ఏపీపీఎస్సీలో మార్పులకు కమిటీ | Committee for changes in APPSC: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీలో మార్పులకు కమిటీ

Nov 13 2024 5:23 AM | Updated on Nov 13 2024 5:23 AM

Committee for changes in APPSC: Andhra pradesh

ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశే­ఖర్‌ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధి­కారు­లతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్‌ కమిషన్స్‌లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

19 నుంచి ఆయుష్‌ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
ఆయుష్‌ విభాగంలో ఆయుర్వేద, హోమియో మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన పరీ­క్ష­ల్లో విజయం సాధించిన అభ్యర్థుల సర్టిఫికె­ట్లను ఈనెల 19 నుంచి పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్‌ సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు 1: 3 నిష్పత్తి­లో అభ్యర్థులను పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్‌ లిస్టును కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచామని, ఈనెల 19, 20 తేదీల్లో అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement