Ayush
-
Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్లో జపాన్ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.137 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో మూడో మ్యాచ్లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్ -
Ind vs Pak: ఆఖరి వరకు పోరాడిన యువ భారత్.. పాక్ చేతిలో తప్పని ఓటమి
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. లీగ్ దశలో తమ తొలి మ్యాచ్లో భారత్తో తలపడ్డ పాక్.. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్లో శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. షాజైబ్ ఖాన్ భారీ శతకంఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్హాఫ్ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్ ఖాన్ భారీ శతకం బాదాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మద్ రియాజుల్లా 27 రన్స్ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్ నాగరాజ్ మూడు, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.ఆదిలోనే ఎదురుదెబ్బఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నిఖిల్ కుమార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.Nikhil Kumar brings up a crucial half-century, adding vital runs for India! 💪🏏Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/X7DCbJLNxq— Sony LIV (@SonyLIV) November 30, 2024 నిఖిల్ వీరోచిత అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నిఖిల్ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేశాడు. అయితే, నవీద్ అహ్మద్ ఖాన్ బౌలింగ్లో నిఖిల్ స్టంపౌట్ కావడంతో యువ భారత్ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్ ఇనాన్ పోరాటపటిమ కనబరిచాడు. చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగాచేతిలో ఒకే ఒక వికెట్ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్ ఝులిపించాడు. ఈ టెయిలెండర్ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్ సేన ఆలౌట్ అయింది.ఫలితంగా పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.తదుపరి జపాన్తోఇదిలా ఉంటే.. భారత్ తమ రెండో మ్యాచ్లో జపాన్తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
ఏపీపీఎస్సీలో మార్పులకు కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్స్లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 19 నుంచి ఆయుష్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలనఆయుష్ విభాగంలో ఆయుర్వేద, హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 19 నుంచి పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్ సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్ లిస్టును కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, ఈనెల 19, 20 తేదీల్లో అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. -
ఆరోగ్య యోగం ఎప్పుడో ?
సాక్షి, సిద్దిపేట: ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా యోగా కేంద్రాల నిర్మాణం జరిగినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 421 ఆయుర్వేద, యునాని, హోమి యోపతి వైద్య,ఆరోగ్య కేంద్రాలకు యోగా కేంద్రాలను మంజూరు చేశారు.పలు చోట్ల నిర్మా ణాలు పూర్తయినా, శిక్షకులను నియమించకపోవడంతో అవి స్టోర్ రూంలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షకులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు వీలుగా యోగాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యోగా కేంద్రం షెడ్ నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున రూ 25.26 కోట్ల నిధులు విడుదల చేశారు.ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్బీ, పీఆర్, టీఎస్ఎంఐడీసీలకు అప్పగించారు. తెలంగాణవ్యాప్తంగా 421 కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 289 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 42 కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, మరో 90 కేంద్రాలకు స్థల కొరత ఏర్పడింది. నిర్మాణాలు పూర్తయినా.. యోగా శిక్షణకు షెడ్ల నిర్మాణాలు పలు చోట్ల పూర్తయినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని జిల్లాల్లో ఏడాదిన్నర క్రితం నిర్మాణాలు పూర్తయినప్పటికీ యోగా శిక్షకులను నియమించకపోవడంతో అవి తెరుచుకోలేదు. ఈ షెడ్లు వినియోగంలో లేకపోవడంతో పలు చోట్ల స్టోర్ రూంలుగా, మరికొన్ని చోట్ల అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. శిక్షకుల నియామకం ఎప్పుడు? రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో యోగా శిక్షణ కేంద్రానికి ఇద్దరు శిక్షకుల చొప్పున నియమించాలని నిర్ణయించారు. అందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు. గత నెలలో యోగా శిక్షకుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహా్వనించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదు. పురుషులకు నెలకు రూ.8 వేలు, మహిళకు రూ.5 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. త్వరలో ప్రారంభిస్తాం త్వరలో యోగా కేంద్రాలను ప్రారంభిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు శిక్షకుల ఎంపికకు గత నెలలో ఆయా జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. త్వరలో శిక్షకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాం. – రవినాయక్, ఆర్డీడీ, హైదరాబాద్, ఆయుష్ -
అద్భుత ఫలితాలంటూ ప్రకటించడం నేరం
న్యూఢిల్లీ: వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి ధ్రువీకరణలు లేని ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతోపాటు వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది. ఇటువంటి ప్రకటనలపై నిషేధం విధించామని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.తాము ఏవిధమైన ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోప తి(ఏఎస్యూహెచ్) మందులకు ధ్రువీకరణలను ఇవ్వలేదని కూడా తెలిపింది. అదేవిధంగా, ఆయా వైద్య విధానాలకు సంబంధించిన ఔషధాల తయారీ, విక్రయాలకు కూడా ఏ ఉత్పత్తిదారు లేదా కంపెనీకి అనుమతులు మంజూరు చేయలేదని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940ని అనుసరించి ఏఎస్యూహెచ్ ఔషధాల తయారీ, విక్రయాలకు అనుమతులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే జారీ చేస్తాయని కూడా వివరించింది. ఏఎస్యూహెచ్ ఔషధాలను సంబంధిత వైద్యులు/ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని కూడా తెలిపింది. అభ్యంతరకర, తప్పుడు ప్రకటనలు, నకిలీ మందులపై రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీకి లేదా ఆయుష్ శాఖకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ సూచించింది. -
ఆయుష్.. నొప్పులు మాయం
లక్డీకాపూల్: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగర ప్రజలు వివిధ రకాల నొప్పులతో సతమతమవుతున్నారు. అవే పెద్ద సమస్యలుగా భావించి చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తొలనొప్పి, కండరాల, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, మిటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది పెద్ద జబ్బులుగా భావిస్తున్నారు. దీంతో రిఫరల్ అస్పత్రి అయిన నిమ్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకు ఉపశమనం కలి్పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ నిమ్స్లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుష్ సేవలకు ప్రాచుర్యం కలి్పంచేందుకు దృష్టిని కేంద్రీరించింది. లోపించిన శారీరకశ్రమ..మనిషి కూర్చునే భంగిమని బట్టి కూడా ఈ నొప్పులు చోటుచేకుంటాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో శారీరశ్రమ లోపించింది. చెప్పాలంటే.. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విటమిన్ల లోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనార్యోగం పాలవుతున్నారు. ఆస్పత్రికి వచి్చన రోగులకు ప్రకృతి వైద్యం పట్ల అవాగాన కల్పిస్తూ.. భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూసేందుకే ఈ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కృషి చేస్తుంది. – డా.నాగలక్షి్మ, ప్రకృతి వైద్యనిపుణురాలు అలోపతికి సమాంతరంగా...అలోపతి వైద్యానికి సమాంతరంగా ఆయుష్ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకూ ప్రకృతి వైద్య చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే సహజ వైద్య చికిత్సల లక్ష్యమని నిపుణులు పేర్కొంటున్నారు. నరగంలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన మొదలైన పర్యావరణ మార్పులకు దారితీసింది. అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ప్రకృతి వైద్య చికిత్సలు. సాధారణ నొప్పులతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలోపతి వైద్య పద్దతిలో లొంగని వ్యాధులకు సైతం ఆయుష్ ఉపశమనం కలి్పస్తుంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ సహజ వైద్య చికిత్సల పట్ల ఆసక్తి చూపుతున్నారు.నామమాత్రపు రుసుము..పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్ వంటి సేవలతో పాటు ప్రకృతి వైద్య సేవల్లో భాగంగా జనరల్ మసాజ్, స్టీమ్బాత్, డైట్ కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకాళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది. ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నారు. చికిత్స పొందాలంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాస్తవానికి సహజ వైద్య చికిత్సలను ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిందే. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక స్లాట్గా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకూ మరో స్లాట్గా నిర్ణయించారు. -
‘ఆయుష్’కు కొత్త కళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ డిస్పెన్సరీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వానంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ను అమర్చి విద్యుత్ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయడం వంటి పనులన్నీ పూర్తయ్యాయి. రూ.12 కోట్లతో మందుల సరఫరా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మందులు వినియోగంలో ఉండగానే భవిష్యత్లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్ మందుల తరహాలోనే ఆయుష్ మందులను కూడా ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ లగింశెట్టి తెలిపారు. -
గాజువాక ఆటోనగర్ లో 112 అడుగుల ఆయుష్ గణపతి
-
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
మెగాహీరోకి పోటీగా శరత్ బాబు వారసుడు
కొన్నాళ్ల క్రితం (మే 22) కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్బాబు ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు. శరత్బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. కాగా గతంలో ఆయుష్ని తన నటవారసుడిగా శరత్బాబు పేర్కొన్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ‘దక్ష’ ఈ నెల 25న విడుదల కానుంది. ఇదే రోజున మెగా హీరో వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' థియేటర్లలోకి రానుంది. ‘‘మా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మా ప్రోడ్యూసర్, డైరెక్టర్ రాజీ పడకుండా పూర్తి చేశారు. మా నాన్న (శరత్బాబు)గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం’’ అన్నారు ఆయుష్. అఖిల్, రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రానికి సంగీతం: లలిత్. -
ఆయుష్లో 156 వైద్యుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదంలో 54, హోమియోలో 33, యునానిలో 69 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆగస్టు ఏడో తేదీ ఉదయం 10.30 గంటల నుంచి అదే నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకోసం mhsrb.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 37, మల్టీ జోన్–2లో 17 పోస్టులను భర్తీ చేస్తారు. హోమియో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 23, మల్టీ జోన్–2లో 10 పోస్టులను భర్తీ చేస్తారు. యునానీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 36, మల్టీ జోన్–2లో 33 భర్తీ చేస్తారు. అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18–44 ఏళ్ల వయసుగల వారై ఉండాలి. ఈ పోస్టుల పేస్కేల్ రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. ఖాళీలను చేర్చడం లేదా తొలగించడం.. ఏదైనా ఉంటే ఫలితాల ప్రకటన వరకు చేస్తారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక.. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. సంబంధిత అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంగా అప్లోడ్ చేయాల్సిన పత్రాలను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, సంబంధిత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), లోకల్ ఏరియా కోసం స్టడీ సర్టిఫికెట్ (1 నుంచి 7వ తరగతి), కమ్యూనిటీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ), బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ కోరే దరఖాస్తుదారులకు తాజా ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు రుసుము కింద ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు తప్పని సరిగా రూ. 200 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత రిఫరెన్స్ ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. -
TS: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆయుష్లో మొత్తం 156 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, అభ్యర్థులు ఆగస్టు 7న ఉదయం 10.30గంటల నుంచి నుంచి 22న సాయంత్రం 5 గంటలవరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, మొత్తం 156 ఉద్యోగాల్లో.. మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) 54; హోమియో 33, యునాని 69 చొప్పున ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు. - అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మించరాదు. - దరఖాస్తు రుసుం రూ.500. - ప్రాసెసింగ్ ఫీజు రూ.200లుగా నిర్ణయించారు. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ప్రాసెసింగ్ పీజు నుంచి మినహాయించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఆయుష్ ను బలోపేతం చేస్తాం
సిద్దిపేటజోన్: ప్రభుత్వం ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, ఆయుర్వేద వైద్య సేవలను మరింతగా విస్తృతం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండేలా చూస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీసు కన్వెన్షన్ హాల్లో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంతోపాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. గతంలో కేవలం 400 మంది వైద్యులను నియమిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 1,200 మందిని నియమించిందని పేర్కొన్నారు. జీవనధార మాకు జీవం అయింది.. ఆయుష్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో తయా రుచేసిన జీవనధార ఔషధం తమకు జీవం అయిందని, సీఎం కేసీఆర్తోపాటు తానుకూడా జీవనధా ర మందును కరోనా సమయంలో నిత్యం వాడానని హరీశ్రావు తెలిపారు. ఆయుర్వేద వైద్య సేవలను మరింతగా విస్తరించడానికి త్వరలో సిద్దిపేట, భూ పాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల ఆసుపత్రులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపా రు. అలాగే సిద్దిపేట మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిందాల్ ప్రకృతి చికిత్సాలయం తరహా లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో ఔ షధమొక్కలతో ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ చెప్పారు. ఇందులో భాగంగా రెండు వేల పల్లె దవాఖానాల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చి నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన ఒప్పందం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇక్కడి మెడికల్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉమ్మడి ఒప్పందం ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చి న 21 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కేవలం తెలంగాణ విద్యార్థులకు ఉండేలా జీఓ తెస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఒకప్పటి జర్నలిజానికి, ఇప్పటి జర్నలిజానికి చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇస్తామని చెప్పారు. కోమటి చెరువు సూపర్ హరీశ్కు సహచర మంత్రుల అభినందన సిద్దిపేటజోన్: సిద్దిపేట కోమటి చెరువు చాలా బాగుందని.. సహచర మంత్రి హరీశ్ రావు చిత్తశుద్ధి, పట్టుదలకు ఇది నిదర్శనమని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కితాబిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా వారంతా కోమటి చెరువును సందర్శించారు. తీగల వంతెన, నెక్లెస్ రోడ్, గ్లో గార్డెన్, సింథటిక్ ట్రాక్ను తిలకించారు. వారికి మంత్రి హరీశ్ రావు అభివృద్ధి పనుల గురించి వివరించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు సాయిరాం తదితరులు ఉన్నారు. -
హైటెక్స్లో జరిగిన స్వస్త్య ఎక్స్పో గ్లోబల్ ఆయుష్ – వెల్నెస్ ఎక్స్పో ఫోటోలు...
