నేడు మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ ఎన్నికలు | Chairman elections in three municipalities on February 03 in Andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడు మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ ఎన్నికలు

Published Mon, Feb 3 2025 4:29 AM | Last Updated on Mon, Feb 3 2025 4:29 AM

Chairman elections in three municipalities on February 03 in Andhra pradesh

నాలుగు డిప్యూటీ మేయర్, ఐదు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవులకు కూడా.. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్‌లు, మూడు కార్పొరేషన్‌లకు డిప్యూటీ మేయర్‌లతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్‌ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇం­దుకోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొ­రే­టర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు.

తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్‌ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచి్చరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement