
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్లను సబ్కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్కలెక్టర్గా పృథ్వీతేజ్, నూజివీడు సబ్కలెక్టర్గా ప్రతిస్త, అమలాపురం సబ్కలెక్టర్గా హిమాన్షు, కందుకూరు సబ్కలెక్టర్గా భార్గవ్తేజ, పార్వతీపురం సబ్కలెక్టర్గా విధేకర్, నర్సీపట్నం సబ్కలెక్టర్గా మౌర్య, నరసరావుపేట సబ్కలెక్టర్గా అజయ్కుమార్, రాజమండ్రి సబ్కలెక్టర్గా అంజలి, టెక్కలి సబ్కలెక్టర్గా ధనుంజయ్, మదనపల్లె సబ్కలెక్టర్గా జాహ్నవి, నంద్యాల సబ్కలెక్టర్గా కల్పన, రాజంపేట సబ్కలెక్టర్గా కేతన్, చిత్తూరు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎంఎస్ మురళి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment