Municipalities
-
నేడు మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్లు, మూడు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచి్చరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేషన్లు(corporations ), మున్సిపాలిటీల(municipalities) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం బెదిరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకుని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏపీ ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాశ్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు కలిసి వినతి పత్రం అందజేశారు. బెదిరించి లాక్కోవడం దుర్మార్గంమాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి డిప్యూటీ మేయర్ పదవికి వైఎస్సార్సీపీ తరఫున శేఖర్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆయన ఆస్తులను ధ్వంసం చేశారని, భవనాలను కూల్చేశారని మండిపడ్డారు. పోటీ చేయడానికి వీల్లేదంటూ ఆయన్ని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మేయర్ శిరీష వెళితే ఆమెనూ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. బహిరంగంగా రాజీనామా చేసి వస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చంద్రబాబు చెబుతున్నారని.. కార్పొరేటర్లకు ఆ నిబంధన వర్తించదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. విప్ను ఉల్లంఘిస్తే డిస్క్వాలిఫై అవుతారని హెచ్చరించారు.నిజాయితీగా పనిచేసే అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ను కోరామని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి.. తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నాడని, పవన్కళ్యాణ్ ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించడం సమంజçÜం కాదన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పార్టీలకు బలం లేని చోట ఎందుకు పోటీకి దిగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా వైఎస్సార్సీపీకే బలం ఉందని చెప్పారు. టీడీపీ గెలిచే అవకాశమే లేదని తెలిసినా.. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అడ్డదారుల్లో గెలవడం కోసం ఇంత దారుణంగా ప్రయత్నించడం ఎక్కడా చూడలేదన్నారు. పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
కాంగ్రెస్కు మరో 3 మున్సిపాలిటీలు
జగిత్యాల/నారాయణఖేడ్/సాక్షి, యాదాద్రి: జగిత్యాల, నారాయణఖేడ్, భువనగిరి మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కోసం బుధవారం సమావేశం ఏర్పాటు చేయగా.. 47 మంది కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే సంజయ్కుమార్ హాజరయ్యారు. చైర్పర్సన్ స్థానానికి బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ సమిండ్ల వాణిని పార్టీ ప్రతిపాదించింది. రెబల్ అభ్యర్థిగా కౌన్సిలర్ అడువాల జ్యోతి పోటీ పడ్డారు. జ్యోతికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 8 మంది, స్వతంత్రులు ఐదుగురు, ఎంఐఎం, ఏఎఫ్బీఐ పార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన సమిండ్ల వాణికి 22 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యుడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఓటు వేశారు. ఒకే ఒక్క ఓటు తేడాతో జ్యోతి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాగా, చైర్పర్సన్గా ఎన్నికైన జ్యోతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఇంటికి వెళ్లడం మున్సిపల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ వశమైంది. బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మా నం నెగ్గడంతో కాంగ్రెస్కు చెందిన ఆనంద్ స్వరూప్ షెట్కార్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా దారం శంకర్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి ప్రకటించారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లకుగాను బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరగా.. కాంగ్రెస్ మద్దతుదారులైన కౌన్సిలర్ల సంఖ్య 11కు చేరింది. ఎనిమిదిమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన ముగ్గురు కౌన్సిలర్లు, ఎక్స్అఫిíÙయో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిపి మొత్తం 12 మంది హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్కు సంబంధించి ఒక్కో దరఖాస్తు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అలాగే భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ పదవి కూడా బీజేపీ ఖాతాలో చేరింది. కాంగ్రెస్కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్గా, బీ జేపీకి చెందిన మాయ దశరథ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పదవిలో ఉన్న బీఆర్ఎస్కి చెందిన చైర్మన్, వైస్చైర్మన్పై జనవరి 23న అవిశ్వాసం పెట్టగా నెగ్గింది. దీంతో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడి హో దాలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి బొర్ర రాకేష్ పోటీలో నిలిచారు. రాకే ష్కు మద్దతుగా బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులు మా త్రమే చేతులెత్తారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు మద్దతుగా 11 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ కౌన్సిలర్ చేతులెత్తారు. దీంతో చైర్మన్గా వెంకటేశ్వర్లు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. -
అవిశ్వాసాలు @ 30 మున్సిపాలిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ పాలక మండళ్లలో మొదలైన అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 34 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్ / చైర్పర్సన్ / వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తూ నోటీసులు జారీ చేయగా, 30 చోట్ల ప్రత్యే క సమావేశాలు నిర్వహించారు. అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోయిన వారిలో 15 మందిని పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగతా 15 చోట్ల నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. 9 మున్సిపాలిటీల్లో కొత్త చైర్పర్సన్లు అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవుల నుంచి దిగిపోయిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల స్థానంలో కొత్త వారిని ఎన్నుకొనే ప్రక్రియ కూడా 9 మున్సిపాలిటీల్లో పూర్తయింది. మహబూబ్నగర్, నేరేడిచర్ల, కోదాడ, భూపాలపల్లి, నస్పూర్, మంచిర్యాల, నల్గొండ, వేములవాడ, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో కొత్త వారు కొలువు దీరారు. జగిత్యాల, భువనగిరి, ఖానాపూర్, హుజూర్నగర్, సుల్తానాబాద్, నారాయణఖేడ్ మునిసిపాలిటీల్లో ఈనెల 28న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కొత్త చైర్మన్/వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాగారం, మణికొండ, తూంకుంట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, సమావేశం తేదీలను నిర్ణయించలేదు. కాగా బండ్లగూడ జాగీర్, జవహర్నగర్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరికొన్ని పట్టణాల్లో అవిశ్వాస నోటీసులు రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి ఇప్పటి వరకు 34 చోట్ల అవిశ్వాస నోటీసులు జారీ అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పురపాలక వర్గాలు చెపుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ సాగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలలోని పట్టణాల పరిధిలో మెజారిటీ మునిసిపాలిటీలను లోక్సభ ఎన్నికల లోపు హస్తగతం చేసుకొనే ఆలోచనలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
Jan 22: రామ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు
టొరంటో: జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని రామ భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కెనాడాలోని మూడు మునిసిపాలిటీలు జనవరి 22వ తేదీని రామ మందిర్ డే గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. బ్రాంప్టన్, ఓక్ విల్లే, బ్రాంట్ఫోర్డ్ మునిసిపాలిటీలు 22ను రామ మందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి. మూడు మునిసిపాలిటీల నుంచి 22వ తేదీని అధికారిక రామ మందిర్ డేగా గుర్తించినట్లు ఉత్తర్వులు తీసుకోవడంలో విజయవంతమైనట్లు హిందూ కెనడియన్ ఫౌండేషన్(హెచ్సీఎఫ్) అధ్యక్షుడు అరుణేష్ గిరి తెలిపారు. గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ)లోనూ రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు సంబంధించి హోర్డింగులు పెట్టినట్లు ఇవి పండుగ వాతావరణాన్ని వ్యాప్తి చేస్తున్నాయని గిరి చెప్పారు. కెనడా వ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల కూడా గడువక ముందే చాలా పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మునిసిపాలిటీలో గురువారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గగా మరో ఏడు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు జిల్లా కలెక్టర్లు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీలో చైర్పర్సన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో అవిశ్వాస నోటీసుకు స్పందించిన కలెక్టర్ ఈ నెల 8న పాలకమండలిని సమావేశపరిచారు. అదేరోజు నల్లగొండలోనూ సమావేశం జరగనుంది. 11న మంచిర్యాల మునిసిపాలిటీ పాలకమండలి సమావేశం కానుండగా ఆ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, ఆ తరువాత గంటకే కొత్త చైర్పర్సన్, వీసీ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితోపాటు నస్పూర్ మునిసిపాలిటీ సమావేశం ఈ నెల 12న జరగనుంది. కాగజ్నగర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ సద్దాం హుస్సేన్పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 20న సభ సమావేశం కానుంది. అలాగే ఈ నెల 19న సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ సమావేశం జరగనుంది. ఇంకా చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు ఇచ్చిన నోటీసులపై జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారు. అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికి సుమారు 15 మంది మునిసిపల్ చైర్పర్సన్లు కాంగ్రెస్లో చేరినా పదవీగండం తప్పేలా లేదు. మరికొన్ని చోట్ల నోటీసులకు సిద్ధం.. నల్లగొండ జిల్లాలో నల్లగొండ మునిసిపాలిటీతోపాటు నేరే డుచెర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్పేట మునిసిపాలిటీ లతోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్లపో చంపల్లి, నిజాంపేట మునిసిపాలిటీలు, పీర్జాదిగూడ, జవహ ర్నగర్ కార్పొరేషన్లలో నోటీసులు జారీ చేసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్లో చేరిన ఇందుప్రియపై బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసుకు సిద్ధమవుతోంది. కరీంనగర్లో జమ్మికుంట మునిసిపల్ చైర్పర్సన్పై ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొన్నగంటి మల్లయ్య అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే రామగుండం కార్పొరేషన్లో అవిశ్వాసం ఆలోచన తమ సభ్యులకు లేదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అసమ్మతి సభ్యుల నుంచే.. సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా నాలుగైదు పాలక మండళ్లనే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పురపాలక చట్టం ప్రకారం పాలకమండలి మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండగా ఈ తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునిసిపల్ చట్టంలో మార్పులు చేసింది. అయితే అది గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో గతేడాది జనవరి 27 తరువాత 36 మునిసిపాలిటీలు, పలు కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అసమ్మతి సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వారికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తోడై చైర్పర్సన్లు, మేయర్లను గద్దె దించాలని ప్రయత్నించారు. అయితే గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పాలకమండళ్లను సమావేశపరచకపోవడం, ఈలోగా మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల్లో మళ్లీ కదలిక మొదలైంది. ‘ఆర్మూర్’చైర్పర్సన్పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన వినీత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారనే..! ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డితోపాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్కు చెందిన 24 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. 2020 జనవరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా 33వ వార్డు నుంచి కౌన్సిలర్గా పండిత్ వినీత గెలిచారు. అప్పట్లో చైర్పర్సన్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చైర్పర్సన్ భర్త పండిత్ పవన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంప్రదించగా ఆయన సూచన మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన మునిసిపల్ చైర్పర్సన్ ఎంపికపై కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు. -
పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పురపాలికల్లో కొత్త ఎత్తులు మొదలయ్యాయి. సుమారు నాలుగేళ్లుగా పదవుల్లో కొనసాగుతున్న పాలక మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతోపాటు మేయర్లపై ‘అవిశ్వాస పరీక్ష’అనే కత్తి వేలాడుతోంది. గత జనవరితో మూడేళ్ల పదవీ కాలం పూర్తవడంతో మునిసిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను గద్దె దించాలని కొందరు సభ్యులు చేసిన ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరలేదు. దాదాపు 95 శాతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లే ఉండటంతో అవిశ్వాసం ద్వారా ఎవరిని గద్దె దించినా.... రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో గులాబీ పెద్దలు వీరి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. దీంతో రాష్ట్రంలోని 130 మునిసిపాలిటీలకుగాను 34 చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లాల కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ, ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 15 మంది చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు అవిశ్వాసంపై పెద్దగా టెన్షన్ లేనప్పటికీ, బీఆర్ఎస్లోనే ఉన్న మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లలో పదవీగండం భయం పట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచిన జిల్లాల్లో బీఆర్ఎస్లో ఉన్న మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు అవసరమైతే పార్టీ మారేందుకూ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్లతో కలిసి ప్రస్తుత పాలక మండళ్ల చైర్మన్లను, వైస్ చైర్మన్లను గద్దె దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. చాలాచోట్ల ప్రయత్నాలు షురూ ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, నేరేడుచర్ల, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, కోస్గి, ఆంథోల్ మునిసిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇందులో బెల్లంపల్లి మునిసిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్లో చేరినప్పటికీ, సభ్యులు అవిశ్వాస నోటీసు ఇవ్వడం గమనార్హం. ఆర్నెల్ల క్రితం అవిశ్వాస నోటీసులు ఇచ్చిన మునిసిపాలిటీల్లో 15 మంది బీఆర్ఎస్ చైర్మన్లు కాంగ్రెస్లో చేరినప్పటికీ, చాలాచోట్ల సభ్యులు వారిని గద్దె దించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో కలెక్లర్లకు అవిశ్వాస నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అసంతృప్త సభ్యులకు కాంగ్రెస్ సభ్యులు కూడా తోడవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో సగం మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఇల్లందు, వైరా, జనగాం, భూపాలపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కోరుట్ల, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, యాదగిరిగుట్టలో అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు అసమ్మతి సభ్యులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులతో కలిసి ఈ మేరకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మునిసిపాలిటీల్లోనూ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. కార్పొరేషన్లలో సైతం రాష్ట్రంలోని 13 మునిసిపల్ కార్పొరేషన్లలో హైదరాబాద్ మినహా మిగతా కార్పొరేషన్లలో సైతం అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని జవహర్నగర్, నిజాంపేట, బోడుప్పల్, ఫిర్జాదీగూడ కార్పొరేషన్లతోపాటు నిజామాబాద్, రామగుండం, ఖమ్మం వంటి కార్పొరేషన్లలో కూడా అవిశ్వానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ మేయర్, చైర్మన్లు ఉన్న పట్టణాల్లో కొంత భిన్నమైన వైఖరి ఉండే అవకాశం ఉంది. కలెక్టర్లకు నోటీసులు ఇచ్చిన తరువాత నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానానికి గడువు ఇచ్చి ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అయితే అవిశ్వాస తీర్మానాలపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది. -
ఈ-ఆటోలతో ఆర్థిక భారం తగ్గుతుంది: ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఈ-ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశాం. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టాం. కోటి 20 లక్షల డస్ట్బిన్లను అందించాం. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. మురుగు నీటిని శుద్ది చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం అవుతుంది. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాం.. కానీ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. పేదలకు ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చదవండి: CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్లో మరో ముందడుగు -
చిన్న మున్సిపాల్టిలకు ఈ–ఆటోలు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిరి్మస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెడుతున్నారు. -
మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా మైనారిటీల నియామకానికి వీలు కల్పిస్తూ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రామాణికతను తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉండి అందుకు తూట్లు పొడిచే పనుల్లో భాగస్వామి కాలేనని ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మైనారిటీల ప్రస్తావనే లేదు... ‘మున్సిపాలిటీల పాలనా వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోసం కేంద్రం 74వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. మున్సిపాలిటీల ఏర్పాటు, పాలకవర్గ సభ్యుల ఎంపిక, సీట్ల రిజర్వేషన్ల అంశాలపై రాజ్యాంగంలోని పేరా–9–ఏలో ఉన్న ఆర్టికల్ 243–పీ, 243–జీలలో స్పష్టమైన వివరణలున్నాయి. ఎక్కడా అందులో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేదు. ఎన్నికల ద్వారానే మున్సిపాలిటీల్లో సీట్ల నియామకం జరపాలని ఆర్టికల్ 243–ఆర్ పేర్కొంటోంది. పురపాలనలో అనుభవం, పరిజ్ఞానంగల వ్యక్తులను కో–ఆప్షన్ సభ్యులుగా నియమించడానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు కమిటీ చైర్పర్సన్లను మున్సిపాలిటీల్లో (ఎక్స్అఫిషియో) సభ్యులుగా నియమించడానికే మినహాయింపు ఉంది. రాజ్యాంగంలోని పేరా–9–ఏలో మైనారిటీల ప్రస్తావన లేదు. ప్రతిపాదిత మున్సిపల్ బిల్లులోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9–ఏను ఉల్లంఘించేలా ఉన్నాయి’అని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఖజానాపై భారమనే ఆ బిల్లు తిరస్కృతి వైద్యవిద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్, వైద్య కళాశాల ల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల పదవీవిరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం తెలిసిందే. 2019 జూలై 20 నుంచి ఈ మేరకు రిటైర్మెంట్ వయసు పొడిగింపును వర్తింపజేస్తూ 2022 సెప్టెంబర్ 12న బిల్లును ప్రభుత్వం తేవడంపట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 61 ఏళ్లు నిండి పదవీ విరమణ చేసిన నాటి నుంచి తిరిగి పునర్నియమితులయ్యే వరకు ఉన్న కాలంలో ఒక్కరోజూ పనిచేయకపోయినా వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఈ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొనడంపై సైతం గవర్నర్ స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే రిటైరైన ఎందరికి దీనిద్వారా ప్రయోజనం కలుగుతుంది? ఎంత మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది? వంటి అంశాలపై తమిళిసై ప్రభుత్వ వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వ వర్సిటీలకు దిక్కులేదు.. ప్రైవేటువి కావాలా? రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం సరికాదని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ కోరినట్టు సమాచారం. -
ఆస్తిపన్ను వసూళ్లు రూ. 825.87 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది. ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ మునిసిపల్ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్ స్కీమ్ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్ కార్యాలయానికి రాకుండానే పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్ఎంఎస్లలో లింక్ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్ చాట్బాట్ నంబర్ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
మున్సిపాల్టీల్లో తల‘సిరి’ తక్కువే
సాక్షి, అమరావతి: దేశంలో 15 రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల మొత్తం ఆదాయంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీల జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.4,624 కాగా.. 15 రాష్ట్రాల్లో ఈ సగటు ఇంకా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పట్టణ జనాభా పెరుగుతున్నప్పటికీ జీడీపీలో మున్సిపాలిటీల వ్యయం 0.44 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులు, అకౌంటింగ్ విధానంపైనా నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక, పరిపాలన సంస్కరణలు చేపట్టాలని పేర్కొంది. ఏపీలో స్థానిక సంస్థలకు 16 అంశాలు బదిలీ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే 18 అంశాలను బదిలీ చేశాయని, ఆంధ్రప్రదేశ్ 16 అంశాలను బదిలీ చేసిందని నివేదిక వెల్లడించింది. అలాగే, పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా తప్పనిసరిగా అకౌంటింగ్ విధానం ఉండాలని నివేదిక సూచించింది. అలాగే, నీతి ఆయోగ్ ఇంకా ఏం సూచించిందంటే.. ► రాష్ట్రాల తరహాలోనే పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం అమలుచేయాలి. ► పట్టణ స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ► దేశంలో 223 క్రెడిట్ రేటింగ్లు ఇస్తే కేవలం 95 పట్టణ స్థానిక సంస్థలకే పెట్టుబడి రేటింగ్ ఉంది. ఇందులో కేవలం 41 మున్సిపాలిటీలే బాండ్ల ద్వారా రూ.5,459 కోట్ల నిధులు సమీకరించాయి. ► 2036 నాటికి పెరిగే జనాభాలో 73 శాతం పట్టణాల్లోనే ఉంటుందని, అందుకనుగుణంగా మౌలిక వసతుల కోసం అవసరమైన నిధుల సమీకరణకు మున్సిపల్ బాండ్ల జారీతో పాటు ఇతర మార్గాలను అనుసరించాలి. ఇందుకోసం మున్సిపాలిటీల సొంత ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్ రేటింగ్ సాధ్యమవుతుంది. ► స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, వినియోగ రుసుం చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే, దేశ జీడీపీలో మున్సిపాలిటీల ఆస్తి పన్ను కేవలం 0.2 శాతమే ఉంది. ► మున్సిపాలిటీలు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీచేసే నిధులపైనే ఆధారపడుతున్నాయి. ► మెరుగైన మున్సిపల్ పాలన కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ► మున్సిపల్ అకౌంటింగ్ రికార్డులు, వార్షిక ఖాతాలు కచ్చితత్వంతో ఉండాలి. ► వాస్తవ ఆదాయం, వ్యయంతోనే అకౌంటింగ్ ఉండాలి తప్ప ఇంకా రాని ఆదాయం, చేయని వ్యయాలను అకౌంటింగ్లో ఉండకూడదు. ► ఏటా ఆదాయంలో 5 శాతం నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ► రుణ స్థాయిలో చట్టబద్ధమైన సీలింగ్ను విధించుకోవాలి. ► జీతం, పెన్షన్ వ్యయాలను 49 శాతానికి పరిమితం చేయాలి. ► 51 శాతం ఆస్తుల సృష్టి, రుణ సేవలు, పెట్టుబడికి వ్యయం చేయాలి. ► క్రెడిట్ రేటింగ్తో బాండ్ల జారీని ప్రోత్సహించాలి. ► ఫలితాల ఆధారిత బడ్జెట్ను రూపొందించుకోవాలి. ► ఆదాయ అంచనాలు సగటు వార్షిక వృద్ధి కంటే ఎక్కువగా ఉండకూడదు. ► స్థానిక సంస్థలు ఆర్థిక డేటాబేస్ను ఏర్పాటుచేయాలి. ► సొంత పన్నులు, కేంద్ర.. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం, వ్యయంతో పాటు అన్ని వివరాలు పౌరులకు ప్రదర్శించాలి. -
బిల్లును ఓకే చేయించి.. అవిశ్వాసాలు ఆపేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నెలకొన్న అవిశ్వాసాల గందరగోళానికి తెర దించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొన్న 127 పట్టణ, నగర పాలక మండళ్లలో చాలా చోట్ల లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలుచోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. కొన్ని పట్టణాల్లో క్యాంపులు, కొనుగోళ్ల పర్వం కూ డా మొదలైంది. అవిశ్వాసాలు ప్రతిపాదించిన పట్ట ణాలు, నగరాల్లో అధికార బీఆర్ఎస్ పాలక మండళ్లే కొలువు తీరి ఉండటం, ప్రస్తుత మేయర్లు, చైర్పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ ప్రతినిధులే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పట్టణ, నగర పాలక మండళ్లలో అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టేందుకు ఉన్న కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే మరో ఏడాది వర కు సమస్య ఉండదని భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించేలా పావులు కదుపుతోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ గవర్నర్ను కలవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ బిల్లు విషయంలో గవర్నర్కు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసి ఆమోదించాల్సిందిగా కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా పెండింగ్లో.. తెలంగాణ మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నగర, పురపాలక సంఘాల్లో మేయర్/ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు.. పాలక మండలి ఏర్పాటైన నాటి నుంచి కనీసం మూడేళ్లు గడువు పూర్తయి ఉండాలి. ఈ నిబంధనకు సవరణ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ వద్ద పెండింగ్లో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య ఏర్పడిన అగాథం నేపథ్యంలో గవర్నర్ వద్ద ఆగిన ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పుర/నగర పాలక సంస్థల పాలక మండళ్లకు గత నెల 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఇదే అదనుగా అసమ్మతి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈలోపే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే సమస్యకు చెక్పడుతుందని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
డీటీసీపీ మాస్టర్ ప్లాన్.. ప్రతీ మున్సిపాలిటీకి రింగ్రోడ్డు!
సాక్షి, హైదరాబాద్: ప్రతి మున్సిపాలిటీకి రింగ్రోడ్డు.. రహదారులు, డ్రైనేజీల విస్తరణ.. ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, మిశ్రమ జోన్లు.. వచ్చే 20ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీలు విస్తరించడం వల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు కీలక చర్యలను చేపట్టనున్నారు. డీటీసీపీ యంత్రాంగం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైంది. మార్చి నాటికల్లా సిద్ధం చేసేలా.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను వినియోగించి.. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, 11 నగరాభివృద్ధి సంస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నారు. 2023 మార్చి నాటికల్లా అమలు చేసేలా బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకుగాను 74 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూపొందించిన మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మిగతా 68 చోట్ల కొత్తగా మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రజలు తమ భూవినియోగ వివరాలను సులభంగా తెలుసుకుని.. టీఎస్ బీ–పాస్ విధానంతో సింగిల్ విండో పద్ధతిలో భవన నిర్మాణ/లేఔట్ల అనుమతులు పొందడానికి మాస్టర్ప్లాన్లు ఎంతో ఉపయోగపడతాయని డీటీసీపీ అధికారులు చెప్తున్నారు. జీఐఎస్ ద్వారా క్షుణ్నంగా సర్వే చేసి వచ్చే 20ఏళ్ల వరకు ఎలాంటి భూ వినియోగమారి్పడి అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరిస్తున్నారు. వివిధ జోన్లుగా విభజించి.. జనాభా అధికంగా ఉండే ప్రాంతాలను మిశ్రమ వినియోగ ప్రాంతాలుగా.. మిగతా ప్రాంతాలను వాణిజ్య, నివాస ప్రాంతాలుగా ఒక క్రమపద్ధతిలో మాస్టర్ ప్లాన్లలో నిర్దేశించనున్నారు. ప్రజలు తాము నివసించే ప్రాంతాల నుంచి కార్యాలయాలకు, పనిచేసే ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేలా, రహదారులపై ట్రాఫిక్ భారాన్ని నిరోధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రహదారులు చిన్నగా ఉండటం.. జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరిగితే ఈ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీల్లో అంతర్గత, ప్రధాన రహదారులపై ఒత్తిడి లేకుండా రింగ్రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక చెరువులు, వాగులు, కాల్వలతోపాటు రైలు మార్గాలు, పారిశ్రామికవాడలు మొదలైన ప్రాంతాల్లో బఫర్ జోన్లను మాస్టర్ప్లాన్లలో నిర్దేశించనున్నారు. పట్టణాల్లో కనీసం పదిశాతానికి తగ్గకుండా గ్రీన్జోన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతా పక్కాగా.. మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో భాగంగా తొలుత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నుంచి పట్టణాల చిత్రాలు, వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ శాఖ నుంచి సర్వే నంబర్ల వారీగా మ్యాపులను తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి.. పట్టణ ప్రణాళికలో నిపుణులైన వారితో కొత్త మాస్టర్ప్లాన్లను రూపొందిస్తున్నారు. -
అభివృద్ధికి పది సూత్రాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో పది పాయింట్ల ఎజెండాతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. గురువారం మునుగోడులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సమీక్ష సందర్భంగా ఆయన ఈ పది సూత్రాల ప్రణాళికను వివరించారు. వచ్చే మార్చి నాటికల్లా ఈ ప్రణాళిక మేరకు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్యక్రమాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు రాష్ట్రానికి చెందిన 26 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్నాయని గుర్తుచేశారు. దీనిని బట్టి దేశంలోనే మన మున్సిపాలిటీల పని విధానం ఉత్తమంగా నిలిచిందన్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని, వాటికోసం పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. మంత్రి వివరించిన ప్రణాళిక ఇదీ.. ► చిన్న, పెద్ద మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు 21 రోజుల్లోపే అన్ని అనుమతులు ఇవ్వాలి. 75 చదరపు అడుగులలోపు అయితే ఏ అనుమతులూ అవసరం లేదు. ఎక్కడైనా తేడాలుంటే నా దృష్టికి తేవాలి. టీఎస్ బీపాస్ ద్వారానే అనుమతులు ఇవ్వాలి. ► ప్రతి మున్సిపాలిటీలో ఒక్కటైనా వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఉండాలి. ప్రజలకు ఉపయోగపడేలా వచ్చే మార్చి 31లోగా పూర్తి చేయాలి. ► అంతిమ సంస్కారాన్ని సంస్కారవంతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయాలి. వైకుంఠ రథాన్ని మున్సిపాలిటీల ఆధ్వర్యంలోనే అందుబాటులో ఉంచాలి. ► హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో 1,700కు పైగా అర్బన్ నర్సరీలు ఉన్నాయి. వాటికోసం 12 శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో అవసరమైన చోట ఇంకా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలి. ► ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక దోబీ ఘాట్లు నిర్మించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలి. వాటిలో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. ► అన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల్లోని చెత్త తొలగింపునకు బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించాలి. ఎక్కడైనా ప్రారంభించకపోతే వెంటనే చేయాలి. మానవ వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ► ప్రతి మున్సిపాలిటీ తనదైన మాస్టర్ ప్లాన్ను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి. కొత్త మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలోనే ప్రజాప్రతినిధులు క్షుణ్నంగా పరిశీలించాలి. ఎక్కడ రోడ్డు వస్తుంది, ఎక్కడ చెరువులు ఉన్నాయనేది పరిశీలించి, ఆమోదించి పంపాలి. ఒకసారి ఫైన్ డ్రాప్ట్ ఆమోదించాక మార్పులు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ► అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఇంటికి యూనిక్ నంబర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి యూనిక్ స్ట్రక్చర్ డిజిటల్ డోర్ నంబర్ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్ కొడితే ఇంటి యజమాని వివరాలు వచ్చేలా ఆన్లైన్ చేయాలి. హైదరాబాద్లో 25 లక్షల ప్రాపర్టీలు ఉంటే 18 లక్షల ప్రాపర్టీల నుంచే పన్ను వస్తోంది. ఇకపై పట్టణాలు, మున్సిపాలిటీల్లో లెక్కలోకి రాని ప్రాపర్టీలు ఉండకూడదు. అందుకోసమే ఈ విధానం తెస్తున్నాం. ► మున్సిపాలిటీల్లోని సెలూన్ల వివరాలు సేకరించాలి. వాటి యజమానుల ఫోన్ నంబర్లు తీసుకోవాలి. ముందుగా సమాచారం సిద్ధం చేస్తే.. తర్వాత వారికి అవసరమైన మోడల్ సెలూన్లను డెవలప్ చేయవచ్చు. ఏసీ వంటి సదుపాయాలతో సెలూన్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ► మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి నీటిని అందించాలి. ఎక్కడైనా మంచినీరు అందని ప్రాంతాలుంటే గుర్తించి వెంటనే మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. 50వేల కన్నా జనాభా తక్కువ ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్ను నియమిస్తాం. మంత్రుల సమీక్షలు ► ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పల్లె–పట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ, విద్యుత్, మిషన్ భగీరథ, రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లుŠ, గిరిజన సంక్షేమం, మహిళాశిశు సంక్షేమం, నీటిపారుదల అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత మంత్రులు సమీక్షించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై చర్చించారు. ► జిల్లాలో ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, పూర్తికాని పనులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఎప్పటిలోగా పూర్తి చేసుకోవాలో నిర్ణయించడానికి ఈ సమావేశం నిర్వహించామని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ► ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా పనులు చేపట్టి పంచాయతీలకు ఆదాయం పెరిగేలా, ట్రాక్టర్ బకాయిలు తీర్చుకునేలా చూడాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. డంపింగ్ యార్డుల్లో ఎరువుల తయారీతో ఆదాయం రాబట్టాలన్నారు. ► రాష్ట్రస్థాయిలో అంతటా 4లేన్ల రోడ్లు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. గత 8 ఏళ్లలో ఇందుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పంచాయతీలుగా మారిన తాండాల్లో రోడ్లకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించామని, ఐటీడీఏల పరిధిలో రూ.476 కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని మంత్రి సత్యవతి చెప్పారు. ‘మునుగోడు’కు 380 కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాబోయే ఆరేడు నెలల్లో రూ.1,544 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో రూ. 380 కోట్లతో మునుగోడును అభివృద్ధి చేస్తామని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తే ఆ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు నెలరోజుల్లోనే సమీక్ష చేపట్టామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపడతామని, మున్సిపాలిటీలకు అదనపు గ్రాంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత జౌళిశాఖ తరఫున నేతన్నల కోసం రూ.4 కోట్లతో హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రూ.30 కోట్లతో చండూరు మున్సిపాలిటీ, రూ.50 కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రూ.కోటి వ్యయంతో నారాయణపూర్లో సంత్ సేవాలాల్ గిరిజన బంజారా భవన్ నిర్మిస్తామని, గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే 12 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ఆలోగా పనులు పూర్తిచేయాలన్నారు. -
16 పురపాలికలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్–22 అవార్డులను సాధించాయి. జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్సీ)కు స్టార్ రేటింగ్ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్లో అవార్డులను ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ పట్టణాలుగా ప్రకటించారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే.. ఆదిభట్ల, బడంగ్పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ. సంస్కరణల ఫలితమే ఈ అవార్డులు: మంత్రి కేటీఆర్ ఈ ఏడాది కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన 16 పురపాలికల్లోని మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతినెలా రాష్ట్ర బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో ప్రాథమిక సేవలకు వీలు కలిగిందన్నారు. ఈ అవార్డుల ద్వారా పట్టణాభివృద్ధి, పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 అవార్డుల్లో తెలంగాణలోని 16 పట్టణాలు అవార్డులు గెలుచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి దర్పణంగా నిలిచిందన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం వివరించారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడీఎఫ్ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశా నికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. -
ఆస్తిపన్ను పరిధిలోకి రాని గృహాలు లక్షల్లో..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పురపాలికలకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. నిధుల్లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్ష్రేత్రస్థాయిలో ఇంకా లక్షల సంఖ్యలో ఆస్తుల పన్ను మదింపు జరగడం లేదు. ఒకవేళ మదింపు జరిగి, నోటీసులు జారీ చేసినా, వందశాతం వసూళ్లు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విదిలించకపోతే ఆ స్థానిక సంస్థలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితులుంటున్నాయి. చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల.. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో సహా మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 17.50 లక్షల స్థిరాస్తులపై ఏటా రూ.4,500 కోట్ల ఆస్తిపన్నులు విధించి వసూలు చేస్తున్నారు. మిగిలిన 141 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో 22 లక్షల స్థిరాస్తులను ఆస్తి పన్నుల పరిధిలోకి తెచ్చి మొత్తం రూ.1,322 కోట్ల పన్నులను వాటిపై విధించారు. మిగిలిన వాటితో పోల్చితే ఒక్క జీహెచ్ఎంసీ 3.2 రెట్లు అధిక ఆదాయాన్ని పొందుతోంది. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు పెద్దసంఖ్యలో ఉండటం, అద్దె విలువ సైతం అధికంగా ఉండటంతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది. క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను వసూళ్లలో లోపాలను అరికట్టేందుకు ఉన్నతస్థాయిలో కొత్త ఆలోచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదు. జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)ను ప్రత్యేకంగా సీనియర్ అధికారిగా నియమించినా.. ఆస్తిపన్ను పెంపులో పెరుగుదల ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ..కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. అయినా, స్థానిక సంస్థల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వందకు వందశాతం వసూలైన దాఖలాలు లేవు. మదింపులోనే అసలు సమస్య ఆస్తిపన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. టాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తిపన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు పుచ్చుకుని ఆస్తిపన్ను తక్కువగా వేస్తున్నారని, ముడుపులివ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. టాక్స్ ఇన్స్పెక్టర్లకు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే.. నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. చాలామంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులను నిర్మిస్తుండటంతో.. అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అనుమతిలేకుండా కట్టిన నిర్మాణాలకు పన్నుల చెల్లింపు విషయంలోనూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తిపన్నుల సవరణ ప్రతీ ఐదేళ్లకోమారు జరగాల్సి ఉన్నా.. నివాస గృహాలపై గత 20 ఏళ్లుగా జరగలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను ఆటోమెటిక్గా పెంచేందుకు పురపాలక శాఖ యత్నిస్తోంది. 141 మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లలో ఇప్పటివరకు 76 మునిసిపాలిటీల్లో భూముల విలువలు పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరిగే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మరో 65 మునిసిపాలిటీల్లో ఈ విధానం అమలు కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో గత ఐదేళ్లలో ఆస్తి పన్ను ఇలా..(ఆగస్టు10 వరకు) సంవత్సరం ఉన్న ఇళ్లు (లక్షల్లో) డిమాండ్ (రూ.కోట్లలో) వసూళ్లు (రూ.కోట్లలో) శాతం 2018-19 17.53 501.20 445.89 88.96 2019-20 19.18 650.13 561.05 86.30 2020-21 20.27 799.14 719.34 90.01 2021-22 20.76 811.48 698.25 86.04 2022-23 21.95 1,322.89 334.18 25.26 -
ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్తులో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల శివార్లలోని అనేక నివాసాలు నీటమునిగాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలోని నిర్మాణాలకు, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లలో అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలను అమలు చేయాలనే విషయమై పురపాలక శాఖ కసరత్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. చెరువులు, కుంటల్లోనే పట్టణాలు! గతనెలలో భారీవర్షాల వల్ల పట్టణాల్లో ని ఏయేప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయనే విషయమై పురపాలక శాఖ నివేదిక రూపొందించినట్లు తెలియవచ్చింది. అందుకు గల కారణాలను కూడా పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ శివార్లలో మొన్నటివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలన్నీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా మారాయి. చెరువులు, కుంటలుగా ఉన్న ప్రాంతాలు పూడుకుపోయిన చోట్ల, శిఖం భూములుగా ఉన్న ప్రాంతాల్లోనే పట్టణాలు విస్తరించినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు ఆనుకొని కొత్తగా ఏర్పాటైన వెంచర్లు కూడా ముంపు ప్రాంతాలుగా నే ఉన్నట్లు పురపాలక శాఖ నిర్ణయానికి వచ్చింది. -
ఉత్సాహంగా మూడోరోజు ‘పట్టణ ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణప్రగతి మూడోరోజు కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పందించి పరిష్కరించారు. మున్సిపల్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ, 28 మంది ఎమ్మెల్యేలతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీసహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 10,189 టన్నుల చెత్త, 1,059 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనున్న పొదలు, 3,129 టన్నుల శిథిలవ్యర్థాలను తొలగించారు. 897 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడిక తీశారు. మురుగు, వరద నీటికాల్వలు, కల్వర్టుల వద్ద 146 జాలీలను ఏర్పాటు చేశారు. 1,256 ప్రజా మరుగుదొడ్లు, 644 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, 546 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రంచేశారు. 182 లోతట్టు ప్రాంతాలను పూడ్చారు. 1,32,762 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రే చేశారు. 121 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సీజ్ చేసి, బాధ్యులపై రూ.15,303 అపరాధ రుసుం విధించారు. పనిచేయని, ఎండిపోయిన 71 బోర్లను మూసివేశారు. 36 ఇంకుడు గుంతలను పునరుద్ధరించడంతోపాటు కొత్తగా పదింటిని నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న 68 ఇళ్లను తొలగించినట్లు తెలిపారు. విద్యుత్ మరమ్మతులు.. వైకుంఠధామాలు 125 విద్యుత్, నీటిమీటర్లకు మరమ్మతులు చేశారు. 26 మోటార్లకు కెపాసిటర్లు బిగించారు. 113 వంగిన స్తంభాలను సరిచేసి, 56 తుప్పు పట్టిన విద్యుత్స్తంభాలను మార్చారు. 2,100 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. 84 వైకుంఠధామాలు, శ్మశాన వాటికలను శుభ్రంచేశారు. 141 వైకుంఠధామాల పనులు ప్రారంభించారు. 28 వైకుంఠ రథాలను కొనుగోలు చేశారు. 25 మార్కెట్లు, రైతుబజార్లను శుభ్రం చేశారు. 42 క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. మొక్కల సంరక్షణకు అనువుగా... పట్టణాలు, నగరాల్లో 24,045 మొక్కల మధ్య కలుపు తీసి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా 11,779, రోడ్ల మధ్యన ఉన్న పాదుల్లో 6, 844 మొక్కలను నాటారు. కొత్తగా 36 స్థలాలను ట్రీ పార్కుల కోసం గుర్తించారు. కొత్త ట్రీ పార్కులో 2,252 గుంతలను మొక్కలు నాటడానికి అనువుగా తీశారు. 14,210 మొక్కలను ఇళ్లకు పంపిణీ చేశారు. మొక్కలు పెంచిన 21 మందిని సన్మానించారు. 320 ప్రదేశాల్లో పైపులైన్ లీకేజీలను గుర్తించి నీరు కలుషితం కాకుండా సరిచేశారు. 44 పంపు సెట్లను బ్రేక్డౌన్ కాకుండా సరిచేశారు. 321 మందికి ఒక రూపాయికి నల్లా కనెక్షన్ను ఇచ్చారు. 148 మందికి రూ.100కు నల్లా నీటి కనెక్షన్ ఇచ్చారు. -
'పల్లె' వించిన పట్టణీకరణ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలయ్యాయి.. పట్టణాలకు ఆనుకుని ఉన్న పల్లెలు వాటిలో అంతర్భాగమయ్యాయి. గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనువుగా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పట్టణ స్థానిక సంస్థలుగా మారడంతోపాటు తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 15 మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని.. అభివృద్ధికి వినియోగించుకోవడంతో ఆయా గ్రామాల స్థాయి పెరిగింది. జిల్లాలవారీగా కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలు ఇవే.. అనంతపురం జిల్లాలోని కోనపురం, వెంకటరెడ్డిపల్లిని కలిపి పెనుగొండ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ని 2020 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇదే నెలలో పలు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ► చిత్తూరు జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంలో సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా మార్చారు. ఇదే జిల్లాలో జనాభా పరంగా పెద్దదైన బి.కొత్తకోట కూడా యూఎల్బీగా మారింది. ► గుంటూరు జిల్లాలోని గురజాల, జంగమహేశ్వరపురం పంచాయతీలు కలిసి గురజాల మునిసిపాలిటీగా, దాచేపల్లి, నడికుడి గ్రామాలు కలిసి దాచేపల్లి మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► కృష్ణా జిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిసి కొండపల్లి మునిసిపాలిటీగా, తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలు కలిసి వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీగా ఏర్పాటయ్యాయి. ► కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బుగ్గనపల్లి కలిపి బేతంచర్ల యూఎల్బీగా ఏర్పాటు చేశారు. ► ప్రకాశం జిల్లాలోని పొదిలి, కంబాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలు కలిసి పొదిలి యూఎల్బీగా, దర్శి గ్రామ పంచాయతీ ఒక్కటీ మరో యూఎల్బీగా ఏర్పాటయ్యాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అల్లూరు, సింగంపేట, నార్త్ మోపూరు గ్రామాలు కలిసి అల్లూరు మునిసిపాలిటీగా, ఇదే జిల్లాలోని అవ్వేరు, కట్టుబడిపాలెం, ఇసకపాలెం, పల్లిపాలెం కలిసి బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, చింతలపూడి గ్రామ పంచాయతీలు వేర్వేరు పట్టణ స్థానిక సంస్థలుగా మారాయి. ► వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం గ్రామ పంచాయతీ సైతం యూఎల్బీగా మారింది. ► రాష్ట్రంలో కమలాపురం, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, బేతంచర్ల, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, కుప్పం, పెనుగొండ మునిసిపాలిటీలు 2020 జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటయ్యాయి. చింతలపూడి, అల్లూరు, పొదిలి, వైఎస్సార్ తాడిగడప, బి.కొత్తకోట మునిసిపాలిటీలను 2021లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్లో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా, 2021లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో 23 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో సమీపంలోని గ్రామాలను విలీనం చేసి ఆయా పంచాయతీల స్థాయి పెంచింది. శ్రీకాకుళం మునిసిపాలిటీలో ఏడు పంచాయతీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పది పంచాయతీలు, భీమిలి మునిసిపాలిటీలో ఐదు పంచాయతీలు, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. అదేవిధంగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఐదు పంచాయతీల చొప్పున, తణుకు, భీమవరం మునిసిపాలిటీల్లో మూడు పంచాయతీల చొప్పున కలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలు, జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీలు, నాయుడుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాలు, మరో పంచాయతీని కలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో అత్యధికంగా 21 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బాపట్ల మునిసిపాలిటీ సమీపంలో వెలసిన కొన్ని కొత్త ప్రాంతాలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి దాని స్థాయిని పెంచారు. అదేవిధంగా పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లోనూ పదుల సంఖ్యలో గ్రామాలను, సమీప కాలనీలను విలీనం చేశారు. కర్నూలు కార్పొరేషన్లో సైతం మూడు సమీప పంచాయతీలను కలిపారు. నంద్యాల మునిసిపాలిటీలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కొంత భాగాన్ని విలీనం చేశారు. ఇక పుంగనూరు మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాన్ని, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలను కలిపారు. -
పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడంపై రాష్ట్ర మునిసిపల్ పాలనా విభాగం దృష్టి సారించింది. ఏ స్థాయిలోనూ ‘పెండింగ్’ అనేది లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలను పరిష్కరించనుంది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో మునిసిపల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెలా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీల్లో సీడీఎంఏ స్వయంగా పర్యటించనున్నారు. ఏ లోపం ఉన్నా కమిషనర్లదే బాధ్యత ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే అంశంపై మునిసిపల్ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, కమిషనర్లపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఒక బృందాన్ని కూడా నియమిస్తోంది. మునిసిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరిగినా, ప్రజలకు అందించాల్సిన సేవల్లో లోపం కనిపించినా అందుకు స్థానిక కమిషనర్లనే బాధ్యులను చేయనుంది. 4,136 వార్డులపై ప్రత్యేక దృష్టి వార్డు సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని మునిసిపల్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న 4,136 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పుడు ఏం ప్రశ్న వస్తుందోనని మునిసిపల్ కమిషనర్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల దుమ్ముదులిపే పనిలో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో ఇటీవల పర్యటించిన సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ కొత్తపేట–2 సచివాలయంలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు యూనిఫామ్ ధరించకపోవడాన్ని గుర్తించారు. వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పేర్లు, వారు అందించే సేవల బోర్డులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో సిబ్బంది పనితీరుని మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఆయన గుర్తించిన లోపాలను అన్ని మునిసిపాలిటీలు సరిచేసుకోవాలని 123 మంది కమిషనర్లకు నోటీసులు పంపించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సకాలంలో సేవలు అందలేదని ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి. కమిషనర్లు పట్టణంలో పర్యటిస్తుంటే సమస్యలు తెలుస్తాయి. ఫిర్యాదులు, పెండింగ్ సమస్యలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలి. మునిసిపాలిటీల్లో 4,136 వార్డులు ఉన్నాయి. వాటిలో 317 సేవలు అందించాలి. ఎవరు ఎలాంటి సేవలు అందిస్తారనేది వార్డు సచివాలయాల్లో బోర్డులు పెట్టాలి. కొన్ని వార్డుల్లో ఇప్పటిదాకా బోర్డులు పెట్టనిచోట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా ప్రవర్తించినా, ప్రభుత్వ సేవలు, పథకాలు సకాలంలో ప్రజలకు అందకున్నా బాధ్యులపై చర్యలు తప్పవు. – ప్రవీణ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ -
కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా పెంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణను నెలకొల్పడం, ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ‘ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం)’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీన్ని గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం సంస్కరణలను సైతం అమలు చేయాలని సూచించింది. దీనికనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం.. ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణతోపాటు మరో 9 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా పన్ను చట్ట ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మదింపు చేపట్టి అందుకనుగుణంగా ఆస్తి పన్ను పెంచాలి. కానీ వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో నివాసయోగ్య ఆస్తులు, 2007లో నివాసేతర ఆస్తుల (కమర్షియల్) పన్నును మదింపు చేశారు. అప్పట్లో ఆస్తుల వార్షిక అద్దె ప్రాతిపదికగా పన్ను విధానం అమలులో ఉండేది. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం.. పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. -
‘టౌన్’ బండి.. డౌన్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిబ్బంది కొరత, సమస్యలకు చిన్న ఉదాహరణ ఇది. పంచాయతీలుగా ఉన్నప్పటి నామమాత్రపు సిబ్బందితోనే చాలా మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడం.. ఉన్నా ఇన్చార్జులే కావడంతో కొత్త పురపాలక సంస్థల్లో పాలన సరిగా జరగని దుస్థితి నెలకొంది. దీనితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని, వివిధ అనుమతులు, పారిశుధ్యం వంటి సేవలు సరిగా అందడం లేదని.. పన్నుల వసూళ్లు కూడా జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: పెరిగిన జనాభా, నివాస ప్రాంతాల విస్తరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పలు మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలి టీలుగా, కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేసింది. కొత్తగా 77 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా వాటికి అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం జరగలేదు. పేరుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారినా.. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొత్తవి ఏర్పాటైన మొదట్లో.. ఆయా జిల్లాల్లో అప్పటికే ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరిని సీనియారిటీ ఆధారంగా కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లు, మేనేజర్లుగా డిప్యుటేషన్లపై నియమించారు. కొందరికైతే రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్గా, మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి సిబ్బంది నుంచే.. శానిటేషన్ ఇంజనీర్లు, ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లను ఎంపిక చేసి వెళ్లదీసుకొస్తున్నారు. అక్రమాలను అడ్డుకునేదెలా? మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేది టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల నుంచే. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల అనుమతి పొంది, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలకు టీఎస్బీపాస్ అనుమతి తప్పనిసరని పురపాలక శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా అనుమతులు మంజూరు చేయడానికిగానీ, పంచాయతీలు ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పడానికిగానీ టౌన్ ప్లానింగ్ అధికారులు లేని దుస్థితి. కేవలం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ శివార్లలోని కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రం డిప్యుటేషన్ మీద టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నియమించడంతో.. వారు అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టగలుతున్నారు. ఇతర చోట్ల చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పన్నుల ఆదాయానికీ గండి ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నుల వసూలు చేసే రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. అభివృద్ధి పనులతోపాటు టౌన్ ప్లానింగ్ విభాగానికి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ప్రతి మున్సిపాలిటీకి ఇంజనీర్లు ఉండాలి. కానీ కొత్త మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత నెలకొంది. సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు, ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయాలన్న నివేదికలు రూపొందించేందుకు అధికారులు లేరు. ఏదైనా అంశంపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారు కూడా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర క్రితమే ప్రకటించినా..: రాష్ట్రంలోని కొత్త, పాత మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ నుంచి శానిటరీ జవాన్ వరకు 4 వేల పోస్టులు అవసరమని పురపాలక శాఖ గతంలో లెక్కతేల్చింది. జనాభా ప్రాతిపదికన ఏయే మున్సిపాలిటీకి, కార్పొరేషన్కు ఏయే స్థాయిలోని అధికారులు, సిబ్బంది ఎంద మంది అవసరమనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2020 జూలై 14న మంత్రి కేటీఆర్ పురపాలకశాఖ అధికారులతో సమావేశమై.. తొలివిడతగా 2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు నియామకాలు జరగలేదు. తాజాగా 129 మున్సిపాలిటీల్లో 3,700 మంది వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలనేది ఆలోచన. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్త మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఇబ్బంది తప్పదని స్థానికులు అంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీలుగా ఉన్న అలంపూర్, వడ్డేపల్లిలను మున్సిపాలిటీలుగా మార్చారు. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన నిత్యానంద్.. ఈ రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్గా ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో మేనేజర్, అకౌంటెంట్, బిల్ కలెక్టర్, ఏఈ, టౌన్ప్లానింగ్ ఏఈ పోస్టులకు ఇన్చార్జి అధికారులే ఉన్నారు. ఆర్ఐ, శానిటరీ ఇన్స్పెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్ వంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శానిటేషన్, ఇతర సిబ్బంది అయితే పూర్తిగా ఔట్ సోర్సింగే. వడ్డేపల్లి మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. పది కీలక పోస్టులకుగాను ఏడింటిలో ఇన్చార్జులే ఉన్నారు. ► మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలి టీలో కమిషనర్తోపాటు టీపీవో పోస్టులకు ఇన్ చార్జులను నియమించిన ప్రభుత్వం.. మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లను మాత్రమే డిప్యుటేషన్ మీద పంపించింది. ఇక ఏ పోస్టుకూ అధికారులు లేరు. శానిటరీ ఇన్స్పెక్టర్ సహా పారిశుధ్య సిబ్బందిని ఔట్ సోర్సింగ్లో తీసుకొని బండి నడిపిస్తున్నారు. ► బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ప్లానింగ్ సిబ్బంది కొరత ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ) మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఇన్చార్జినే. నలుగురు సూపర్వైజర్లు, ఒక ఏసీపీ పోస్టులకు సంబంధించి ఎవరూ లేరు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఏఈలు అవసరం. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఇద్దరు ఈఈ ఉండాల్సి ఉన్నా.. ఎవరూ లేరు. ► రామాయంపేట మున్సిపాలిటీలో అంతా ఇన్ చార్జుల పాలనే. 20 మందికిగాను.. మున్సిపల్ కమిషనర్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నప్పటి సిబ్బందితోనే పాలన కొనసాగుతోంది. ళీ చిట్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్, మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా ఇన్చార్జులే ఉన్నారు. ► కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ, టీపీవో ఇన్చార్జులే. ఏఈ, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ , అకౌంట్స్ విభా గంలో ఏవో, జేఏవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ టీపీ, టీపీఎస్, శానిటర్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బిల్ కలెక్టర్లు నలుగురికి ఒక్కరే, జూనియర్ అసిస్టెంట్లు నలుగురికి ఇద్దరే ఉన్నారు. పలు కొత్త మున్సిపాలిటీల్లోని పరిస్థితి ఇదీ.. ► కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో అంతకు ముందున్న గ్రామ పంచాయతీ పరిస్థితికి ఇప్పటికి తేడా లేని దుస్థితి. ► మున్సిపాలిటీల్లో గెలిచిన పాలక మండళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా అమలు కావడం లేదు. ► కొందరు కమిషనర్లు, కీలక అధికారులు రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జులుగా ఉంటుండటంతో పాలన కుంటుపడుతోంది. ► టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది లేకపోవడం వల్ల కొత్త మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే యంత్రాంగం లేదు. ► గ్రామ పంచాయతీ పర్మిషన్ పేరుతో కొత్త మున్సిపాలిటీల్లో ఇప్పటికీ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని కొత్త మున్సిపాలిటీల్లో మాత్రం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి.. ఇతర మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖల నుంచి సిబ్బందిని తెప్పించి మరీ అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. కానీ జిల్లాలో ఈ పరిస్థితి లేదు. ► పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం లేదు. కమిషనర్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు, ఇతర పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ► హైదరాబాద్ శివార్లలోని జవహర్నగర్, బండ్లగూడ జాగీర్, పీర్జాదిగూడ వంటి కొత్త కార్పొరేషన్లలో పాలకమండళ్ల హడావుడే తప్ప అధికారులు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. అడుగడుగునా సమస్యలే.. అధికారులు, సిబ్బంది లేకుంటే మున్సిపాలిటీలు ఎందుకు? పౌరులకు మౌలిక సదు పాయాలు కల్పించడమ నేది స్థానిక సంస్థల బాధ్యత. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నుంచి సౌకర్యాలు ఆశిం చడం ప్రజల హక్కు. కొత్త మున్సి పాలిటీలు ఏర్పాటు చేసి.. కమిషనర్లను, సిబ్బందిని నియమించకపోవడం వల్ల స్థానిక సంస్థల ఉద్దేశం దెబ్బతింటుంది. అధికారులను నియ మించకపోవడం శోచనీయం. పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కావాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రెగ్యులర్ స్టాఫ్ను నియమిస్తే మంచిది. – ఆర్వీ చంద్రవదన్, రిటైర్డ్ ఐఏఎస్, ఎంసీహెచ్ మాజీ అదనపు కమిషనర్ -
మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలకు కొత్త జవసత్వాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్డుస్థాయిలో పాలనావికేంద్రీకరణ జరిగే విధంగా కొత్త విధానాన్ని తీసుకు రావడానికి అడుగులు వేస్తోంది. కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమించాలని ఉన్నతస్థాయిలో జరిగిన పలు సమావేశాల అనంతరం నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం 142లో 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లోని డివిజన్లు/వార్డుల్లో ఈ అధికారులను నియమించాలని సర్కార్ యోచిస్తోంది. ప్రజాప్రతినిధులతో వార్డు కమిటీలున్నా, వారిని సమన్వయం చేసుకోవడంతోపాటు వార్డుస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఈ అధికారులను వినియోగించనున్నారు. దాదాపు 3,700 మంది అధికారులను ఇందుకోనం వినియోగించనున్నట్లు సమాచారం. పట్టణ ప్రగతిలో కీలకమైన హరితహారం, పారిశుధ్యం, నందనవనం, మహిళాసంఘాలను బలోపేతం చేయడం, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ వార్డు అధికారులను వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం వార్డు స్థాయిలో అధికారులు లేరు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో మాత్రం కొన్నిచోట్ల వార్డు కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమించడం ద్వారా ప్రజలకు మరింతగా పాలన చేరువ కావడానికి వీలుంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటైన వాటికి స్టాఫ్ కూడా.. మూడేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 84 మున్సిలిటీలు, కార్పొరేషన్లకు సరిపడా సిబ్బందిలేరు. సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్, టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్, మేనేజర్లు, కమిషనర్లు ఈ విధంగా దాదాపు 4 వేల పోస్టులకు పురపాలకశాఖ చాలా కాలక్రితమే ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. అవి కూడా త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల భర్తీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో జారీ చేసే నోటిఫికేషన్ల సమయంలోనే ఇస్తారా? లేక మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నట్లు సమాచారం. కొత్త పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, కనీస సిబ్బంది లేకపోవడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు లేవని, మేనేజర్లు, అకౌంటెంట్లను కమిషనర్లుగా నియమించడం, కొన్నిచోట్ల ఒకటి రెండు మున్సిపాలిటీలకు కలిపి అధికారులు పనిచేస్తుండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల ఆకాంక్షలు పెరిగిపోతున్నాయని.. అందుకు అనుగుణంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది అవససరం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
పద్ధతిగా పట్టణాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసే ప్రక్రియ రూపుదిద్దుకుంటోంది. పట్టణాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్ మాస్టర్ప్లాన్ సిద్ధం చేస్తోంది. వానలు, వరదలు వచ్చినా నష్టం కలగకుండా పట్టణాల్లో నాలాల అభివృద్ధి, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొదలు పన్ను వసూళ్లకు శాస్త్రీయ విధానాన్ని రూపొందించడం వరకు మాస్టర్ ప్లాన్లో పొందుపరుస్తోంది. జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాలతోపాటు వరంగల్ కార్పొరేషన్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు పునరావృతం కాకుండా మాస్టర్ప్లాన్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాస్టర్ప్లాన్లను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రెసిడెన్షియల్, వాణిజ్య, గ్రీన్ జోన్లుగా.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో నివాస, నివాసేతర ప్రాంతాలను జోన్లుగా విభజించనుంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జోన్ల వారీగా విభజించి రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయనుంది. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతోపాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి అభివృద్ధి చేపట్టనుంది. ఈ జోన్లను జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది. ప్రయోగాత్మకంగా 17 మున్సిపా లిటీల్లో ఇప్పటికే జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు తీరును పరీక్షించింది. మాస్టర్ ప్లాన్లో రోడ్ నెట్వర్క్, జనాభా, భౌగోళిక అంశాల వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీలకు రూ. 2,062 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 858 కోట్ల వ్యయంతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కి.మీ. మేర రహదారుల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కోసం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్లో వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతోపాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్ఎస్ఏపీలను సిద్ధం చేయనుంది. 38 పట్టణాల్లో రూ. 1,433 కోట్లతో నీటిసరఫరా పథకాలు, రూ. 700 కోట్లతో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లు, రూ. 61 కోట్లతో మెహదీపట్నం, ఉప్పల్లో స్కై వాక్ నిర్మాణాలతోపాటు కొత్వాల్గూడ దగ్గర్లో 85 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు వంటివన్నీ మాస్టర్ ప్లాన్లో భాగమే. 70 పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు రెడీ... రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ తదితర కార్పొరేషన్లలో ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేశారు. మొత్తంగా 70 నగరాలు, పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయని, మరో 37 మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను నెల రోజుల్లో సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణలో నగరాలు, పట్టణాల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. వానలకు నగరాలు, పట్టణాలు అతలాకుతలం కాకుండా రూపురేఖలు మార్చాలని సంకల్పించింది. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నిర్మాణాలకు అనుమతి, మునిసిపల్ నిబంధనలు కశ్చితంగా అమలు చేయడంపై దృష్టి పెట్టబోతోంది. జీహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను మునిసిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆధునిక వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పట్టణాలు, నగరాల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఉండేలా సిద్ధమయ్యారు. రెసిడెన్షియల్, వాణిజ్య,గ్రీన్ జోన్లుగా విభజించి.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ భావిస్తోంది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలనుకుంటోంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రణాళిక పద్ధతిలో రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతో పాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ జోన్లను జీఐఎస్తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు చేసే పనుల్లో పురపాలక శాఖ పురోగతిలో ఉంది. తర్వాత మిగతా మున్సిపాలిటీలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే రూ. 2,062 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.858 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కిలోమీటర్ల మేర రహదారుల వెంట మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కో సం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్ వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతో పాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్ఎస్ఏపీలను సిద్ధం చేయనుంది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలో మాస్టర్ ప్లాన్లు రెడీ అయ్యాయి. 38 పట్టణాల్లో రూ.1,433 కోట్లతో నీటి సరఫరా పథకాలు, రూ.700 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లు, రూ.61 కోట్లతో మెహిదీపట్నం, ఉప్పల్లో స్కై వాక్ నిర్మాణాలు, కొత్వాల్ గూడ దగ్గర ఎకో పార్క్ నిర్మించనున్నారు. -
మెప్మా రిసోర్స్ పర్సన్ల సహాయ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో పనిచేస్తున్న మహిళలైన రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు చెల్లించే బాధ్యత నుంచి ఆ సంస్థ పూర్తిగా వైదొలిగింది. కొన్ని నెలలుగా వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.4 వేల మొత్తాన్ని ఏ అకౌంట్ నుంచి ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జనరల్ ఫండ్ నుంచే ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడి మూడు నెలలు గడిచినా.. రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు ఏ ఒక్క మునిసిపాలిటీ/ కార్పొరేషన్లో ఇవ్వలేదు. వారికి 25.38 కోట్ల గౌరవ వేతనాలు ప్రభుత్వం బకాయిపడింది. ఈ నేపథ్యంలో రిసోర్స్ పర్సన్లు నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. మురికివాడల్లో పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం, రికవరీ చేయించడం మినహా ప్రభుత్వం అప్పగించే ఏ పని చేయలేమని అల్టిమేటం ఇచ్చారు. వీఎల్ఆర్, స్త్రీనిధి ఫండ్స్ నుంచే వేతనాలు స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్, పట్టణ వికలాంగుల సమాఖ్యల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 5,765 మంది రిసోర్స్ పర్సన్లు ఉన్నారు. వీరందరికీ నెల వేతనంగా రూ.2.3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మెప్మాలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్కు వేతనాల కోసం ప్రత్యేక అకౌంట్ ఏమీ లేదు. దీంతో మంత్రి కేటీఆర్ను కలసి విజ్ఞప్తి చేసినప్పుడల్లా వడ్డీ లేని రుణాలు (వీఎల్ఆర్), స్త్రీ నిధి ఫండ్స్ కింద బడ్జెట్ విడుదల చేసి గౌరవ వేతనాలు అందజేసేవారు. గత నవంబర్ నుంచి ఎవరికీ గౌరవ వేతనం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆర్పీల నుంచి ఒత్తిడి పెరగడంతో గత ఆగస్టు 3న 2018లో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్–164 ప్రకారం ఆర్పీలకు అర్బన్ లోకల్ బాడీల నుంచే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్రెడ్డి మెమో జారీ చేశారు. దీంతో మెప్మా నుంచి వేతనాలు వచ్చే అవకాశాలకు ఫుల్స్టాప్ పడింది. మరోవైపు స్థానిక సంస్థలు కూడా రూపాయి కేటాయించలేదు. మెట్పల్లిలో 34 మందికి 9 నెలల వేతనం మెప్మా, స్థానిక పట్టణ సంస్థలేవీ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంతో 5,765 మంది రిసోర్స్ పర్సన్స్ తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీవర్ సర్వే, హరితహారం, నల్లా సర్వే, పారిశుధ్య సర్వే వంటి పలు సేవలతో పాటు అంగన్వాడీ, ఆశ, ఏఎన్ఎం వర్కర్లతో కలసి చేసే పనులేవీ తాము చేయలేమని ఆర్పీలు తేల్చిచెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, కమిషనర్లకు, మెప్మా పీడీలకు లేఖలు ఇవ్వగా, మెట్పల్లి మున్సిపాలిటీ విషయంలో మాత్రమే జగిత్యాల కలెక్టర్ స్పందించారు. మెట్పల్లిలో పనిచేస్తున్న 34 మంది ఆర్పీలకు గత ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు 9 నెలల వేతనం 12.24 లక్షలు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపారు. మంత్రి కేటీఆర్ దయ చూపాలి పట్టణ మురికివాడల్లో పొదుపు సంఘాల ద్వారా ఇతర ప్రభుత్వ సేవల ద్వారా కష్టపడుతున్న రీసోర్స్ పర్సన్లకు నెల నెలకు రూ.4 వేల గౌరవ వేతనం ఇప్పించేందుకు మంత్రి కేటీఆర్ దయ చూపాలి. ప్రభుత్వమే ఆర్పీలకు బడ్జెట్ విడుదల చేయాలి. పండుగ సమయంలో కూడా వేతనాలు లేని పరిస్థితి ఉంది. – సునీత, ఆర్పీల సంఘం అధ్యక్షురాలు -
ఏపీలో12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఆగిన మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు?
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలలో వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో వివిధ కారణాలతో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు 32 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్నికలు ఆగిన వాటిల్లో.. నెల్లూరు కార్పొరేషన్తో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి, గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం), బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం, రాజంపేట(వైఎస్సార్), పెనుకొండ(అనంతపురం) మునిసిపాలిటీలలో తాజాగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటికి సంబంధించి సోమవారం, లేదంటే మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆయా చోట్ల.. నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టి.. నెలాఖరులోగానే ఆ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్ ఎన్నికలు జరిగిన ఏడు నగర పాలక సంస్థల పరిధిలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 డివిజన్లకు, మరో 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 14 వార్డులకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగానే ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తాజాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అలాగే శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల కమిషనర్లు కూడా టెలి కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అన్నింటికీ కలిపి ఒకే రోజు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికలు జరిగే తేదీకి ఒక్క రోజు ముందు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, ఆ తర్వాత రోజు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించి.. ఆ మరుసటి రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి చనిపోయిన కారంపూడి(గుంటూరు), లింగాల(వైఎస్సార్), కొలిమిగుండ్ల(కర్నూలు) స్థానాలతో పాటు, పోలింగ్ జరగక ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన కారణంగా ఎన్నిక నిలిచిన మరో 11 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. -
AP: ‘పురసేవ’లో సర్కార్ సక్సెస్
సాక్షి, అమరావతి: వెలగని వీధి లైట్లు.. అస్తవ్యస్తంగా చెత్త సేకరణ.. అపరిశుభ్ర పరిసరాలు.. పొంగుతున్న డ్రైన్లు.. ఇలా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. ఆయా సమస్యలను నిర్దేశించిన గడువులోగా మున్సిపల్ శాఖ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు సెలక్షన్ గ్రేడ్, ఏడు స్పెషల్ గ్రేడ్, 15 ఫస్ట్ గ్రేడ్, 30 సెకండ్ గ్రేడ్, 19 థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 40.83 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మున్సిపల్ శాఖ ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలను అందుబాటులో ఉంచింది. అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తోంది. 95.85 శాతం ఫిర్యాదుల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల నుంచి వార్డు సచివాలయాల్లో ఆఫ్లైన్ విధానంలో సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో స్పందన పోర్టల్ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు స్పందనలో 14,610 ఫిర్యాదులు అందగా ఇప్పటివరకు 14,005 (95.85 శాతం) ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. 99.17 శాతం పరిష్కారం ఇక ఆన్లైన్ విధానంలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు 45,043 ఫిర్యాదులు అందగా 44,671 (99.17 శాతం) ఫిర్యాదులను పరిష్కరించారు. ఇందులో 61.39 శాతం ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగానే పరిష్కరించారు. ఆన్లైన్లో అందే ప్రతి ఫిర్యాదు వార్డు సచివాలయంలోని సంబంధిత ఉద్యోగికి చేరుతుంది. నిర్దేశిత గడువులోగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే.. ఆ మరుసటి రోజే సచివాలయ ఉద్యోగిపై అధికారికి ఆన్లైన్లోనే ఫిర్యాదు బదిలీ అవుతుంది. ఆన్లైన్ ఫిర్యాదులపై పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలను అనుసంధానిస్తూ సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఫిర్యాదులు పరిష్కరిస్తున్న వి«ధానాన్ని మునిసిపాలిటీల వారీగా పర్యవేక్షిస్తున్నారు. cdma. ap. gov. inలో, పురసేవ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను జత చేయాలి. ప్రతి ఫిర్యాదుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఫిర్యాదుదారులు రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎం. నాయక్ తెలిపారు. -
కొత్త కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు.. 36 కోట్లతో స్మారక మండపం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రానికి నిరుపమాన సేవలందించిన దివంగత ముఖ్యమంత్రి, కలైంజ్ఞర్ కరుణానిధికి ఘనమైన స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చెన్నై మెరీనాబీచ్లో రూ.39 కోట్లతో ఈ స్మారకమండపాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ మేరకు మండపం నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థలు, రాయితీల కోర్కెల పై చర్చతో అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘తమిళ సమాజాభివృద్ధి, శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడిన కరుణానిధి గురించి చేయబోయే ప్రకటనతో నేనే కాదు, ఈ ప్రభుత్వమే గర్వపడుతోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న తమిళులు గౌరవాన్ని పెంపొందించేలా ఆయన వ్యవహరించారు. దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచిన రాజకీయ మేధావి. తమిళనాడు అసెంబ్లీకి మమ్మల్నంతా శాశ్వత సభ్యులుగా అందించిన ధీశాలి. కోట్లాది ప్రజల హృదయాల్లో తోబుట్టువుగా మారారు. సినీ పరిశ్రమతో 70 ఏళ్ల అనుబంధం, జర్నలిస్టుగా 70 ఏళ్ల జీవితం, 60 ఏళ్లపాటూ ఎమ్మెల్యే, డీఎంకే అధ్యక్షునిగా 50 ఏళ్ల పాలన, 13 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడు కరుణానిధి. విజయం ఆయనను వీడలేదు, ఓటమి ఆయనను తాకలేదు. 1969లో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత మొత్తం ఐదుసార్లు రాష్ట్రాన్ని పాలించారు. జార్జికోట(సచివాలయం)లో కూర్చున్నా గుడిసెవాసుల గురించి ఆలోచిస్తుంటానని నిరూపించిన ప్రజా నాయకుడు. తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలకు అలుపెరుగని సేవ చేశారు. ప్రస్తుతం మనమంతా అనుభవించి, ఆస్వాదించే ఆధునిక తమిళనాడు కరుణానిధి కృషి ఫలితమే. కరుణానిధి గొప్పదనం గురించి ఇలా ఎన్నిరోజులైనా చెప్పుకుంటూ పోవచ్చు. ప్రజల కోసం జన్మించి, వారి సంక్షేమం కోసమే తుదివరకు పోరాడి అలసిపోయిన కరుణానిధి శాశ్వత విశ్రాంతి కోసం 2018 ఆగస్టు 7వ తేదీన తనువు చాలించారు. ఇలా తనను తాను తమిళనాడుకు అర్పించుకున్న ఆ మహానేత కరుణానిధిని నిరంతరం స్మరించుకోవడమే అసలైన నివాళి. అందుకే చెన్నై మెరీనాబీచ్లో కరుణానిధి సమాధివద్ద 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.39 కోట్లతో స్మారకమండపాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది..’’ అని ప్రకటించారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉపనేత ఓ పన్నీర్సెల్వం, మంత్రులు, విపక్షాల సభ్యులు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ, పత్రిక, సినీ, సాహిత్యరంగాల్లో విశేషఖ్యాతి గడించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సరైన గౌరవమని కొనియాడారు. చదవండి: Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..! కొత్త కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ప్రకటన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ‘ప్రమోషన్’ దక్కింది. స్థానిక సంస్థల అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో చెన్నై పల్లవరం డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి మాట్లాడారు. చెన్నై నగర శివార్లకు స్థాయి పెంపు హోదా కల్పించాలని కోరారు. తాంబరంను మునిసిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తున్నట్లు అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తాంబరం, పల్లవరం, చెంబాక్కం, పమ్మల్, అనకాపుత్తూరు మునిసిపాలిటీలను, వాటి పరిధిలోని పంచాయతీలను ఒకటిగా చేసి తాంబరానికి కార్పొరేషన్గా స్థాయిని పెంచుతున్నట్లు పేర్కొంది. అదే విధంగా కాంచీపురం, కుంభకోణం, కరూరు, కడలూరు, శివకాశీలను సైతం కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. పల్లపట్టి, తిట్టకుడి, మాంగాడు, కున్రత్తూరు, నందిగ్రామం, గుడువాంజేరీ, పొన్నేరి, ఇడంగనశాలై, తారామంగళం, కోట్టకుప్పం, తిరునిన్రవూరు, శోలింగనల్లూరు, తారమంగళం, కూడలూరు, కారమడై, వడలూరు, తిరుక్కోయిలూరు, ఉళుందూరపేట్టై, సురండై, కలక్కాడు, అదిరామపట్టినం, మానమధురై, ముసిరి, కరుమత్తంపట్టి, మధుకరై, లాల్గుడి, కొల్లన్కోడును పురపాలక స్థాయికి పెంచుతున్నారు. పుగళూరు, టీఎన్పీఎల్ పుగళూరులను విలీనం చేసి పుగళూరు మునిసిపాలిటీలుగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: MK Stalin: ఆసక్తి రేపుతున్న సీఎం స్టాలిన్ నిర్ణయాలు! -
నేడు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో నేడు (శుక్రవారం) రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం మునిసిపల్ పాలకమండళ్లను ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. -
26న ‘దళితబంధు’పై అవగాహన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న ‘దళితబంధు’ పథకంపై ఈనెల 26న ప్రగతిభవన్ వేదికగా అవగాహన సదస్సు జర గనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రా రంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితు లు, మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు కలిపి మొత్తం 427 మంది సదస్సులో పాల్గొంటారు. నియోజక వర్గంలోని ప్రతీ గ్రామం, మున్సిపాలిటీల్లోని ప్రతీ వార్డు నుంచీ నలుగురు చొప్పున దళితులు సదస్సుకు హాజరవుతారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల నుంచి వచ్చే నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఉంటారు. బస్సుల్లో హుజూరాబాద్ టు ప్రగతిభవన్ సదస్సుకు హాజరయ్యే దళిత ప్రతినిధులు ఈ నెల 26న తమ గ్రామాల నుంచి బయల్దేరి ఉదయం 7 గంటలకు తమ మండల కేంద్రాలకు చేరుకుం టారు. అల్పాహారం చేసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో హుజూరాబాద్కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరి ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్కు చేరుకుంటారు. దళితబంధు పథకం ఉద్దేశం, పథకం అమలుతీరు, పర్యవేక్షణ, నిర్వహ ణ తదితరాలపై వీరికి సదస్సులో అవగాహన కల్పి స్తారు. హుజూరాబాద్లో ప్రారంభమయ్యే దళిత బంధు పథకం అమలులో దళితులు పోషించాల్సిన పాత్ర, దళితుల్లోకి తీసుకెళ్లాల్సిన తీరుపై సీఎం వివరిస్తారు. ప్రగతిభవన్లో మధ్యాహ్న భోజన విరామం తర్వాత కూడా అవగాహన కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది. -
37 ‘మునిసిపల్’ ఎన్నికలకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలకశాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉండగా ఇటీవల 87 చోట్ల ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్కు 2017లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లతోసహా 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్ పనుల్ని వచ్చేనెల 15 నాటికి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. ఓటర్ల జాబితాలను రూపొందించాలని, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. అవసరమైనచోట వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రతిపాదనలను రూపొందించి, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలని పురపాలకశాఖ యోచిస్తోంది. ఆ 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అందుకు సన్నద్ధమై ఉండాలని భావిస్తోంది. -
బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ.. -
మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్లు గురువారం కొలువుదీరనున్నాయి. కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అదేవిధంగా 75 మునిసిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. అందుకోసం పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఇలా.. ముందుగా నగరపాలక సంస్థల కార్పొరేటర్లు, మునిసిపల్ కౌన్సిలర్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు కనీసం 50 శాతం సభ్యుల హాజరును కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా సంస్థల సమావేశ మందిరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క పోస్టుకే నేడు ఎన్నికలు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఈ లోగా ఒక్కొక్క మేయర్, ఒక్కొక్క వైస్ చైర్పర్సన్ నియామకానికి గురువారం ఎన్నిక నిర్వహిస్తారు. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభించింన తరువాత మరో డిప్యూటీ మేయర్, మరో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరమే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను తగ్గిస్తాం
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను పెంచుతుందని, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే దానిని తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తీర్మానం చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. జగన్కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అద్దె విలువ ఆధారంగా ఉండే పన్నులను రిజిస్ట్రేషన్ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా ఈ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భారాలు వేసేందుకు చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులను కిడ్నాప్ చేసి బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయన్నారు. ఇలాంటి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ చేయలేరన్నారు. భయపడి నామినేషన్లు వెనక్కుతీసుకోవడం పిరికిచర్య అన్నారు. రేపటి నుంచి బాబు ప్రచారం గురువారం నుంచి తాను మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8న గుంటూరు జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహిస్తానని చెప్పారు. -
ప్రగతిపథంలో 'పురం'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో నగర, పట్టణ ప్రాంతాలు అభివృద్ధిపథంలో నడుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నగరపాలక సంస్థతోపాటు పట్టణాల్లో కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుమారు 60 వేలమందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు ఇవ్వనున్నారు. ఒక్క ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 29 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవికాకుండా 6,480 టిడ్కో ఇళ్లను త్వరలో ఇవ్వనున్నారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తోపాటు నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ది, సంక్షేమం వైపే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. చాలాచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు లేక విపక్షాలు నిరాశలో ఉన్నాయి. నరసాపురంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చీకటిపొత్తులకు తెరతీస్తున్నాయి. నరసాపురంలో.. 14వ ఆర్థికసంఘం నిధులు, జనరల్ ఫండ్స్ నుంచి మొత్తం రూ.13 కోట్లతో 31 వార్డుల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. రూ.8 కోట్లతో చేపట్టనున్న రహదారులు, మంచినీటి పైప్లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.28 కోట్లు వెచ్చించి 50 పడకల ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచుతున్నారు. దీన్లో రూ.13 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయి. రూ.3 కోట్లతో బస్టాండ్ ఆధునికీకరణకు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.400 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి డీపీఆర్ రూపొందించారు. స్థల సేకరణకు ప్రభుత్వం రూ.65 కోట్లు మంజూరు చేసింది. నిడదవోలులో.. 2,705 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుండగా, 1,248 మందికి టిడ్కో గృహాలు కేటాయించనున్నారు. నాడు–నేడు కింద 8 పాఠశాలల్లో రూ.2.08 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 14వ ఆర్థికసంఘం నిధులు రూ.6.24 కోట్లతో 55 సీసీ రోడ్లు, డ్రైయిన్ల పనులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.97.06 లక్షలతో 8 పనులు చేపట్టారు. పురపాలకసంఘం సాధారణ నిధులు రూ.3.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు పనులు జరుగుతుండగా, పట్టణంలో నూతన జగనన్న కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.89.58 లక్షలు మంజూరయ్యాయి. జంగారెడ్డిగూడెంలో.. ఇప్పటివరకు రూ.6 కోట్లతో సీసీరోడ్లు, డ్రెయిన్ల పనులు పూర్తికాగా మరో రూ.3 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటికి 14వ ఆర్థికసంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు వెచ్చించారు. పట్టణంలో 2,266 మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారు. 588 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. 231 ఇళ్లను త్వరలో పంపిణీ చేయనున్నారు. కొవ్వూరులో.. నాడు–నేడు పథకం కింద రూ.40 లక్షలు వెచ్చించి పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. రూ.2 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. రూ.4 కోట్లతో శ్రీనివాసపురం అవుట్ఫాల్ డ్రెయిన్ పనులు జరుగుతున్నాయి. గోదావరి నీటిని శుద్ధిచేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రపంచబ్యాంకు నిధులు రూ.53 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 15వ ఆర్థికసంఘం నిధులు రూ.1.78 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.45 లక్షలు వచ్చాయి. రూ.వందల కోట్లతో పనులు ఏలూరు నగరంలో రూ.200 కోట్లతో సుమారు 573 ఎకరాల స్థలం సేకరించి 29 వేలమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. 14వ ఆర్థికసంఘం నిధులు రూ.44 కోట్లతో 142 అభివృద్ధి పనులు, 15వ ఆర్థికసంఘం నిధులు రూ.22 కోట్లతో 20 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.8 కోట్లతో నగరంలోని 14 పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. రూ.59.80 కోట్లతో 281 సీసీ రోడ్లు, రూ.52.75 కోట్లతో 188 సీసీ డ్రైన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరంలో నిర్మించే వైద్యకళాశాల కోసం 54 ఎకరాల స్థలాన్ని సేకరించారు. నగరపాలక సంస్థలో మొత్తం 2,47,631 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 1,27,890 మంది, పురుషులు 1,19,741 మంది. -
ప్రగతి పరుగులు.. ప్రజలకు వసతులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని పట్టణాలు ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయి. ప్రజలకు పెద్దఎత్తున వసతులు సమకూరుతున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని పట్టణాల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపడ్డాయి. గత పాలకులు ఏ పనులూ చేయకుండా.. నిధులను మింగేసి మున్సిపాలిటీల పాలిట పాపాల భైరవులుగా మిగిలిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపూ మున్సిపాలిటీల్లో నిధుల స్వాహాపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై చూపలేదు. కేంద్రం నుంచి విడుదలైన నిధులైనా ఖర్చు చేసి పట్టణాల్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస కూడా వారికి కలగలేదు. దీంతో మున్సిపాలిటీల్లో కోట్లాది రూపాయలు మురిగిపోయాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టడమే కాకుండా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి.. అవసరం మేరకు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఫలితంగా నిన్నమొన్నటి వరకు వెనుకబడిన పాలకొండ, రాజాం నగర పంచాయతీలతో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో తాగునీరు, పారిశుధ్య, డంపింగ్ యార్డు, రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రస్తుతం విలీన పంచాయతీల సమస్యల కారణంగా శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం మున్సిపాలిటీలు ఎన్నికలు జరగటం లేదు. పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో యథావిధిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమ విజయ సోపానాలుగా వైఎస్సార్సీపీ నేతలు భావిస్తుండగా.. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, వైఫల్యాలు ఎక్కడ తమకు చుట్టుకుంటాయోనన్న భయంతో టీడీపీ నేతలు ఉన్నారు. కేంద్రానికి తప్పుడు యూసీలిచ్చి.. గత పాలనలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఖర్చు పెట్టకుండా తప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన దాఖలాలున్నాయి. నిధుల వినియోగం కాగితాల్లోనే చూపించారు. క్షేత్రస్థాయిలో ఖర్చు చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు నడుచుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలోని మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం కింద రూ.26,12,25,000 మంజూరు కాగా వాటిలో రూ. 8,59,80,000 మాత్రమే ఖర్చు చేశారు. 342 పనులు చేపట్టాల్సి ఉండగా.. 203 పనులు ప్రారంభించనేలేదు. ఏడు పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు ఆరా తీస్తే అవినీతి బాగోతం చాంతాడంత బయటపడింది. పాలకవర్గాలను పని చేయనివ్వలేదు అప్పట్లో మున్సిపల్ పాలకవర్గాలను సరిగా పని చేయనివ్వలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమ ప్రయోజనాల కోసం ఆటంకాలు కలిగించారు. గ్రూపు రాజకీయాల్లో పాలకవర్గాల మాట చెల్లకుండా చేశారు. అనేక ఇబ్బందులు, ఆంక్షలు పెట్టడంతో కొన్నిచోట్ల పాలకవర్గాలు సైతం ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ పాలకవర్గాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడతో అక్కడి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ వ్యవహరించారు. రాజాం, పాలకొండ, అమదాలవలసలో కూడా రకరకాల రాజకీయాలతో అభివృద్ధి జరగకుండా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఉద్దానం ఏరియాలో కిడ్నీ సమస్య దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వాలెన్ని వచ్చినా కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం కాలేదు. వైఎస్ జగన్ మాత్రం అధికారంలోకి రాకముందే కిడ్నీ బాధితుల సమస్యకు మూలాలను అన్వేషించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేశారు. ఇప్పటికీ కిడ్నీ వ్యాధుల నియంత్రణ కోసం రీసెర్చ్ సెంటర్తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వరకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ వ్యాధికి ప్రధాన కారణం తాగునీరే కావచ్చనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించనున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఖరీదైన మందులను అందుబాటులోకి తెచ్చారు. పాలకొండలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. పాలకొండలోనే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో రూ.58.48 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు చేపట్టారు. రూ.3.26 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద బడులు రూపురేఖలు మారాయి. ఇచ్ఛాపురంలోని 30 పడకల ఆస్పత్రిని 50 పడకలకు ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. -
ఎన్నికలకు 55,840 మంది సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు మార్చి 10న నిర్వహించనున్న ఎన్నికల కోసం పురపాలక శాఖ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో 9,308 పోలింగ్ కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించనున్న ఈ భారీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అంతేస్థాయిలో ఎన్నికల సిబ్బందిని వినియోగించాలని నిర్ణయించింది. అందుకు వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 55,840 మందిని భాగస్వాములను చేయనుంది. అందుకోసం జిల్లాల వారీగా, ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల వారీగా ప్రతిపాదనలను రూపొందించి ఆమోదించింది. ఆ వివరాలు.. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 55,840 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించనున్నారు. వారిలో రిటర్నింగ్ అధికారులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. ► ఎన్నికలు జరగనున్న 12 నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం (జీవీఎంసీ) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1,712 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 17.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో 10,271 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ► అలాగే, నగరపాలక సంస్థల్లో మచిలీపట్నంలో తక్కువ మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక్కడ 133 పోలింగ్ కేంద్రాల్లో 1.33 లక్షల మంది మాత్రమే ఓటు హక్కువినియోగించుకోనున్నారు. ఇందుకు 799 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ► మరోవైపు.. ఎన్నికలు జరగనున్న పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో నంద్యాలకు అత్యధికంగా ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. 170 పోలింగ్ కేంద్రాల్లో 1.86 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ 1,084 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అలాగే, కర్నూలు జిల్లా గూడూరులో తక్కువ మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 20 వార్డుల్లో 50,758 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న ఈ నగర పంచాయతీలో కేవలం 120 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించారు. సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది గుర్తింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. పురపాలక శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, వార్డు సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధుల కోసం వినియోగించనున్నారు. ఎన్నికలకు అవసరమని భావించిన మొత్తం 55,840 మందికి గాను ఆదివారం నాటికి 48,141 మందిని గుర్తించారు. వారిలో 43,012 మందిని విధుల్లో నియమించారు. మిగిలిన వారిని సోమవారం గుర్తించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఇక ఎన్నికల సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 1, 2 తేదీల్లో మొదటి విడత.. 6, 7 తేదీల్లో రెండో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
అక్రమ ఇళ్లపై అదనపు పన్ను
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా, అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ భవనాలు, గృహాలపై పురపాలక సంఘాలు కొరడా ఝళిపిస్తున్నాయి. అక్రమాలు, ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను జరిమానా కింద ప్రతి ఏటా అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అక్రమ భవనాలు, గృహాల యజమానులు చెల్లించాల్సిన వార్షిక ఆస్తి పన్నులు 125 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 142 పురపాలక సంఘాలు ఉండగా, జీహెచ్ఎంసీ నేరుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉంది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్(సీడీఎంఏ) పరిధిలో మిగిలిన 141 పురపాలికలు ఉన్నాయి. ఈ 141 పురపాలికల్లో ఇప్పటివరకు గుర్తించిన అక్రమ భవనాలు, గృహాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.93.15 కోట్ల జరిమానాలు విధించగా, ఇందులో రూ.31.08 కోట్లను సంబంధి త భవన యజమానులు చెల్లించారు. జీహెచ్ఎంసీ లో సైతంఇదే తరహాలో అక్రమ భవనాలు, గృహాలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంది. వరంగల్, నిజామాబాద్ల్లో అత్యధిక జరిమానాలు అనుమతి లేకుండా లేదా బిల్డింగ్ ప్లాన్ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను ప్రతి ఏటా జరిమానా కింద అదనంగా వసూలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ 2016 డిసెంబర్ 20న జీవో 299 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని పురపాలికల్లోని అక్రమ, అనధికార కట్టడాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. 141 పురపాలికల్లో వార్షిక ఆస్తి పన్నుల మొత్తం రూ.538.47 కోట్లతో పోల్చితే జరిమానాలు 17 శాతానికి మించి పోయాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అక్కడ వార్షిక ఆస్తి పన్నుల మొత్తం డిమాండ్ రూ.49.94 కోట్లు కాగా, జరిమానాలు రూ.33.01 కోట్లు ఉండడం విశేషం. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.61 కోట్ల వార్షిక ఆస్తి పన్ను ఉండగా, రూ.18.19 కోట్ల జరిమానాలు విధించారు. 60 శాతం వసూళ్లు జీహెచ్ఎంసీ మినహా ఇతర 141 పురపాలికల్లో 20,22,171 భవనాలు/గృహాలు ఆస్తి పన్నుల పరిధిలో ఉండగా, 2020–21లో రూ.538.47 కోట్ల ఆస్తి పన్ను, రూ.230.22 కోట్ల పాత బకాయిలు, రూ.93.15 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.861.84 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.359.81 కోట్ల ఆస్తి పన్ను, రూ.127.77 కోట్ల పాత బకాయిలు, రూ.31.08 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.518.66 కోట్లు వసూలయ్యాయి. మొత్తం డిమాండ్తో పోల్చితే ఇప్పటివరకు 60.18 శాతం వసూళ్లు జరిగాయి. వచ్చే మార్చి 31లోగా 100 శాతం వసూళ్లను సాధించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తోంది. జరిమానాలు ఇలా.. జీవో ప్రకారం..అనుమతించిన ప్లాన్ మేరకు నిర్మించిన భవన అంతస్తుల్లో 10 శాతానికి లోబడి సెట్బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 25 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన అంతస్తుల్లో 10 శాతానికి మించి సెట్బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 50 శాతం ఆస్తి పన్నును అధికంగా వసూలు చేస్తున్నారు. ప్లాన్లో అనుమతించిన అంతస్తులపై అనధికారికంగా అంతస్తులు నిర్మిస్తే.. అలా అనధికారికంగా నిర్మించిన అంతస్తులపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. -
సామాన్యుల కోసం ‘స్మార్ట్ టౌన్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టౌన్ల ఏర్పాటు, వాటి అభివృద్ధికి పురపాలక శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, నగర పంచాయతీలలో భూములను సేకరించి లే–అవుట్లు వేయడం.. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరకు సామాన్యులకు ప్లాట్లను అందించేందుకు ఉద్దేశించిన ‘స్మార్ట్ టౌన్’ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 125 పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీలను జనాభా ప్రాతిపదికన ఐదు కేటగిరీలుగా విభజించి స్మార్ట్ టౌన్లను తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. మొదటి దశలో 12 పట్టణాల్లో 18 లే–అవుట్లను అభివృద్ధి చేస్తారు. అనంతరం అన్నిచోట్లా స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులను చేపడతారు. ప్రత్యేక సెల్స్ ఏర్పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే స్మార్ట్ టౌన్ ప్రాజెక్టులను విజయవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలోనూ, పురపాలక సంఘాల స్థాయిలోనూ ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా భూ రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేకంగా రెవెన్యూ, న్యాయ అధికారులతో లీగల్ సెల్స్ను నెలకొల్పుతారు. ఇప్పటికే వివిధ టిడ్కో, గృహ నిర్మాణ శాఖ తదితర విభాగాల వద్ద అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తారు. ఇంకా అవసరమైన భూముల కోసం భూ యజమానులు, క్రెడాయ్ వంటి సంస్థలు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. భూ సేకరణ ప్రక్రియ నుంచి పూర్తిస్థాయిలో లే–అవుట్ల అభివృద్ధి, భూ యజమానులకు ప్లాట్ల పంపిణీ, లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ప్లాట్ల విక్రయం వరకూ అన్ని అంశాలను ఈ సెల్స్ పర్యవేక్షిస్తాయి. నిర్ణీత కాలవ్యవధిలో స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులను పూర్తి చేసి నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పురపాలక శాఖ చర్యలు వేగవంతం చేసింది. ప్రాజెక్టుల స్వరూపం ఇలా.. ఒక్కో స్మార్ట్ టౌన్ ప్రాజెక్ట్ లే–అవుట్ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న విశాఖ, విజయవాడ నగర పాలక సంస్థల పరిధిలో 200 ఎకరాల చొప్పున ప్రాజెక్టులు చేపడతారు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న 14 నగరపాలక సంస్థల్లో 100 ఎకరాల చొప్పున సేకరించి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. 6 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 7 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలలో 75 ఎకరాల చొప్పున సేకరించి లే–అవుట్లు వేస్తారు. 17 గ్రేడ్–1 మున్సిపాలిటీలు, 30 గ్రేడ్–2 మున్సిపాలిటీలు, 18 గ్రేడ్–3 మున్సిపాలిటీలలో 50 ఎకరాల చొప్పున భూములు సేకరించి లే–అవుట్లు వేస్తారు. అదేవిధంగా 31 నగర పంచాయతీలలో 25 ఎకరాల చొప్పున సేకరించి లే–అవుట్లు అభివృద్ధి చేస్తారు. -
మున్సిపాలిటీలకు ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?
సాక్షి, హైదరాబాద్: పాలకవర్గం గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. నల్లగొండ జిల్లా నకిరేకల్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట, సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగిసినా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని, ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో పేర్కొంటూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. పాలకవర్గం ముగిసినా ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఆదేశించాలంటూ వరంగల్ పట్టణానికి చెందిన ఎం.ధర్మారావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిన్నోళ్ల నరేశ్రెడ్డి వాదనలు వినిపించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగానే కొంత జాప్యం జరుగుతోందని అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ ప్రక్రియ పూర్తవగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
మందుబాబులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త బార్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సోమవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదేరోజు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు వచ్చే నెల 8వ తేదీ వరకు తీసుకుంటారు. లాటరీ పద్ధతి ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ 11న డ్రా తీస్తారు. బార్లు పొందిన వారి జాబితాను అదే నెల 12న ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్ కమిషనర్కు పంపనుండగా, 13న జీహెచ్ఎంసీ జాబితాను పంపుతారు. అదే నెల 17న లాటరీ వచ్చిన వారికి జిల్లా అధికారులు బార్లు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనైతే కమిషనర్ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు లభ్యమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న 1,030 బార్లకు అదనంగా కొత్త మున్సిపాలిటీల్లో మరో 159 ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు సులభం ఈసారి బార్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభం చేసింది. ఒక్క పేజీలోనే ఎక్సైజ్ శాఖ దరఖాస్తును తయారుచేసింది. మూడు కలర్ పాస్పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్కార్డు లేదా ఆధార్కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. బార్ల లాటరీ పూర్తయ్యాక మాత్రం 90 రోజుల్లోగా ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు అన్నీ పూర్తి చేసిన తర్వాతే బార్ లైసెన్స్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. -
ఏడాదైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏడాది గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఏడాది గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్పేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి జనవరి 4న ప్రకటించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన బండారి కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడాది గడిచిందని, రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి మారుతాయని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్కుమార్ నివేదించారు. రెండు పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతాయని మున్సిపల్ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...ప్రతివాదులు మూడు నెలల్లో కౌంటర్ దాఖలు చేయాలని, దానిపై రెండు నెలల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్కు సూచిస్తూ విచారణను జూన్కు వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి నా పేరు తొలగించండి : శ్రీలక్ష్మి సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)పై సీబీఐ నమోదు చేసిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. మైనింగ్ లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని తెలిపారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది. -
తెలంగాణ: ఒకేసారి ఏడు పురపాలక ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: మినీ ‘పుర పోరు’కు రంగం సిద్ధమవుతోంది. ఏడు పురపాలికల ఎన్నికలకు కసరత్తు మొదలుకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం... ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు త్వరలో ఒకేదఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2021 మార్చి 14తో ముగియనుండగా, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో తీరనుంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా హోదా పెరిగిన నకిరేకల్ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)లకు గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం అప్పట్లో పూర్తికాకపోవడమే దీనికి కారణం. త్వరలో వార్డుల పునర్విభజన షెడ్యూల్! తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం... పురపాలికల పాలకవర్గాల గడువు ముగింపునకు మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడు పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ పట్టణాల్లో వార్డుల పునర్విభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లోనూ ఈ కసరత్తు జరగాల్సి ఉంది. ఎన్నికల సంఘం నుంచి సూచనలు అందడంతో వార్డుల పునర్విభజన ప్రక్రియ కోసం త్వరలో రాష్ట్ర పురపాలక శాఖ షెడ్యూల్ జారీ చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2021లో భాగంగా జనవరి 15న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం శాసనసభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. దీని ఆధారంగానే ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డివిజన్లు/ వార్డుల పునరి్వభజన, చైర్పర్సన్, వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన ప్రక్రియను సైతం ఫిబ్రవరిలోగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. సాగర్ ఉపఎన్నిక తర్వాతే పురపోరు నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలోగా సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయితే ఏప్రిల్ లేదా మేలో ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. -
పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేటగిరీలవారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లు ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి. అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి. దీనిపై పురపాలకశాఖ తుది నిర్ణయం తీసుకుని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. పురపాలకశాఖ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ఆస్తి పన్ను రేట్లు ఇలా.. ► నివాస గృహాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.10 శాతానికి తగ్గకుండా 0.50 శాతానికి మించకుండా ఆస్తి పన్నును ప్రతిపాదించారు. ► వాణిజ్య భవనాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.20 శాతానికి తగ్గకుండా 2 శాతానికి మించకుండా ఆస్తి పన్ను ప్రతిపాదించారు. ► ఒక మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతటా ఆస్తి పన్ను రేట్లు ఒకేలా ఉండాలి. ► 375 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలోపు నిర్మించిన ఇళ్లలో ఇంటి యజమాని నివాసం ఉంటే ఏడాదికి నామమాత్రంగా రూ.50 ఆస్తిపన్నుగా నిర్ణయించారు. ఖాళీ జాగాలపై పన్ను రేట్లు ఇలా ► మున్సిపాలిటీలలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.20 శాతం. ► మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.50 శాతం. ► ఖాళీ జాగాలలో చెత్త / ఇతర వ్యర్థాలు వేస్తే మున్సిపాలిటీలలో అదనంగా 0.10 శాతం, కార్పొరేషన్లలో అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు. అనధికార నిర్మాణాలపై జరిమానాలు ► అనుమతులకు మించి 10 శాతం అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 25 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులకు మించి 10 శాతాని కంటే ఎక్కువగా అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 50 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు (ఫ్లోర్లు) నిర్మిస్తే విధించిన ఆస్తిపన్నుపై 100 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. మొత్తం భవనమే అనధికార నిర్మాణం అయితే కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది. వీటికి పన్ను మినహాయింపులు ► ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ/ మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు, పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ► సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ జాగాకు పన్ను మినహాయింపు కలి్పంచారు. -
మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో సంస్కరణలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలంటూ కేంద్రం మార్గనిర్దేశం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్న ఆస్తి పన్ను విధానాలను వివరించారు. (చదవండి: వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు) ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి, అధికారులతో సమావేశంలో చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
మున్సిపాలిటీల్లో ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు అన్ని మున్సిపాలిటీల్లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో పచ్చదనాన్ని పెంచే అత్యుత్తమ పురపాలికలకు ఏటా అవార్డులు ఇస్తామని, తద్వారా పోటీతత్వం పెంచుతామని వెల్లడించారు. గ్రీన్ స్పేస్ ఇండెక్స్లో భాగంగా వినూత్న డిజైన్లు, రోడ్ల పక్కన పచ్చదనం, ఇంటి మొక్కల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ప్రకటించారు. మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న గ్రీన్ కవర్ను మదించేందుకు జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), ఉపగ్రహ చిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ పద్ధతుల ద్వారా రికార్డు చేస్తామని వెల్లడించారు. ఈ డేటా ఆధారంగా వచ్చే ఏడాది ఆయా పట్టణాల్లో గ్రీన్ కవర్ ఎంత మేర పెరిగిందనే అంశాన్ని తిరిగి మదింపు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ఆయా పట్టణాల్లో గ్రీన్ కవరేజీకి 85 శాతం, గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు 5 శాతం, ఆకట్టుకునే డిజైన్లతో చేపట్టే ప్లాంటేషన్కు మరో 10 శాతం వెయిటేజీ ఇచ్చి ఉత్తమ పురపాలికలను ఎంపిక చేస్తామన్నారు. అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిట, రోడ్ల పక్కన మొక్కల పెంపకం వంటి కేటగిరీల్లో అవార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రగతి భవన్లో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ 2298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రెషనలైజ్(హేతుబద్ధీకరణ) చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మెదటి సారిగా... పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక భద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న ముఖ్యమంత్రి అలోచనల మేరకు రూపోదించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకి వేగంగా పౌర సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు అయన తెలిపారు. ఈమేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు అఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారని మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిధుధ్ద్యం, హారితహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అఫీసర్ల నియామకం దోహాదం చేస్తుందన్నారు. భర్తీ అత్యంత పారదర్శకంగా.. ఖాళీల భర్తీ తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్పూర్తితో ముందుకు పోయేందుకు వీలుకలుగుతుందన్నారు. వార్డు అఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఎర్పడుతుందని, తద్వారా పురపాలనా అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులంలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వీరికి సహాయంగా ఇద్దరు లేదా ముగ్గురు ఏస్.ఈలు కూడా ఉంటే ప్రతిపాదనలకు కూడా అమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
స్థానిక సంస్థల పాలనపై కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలకశాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది. నిజానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్లో, జూన్ 30న మున్సిపాలిటీలలో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. (ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రభుత్వం.. శ్రీకాకుళంలోని కార్పొరేషన్లో అక్టోబర్ 10 వరకు మాత్రమే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించగా మిగతా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలో డిసెంబర్ 31 వరకు పొడిగించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు నొటిఫికేషన్లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. (పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు) -
దాహం తీరనుంది..!
