎంతో గౌరవించేవారు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. – వరప్రసాద్, ఎమ్మెల్యే, గూడూరు మా కుటుంబానికి పెద్దబ్బాయి మా కుటుంబానికి పెద్దబ్బాయి గౌతమ్రెడ్డి. ఇద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం. మా అబ్బాయి ఏం చెబితే అది కుటుంబంలో ఆచరించేవాళ్లం. మేం వైఎస్సార్ కుటుంబానికి భక్తులం. గౌతమ్ కూడా అంతే. సీఎంకు తోడు నీడగా ఉండేవాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే అలాగే బాబూ అని చేశాను. మా అబ్బాయి సంతాప సభ అసెంబ్లీలో జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. – మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి చిన్న వయసులో మరణించడం బాధాకరం చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరం. మరణ వార్త విన్నవెంటనే మా అధినేత చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. గౌతమ్రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మా పార్టీ దేవుడిని ప్రార్థిస్తోంది. – ఏలూరి సాంబశివరావు, టీడీపీ ఎమ్మెల్యే -
గౌతమ్ సంగం బ్యారేజీ
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డిని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని, యుద్ధ ప్రాతిపదికన మంత్రి అనిల్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అని పేరు పెట్టి ప్రారంభిస్తామన్నారు. మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ తమ చిరకాల అనుబంధాన్ని, మంత్రివర్గ సహచరుడి మంచి పనులను గుర్తు చేసుకున్నారు. మూడు కోరికలను నెరవేరుస్తాం.. గౌతమ్రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి కోరిన వాటిని నెరవేరుస్తామని సీఎం జగన్ చెప్పారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్స్) కళాశాలకు గౌతమ్ పేరు పెట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్కు అనువైన బోధనా కాలేజీగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఆ కాలేజీని ప్రభుత్వం తీసుకుని ఆయన ఆశించినట్లుగానే గౌతమ్ పేరుతో అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టి ఉత్తమ కాలేజీగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయగిరికి తొలిదశలోనే నీరు వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని రెండో దశలో కాకుండా మొదటి దశలోకి తెచ్చి పనులు వేగంగా పూర్తి చేసి ఉదయగిరి ప్రాంతానికి నీళ్లివ్వాలని రాజమోహన్రెడ్డి చాలా భావోద్వేగంగా అడిగారని, అది కూడా కచ్చితంగా నెరవేరుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ మొదటి దశలోకి తీసుకువచ్చి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ఉదయగిరి డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపరచాలని కోరారని, నాడు–నేడు రెండో దశలో ఆ కళాశాలకు మెరుగులు దిద్దుతామన్నారు. రాజమోహన్రెడ్డి కోరిన మూడు అంశాలను కచ్చితంగా చేస్తామని ఈ సభ ద్వారా భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. ఆ ఊహే కష్టంగా ఉంది తన సహచరుడు, చిరకాల మిత్రుడు, మేకపాటి గౌతమ్రెడ్డి ఇకలేడన్న ఊహే ఎంతో కష్టంగా ఉందని, ఇది రాష్ట్రానికి కూడా తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. గౌతమ్ తనకు చిన్నతనం నుంచి స్నేహితుడని, తన కంటే వయసులో ఒక సంవత్సరం పెద్దవాడైనా తనను అన్నగా భావించేవాడని గుర్తు చేసుకున్నారు. తనను అంత విశ్వసించి, తనపై అంత నమ్మకముంచేవాడన్నారు. తనకేం కావాలి...? తనకేం నచ్చుతుందోనని తపించేవాడని చెప్పారు. అలాంటి ఒక మంచి స్నేహితుడిని, ఎమ్మెల్యేని పోగొట్టుకున్నానని, గౌతమ్ ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. గౌతమ్ ఉన్నత చదువులు చదివాడని, యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడకి వచ్చాడని తెలిపారు. కాంగ్రెస్ను వీడాక నా వెంటే నిలిచారు.. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తాను తొలుత బయటకు అడుగులు వేసినప్పుడు గౌతమ్ రాజకీయాల్లో లేడని, ఆయన తండ్రి రాజమోహన్రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారని సీఎం జగన్ చెప్పారు. తాను ఈ స్థానానికి వస్తానని ఆ రోజుల్లో బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చన్నారు. కాంగ్రెస్తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకి వచ్చినప్పుడు అతి తక్కువ మంది తనతోపాటు ఉండటానికి సాహసించారని తెలిపారు. అలాంటి కొద్ది మంది వ్యక్తులలో గౌతమ్ ఒకరని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ ప్రభావం ఆయన తండ్రిపై ఉందన్నారు. రాజమోహన్రెడ్డి తనతో నిలబడటానికి గౌతమ్తో తనకున్న స్నేహం, విశ్వాసం, తాను చేయగలననే నమ్మకం ప్రధాన కారణాలన్నారు.మేకపాటి కుటుంబమంతా తన వెంట నడిచిందని, అలాంటి స్నేహితుడ్ని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. పట్టుబట్టి పెట్టుబడులు.. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్రెడ్డి కేబినెట్లో ఆరు శాఖలకు ప్రాతినిధ్యం వహించి సమర్థంగా పనిచేశారని సీఎం జగన్ కొనియాడారు. దుబాయ్ ఎక్స్పోకు వెళ్లేముందు కూడా తనను కలిశారని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, తాను కలుసుకున్న పారిశ్రామికవేత్తల వివరాలను తనకు తెలియచేయాలని కోరుతూ రోజూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరాలు పంపేవారని తెలిపారు. పరిశ్రమలపరంగా రాష్ట్రాన్ని ముందెన్నడూ లేని విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. గౌతమ్ కృషితో పారిశ్రామిక దిగ్గజాల రాక గతంలో ఎన్నడూ లేనివిధంగా పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించడం వెనుక మంత్రి గౌతమ్రెడ్డి కృషి ఎంతో ఉందని సీఎం జగన్ తెలిపారు. సెంచురీ ఫ్లైవుడ్ కడప జిల్లా బద్వేలులో రావడంతోపాటు బంగర్లు.. శ్రీ సిమెంట్స్ ఫ్యాక్టరీ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారని చెప్పారు. బజాంకాలు, బంగర్లు, సన్ఫార్మా దిలీప్ సంఘ్వీ, ఆదిత్య బిర్లా తమ హయాంలోనే రాష్ట్రంలో అడుగుపెడుతున్నారన్నారు. అదానీలు కూడా తమ హయాంలోనే రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. వారి పేర్లను గతంలో పత్రికల్లో చదవడమే మినహా మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదన్నారు. వారందరికీ భరోసా కల్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో గౌతమ్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. గౌతమ్ భౌతికంగా మన మధ్య లేకున్నా తన కలలు, తన ప్రాంతానికి మంచి జరగాలన్న కోరికను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. పైలోకంలో ఉన్న గౌతమ్ను దేవుడు చల్లగా చూస్తాడని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. మేకపాటి కుటుంబానికి తామంతా ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరం: సీఎం జగన్
-
సంగం బ్యారేజీకి గౌతమ్రెడ్డి పేరు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గౌతమ్రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది తెలిపారు. గౌతమ్రెడ్డి మృతి తనకు,పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గౌతమ్రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. గౌతమ్రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. గౌతమ్రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. చదవండి: మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరం: సీఎం వైఎస్ జగన్ -
సోమశిల ప్రాజెక్టు కోసం గౌతమ్ పరితపించేవారు
-
గౌతమ్రెడ్డి ఆగర్భ శ్రీమంతుడు
-
గౌతమ్ రెడ్డి బంగారంలాంటి మనిషి
-
గౌతమ్లో అలా ఉండటం ఎప్పుడూ చూడలేదు.. కానీ..
-
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు
-
రాష్ట్రం బంగారంలాంటి మనిషిని కోల్పోయింది
-
గౌతమ్ మళ్ళీ వస్తాడనుకుంటే తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయాడు
-
జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్ అన్న...
-
సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
-
ఎలాంటి ఇగో లేని వ్యక్తి గౌతమ్ అన్న..
-
AP: మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరం: సీఎం వైఎస్ జగన్
Updates: ► ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. ► గౌతమ్రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. ► గౌతమ్రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ► గౌతమ్రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది తెలిపారు. గౌతమ్రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. గౌతమ్రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ► గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్రెడ్డి గొప్ప విద్యావంతుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయుడని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనపై గౌతమ్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని గుర్తుచేశారు. గౌతమ్రెడ్డి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి: ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు ► గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై ధర్మన ప్రసాదరావు మాట్లాడుతూ.. గౌతమ్రెడ్డి రాజకీయల్లో ఉన్నతమైన పదవులు సాధించినా ఎప్పుడూ గొప్ప సంస్కారంతో ఉండేవారని తెలిపారు. గౌతమ్రెడ్డి మరో మూడు దశాబ్దాలు ప్రజా జీవితానికి పనికివస్తాడని తాను భావించేవాడినని గుర్తుచేసుకున్నారు. ► గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఐటీ పాలసీలు చేస్తున్నప్పుడు ‘గౌతమ్రెడ్డి అన్న’తో అనేకసార్లు చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు. గౌతమ్రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు: ఆదిమూలపు ►నిరంతరం తపన కలిగిన వ్యక్తి గౌతమ్రెడ్డి అని మంత్రి ఆదిమూలపు సురేష్ గుర్తుచేశారు. కడప జిల్లాఇన్చార్జ్గా ఉన్న సమయంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పుడు అక్కడ కూడా గౌతమ్రెడ్డి పట్టుదల, కమిట్మెంట్ చూశామని తెలిపారు. ► గౌతమ్రెడ్డి అకాల మరణం బాధాకరం: ఆనం ► బంగారం లాంటి మనిషిని రాష్ట్రం కోల్పోయింది. మేకపాటి కుటుంబంతో 35 ఏళ్ల అనుబంధం ఉంది: మంత్రి బాలినేని దురదృష్టకరం: ఆర్కే రోజా ► గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి. అజాతశత్రువు ఆయన. ప్రతిపక్షాల మెప్పు సైతం పొందిన వ్యక్తి. జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్రెడ్డి. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డిలు గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై సభలో ప్రసంగించారు. ► గౌతమ్.. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి : పెద్దిరెడ్డి ► ఎన్ని బాధ్యతలు నిర్వహించినా.. వివాదాలు లేకుండా సమర్థవంతుడిగా పేరుంది గౌతమ్ రెడ్డికి. ఆయన లేని లోటు తీరనిది: కాకాణి గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై ప్రసంగించిన మంత్రి అనిల్ ► వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్రెడ్డి. ఎలాంటి ఇగో లేని వ్యక్తి. గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన మరణ వార్త వినగానే షాక్కు గురయ్యాం.. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. 2010 నుంచి సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి అనిల్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రసంగించాడు మంత్రి అనిల్. ► ఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. గౌతమ్రెడ్డి సంతాపం తీర్మానం సభలో ప్రవేశపెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండోరోజు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. గౌతమ్రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానునుంది. శాసన మండలిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం శాసన మండలి వాయిదా పడనుంది. ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. 9వ తేదీన గౌతమ్రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 10వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనుంది. -
దాతృత్వాన్ని చాటుకున్న మేకపాటి కుటుంబం
-
గౌతమ్రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. -
మేకపాటి మృతి పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణం పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పా టు పలు విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మేకపాటితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది. వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయ న ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్ ఎస్బీ హాము హజీ పేర్కొన్నారు. చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7కి వాయిదా) దుబాయ్ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని, వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి. -
ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7కి వాయిదా
సాక్షి, అమరావతి: మార్చి 3న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 7కు వాయిదా పడింది. దివంగత మంత్రి గౌతమ్రెడ్డి పెద్ద ఖర్మ దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 7న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే.. మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు) -
పవిత్ర నదుల్లో గౌతమ్రెడ్డి అస్థికల నిమజ్జనం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఉదయగిరి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అస్థికలను పవిత్ర నదుల్లో నిమజ్జనం చేశారు. గౌతమ్రెడ్డి వారం రోజుల క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు కృష్ణార్జునరెడ్డి ఆదివారం కృష్ణా, గోదావరి నదుల్లో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పావన గోదావరి నదిలో స్థానిక కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పాల్గొని గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. విజయవాడలోని కృష్ణానదిలో నిర్వహించిన గౌతమ్రెడ్డి అస్థికల నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్లతో చనిపోయే వారు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారు. కొద్దిరోజుల ముందు ప్రఖ్యాత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ను మరవకముందే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఘటన అందరినీ కలచివేసింది. ఇద్దరిదీ చిన్న వయసే. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ, మంచి ఫిట్నెస్ను కలిగి ఉన్నవారే. వీళ్లకే ఇలా జరుగుతుంటే... సాధారణ ప్రజల పరిస్థితేమిటి అన్న ఆందోళన చాలామందిని వేధిస్తోంది. ఇలాంటి హార్ట్అటాక్లను సరిగ్గా గుర్తిస్తే.. వీలైనంత త్వరగా వైద్యసహాయం అందేలా జాగ్రత్త పడవచ్చు. మరణాలనూ నివారించవచ్చు. వాటిని గుర్తించడం ఎలాగో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలిపే కథనమిది. చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు ఆందోళన వద్దు... అప్రమత్తత మేలు! గతంలో 35 లోపు వయసున్న వారిలో గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజ్లు) అరుదు. నిజానికి కరొనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనులు గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్నూ సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఇవి సన్నబడతాయి. కొన్నిసార్లు మూసుకుపోతాయి. దాంతో గుండెకు రక్త సరఫరా తగ్గడం లేదా ఒక్కోసారి పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. ఆ సమయాల్లో ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్ను ‘యాంజినా/యాంజైనా పెక్టోరిస్’ అంటారు. తగినంత రక్తసరఫరా జరగనప్పుడు గుండె కండరాలు చచ్చుపడిపోవడం మొదలవుతుంది. దాన్నే హార్ట్ ఎటాక్ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ – ఏఎమ్ఐ) అంటారు. అప్పుడు వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ కారణంగా... యాంజినల్ చెస్ట్ పెయిన్ (ఛాతీ నొప్పి) నుంచి అకస్మాత్తు మరణం వరకు ఏదైనా సంభవించవచ్చు. ఇటీవల మన దేశంలోనూ 35 – 40 ఏళ్లలోపు వారికి కరోనరీ ఆర్టరీ డిసీజెస్ బాగా పెరిగాయి. లక్షణాలు : గుండెపోటు లక్షణాలు పెద్దవయసు వారిలోనూ, చిన్నవయసు వారిలోనూ ఒకేలా ఉంటాయి. దీనిలో ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి. గమనించాల్సిన అంశమేమిటంటే.. చిన్నవయసు వారిలో నొప్పి తీవ్రత కాస్త ఎక్కువ. ఈ నొప్పినే ‘యాంజినా’ అంటారు. గుండెపోటు మరికొన్ని రకాలుగా కూడా వ్యక్తం కావచ్చు. ముఖ్యంగా ఈ నొప్పి మన ఒంట్లో... ►కింది దవడ మొదలుకొని... బొడ్డు వరకు ఎక్కడైనా కనిపించవచ్చు. ∙ఇది ఛాతీపై నొక్కిపట్టుకుంటున్నట్లుగా (స్క్వీజింగ్) వస్తుంటుంది. ∙ఛాతీపై పెద్ద బరువు ఉన్నట్లుగా, పాకుతున్నట్లుగా వస్తుంది. ∙ఒక్కోసారి ఛాతీలో మంటగా అనిపిస్తుంది. అందువల్లనే బాధితులు దాన్ని ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతుంటారు. త్వరగా గుర్తించేందుకు తోడ్పడే అంశాలు... ►ఛాతీపై ఒత్తిడి కలుగుతున్నట్లుగా / పట్టేసినట్టుగా / నొక్కినట్టుగా / మంటతో వచ్చే నొప్పి. ∙ఐదు నిమిషాల్లో నొప్పి తీవ్రత క్రమంగా పెరగడం. ∙నొప్పి విస్తరిస్తున్నట్లుగా రావడం. (కొందరిలో ఛాతీ ఎడమవైపు నొప్పి ఉంటేనే గుండెనొప్పిగా భావిస్తుంటారు. ఇది ఛాతీ మధ్యలోనూ వచ్చి, అన్ని వైపులకూ విస్తరించవచ్చు). ►ఛాతీ నొప్పి ప్రధానంగా ఎడమ భుజంలోకి, మెడలోకి, వీపులోకి పాకుతూఉండవచ్చు. ►నొప్పితో పాటు మరికొన్ని లక్షణాలూ కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసలో ఇబ్బంది, చల్ల చెమటలు, అకస్మాత్తుగా నోరంతా వికారం. ►శారీరక శ్రమ తర్వాత నొప్పి పెరగడం లేదా ఛాతీ పట్టేసినట్టుగా కావడం. ►తీవ్రమైన ఉద్వేగానికి లోనైనప్పుడు లేదా విశ్రాంతి సమయంలో కూడా ఛాతీనొప్పి. ►చాలా అరుదుగా దవడ పై భాగంలోనూ నొప్పి రావచ్చు. కానీ ఈ లక్షణాన్ని చూసిన వెంటనే డాక్టర్లు దాన్ని గుండెపోటుగా పరిగణించకపోవచ్చు. ఇది అరుదు కావడంతో కొన్ని పరీక్షల తర్వాతే గుండెపోటును నిర్ధారణ చేస్తారు. కారణాలు : ► శారీరక శ్రమ లేకుండా కూర్చుని చేసే పనులు పెరగడంతో కొవ్వులు పేరుకుపోయి రక్తప్రవాహానికి అడ్డుపడే అవకాశాలు పెరుగుతున్నాయి. ►మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో 40 ఏళ్ల తర్వాతే కనిపించే ఈ ముప్పు ఇటీవల 25 నుంచి 30 ఏళ్లప్పుడే జరుగుతోంది. ►మారుతున్న ఆహారపు అలవాట్లు యువతను ప్రభావితం చేస్తున్నాయి. గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ తగ్గి, కీడు చేసే చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వులైన ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెరిగింది. ►యువతలో మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు అథెరో స్కి›్లరోసిస్కు దారితీస్తాయి. ►హైబీపీ కూడా గుండెపోటుకు దోహదం చేస్తుంది. గుండెపోటు ముప్పును పెంచే అంశాలు ►యువతలోనూ ఊబకాయుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. పైగా మన సమాజంలో పొట్ట దగ్గర ఊబకాయం మరీ ఎక్కువ. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ / సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మామూలు ఊబకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీ వల్ల గుండెపోటు ముప్పు ఎక్కువ. ►ఇటీవల డయాబెటిస్ చిన్నవయసులోనే కనిపిస్తోంది. గుండెపోటుకు ఇదో స్పష్టమైన ముప్పు. ►ఆహారాల్లో ఎక్కువగా వాడుతున్న ఉప్పు, కొవ్వు పదార్థాలు (ట్రాన్స్ఫ్యాట్స్)... రక్తనాళాల్లో కొవ్వులు చేరేలా, సన్నబడేలా చేస్తున్నాయి. ►యువతలో శారీరక శ్రమ / వ్యాయామం లేకపోవడమూ ఓ ప్రధాన ముప్పే. వ్యాయామం చేసే యువత కూడా... కొవ్వు కరిగేలా చేసుకోవడం కంటే కండరాల నిర్మాణం, మంచి ఆకృతిపైనే ఆసక్తి చూపుతున్నారు. తీవ్రమైన శ్రమ కలిగించే వ్యాయామాల కంటే శ్రమలేనివే మంచివన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. ►కుటుంబ చరిత్రలో గుండెజబ్బులుండ టమూ గుండెపోటుకు దారితీసే అంశమే. దాదాపు 25 శాతం మందిలో ఈ ఫ్యామిలీ హిస్టరీయే గుండెపోటుకు ఓ కారణం. ►యువతలో ఎక్కువ గంటల పాటు, రాత్రుళ్లు నిద్రలేకుండా పనిచేసే వృత్తులో ఉండటం బాగా పెరిగింది. శారీరక/మానసిక ఒత్తిడి కూడా. ఇవన్నీ గుండెపోటుకు దారితీసే అంశాలే. పైన పేర్కొన్న కారణాలను గుర్తించి, వాటిలో వీలున్నవి సరిదిద్దుకుని, లక్షణాలను శ్రద్ధగా గమనించి, యువకుల్లో అవి కనిపించగానే తక్షణం ఆసుపత్రికి తరలించడం వల్లవారి ప్రాణాలను కాపాడవచ్చు. జాగ్రత్తగా గమనించాల్సిందే... చిన్న... పెద్ద వయసు వారిలో గుండెపోటును స్పష్టంగా గుర్తించడం అవసరం. పెద్దవయసు వారిలో నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నందున మరింత శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే ఆ వయసు వారిలో ఉండే ముప్పు (కో–మార్బిడిటీస్) వల్ల ఈ అప్రమత్తత అవసరం. అయితే ఇప్పుడు చిన్నవయసు వారిలో సైతం ఇవే లక్షణాలను ఇంకా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే చిన్నవయసులో గుండెపోటుకు పెద్దగా అవకాశం ఉండదన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇటీవలి ఘటనల తాలూకు హెచ్చరికల నేపథ్యంలో చిన్నవయసువారి విషయంలోనూ అప్రమత్తత అవసరమవుతోంది. ఇక చిన్నవయసువారిలో గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటివి గుండెపోటు లక్షణాల మాదిరిగానే వ్యకమవుతూ ఉండటం వల్ల... రిస్క్ తీసుకోకుండా ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. - డాక్టర్ ఎ. శరత్ రెడ్డి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ -
మెరిట్స్లో కర్మక్రియలు.. మార్చి 3న మంత్రి గౌతమ్రెడ్డి పెద్ద కర్మ
సాక్షి, నెల్లూరు(ఉదయగిరి/సంగం): దివంగత మంత్రి గౌతమ్రెడ్డి కర్మక్రియలను శుక్రవారం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తండ్రి గౌతమ్రెడ్డికి ఆయన తనయుడు మేకపాటి కృష్ణార్జునరెడ్డి సంగంలోని పెన్నానదిలో త్రివేణిలో పిండ ప్రదానం చేశారు. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని మేకపాటి రాజమోహన్రెడ్డి, ఆయన సతీమణి మణిమంజీరి, గౌతమ్రెడ్డి సతీమణి కీర్తి, కుమార్తె సాయి అనన్య ఇతర కుటుంబ సభ్యులు దుఃఖాన్ని భరిస్తూ కర్మక్రతువులు పూర్తి చేశారు. అర్జన్రెడ్డిని ఓదార్చుతున్న మేకపాటి దంపతులు ఈ సమయంలో తండ్రిని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో రోదిస్తున్న మవవడు అర్జన్రెడ్డిని రాజమోహన్రెడ్డి, మణిమంజరి తమ దుఃఖాన్ని అణుచుకుంటూ ఓదార్చుతుండడం అందరిని కంట తడి పెట్టించాయి. బిడ్డలు వేదనను చూసిన బంధువులు, పలువురు అధికారులు కంట చెమ్మ పెట్టారు. గౌతమ్రెడ్డి చితాభస్మంను దేశంలోని ఏడు పుణ్యనదుల్లో కలిపే నిమిత్తం ఏడు పాదుకుల్లో సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణి, మేకపాటి కుటుంబ సభ్యులు రాజారెడ్డి, పృధ్వీరెడ్డి, విక్రమ్రెడ్డి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (గౌతమ్రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ) మార్చి 3న మంత్రి పెద్ద కర్మ మంత్రి గౌతమ్రెడ్డి పెద్ద కర్మ శాస్త్రీయ ప్రకారం కాలం చేసిన 11వ రోజు మార్చి 3వ తేదీ ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకర్మకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అ«ధికారులు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
గౌతమ్రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: (పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు) వీఎస్యూలో ఘన నివాళి వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
అత్యంత శాస్త్రోక్తంగా మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు..
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి దహన సంస్కారాలు ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం వేదపండితుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా ఆయన కుటుంబ సభ్యులు జరిపించారు. ముందుగా గౌతమ్రెడ్డి తనయుడు కృష్ణార్జునరెడ్డి చేత పండితులు గణపతి హోమంతో పాటు అగ్నిప్రతిష్టంభన హోమం చేయించారు. గౌతమ్రెడ్డి చెవిలో కుటుంబ సభ్యులతో నారాయణ మంత్రం జపించారు. దహన సంస్కారాలు కూడా రాహుకాలం రాక ముందే సంప్రదాయ రీతిలో నిర్వహించారు. వేలాది మంది మేకపాటి అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతుల సమక్షంలో వేదపండితులు మధ్యాహ్నం 12 గంటలలోపే కృష్ణార్జునరెడ్డి చేత చితికి నిప్పంటించారు. గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని గంధపు చెక్కలతో దహనం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చితికి నిప్పంటించినన ఆనంతరం పోలీసులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. గౌతమ్రెడ్డి పాడె మోస్తున్న మంత్రి అనిల్ గుండెలలిసేలా.. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయం వద్ద ఆయన తనయుడు కృష్ణార్జునరెడ్డి గుండెలవిసేలా రోదించాడు. ఆయన విదేశాల్లో విద్యభ్యాసం చేస్తున్న సమయంలో తన తండ్రి మరణవార్త విని హటాహుటినా బయలు దేరిన మంగళవారం రాత్రి 11 గంటలపైన నెల్లూరులోని స్వగృహనానికి చేరుకున్నారు. అప్పటి వరకు మంత్రి మేకపాటి పార్థివదేహన్ని ప్రజల దర్శనార్థం బయట ఉంచిన కుటుంబ సభ్యులు ఆయన తనయుడు రాక ముందే మంత్రి అధికార కార్యాలయ గదిలోకి మార్చారు. ఇంటికి చేరుకున్న కృష్ణార్జునరెడ్డి తండ్రి భౌతికకాయాన్ని చూసి రోదించాడు. అక్కడున్న అందరిని కాసేపు బయటకు వెళ్లమని చెప్పి తానొక్కడే తండ్రి దేహం వద్ద కూర్చొని చాతి నిరుముతూ బోరున విలపించాడు. తనయుడు బాధను చూసి వారి కుటుంబ సభ్యులు దుఃఖంతో గుండెలవిసేలా విలపించారు. చదవండి: (తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణార్జునరెడ్డి) తండ్రి గౌతమ్రెడ్డి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న తనయుడు కృష్ణార్జున్రెడ్డి మౌనంగానే ఉంటూ.. తన ముద్దుబిడ్డ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఇకపై తమబిడ్డ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎందరో మేకపాటి ఆప్తులు, ప్రముఖులు, అభిమానులు వేలాది మంది తరలివచ్చి ఆయన్ను ఓదార్చుతున్న వారందరితో మౌనంగానే చేయేత్తి నమస్కరిస్తూ బరువెక్కిన హృదయంతో లోలోపల కుమిలిపోయాడు. తన బిడ్డ పార్థివదేహన్ని తదేకంగా చూస్తూ మౌనంగానే రోదించారు. గౌతమ్రెడ్డికి తండ్రి రాజమోహన్రెడ్డి అంటే ఎనలేని ప్రేమ. ప్రతి రోజు ఎక్కడున్నా రోజుకు పదిసార్లయినా తండ్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఆ రోజు తాను చేసిన పనులను చెప్పేవాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఎంఈఓలు కుదిరాయని తండ్రికి ఫోన్లో చెప్పడంతో కుమారుడిని అభినందించారు. అంతలోనే పుత్రశోకం మిగలడంతో మేకపాటి రాజమోహన్రెడ్డి తట్టుకోలేక మౌనంగా రోదిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీ బ్రేవ్.. నేనున్నా
Mekapati Goutham Reddy Funeral At Udayagiri: ఉదయగిరిలో బుధవారం మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సీఎం వైఎస్ జగన్ దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించారు. మేకపాటి రాజమోహన్రెడ్డితో కలిసి చితి వద్దకు చేరుకుని పార్థివదేహంపై స్వయంగా గంధపు చెక్కలను పేర్చి చితిపై నెయ్యి వేశారు. మేకపాటి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ నేనున్నా.. పార్టీ అండగా ఉంటుంది.. ధైర్యంగా ఉండాలని అనునయించారు. గౌతమ్రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని తెలియగానే, సీఎం జగన్ దంపతులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని మేకపాటి కుటుంబ సభ్యులను ఓదార్చిన విషయం తెలిసిందే. కృష్ణార్జునరెడ్డిని భుజం తట్టి.. తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కృష్ణార్జునరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అనునయించారు. ‘బీ బ్రేవ్’.. నేనున్నా... మీకు ఎప్పటికీ పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. గౌతమ్రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె సాయిఅనన్య, తల్లి మణిమంజరిలను సీఎం సతీమణి వైఎస్ భారతీరెడ్డి ఓదార్చి ధైర్యం నింపారు. గౌతమ్రెడ్డి అంతిమ సంస్కారాల్లో సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు విషణ్ణ వదనాలతో ఆవేదన పంచుకున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడు, చురుకైన నాయకుడు, మచ్చలేని మనిషిగా కీర్తి గడించిన గౌతమ్రెడ్డి కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని కంట తడి పెట్టారు. -
కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ నెల్లూరు సెంట్రల్: ఆత్మీయులు, అశేష జన సందోహం వెంట రాగా.. జోహారన్నా.. మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్రహే అనే నినాదాల నడుమ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. సీఎం వైఎస్ జగన్ దంపతులు, బంధుమిత్రులు, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు కడసారి గౌతమ్రెడ్డి పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. గౌతమ్రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి 11.59 గంటలకు చితికి నిప్పు అంటించగా పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి తుపాకులు పేల్చారు. స్వగ్రామం మీదుగా ఉదయగిరికి నెల్లూరు డైకస్ రోడ్డులోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, పి.అనిల్కుమార్ యాదవ్, ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య కాన్వాయ్ వెంట రాగా జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, నెల్లూరు పాళెం, డీసీపల్లె, మర్రిపాడు, బ్రాహ్మణపల్లె, నందిపాడు మీదుగా అంతిమయాత్ర 10.45 గంటలకు ఉదయగిరికి చేరుకుంది. కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పార్థివదేహాన్ని ఉంచారు. 11.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులు అక్కడకు చేరుకోగా అప్పటికే అంతిమ సంస్కారానికి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని సిద్ధం చేశారు. శాస్త్రోక్తంగా కుమారుడు ముందు నడుస్తుండగా పాడెను బంధుమిత్రులు చితి వరకూ మోసుకొచ్చారు. బరువెక్కిన హృదయాలతో.. బరువెక్కిన హృదయాలు, అశ్రు నయనాలతో మేకపాటి కుటుంబీకులు గౌతమ్రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్రెడ్డి, మణిమంజరి వేదన వర్ణనాతీతం. సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె సాయి అనన్య, కుమారుడు కృష్ణార్జునరెడ్డి, సోదరులు విక్రమ్రెడ్డి, పృధ్వీరెడ్డి, సమీప బంధువులు చివర చూపు అనంతరం చితిపై గంధపు చెక్కలను పేర్చారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చితిపై గంధపు చెక్కలు పేర్చి నెయ్యి వేశారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన అనంతరం చితికి కృష్ణార్జునరెడ్డి నిప్పు అంటించారు. మా ధైర్యం వెళ్లిపోయింది.. తమ ఆత్మీయ నేతను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రహదారులపైకి తరలి వచ్చారు. కాన్వాయ్పై ఊరూరా పూలవర్షం కురిపించారు. మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంబులెన్స్ను పట్టుకుని వెక్కి వెక్కి విలపించారు. ఆప్యాయంగా పలకరించే మా ధైర్యం వెళ్లిపోయిందంటూ రోదించారు. తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలకు పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరై నివాళులర్పించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకరనారాయణ, పినిపె విశ్వరూప్, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, గల్లా జయదేవ్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్చక్రవర్తి, డీసీ గోవింద రెడ్డి, పోతుల సునీత, వాకాటి నారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కె.శ్రీనివాసులు, శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కరణం బలరాం, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, అన్నా రాంబాబు, డా.సుధ, మేడా మల్లికార్జున రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, హఫీజ్ ఖాన్, కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ శిద్దారెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి, బిజేంద్రనాథరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే.. ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందినా నెల్లూరుతో మేకపాటి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. డైకస్ రోడ్డులోని నివాసాన్ని మేకపాటి గౌతమ్రెడ్డి ఎంతో ఇష్టపడి కట్టించుకున్నారు. అలాంటి ఇంటి నుంచి చివరిసారి వెళ్లిపోతున్నావా.. అంటూ అంతిమ యాత్ర ప్రారంభం కాగానే అంతా కన్నీటి పర్యంతమయ్యారు. నాన్నకు నచ్చిన దుస్తుల్లో.. గౌతమ్రెడ్డి ఎక్కువగా లాల్చి, పైజామా ధరిస్తుంటారు. జిల్లాలో ఎక్కడకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఎక్కువగా వీటినే ధరిస్తారు. తమ తండ్రికి ఎంతో ఇష్టమైన లాల్చి, పైజామాను కుమారుడు కృష్ణార్జునరెడ్డి, కుమార్తె అనన్య చివరిసారిగా తొడిగి నివాళులు అర్పించారు. ఎటైనా ‘డిఫెండర్’లోనే.. మంత్రి గౌతమ్రెడ్డికి లగ్జరీ కార్లు అంటే ఆసక్తి. ఇటీవలే ఆయన డిఫెండర్ కారును కొనుగోలు చేశారు. ఏ కార్యక్రమానికైనా అందులోనే వెళ్లేవారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆ కారును బాగా ఇష్టపడేవారని పలువురు అభిమానులు తెలిపారు. -
మంత్రి మేకపాటి గౌతంరెడ్డిపై స్పెషల్ సాంగ్
-
ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం టీడీపీకి లేదు’
-
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
మేకపాటి గౌతమ్ రెడ్డి జిమ్ వర్క్ అవుట్స్ వీడియో
-
మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్
-
గౌతమ్ రెడ్డి తల్లిని ఓదార్చిన వైఎస్ భారతి..
-
ఉదయగిరి చేరుకున్న సీఎం జగన్