బొబ్బిలి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రూ.261.02 కోట్ల ఏఐఐబీ(ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్) నిధులతో సమగ్ర తాగునీటి పథకాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మున్సిపాల్టీల సమీపాల్లో ఉన్న నదుల్లో ఇన్ఫిల్టర్ బావులను నిర్మించి అధునాతన తాగునీటి పథకాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పైప్లైన్ల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖతో కలసి ప్రజారోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పరిపాలనామోదం పొందడంతో ఇక నిర్మాణాలే మిగిలాయి. మొదలైన అధికారుల పరిశీలన తాగునీటి పథకాల నిర్మాణం కోసం మంజూరైన రూ.261 కోట్ల నిధులను రెండేసి ప్యాకేజీలుగా విభజించారు. పార్వతీపురం మున్సిపాలిటీకి రూ.63.63 కోట్లు, బొబ్బిలికి రూ.93.62 కోట్లు, సాలూరుకు రూ.68.98 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ.34.97 కోట్లు కేటాయించారు ఈ నిధులను రెండు ఫేజ్లుగా విభజించారు. జిల్లాలోని పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణం కోసం మెయిన్ పైప్లైన్లు, డిస్ట్రిబ్యూటరీ లైన్లను నిర్మించాల్సి ఉంది. వీటిని మున్సిపాలిటీల్లోని ప్రధాన రోడ్ల వెంబడి నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్అండ్బీ రోడ్లను దాదాపు నాలుగు మీటర్ల వెడల్పుతో తవ్వాల్సి ఉంది. వీటిని తవ్వాలంటే ఆ శాఖ అనుమతులు తప్పనిసరి! ఇందుకోసం జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సంయుక్తంగా పరిశీలనలు చేపడుతున్నారు. బొబ్బిలి పరిశీలనలో ఆర్అండ్బీ ఈఈ కె.చంద్రన్, ప్రజారోగ్య ఈఈ ఎ.కృష్ణారావు, ఆర్అండ్బీ ఏఈ ఐ.వి.ఎస్.జగన్నాతరావు, మున్సిపల్ డీఈఈ రమేష్, ఏఈ షమీమ్, ఇతర సిబ్బంది పైపుల కోసం తవ్వాల్సిన రోడ్లను పరీశీలించారు. రెండు ఫేజుల్లో మంజూరు ఇలా... పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణంలో భాగంగా మంజూరైన రూ.261 కోట్లను రెండు ఫేజులుగా విభజించారు. ఇందులో పార్వతీపురం మున్సిపాలిటీకి మొదటి విడత రూ. 31.19 కోట్లు, రెండో విడత రూ.32.44 కోట్లు, బొబ్బిలికి రూ,55.06 కోట్లు, రెండో విడత రూ.38.02 కోట్లు, సాలూరుకు మొదటి విడత రూ.44.54కోట్లు, రెండో విడత రూ.24.44 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి మొదటి విడత రూ.17.64 కోట్లు, రెండో విడత రూ.17.33 కోట్లు మంజూరు చేస్తున్నారు. రెండో ఫేజ్ టెండర్ల ప్రక్రియ ముగియగా మొదటి ఫేజ్ పెండింగ్లో ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం నిధులు మంజూరైన సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మొదటి, రెండో ఫేజుల్లో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని టెండర్ల దశకు చేరుకున్నాయి. అవి పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తాం. – ఎ.కృష్ణారావు, ఈఈ, ప్రజారోగ్య శాఖ, విజయనగరం -
హరిత పట్నం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : మరోసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని పురపాలక మంత్రి కె.తారకరామారావు కోరారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో శనివారం ఇక్కడ ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పట్టణ పురపాలిక బడ్జెట్లో 10 శాతం హరిత బడ్జెట్గా ఉండాలన్న నిబంధనను నూతన పురపాలక చట్టం చెబుతోందని, హరిత పట్టణాలుగా తీర్చిదిద్దడానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. గ్రీన్ బడ్జెట్ వినియోగంపైన భవిష్యత్లో సమగ్ర సమీక్ష ఉంటుందని, హరితహారం, గ్రీన్ బడ్జెట్ను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. మొక్కలను నాటడం, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మునిసిపల్ కమిషనర్, చైర్పర్సన్లదే అన్నారు. కనీసం 85% నాటిన మొక్కలను కాపాడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రై డేగా పాటించి నాటిన చెట్లను సంరక్షించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డంప్ యార్డుల వద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని, సాధ్యమైనంత ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలను నాటితే వాటి సంరక్షణ సులువు అవుతుందన్నారు. దోమలను తరిమే మస్కిటో రిప్పెలంట్ చెట్లను నాటాలన్నారు. ప్రతీ పట్టణానికి ఒక ట్రీ–పార్క్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 పట్టణాలకు దగ్గర్లో అటవీ బ్లాకులు అందుబాటులో ఉన్నాయని, వీటిలో చెట్లు నాటేందుకు పురపాలకలు ముందుకు రావాలని కోరారు. ప్రతి పట్టణంలో స్మృతి వనాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. పట్టణాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఉధృతంగా పారిశుద్ధ్య పనులు.. జీహెచ్ఎంసీతో సహా అన్ని పురపాలికలకు ప్రతినెలా రూ.148 కోట్ల ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను నేరుగా విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చామన్నారు. ఈ నిధులతో పారిశుద్ధ్యంతో పాటు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అవసరమైన కార్యచరణ చేపట్టిందని తెలిపారు. సీఎం సూచన మేరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ని కూడా చేపట్టామన్నారు. ఈ సీజన్ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ధ్యానికి అదనంగా నాలుగు రెట్లు ఎక్కువ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. పౌరుల భాగస్వామ్యంతో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇల్లందులో పట్టణ ప్రగతి నిర్వహణపై ఒక నివేదికను రూపొందించి మంత్రికి పంపించిన మునిసిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మునిసిపల్ కమిషనర్ను కేటీఆర్ అభినందించారు. ఇదే తరహాలో పట్టణ ప్రగతికి ముందు, తర్వాత ఉన్న పరిస్థితులను పొటోలతో సహా ఒక రిపోర్ట్ తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచితే ప్రజలకి తాము చేస్తున్న కార్యక్రమాలు అర్ధమవుతాయని మంత్రి సూచించారు. -
79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..
న్యూఢిల్లీ/తిరువనంతపురం/గువాహటి: భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 79 శాతం కేసులు కేవలం 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల పరిధిలోనే బయటపడ్డాయని మంత్రుల బృందం(జీవోఎం) వెల్లడించింది. 15వ జీవోఎం సమావేశం శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగింది. దేశంలో కరోనా తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 6.92 శాతం మంది మరణించగా, భారత్లో 3.23 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని జీవోఎం పేర్కొంది. ఉధృతంగానే కరోనా వ్యాప్తి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల ఆగడం లేదు. తాజాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,976 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వల్ల 100 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 81,970కి, మరణాలు 2,649కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్లో యాక్టివ్ కరోనా కేసులు 51,401. ఇప్పటివరకు 27,919 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 34.06కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజాగా నమోదైన 100 మరణాల్లో 44 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. గుజరాత్లో 20 మంది, ఢిల్లీలో 9 మంది, పశ్చిమబెంగాల్లో 8 మంది ఉత్తరప్రదేశ్లో ఐదుగురు, మధ్యప్రదేశ్లో ఐదుగురు కన్నుమూశారు. కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో 70 శాతానికి పైగా బాధితులకు ఇతర జబ్బులు కూడా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 20 లక్షలకుపైగా కరోనా టెస్టులు: ఐసీఎంఆర్ దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. శుక్రవారం ఉదయం వరకు 20,39,952 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. ఇందులో 92,911 పరీక్షలను గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనా టెస్టుల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రత్యేక రైలులో వచ్చిన వారికి కరోనా వెయ్యి మంది వలస కూలీలతో కూడిన మొదటి ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి కేరళకు చేరుకుంది. వీ రిలో ఏడుగురికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు పరీక్షలో తేలింది. దాంతో వారిని అధికారులు కరోనా కేర్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు. కాగా,కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించాలని అ స్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కేంద్రానికి లేఖరాశారు. లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం మిజోరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
మున్సిపాలిటీలకు నిధుల కొరత లేదు
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండబోదని, ప్రభుత్వం నుంచి ప్రతి నెలా దామాషా ప్రకారం నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణాల్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, పురపాలక చట్టం ప్రజలకు ఉపయోగపడడంతో పాటు తప్పు జరిగితే అదేరీతిలో శిక్షించే విధంగా ఉందని, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు నిరంతరం శ్రమించాలని కోరారు. హరితహారం, పారిశుధ్యంపై కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్లక్ష్యం వహిస్తే పదవులు కోల్పోవడం ఖాయమని, ఇది తాను బెదిరించడానికి చెప్పడం లేదని, చట్టం గురించి వివరిస్తున్నాని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చి దిద్దాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నియంత్రించేందుకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాల కోసం మరుగుదొడ్లను నిర్మించాలని అన్నారు. జిల్లాలో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలే నిదర్శనమన్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రాజకీయంగా జిల్లాలో ‘సైకిల్’ని పూర్తిగా తొక్కేసి ప్రజల కోసం నగరంలో సైకిల్ సవారి చేస్తున్నారని ప్రశంసించారు. ‘బయ్యారం’ కోసం ఒత్తిడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని కేటీఆర్ చెప్పారు. గత ఏడాది కాలంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తయ్యాయని, వచ్చే నాలుగేళ్లు అభివృద్ధిపైనే దృష్టి పెడతామన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతి పేదవాడి మనసు గెలుచుకున్నారని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా అభివృద్ధికి బాటలు వేస్తూ అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నారని తెలిపారు. ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, వీధిని, వాడను, గ్రామాన్ని, పట్టణాన్ని అలాగే ఉంచాలని కోరారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీగా జరిమానాలు విధించాలన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినంత మాత్రాన లీడర్లు కారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నవారే అసలైన నాయకులని అన్నారు. తన పర్యటన సందర్భంగా ఇల్లెందులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినందున మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు మంత్రి కేటీఆర్ రూ.లక్ష జరిమానా విధిం చారు. మున్సిపల్ కమిషనర్కు జరిమానా మొత్తం చెల్లించకపోతే వసూలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్దేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతా రావు, ఎమ్మెల్యేలు బానోత్ హరి ప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, భద్రాద్రి కలెక్టర్ ఎం.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గోడు వినండి! ‘సింగరేణి సంస్థ వల్ల భూమి కోల్పోయాం.. ఉపాధి లేక, నష్టపరిహారం అందక కుటుంబం రోడ్డున పడింది. మాకు చనిపోయేందుకు అనుమతివ్వండి..’అంటూ కొందరు బాధితులు మంత్రి కేటీఆర్ సభలో గోడు వెళ్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ ఎస్.ఎం.అలీ వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఇల్లెందులో సింగరేణి ఓపెన్కాస్టు గని విస్తరణలో సుందర్లాల్ లోద్ కుటుంబం భూమి కోల్పోయింది. దీంతో ఆదివారం ఇల్లెందులో జరిగిన పట్టణ ప్రగతి బహిరంగసభకు హాజరైన మంత్రి కేటీఆర్ ఎదుట నిరసన తెలిపేందుకు పలువురు రైతులు వచ్చారు. అనంతరం మంత్రి కేటీఆర్ను కలసిన బాధితులు సమస్యను విన్నవించగా, వారి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ ఎం.వి.రెడ్డిని మంత్రి ఆదేశించారు. -
100% వసూలు కావాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనల పన్ను, షాపుల అద్దెల వసూళ్ల తీరుపై పురపాలక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియబోతుండగా, ఇప్పటివరకు నివాసగృహాల యజమానుల నుంచి కేవలం 62% ఆస్తి పన్నే వసూలు చేశా రని మున్సిపల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు 30% కూడా జరగలేదని తెలిపింది. నివాస గృహాల నుంచి రూ.672.30 కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.416.85 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, మరో రూ.255.44 కోట్లు రాబట్టాల్సి ఉందని తెలిపింది. ఎట్టి పరిస్థితిలోనైనా మార్చి 31లోగా 100% ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ప్రకటనల పన్ను, దుకాణాల అద్దెలను వసూలు చేయాల్సిందేనని ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణరెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆస్తి పన్నులు, ఇతర పన్నులు, ఫీజుల వసూళ్ల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్లు అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో కోరారు. వెబ్సైట్, నోటీసు బోర్డుల్లో వారి జాబితా.. సకాంలలో ఆస్తి పన్నులు చెల్లించడంలో విఫలమైన వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలో టాప్ 500 బకాయిదారులను గుర్తించి వారి నుంచి బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్నులు చెల్లించక భారీగా బకాయిపడిన వారిని వ్యక్తిగతంగా సంప్రదించి, వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని కోరింది. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తే కొత్త మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం వారికి లీగల్ నోటీసులు పంపాలని తెలిపింది. ఆస్తి పన్ను బకాయిలను ఎగనామం పెట్టిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాల యజమానుల జాబితాను మున్సిపాలిటీ వెబ్సైట్, కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శనకు ఉంచాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన పురపాలికల్లో వివిధ పన్నుల వసూళ్లు.. (రూ.కోట్లలో) వసూళ్ల లక్ష్యాలు.. 85 శాతం ఆస్తి పన్నులను బిల్ కలెక్టర్లు వసూలు చేయాలని, మిగతా 10% బకాయిలను మేనేజర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, ప్లానింగ్ ఆఫీసర్, టౌన్ప్లానింగ్ సూపర్వైజర్లు వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టి వసూలు చేయాలని, మిగతా 5% బకాయిలను మున్సిపల్ కమిషనర్ వ్యక్తిగత చొరవ చూపి వసూలు చేయాలని పురపాలక శాఖ లక్ష్యాలను నిర్దేశించింది. వసూళ్లపై కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు తమ స్థాయిల్లో రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. -
ప్రగతిబాటలో పట్టణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని 3,456 మున్సిపల్ వార్డుల్లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. పలుచోట్ల మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం–పరిశుభ్రత విజయవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు నిర్వహించాలని సూచించారు. హరితహారం, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష: ఈటల ‘‘నాకు మంత్రి పదవి మా అమ్మ ఇవ్వలే. హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష. నా కారులో మీరు పెట్రో లు పోస్తే నేను తిరుగుతున్నాను అని ప్రతిక్షణం గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాను’’అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నడిచే ఎద్దును పొడుస్తారని, పనిచేసేవాడి దగ్గరికే ప్రజలు వస్తారని.. ఈ నేపథ్యంలో ప్రతి కౌన్సిలర్ రోజూ ఉదయం వార్డుల్లో తిరగాలని సూచించారు. పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మనదని వ్యాఖ్యానించారు. గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్ల కింద ఉన్నవారికి ముందుగా 500 డబుల్ బెడ్రూం ఇళ్లు రెడీ అవుతున్నాయని చెప్పారు. అలాగే సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్తో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ప్రజలు కూడా తమ బాధ్యత మరవకుండా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ అధికారులు చెత్తా చెదారం లేని, మురికినీరు లేని, పచ్చని చెట్లతో ఉన్న పట్టణం తయారు చేయాలని సూచించారు. సైకిల్పై తిరిగిన పువ్వాడ... ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ మాణిక్యనగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. మురికి కాలువలో పూడిక తొలగించి, మొక్కలు నాటారు. అనంతరం సైకిల్పై పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. పచ్చదనం పెంపునకు నిధులు: సీఎస్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు మున్సిపల్ బడ్జెట్లలో పదిశాతం నిధులను గ్రీన్ బడ్జెట్గా కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి మున్సిపల్ వార్డులో ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులతో మొత్తం నాలుగు కమిటీలు నియమించినట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం
-
నేటి నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : పాలనా సంస్కరణల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సోమవారం (24వ తేదీ) నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తం గా తొలి విడత పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని నిర్వహించబోతున్నారు. పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేసీఆర్ ప్రకటించారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్తగా జిల్లా అదనపు కలెక్టర్లుగా (స్థానిక సంస్థలు) నియమితులైన అధికారులు పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను రానున్న 10 రోజుల్లోగా పూర్తి చేయనున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయనున్నారు. మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ టార్గెట్ నిర్దేశించారు. విఫలమైతే చైర్పర్సన్లు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పట్టణ ప్రగతి అమలు తీరును పరిశీలించేందుకు కేసీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశముంది. సీనియర్ అధికారులతో రూపొందించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రగతి ప్రణాళిక.. కౌన్సిలర్/కార్పొరేటర్ల సమన్వయంతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు వార్డుల వారీగా ప్రణాళికలు రూపొందించనున్నారు. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకాధికారి పనిచేయనున్నారు. పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులపై గుంతల మరమ్మతులకు సంబంధించిన పనులను తక్షణమే చేపట్టనున్నారు. పట్టణ ప్రగతి కింద తక్షణమే చేయాల్సిన పనులకు కలెక్టర్, మేయర్/చైర్పర్సన్ నుంచి అనుమతి పొంది మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా నిర్వహించాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల వారీగా ప్రతి పురపాలికలో యువజన, మహిళా, వయోజనులు, ప్రముఖుల కమిటీలను ఏర్పాటు చేయాలని మరో ఉత్తర్వులో పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు.. పట్టణ ప్రగతి దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ప్రతి పట్టణంలో దహన వాటికలు/ఖనన వాటికలు, పట్టణ జనాభాకు తగినట్లు పరిశుభ్రమైన వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూల మార్కెట్లు, ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. వీధి వ్యాపారుల కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయనున్నారు. వంగిన, తుప్పు పట్టిన స్థంభాలు, రోడ్డు మధ్యలోని స్థంభాలు, ఫుట్పాత్లపై ఉండే ట్రాన్స్ఫార్మర్లను పట్టణ ప్రగతిలో భాగంగా మార్చనున్నారు. ఇళ్లపై వేలాడే వైర్లను సరిచేయనున్నారు. ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి: కేటీఆర్ పట్టణ రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. పట్టణ ప్రగతి విజయవంతం కావడానికి పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ప్రతి వార్డులో పౌరులతో కమిటీలు ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. కాగా, మహబూబ్నగర్ పట్టణంలో సోమవారం జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది. -
పట్టణం.. కావాలి ఆదర్శం
సాక్షి, సంగారెడ్డి: మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల కొరతలేదని, ప్రతి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆర్థిక శాక మంత్రి హరీశ్రావు సూచించారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహించనున్న దృష్ట్యా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో శనివారం ‘పట్టణ ప్రగతి సమ్మేళనం’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం మున్సిపాలిటీలకు ప్రతినెలా ఒకటో తేదీన నిధులు జమ చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి రూ.6.44 కోట్లు వస్తాయని వివరించారు.మున్సిపాలిటీలకు పన్నుల రూపంలో వచ్చే నిధులు కాకుండా ఇవి అదనమని తెలిపారు. ప్రతి వార్డులో నాలుగు కమిటీలు వేయాలని, ప్రతి కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలన్నారు. మున్సిపాలిటీల వారీగా చేయాల్సిన పనులు, బడ్జెట్ ప్లానింగ్ను, ప్రత్యేక కార్యాచరణను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆయన సూచించారు. మున్సిపాలిటీలకు విడుదల చేసే నిధుల్లో 10 శాతం పచ్చదనం పెంపుకు ఖర్చు చేయాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్లు, కౌన్సిలర్లు బాగా పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని, లేనిచో అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చర్యలు తప్పవని, పదవులు కూడా ఊడతాయనే విషయాన్ని గ్రహించాలన్నారు. చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం కలెక్టర్లకే ఉంటుందని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకు పనిజరగాలన్నారు. కఠినంగా నూతన మున్సిపల్ చట్టం మున్సిపాలిటీలు, పట్టణాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపల్ చట్టం చాలా కఠినంగా రూపొందించబడినదని చెప్పారు. అక్రమ కట్టడాలను కూలి్చవేసే, స్వా«దీనం చేసుకునే, సీజ్చేసే, జరిమానా విధించే అధికారాన్ని మున్సిపల్ చట్టం కట్టబెట్టిందని వివరించారు. మూడు సంవత్సరాల జైలుశిక్ష కూడా ఉంటుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించారు. ఏ మున్సిపాలిటీలోనూ చెత్త ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ.పాటిల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కలెక్టర్లు ఎం.హనుమంతరావు, ధర్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. – సత్యనారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ -
మున్సిపాలిటీలు దేశానికి ఆదర్శం కావాలి
సాక్షి, సంగారెడ్డి : తెలంగాణలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలని దీని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ‘పట్టణ ప్రగతి సమ్మేళనం’ (అవగాహన, సన్నాహక సమావేశం) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీలో 60 మంది సభ్యులుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లను ఆదేశించారు. ప్రతినెలా మున్సిపాలిటీలకు నిధు లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చేయడమే మీముందున్న సవాలన్నారు. లంచం లేకుండా పనులు జరగాలి.. ఒక్క రూపాయి లంచం లేకుండానే ప్రజలకు పనిచేసి పెట్టాలని హరీశ్ సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం పకడ్బందీగా ఉందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, చివరకు తానైనా పనిచేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. పేదలు 75 గజాలలోపు ఇళ్లు కట్టుకుంటే ఎలాంటి అనుమతి, ఫీజు అవస రం లేదన్నారు. చెత్త సేకరణ పద్ధతులు, తది తర అంశాలపై ఎన్జీవో ప్రతి నిధి శాంతి, సా హస్ సంస్థ ప్రతినిధి మహేశ్ తడి–పొడి చెత్త సేకరణ పద్ధతులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్లు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పగ్గాలు అదనపు కలెక్టర్లకే..
సాక్షి, హైదరాబాద్: కొత్తగా సృష్టించిన అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు) విధుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్థానిక సంస్థల నిర్వహణ బాధ్యతను పూర్తిగా వీరికి కట్టబెట్టింది. మండల, జిల్లా పరిషత్ మినహా గ్రామ పంచాయతీలు, పురపాలికలపై పూర్తిస్థాయి అజమాయిషీ అప్పగించిన ప్రభుత్వం.. విధానపరమైన నిర్ణయాలు, సిబ్బంది, పాలకవర్గాలపై చర్యలు తీసుకునే అధికారం మాత్రం కలెక్టర్లకు సంక్రమింపజేసింది. మండల, జిల్లా పరిషత్లు ప్రస్తుతం ఉన్న తరహాలోనే జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షణలో పనిచేస్తాయి. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి రోజూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో పర్యటించాలని జాబ్ చార్ట్ లో పొందుపరిచింది. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు రానప్పటికీ, మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు వెల్లడించినట్లు తెలిసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, పారిశుద్ధ్యం, హరితహారం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ బాధ్యతలను వీరికి అప్పగించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరపడం వరకే పరిమితం చేసిన ప్రభుత్వం.. చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది. ఇకపై పంచాయతీ కార్యదర్శి మొదలు డీపీవో, మున్సిపల్ కమిషనర్లు కూడా అదనపు కలెక్టర్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టరంటే రాజమణిలా ఉండాలి... పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను ఆకళింపు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ‘నా చిన్నతనంలో రాజమణి అనే కలెక్టర్ ఉండేవారు. ఆయనకు ప్రజలు దండం పెట్టేవారు. ఆయన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మీరు కూడా వినూత్నంగా పనిచేసి గొప్ప అధికారిగా రాణించాలి’అని సీఎం సూచించారు. -
ఏప్రిల్ 2 నుంచి టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖలో ప్రవేశపెట్టబోతున్న ‘టీఎస్–బీపాస్’విధానం కింద 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడబోమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతో పాటు ఆరు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో టీఎస్–బీపాస్ను అమలు చేస్తామన్నారు. టీఎస్–ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 35 రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్ శాఖల అనుమతులను టీఎస్–బీపాస్ ద్వారా సింగిల్ విండోలో జారీ చేస్తామన్నారు. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులను బాధ్యు లు చేసి వారిపై జరిమానాలు విధించాలని యోచిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం కేటీఆర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ తరహాలోనే టీఎస్–బీపాస్ను ప్రభు త్వం తెస్తోందని, దీనికి అమలుకు సమాయత్తం కావాలన్నారు. హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తాం పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠిన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని కేటీఆర్ అన్నారు. ఎవరైనా అధికారి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు అనుమతిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు. పౌరులే కేంద్రంగా పాలన పౌరులే కేంద్రంగా పురపాలన జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని మున్సిపల్ కమిషనర్లు జాబ్చార్ట్గా పరిగణించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పని చేయాలన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందా లంటే స్థానిక కమిషనర్లు తమతో పాటు పనిచేసే సిబ్బందితో, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్యమే ప్రాథమిక విధి.. కొత్త మున్సిపల్ చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లైన్ సేవ లు, సాంకేతిక వినియోగం, ఫిర్యాదుల పరి ష్కారం, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుర్తించుకోవాలని కేటీఆర్ చెప్పారు. పారిశుద్ధ్యం ప్రాథమిక విధి అని, తెల్లవారు జాము 4:30 గంటలకే కమిషనర్లు రోడ్ల మీదకు వచ్చిన పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. పట్టణాలు, నగరాల్లో అవసరమైన రీతిలో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ‘షీ టాయి లెట్ల’ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ బడ్జెట్లో 10% నిధులను హరిత ప్రణాళిక అమలుకు ఖర్చు చేయాలన్నారు. -
ముగిసిన పురపోరు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. 129 పురపాలికల్లో మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఓటేసిన వారిలో మహిళలు 69.94 శాతం, పురుషులు 68.8 శాతం, ఇతరులు 8.36 శాతం మంది ఓటర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 93.31 శాతం నమోదు కాగా, మేడ్చల్ జిల్లా నిజాంపేట కార్పొరేషన్లో అత్యల్పంగా 39.65 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీల్లోని మొత్తం ఓట్లకు 49,75,093గాను 34,95,322 ఓట్లు పోలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 88.32 శాతం పోలింగ్, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 50.32 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో గ్రామ పంచాయతీలు, నగరపంచాయతీలుగా ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ బాగా జరగ్గా, నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు కొంతమేర బద్ధకించినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎక్కడా కూడా రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశించలేదు. టెండర్ ఓట్లు నమోదు అయినట్లు కూడా ఎస్ఈసీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఘర్షణలు.. వాగ్వాదాలు.. : వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య పలుచోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు, డబ్బు పంపిణీ ఆరోపణలు, కొన్నిచోట్ల పోలీసులకు ఫిర్యాదు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు తమ తమ మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం 120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు (80 ఏకగ్రీవాలు మినహాయించి), 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు (ఒక ఏకగ్రీవస్థానం కాకుండా) వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తంగా 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటి పరిధిలో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే.. 24న రీపోలింగ్ నిర్వహించి, 25న ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు ప్రకటిస్తారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించి ఓటేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించారు. జీహెచ్ఎంసీలోని డబీర్పురా డివిజన్లోనూ ఉప ఎన్నిక జరిగింది. కాగా, బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 24న ఈ కార్పొరేషన్లోని 58 డివిజన్లకు (రెండు ఏకగ్రీవాలు మినహా) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలు ప్రకటిస్తారు. బుధవారం ఓటింగ్ సందర్భంగా మొత్తం 2,072 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజీ, 2,406 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్కాస్టింగ్ నిర్వహించారు. భైంసాలో పోలింగ్ ప్రశాంతం భైంసా (ముథోల్): నిర్మల్ జిల్లా భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 23 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 64.70 శాతం పోలింగ్ నమోదైంది. ఒక్కనిమిషం వ్యవధిలోనే ఓటర్ల గుర్తింపు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతం కుత్బుల్లాపూర్: ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో భాగం గా దేశంలోనే తొలిసారిగా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతమైంది. దూలపల్లి– కొంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 బూత్లలో పైలెట్ ప్రాజెక్ట్గా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని ఒక్క నిమిషం వ్యవధిలోనే యాప్ ద్వారా గుర్తిస్తూ క్లియరెన్స్ ఇవ్వడంతో వేగంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ ప్రశాంతం ఫలించిన పోలీస్ వ్యూహాలు రాష్ట్రవ్యాప్తంగా మున్సి పల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిం టదని శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కడా గొడవలు తలెత్తలేదన్నారు. మొత్తం 50 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. ఏఆర్, సివిల్, టీఎస్ఎస్పీ పోలీసులతోపాటు ఫారెస్టు, ఎక్సైజ్, విద్యుత్, విజిలెన్స్కు చెందిన ఉద్యోగులు కూడా విధుల్లో పాల్గొన్నారని వివరించారు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదన్నారు. ఎన్నికల కోసం పోలీసులు వ్యవహరించిన పలు వ్యూహాలు ఫలితాలనిచ్చాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఓటేసిన మంత్రి కోదాడ / సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్లో సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నెహ్రూనగర్లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి ఆయన సతీమణి సునిత ఓటు వేశారు. కోదాడలో ఉత్తమ్... సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల నుంచి.. హుజూరాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చారు. ఖతార్, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్ల నుంచి స్వదేశాలకు వచ్చి ఓటేశారు. నరేశ్.. శభాష్ నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని 37 వార్డులో స్థానికుడైన నరేశ్ రెండు చేతులు లేకున్నా.. బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వేయడం ఆనందంగా ఉందన్నారు. ఓటు బహిర్గతం మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓ అభ్యర్థికి వేసిన ఓటు బహిర్గతమైంది. గుర్తుతెలియని ఓటరు ఓటు ను ఫోన్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇది వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. ఓటుకు ముక్కు పుడక కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపాలిటీ అడ్లూర్ పరిధిలోని ఇల్చిపూర్లో పంగ లింగం నుంచి ఓటర్లకు పంచుతున్న 33 బంగారు ముక్కు పుడకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
25 నయా నగరం..వేల కోట్ల వ్యయం!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో సమస్యలు తిష్ట వేశాయి. గ్రామీణ నేపథ్యం నుంచి పట్టణాలుగా.. తర్వాత నగరపాలక సంస్థలుగా వెంటవెంటనే రూపాంతరం చెందినా... పలు సమస్యలు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, శానిటేషన్, వీధిలైట్లు, పార్కుల అభివృద్ధి లాంటి సదుపాయాలు మచ్చుకైనా కానరావడం లేదు. ఓఆర్ఆర్ పరిధిలోని 15 పురపాలక సంస్థలు, 7 కార్పొరేషన్లు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నగరాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని ఇటీవల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ స్థాయిలో నిధులు వెచ్చించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా నగరపాలక సంస్థలు లేవు. ఈ నగర పాలక సంస్థలకు ఏటా లభిస్తున్న ఆదాయం అరకొరగా పారిశుద్ధ్య వసతుల కల్పన, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోంది. ప్రధానంగా నిజాంపేట్, బోడుప్పల్, మీర్పేట్, బడంగ్పేట్ నగరపాలక సంస్థలకు ఏటా వచ్చే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంటోంది. కార్పొరేషన్లలో ప్రధాన సమస్యలు ఇవే.. ►ఈ నగరపాలక సంస్థల్లో పట్టణ ప్రణాళిక గాడి తప్పింది.మాస్టర్ ప్లాన్ అమలు ఊసేలేదు. ►మురుగునీరు, ఇరుకు రహదారులతో ఇబ్బందులు. ►గ్రీన్ బెల్ట్, పార్కుల అభివృద్ధి లేదు. ►పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ కట్టడాలను నియంత్రించేవారే కరువయ్యారు. ►గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మంచినీటి సరఫరా అరకొరే. ►ఘన వ్యర్ధాల నిర్వహణ కాగితాలకే పరిమితం. ►మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం జాడే కానరాదు. ►ప్రజారోగ్యం గాల్లో దీపం అయింది. ∙యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ►పలు నగరపాలక సంస్థల్లో ముంపు సమస్యతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటంలేదు. కార్పొరేషన్లు /సమస్యలు నిజాంపేట్ జనాభా: 3 లక్షలు ఆదాయం: రూ.30 కోట్లు; వ్యయం: రూ.35 కోట్లు ప్రధాన సమస్యలు: ముంపు సమస్యలు, డ్రైనేజీ, మంచి నీటి వసతుల లేమి, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ. బోడుప్పల్ జనాభా: 1.35 లక్షలు ఆదాయం: రూ. 30 కోట్లు; వ్యయం: రూ.32 కోట్లు సమస్యలు: రహదారులు, పార్కుల లేమి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి పైపులైన్ లీకేజీ. మీర్పేట్ జనాభా: 84 వేలు ఆదాయం: రూ. 23 కోట్లు; వ్యయం: రూ. 25 కోట్లు సమస్యలు: చెరువుల కలుషితం, భూగర్భ డ్రైనేజీ సదుపాయం లేకపోవడం, తాగునీటి సమస్యలు. బడంగ్పేట్ జనాభా: 1.16 లక్షలు ఆదాయం: రూ.30 కోట్లు; వ్యయం: రూ. 35 కోట్లు సమస్యలు: అక్రమ కట్టడాలు, డ్రైనేజీ సదుపాయం లేమి, పార్కులు అసలే లేకపోవడం. త్వరితగతిన చేపట్టాలి... మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని 3 చెరువులు కలుషితం కావడంతో పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైనేజీ నీరు చెరువుల్లో కలవకుండా చేపడుతున్న ట్రంకులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. తోడేటి ప్రసాద్, మీర్పేట నాణ్యతలేని రోడ్లు మీర్పేట కార్పొరేషన్లో ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మున్సిపాలిటీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేస్తుండటంతో అవి కొన్ని రోజులకే గుంతలమయంగా మారుతున్నాయి. ఇజాజ్ మీర్పేట -
లంచాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్లు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి ట్రామ్ (రైలు) తరహా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలి. అందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాల ప్రసక్తే లేకుండా బిల్డింగ్ ప్లాన్లు ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యతాక్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. మంచినీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, డీశాలినేషన్ (సముద్రం జలాల శుద్ధి) చేసిన నీటినే పరిశ్రమలకు వినియోగించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి సహా వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. పలు సూచనలు చేశారు. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో లంచాలు తీసుకోకుండా బిల్డింగ్ ప్లాన్లు మంజూరు చేసే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఇందుకు ఏసీబీ సాయం తీసుకోవాలని సూచించారు. మెరుగైన వ్యవస్థను తయారు చేయడానికి అహ్మదాబాద్ ఐఐఎం సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతిలేని వ్యవస్థను తీసుకు వస్తే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. విశాఖ నగరానికి నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం నుంచి భూగర్భ పైప్లైన్ ద్వారా తాగునీటిని నేరుగా విశాఖ నగరానికి సరఫరా చేయడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. విశాఖలో దాదాపు 1.50 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీలుగా కమలాపురం, కుప్పం వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా, ప్రాధాన్యతా క్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. మురుగు నీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా> 110 మున్సిపాల్టీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మించడానికి రూ.23,037 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలను అధికారులు సీఎంకు వివరించారు. లక్షకు పైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాల్టీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కోసం రూ.11,181 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. డీశాలినేషన్ చేసిన నీటినే పరిశ్రమల అవసరాలకు వాడుతూ.. మంచి నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడేందుకు అవసరమైతే చట్టం చేద్దామని సీఎం అన్నారు. ఇందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్ స్పెసిఫికేషన్స్ మార్చకుండా పట్టణ గృహ నిర్మాణ పథకంలో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫ్లాట్ల నిర్వహణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీల్లానే ఫ్లాట్ల నిర్వహణ కోసమూ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 48,608 హౌసింగ్ యూనిట్ల(ఇళ్ల)కు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. రూ.2,399 కోట్ల కాంట్రాక్టు విలువ గల పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్ల ద్వారా రూ.303 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్ టెండరింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి, మంగళగిరి, పులివెందులలో అభివృద్ధి చూపించాలి తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మున్సిపాలిటీల్లో కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. ఈ మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలన్నారు. ఆ మేరకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేస్తున్నామని అధికారులు వివరించారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో 10,794 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు తెలుపగా, మోడల్ కాలనీ కట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో ముంపునకు గురికాకుండా కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. -
33% బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 33 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాష్ట్ర మున్సిపాలిటీల చట్టంలో విధించిన గరిష్ట పరిమితి మేరకు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32.5 నుంచి 33 శాతం వరకు రిజర్వేషన్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల చైర్పర్సన్, 13 మున్సి పల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం హైదరాబాద్లో ప్రకటించారు. 123 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్కాగా ఓపెన్ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాల్సి ఉంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ఇంకా ముగియలేదు. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. మరోవైపు ఆదివారం జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డులు/డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. ఈ నెల 7న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 22న పోలింగ్ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటించనున్నారు. జనాభా దామాషా ప్రకారం.. మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రాష్ట్రం యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం చైర్పర్సన్, మేయర్ స్థానాలను కేటాయించారు. మున్సిపాలిటీల్లో 3.3 శాతం ఎస్టీ జనాభా ఉండగా, 3.2 శాతం చైర్పర్సన్ స్థానాలు వారికి దక్కాయి. దీంతో మొత్తం 123 పురపాలికలకుగాను 4 చైర్పర్సన్ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఇక మున్సిపాలిటీల్లో 13 శాతం ఎస్సీల జనాభా ఉండగా దాదాపు 14 శాతం (17 స్థానాలు) చైర్పర్సన్ సీట్లను వారికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల కోటా కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా బీసీలకు 32.5 నుంచి 33 శాతం (40 స్థానాలు) చైర్పర్సన్ సీట్లను కేటాయించినట్లు పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టీల జనాభా 1.9 శాతం మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి ఒక మేయర్ పదవి (8 శాతం)ని కేటాయించారు. కార్పొరేషన్లలో ఎస్సీల జనాభా 3.6 శాతం ఉండగా వారికి కూడా నిబంధనల ప్రకారం ఒక మేయర్ సీటును కేటాయించడంతో 8 శాతం కోటా అమలు చేసినట్లు అయింది. బీసీలకు 4 మేయర్ స్థానాలు కేటాయించడంతో 33 శాతం రిజర్వేషన్లు వారికి కల్పించినట్లు అయిందని శ్రీదేవి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో మేయర్ పదవి రిజర్వు కావడంతో ఈ స్థానాలకు మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేకపోయామన్నారు. అందుకు బదులుగా మహిళలకు ఓపెన్ కెటగిరీలో ఉన్న 7 మేయర్ స్థానాలకుగాను 4 స్థానాలను రిజర్వు చేశామన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్లు... బీసీ (జనరల్): నారాయణ్ఖేడ్, ఆందోల్–జోగిపేట్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్ బీసీ (మహిళ): సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీంగల్, ఆర్మూర్, కోస్గి, మెట్పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్ ఎస్సీ (జనరల్): క్యాతన్పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, ఐజా, నస్పూర్, నేరెడ్చర్ల, తొర్రూరు, నర్సింగి ఎస్సీ (మహిళ): మధిర, పరకాల, పెబ్బైర్, అలంపూర్, వర్ధన్నపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్పేట, తిరుమలగిరి ఎస్టీ (జనరల్): ఆమనగల్, డోర్నకల్ ఎస్టీ (మహిళ): వర్ధన్నపేట, మరిపెడ ఓసీ (జనరల్): మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఎల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్నగర్, కల్వకుర్తి, షాద్నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిబట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తుంకుంట, బొల్లారం, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ. ఓసీ (మహిళ): చొప్పదండి, పెద్లపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్నగర్, హుజూరాబాద్, శంకర్పల్లి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఎస్సీ (జనరల్): రామగుండం ఎస్టీ (జనరల్): మీర్పేట బీసీ (జనరల్): బండ్లగూడ జాగీర్, వరంగల్ బీసీ (మహిళ): జవహర్నగర్, నిజామాబాద్ ఓసీ (జనరల్): కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ ఓసీ (మహిళ): ఖమ్మం, నిజాంపేట్, బడంగ్పేట్, జీహెచ్ఎంసీ మహిళలకు..50% 123 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకుగాను 61 స్థానాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్ స్థానాలకుగాను 6 స్థానాలు మహిళలకు లభించాయి. కొత్త మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా 50 శాతం స్థానాలను ఎంపిక చేసి మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వేషన్ కేటగిరీలవారీగా మహిళా రిజర్వేషన్లను పరిశీలిస్తే 123 చైర్పర్సన్ స్థానాల్లో బీసీ (జనరల్)కు 20, బీసీ (మహిళ)కు 20, ఎస్టీ (జనరల్)కు 2, ఎస్టీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 9, ఎస్సీ (మహిళ)కు 8, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 31, ఓపెన్ కేటగిరీ (మహిళ)కి 31 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను మహిళలకు 6 స్థానాలు దక్కాయి. 13 మేయర్ స్థానాలకుగాను బీసీ (జనరల్)కు 2, బీసీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 1, ఎస్టీ (జనరల్)కు 1, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 3, ఓపెన్ కేటగిరీ (మహిళ)కు 4 స్థానాలు రిజర్వు అయ్యాయి. కీలకమైన జీహెచ్ఎంసీ మేయర్ స్థానం ఓపెన్ కేటగిరీ(మహిళ)కి రిజర్వు కావడం గమనార్హం. -
డెడ్లైన్ డిసెంబర్ 31
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర మున్సిపల్ శాఖ చీఫ్ శ్రీదేవి ఆదేశాలకనుగుణంగా డిసెంబర్ 31లోగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధించాల న్నారు. ఆ దిశగా మున్సిపల్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ రిజినల్ డైరెక్టర్(ఆర్డీ) పంకజం స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రం సిద్దిపేట మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన సమావేశంలో ఆయా మున్సిపాలిటీల్లో డిసెంబర్ చివరి నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. ఇదే సమయంలో ఆయా మున్సిపాలిటీలు డిసెంబర్ తరువాత ప్లాస్టిక్ను పట్టణంలో నిషేధించినట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధంపై థార్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించి అవార్డులు ఇస్తామని తెలిపారు. 100 శాతం పన్నులు వసూలు చేయాలి మున్సిపాలిటీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లలో అధికారులు లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలన్నారు. సిద్దిపేట మున్సిపల్లో ప్రస్తుతం 60శాతం వసూల్లు జరిగాయని, నిర్థేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పథకాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా దరఖాస్తులను స్వీకరించి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజల్లో అవగహన కల్పించండి జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగహన కల్పించాలని ఆమె సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా మార్చాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉందన్నారు. వివిధ అంశాలపై మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ పంకజం మున్సిపల్ల వారీగా సమీక్ష నిర్వహిస్తూ వివరాలు సేకరించారు. ఈ సమీక్షలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ల కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, నర్సయ్య, కృష్ణారెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అవకాశమిచ్చిన లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్ల లోని అనధికారి లేఅవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం లేదు. ప్రభుత్వం తొలుత హెచ్ఎండీఏ పరిధిలోని 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 73 సంస్థల పరిధిలో అవకాశమివ్వాలని భావించినా ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 2018 మార్చి 30 కటాఫ్గా నిర్ణయించడంతో లక్షకుపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చి కోట్లలో ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు.90 రోజుల్లోపు అంటే 3 నెలల్లోపు ఆయా ప్లాట్ల యజమానులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రారంభ ఫీజుగా రూ.పదివేలు చెల్లించి దరఖాస్తు చేసిన తర్వాత ఆయా డాక్యుమెంట్లు సరిగా ఉంటే సబ్రిజిష్టార్ మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా ఎల్ఆర్ఎస్,వ్యవసాయేతర(నాలా) ఫీజును అధికారులు లబ్ధిదారుని సెల్ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు.అయితే గతంలో లాగే ఈ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిశీలించనుంది. అవకాశం వీటికే: నర్సాపూర్ మునిసిపాలిటీ, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, ఖానాపూర్, చొప్పదండి, కొత్తపల్లి, రాయికల్, ధర్మపురి, మంథని, సుల్తానాబాద్, వైరా, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, నడికొండ, చిత్యల్, హాలి యా, చందూర్, నేరేడ్చెర్ల, తిరుమలగిరి, మోత్కు రు, ఆలేర్, యాదగిరిగుట్ట, మత్కల్, భూత్పూర్, కోస్గి, కొత్తకోట, పెబ్బెర్, ఆత్మకూర్, అమరచింత, వడ్డెపల్లి, అలంపూర్, రామాయంపేట, చేర్యాల, నారాయణ్ఖేడ్, బాన్సువాడ, భీంగల్, ఎల్లారెడ్డి, పరిగి, కొడంగల్, ఆమన్గల్ మునిసిపాలిటీలకు ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు.. -
ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం సమీక్షించారు. అక్రమ కట్టడాలతో దుర్భర పరిస్థితులు... వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో అంతా చూస్తున్నామని, కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నగరాల్లో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని, మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదన్నారు. వరదనీరు ప్రవహించే మార్గాల్లో అక్రమ నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయని, కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలతో మనమే సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా కూడా రాదని, చట్టాలు కూడా దీనికి అంగీకరించవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలు, సామాన్యుల పట్ల ఉదారంగా వ్యవహరించి, వారికి కావాల్సిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలంగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు సమస్యలు తీర్చేలా సచివాలయాలు.. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదని, వీటి విషయంలో వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, విద్యుత్తు, రేషన్కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ లాంటివి సమకూర్చే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేలా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండాలన్నారు. ఎలాంటి విజ్ఞప్తులు అందినా పరిష్కరించేలా ఉండాలని పేర్కొన్నారు. ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరిని ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లి, మంగళగిరిలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని, తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు తదితర మౌలిక వసతులతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని సీఎం సూచించారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాల్టీలు సాధ్యమన్నారు. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాల్లో లంచాల పేరు కూడా వినపడకూడదని హెచ్చరించారు. ఏ పౌరుడూ, ఏ బిల్డరూ లంచం ఇచ్చి పనులు చేయించుకునే దుస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. కరకట్ట పేదలకు ఉచితంగా ఇళ్లు... కృష్ణా నది కట్టమీద, కరకట్ట లోపల, కాల్వ గట్ల మీద నివసిస్తున్న వారికి ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఉగాది నాటికి వారికి పట్టాలు ఇచ్చి మంచి డిజైన్తో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. వారి సమస్యను శాశ్వతంగా తీర్చాలన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర స్థలం కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. ఎక్కడో దూరంగా కాకుండా వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, నదీ పరీవాహక చట్టాల అమలు కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. బకింగ్ హాం కెనాల్ కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని కాల్వ గట్లపై విస్తారంగా చెట్లను పెంచాలన్నారు. -
దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా
సాక్షి, దాచేపల్లి: దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మున్సిపాల్టీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీలల హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది . ఎన్నికల సమయంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీ హోదాను కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రజల కలను నిజం చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను కలిసి దాచేపల్లి మున్సిపాల్టీగా, గురజాల, జంగమహేశ్వరపురం గ్రామాలను కలిసి గురజాల మున్సిపాల్టీలుగా రూపాంతరం చెందనున్నాయి. మున్సిపాల్టీల ఏర్పాటుతో పాటు అందుకు అవసరమైన సిబ్బంది, కార్యాలయం, ఫర్నిచర్తో ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాల్టీలతో అభివృద్ధి.. దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత దశాబ్దాల నుంచి వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మున్సిపాల్టీలుగా మారుస్తున్నామని గొప్పలు చెప్పారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పల్నాడు అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గానికి రూ.66 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆ తర్వాత తంగెడ, మాచవరం గ్రామాల పరిధిలో ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.188 కోట్ల ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దాచేపల్లి, నడికుడి, గురజాల, జంగమహేశ్వరపురంలో ఉన్న జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, మానవ వనరులను పరిగణలోకి తీసుకుని దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీలు ఏర్పడితే ప్రతి రోజు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం, ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందుతాయి. మున్సిపాల్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తాయి. తమ కల ఇన్నాళ్లకు నెరవేరతుండటంతో దాచేపల్లి, గురజాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాల్టీగా ఉండటంతో తాజాగా దాచేపల్లి, గురజాల పట్టణాలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. -
ఆ గ్రామాల వివరాలు పంపండి
ఎఫెక్ట్.. సాక్షి, హైదరాబాద్: ‘ఊళ్లకు ఊళ్లు మాయం’శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై కదలిక వచి్చంది. జిల్లాల పునరి్వభజనలో ఏకంగా కొన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వివరాలు గెజిట్ నోటిఫికేషన్లో మాయం కావడాన్ని కేంద్ర జనాభా గణాంక శాఖ ఎత్తి చూపింది. 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నద్ధమవుతున్న సెన్సెస్ విభాగం.. 2011 జనాభా లెక్కల్లో ఉన్న గ్రామాలు, ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తప్పుబట్టింది. 58 మండలాల్లో 460 గ్రామాలు గల్లంతు కావడంపై ఆరా తీసింది. రెండు జిల్లా కేంద్రాలు వనపర్తి, గద్వాల కూడా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్లో లేకపోవడమేమిటనీ ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు. దీనిపై సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం స్పందించింది. తక్షణమే రెవెన్యూ డివిజన్లు, మండలాలు (ఏజెన్సీ మండలాలు కూడా), గ్రామాలు, అనుబంధ గ్రామాల వివరాలను పంపాలని కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ వివరాలకు అనుగుణంగా జిల్లాల పునరి్వభజన గెజిట్లో కనిపించకుండా పోయిన గ్రామాలను గుర్తించి.. మరోసారి జీఓ జారీ చేసే అవకాశముంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా 2021 జనాభా లెక్కలకు సెన్సెస్ విభాగం నడుంబిగించే వీలుంది. -
విద్యుత్ బిల్లు చెల్లించకపోతే వేటే!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి సంస్థలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను వన్టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను కూడా జీరో సైజుకు తెస్తాం. భవిష్యత్తులో వాడే విద్యుత్కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలని, అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించట్లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలది కీలక పాత్ర.. తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని, నేడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్ కారణంగా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉం డేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ ‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ఉంటుంది. ఆ సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలను, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చూడటం తదితర పనులు నిర్వహిస్తాం. సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుంది.. ఎంత బిల్లు వస్తుందనే విషయాలను మదింపు చేయాలి’ అని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయని, ఇందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లేఅవుట్లలో విద్యుత్ అవసరాలకు తగినంత స్థలం కేటాయించేలా చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం.. దాన్ని ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్ను తట్టుకునేందుకు, సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని సూచించారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్రావు, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్రావు, రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, íసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో 6 కొత్త మున్సిపాలిటీలు..!
సాక్షి, కర్నూలు (టౌన్): పట్టణీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్గ్రేడ్ చేస్తోంది. తద్వారా కేంద్ర నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పట్టణాలు మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. మునిసిపాలిటీలను పెంచితే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ప్రభుత్వ భావన. అందులో భాగంగా జిల్లాలో మరో 6 మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ డైరెక్టర్ విజయకుమార్.. ఆయా మేజర్ గ్రామ పంచాయతీల సమీపంలో ఉన్న గ్రామాలు కలుపుకునే అవకాశాలకు సంబంధించి నివేదకలు తయారు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 వ తేదీలోపు నివేదికలు ప్రభుత్వానికి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరు మేజర్ పంచాయతీలకు మహర్దశ.. జిల్లాలోని బేతంచెర్ల, కోవెలకుంట్ల, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం మేజర్ పంచాయతీలను అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెలాఖరుకు నివేదికలు అందిన తరువాత నెలరోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకుంటారు. ఆయా పంచాయతీల పరిధిలో విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకొని ఆ తరువాత ఆధికారికంగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసేందుకు తగిన చర్యలు చేపడుతోంది. 15కు చేరనున్న పట్టణాల సంఖ్య : కొత్తగా 6 మునిసిపాలిటీలు ఏర్పడితే..జిల్లాలో పట్టణాల సంఖ్య 15కు చేరుకుంటుంది. ఇప్పటికే జిల్లాలో కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్తో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు మునిసిపాలిటీలుగా ఉన్నాయి. గూడూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్కు తొమ్మిదేళ్లుగా వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలోని ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గం గడువు ముగిసింది. కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటైన తరువాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
మున్సి‘పోల్స్’కు ముందే హోదా పెంపు
సాక్షి, అనంతపురం న్యూసిటీ/కదిరి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించేందుకు సిద్ధమైంది. ఈనెల 31లోగా ఆయా పంచాయతీల స్థాయి పెంపుపై వివరాలు ఇవ్వాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం.18 విడుదల చేసింది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలతో పాటు కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడనున్న మూడు పంచాయతీల సమీప గ్రామాలు, ప్రాంతాలను సైతం ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరింది. దీంతో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కొత్తగా ఏర్పాటు కానున్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సమీప ప్రాంతాలు, గ్రామాల సమగ్ర సమాచారం ఇవ్వాలని పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మున్సి‘పోల్స్’కు ముందే హోదా పెంపు ఎన్నికలకు ముందే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుత్తి, పామిడి మున్సిపాలిటీలున్నాయి. ఈ నెల 2వ తేదీతో వీటి పాలకవర్గం గడువు ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వీటికి తిరిగి ఎన్నికలు నిర్వహించేలోపే ఉరవకొండ, గోరంట్ల, పెనుకొండ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కల్పించి వీటికీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది ప్రతిపాదనలు గతేడాది ఆగస్టు 23న అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారి జిల్లాలోని ఉరవకొండ, పెనుకొండ, గోరంట్ల, యాడికి మేజర్ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించాలని, అనంతపురం చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే రాజీవ్కాలనీ, ప్రసన్నాయపల్లి, రాప్తాడు, ఏ నారాయణపురం పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అనంతపురం చుట్టు పక్కల ఉన్న బీకేఎస్, ఉప్పరపల్లి, రుద్రంపేట, కక్కలపల్లి కాలనీ, కక్కలపల్లి, అనంతపురం రూరల్ గ్రామ పంచాయితీలను విలీనం చేయవద్దని పేర్కొన్నారు. హోదా పెరిగితే.. నిధుల వరద పెనుకొండ, గోరంట్ల, ఉరవకొండ ప్రాంతాలను నగర పంచాయతీలు హోదా దక్కితే వాటికి భారీగా నిధులు మంజూరవుతాయి.దీంతో అవి అభివృద్ధి దిశగా ముందుకెళ్లనున్నాయి. -
మరో 4నగర పంచాయతీలు
సాక్షి, అరసవల్లి: ఓవైపు గ్రామీణాభివృద్ధి... మరోవైపు పట్టణీకరణ.. ఇలా అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పించి, జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సంకల్పించింది. ఇప్పటికే మారుమూల గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ కాగా.. పట్టణ నాగరికత, వనరులు పెరిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీ/మున్సిపాల్టీలుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మరోసారి నగర పంచాయతీల అంశం తెరమీదకొచ్చింది. ఈమేరకు జిల్లాలో రాజకీయ, పారిశ్రామిక, ఆర్థిక, సహజ వనరులు, జనాభా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు పురపాలక శాఖ సన్నద్ధమయ్యింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు ఆయా ప్రతిపాదిత పంచాయతీల నైసర్గిక స్వరూపం, జనాభా, అతి సమీప గ్రామ పంచాయతీల్లో ఉన్న జనాభాతోపాటు అసెస్మెంట్లు తదితర వివరాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆచరణ సాధ్యంగా మలిచేందుకు ఆయా పం చాయతీ అధికారులు తగు చర్యల్లో నిమగ్నమయ్యారు. స్వరూపం మారనున్న ఆ నాలుగు... జిల్లాలో ప్రస్తుతం వరకు 1141 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ప్రధానంగా టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం పట్టణ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు రావడంతో జిల్లాలో చర్చలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఈ నాలుగు పంచాయతీలు రాజకీయ ప్రాధాన్యత గల ప్రాంతాలు కావడంతో అన్ని విధాలుగా అప్గ్రేడ్ అవ్వనున్నట్లు చెప్పవచ్చు. మున్సిపల్ నిబంధనల ప్రకారం నగర పంచాయతీ లేదా మున్సిపాల్టీగా మార్పు చేయాలంటే కనీస జనాభా 20 వేలకు మించిన పంచాయతీలుగా ఉండాలి. అయితే ప్రస్తుతం ప్రకటించిన నాలుగు పంచాయతీల్లో పాతపట్నం, రణస్థలంలలో 20 వేలలోపు జనాభా ఉండడంతో సమీప గ్రామాలను కలుపుకుని నగర పంచాయతీలుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈనాలుగు పంచాయతీ కేంద్రాల స్వరూపాలే మారిపోనున్నాయి. ఈనెల 31లోగా నివేదికలు పంపించేందుకు చర్యలు జిల్లాలో నాలుగు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు కోరారు. నిబంధనల ప్రకారం ప్రతిపాదిత పంచాయతీకి సంబంధించి జనాభా, ఆదాయం, వనరులు, కోల్పోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, విస్తీర్ణం, సర్వే నెంబర్లు తదితర 13 ప్రొఫార్మాలను ఈనెల 31లోగా పంపించేందుకు చర్యలు చేపడుతున్నాం. టెక్కలి జిల్లా కేంద్రం తర్వాత ప్రధాన రాజకీయ కేంద్రంగా టెక్కలినే చెప్పవచ్చు. ఇక్కడ 2001 జనాభా లెక్కల ప్రకారం 28,631 మంది ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 34 వేల వరకు చేరింది. అలాగే ఈ పంచాయతీ కేంద్రంలో 6067 ఇళ్లు ఉన్నట్లు అధికారిక సమాచారం. అయితే టెక్కలికి అతి సమీపంలో చాకిపల్లి, అక్కువరం, బన్నువాడ, రావివలస, కె.కొత్తూరు తదితర పంచాయతీలున్నాయి. నరసన్నపేట వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్న నరసన్నపేటలో 2001 నాటికి 26,280 మంది జనాభా ఉండగా, ఇప్పుడా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. అలాగే 8977 ఇళ్లు ఉండగా, అతి సమీపంగా సత్యవరం తదితర పంచాయతీలున్నాయి. పాతపట్నం పాత సిటీగా పేరున్న ఈ పట్టణానికి ఒడిశా సరిహద్దు ప్రాంతంగా చారిత్రక ప్రాధాన్యత ఉంది. 2001 నాటికి 17,247 మంది జనాభా ఉండగా, ప్రస్తుతానికి ఈ సంఖ్య 20 వేలకు పైగా చేరింది. ఇక్కడ 5995 ఇళ్లు ఉండగా, అతి సమీపంగా ప్రహరాజపాలెం, బూరగాం, కోదూరు తదితర గ్రామాలున్నాయి. రణస్థలం ఫార్మా కేంద్రంగా పేరున్న రణస్థలం ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండగా, పలు ఫార్మా పరిశ్రమలు, అణువిద్యుత్ కేంద్రం నిర్మాణంతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా పేరు ప్రసిద్ధి కానుంది. రణస్థలంతోపాటు జంట ప్రాంతంగా ఉన్న జేఆర్ పురంలో జనాభా కలిపి 2001 నాటికి 11,332 మంది కాగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 15 వేలకు పైగానే చేరింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్థిర నివాసాలు చేసుకోవడంతో ఈ ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరించింది. అలాగే ఈ జంట ప్రాంతాల్లో ప్రస్తుతానికి 3,062 ఇళ్లు ఉన్నాయి. రణస్థలానికి సమీపంలో రావాడ, కోష్ట తదితర ప్రాంతాలున్నాయి. -
‘విజ్ఞప్తులు పట్టించుకోకుండా పునర్విభజన చేశారు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్లు బుధవారం గాంధీభవన్లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంపత్కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మున్సిపాలిటీల పునర్విభజన చేశారని మండిపడ్డారు. 3385 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే వివిధ వేదికల ద్వారా న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. వంశీచంద్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వార్డుల విభజన చేసిందని ఆరోపించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ సుదీర్ఘంగా చర్చిందని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రజలు వార్డుల పునర్విభజనపై ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన వినతుల కోసం గుడువును పెంచాలని కోరారు. స్థానిక నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాదమని తెలిపారు.