-
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్మెంట్కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
కేఆర్ఐపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: అనధికార పెట్టుబడి సలహాలు ఇస్తున్న కారణంగా నాలెడ్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేఆర్ఐ)తోపాటు సంస్థ యజమాని ఆయుష్ ఝవార్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేసింది. ఆరు నెలలపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. కేఆర్ఐ, ఆయుష్లకు సెబీ 2021 జులైలో షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తదుపరి తాజా ఆదేశాలు జారీ చేసింది. సెబీ నుంచి సర్టిఫికెట్ పొందకుండానే కేఆర్ఐ, ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సర్వీసులను అందించడం ద్వారా అడ్వయిజరీ నిబంధనలను అతిక్రమించాయి. దీంతో సెబీ తాజా చర్యలను చేపట్టింది. సలహాల ద్వారా ఫీజు రూపేణా ఆర్జించిన రూ. 27.57 లక్షలను 3 నెలల్లోగా వాపస్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. -
కోవిడ్ కట్టడిలో ఏపీ ఆయుష్ కార్యక్రమాలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుష్ వైద్య సేవల ద్వారా కోవిడ్–19ను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించాయని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన వివిధ ఆయుష్ ఆధారిత కార్యక్రమాలు, పద్ధతుల సమాచారాన్ని వివరిస్తూ నీతి ఆయోగ్ ఓ సంకలనాన్ని రూపొందించింది. దీనిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ శనివారం విడుదల చేశారు. ఏపీలో గరిష్ట సామర్థ్యానికి తగ్గట్టుగా.. కోవిడ్–19 కట్టడి విషయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అందుబాటులో ఉన్న వనరుల గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కోవిడ్–19 రోగ నిరోధకత, కోవిడ్ అనంతర పునరుత్తేజం లక్ష్యాలతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీలలో పనిచేస్తున్న సుమారు 339 మంది ఆయుష్ అధికారులకు కాంటాక్ట్ ట్రేసింగ్, మందుల పంపిణీ, నియంత్రణ, కౌన్సెలింగ్, క్లినికల్ మేనేజ్మెంట్ కోసం విధులు కేటాయించారు. దాదాపు 400 మంది పీజీ స్కాలర్లు, ఇంటర్న్లు ఆయుర్వేదం, హోమియోపతికి సంబంధించిన ప్రొఫిలాక్టిక్ ఔషధాల పర్యవేక్షణ, పంపిణీ చేశారు. కళాశాలల అధ్యాపకులు ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ నివారణ చర్యలను చేపట్టింది. ఆయుష్ కళాశాలల అధ్యాపకులు పీజీ స్కాలర్లు, ఇంటర్న్ల సహకారంతో అవగాహన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణలోనూ చురుగ్గా.. తెలంగాణ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖ.. కోవిడ్–19 కట్టడి కోసం కేసులను గుర్తించడం, వైరస్ వ్యాప్తిని తగ్గించే చర్యలు చేపట్టడం, వైరస్ నివారణ, నిర్వహణ ప్రోటోకాల్లను అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది. త్వరితగతిన నివారణ ఔషధాల తయారీ, పంపిణీని చేపట్టింది. ఆయుష్ బోధనా ఆసుపత్రులను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చింది. మ్యూకోర్మైకోసిస్ ఇన్ఫెక్షన్కు నివారణ, చికిత్సకు సంబంధించిన ఆయుష్ ప్రోటోకాల్లను వేగంగా అమలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 461 ఆయుష్ అధికారులను కోవిడ్–19 నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఉపయోగించారు. 1,126 మంది ఆయుష్ వైద్యులు హాస్పిటల్ ప్రోటోకాల్లకు సంబంధించిన వర్చువల్ ప్లాట్ఫామ్పై శిక్షణ పొందారు. 1,094 మంది ఆయుష్ సిబ్బందిని ఆయుష్ క్వారంటైన్/ఐసోలేషన్ సెంటర్లలో నియమించడంతో పాటు శిక్షణ కూడా అందించారు. 464 మంది వైద్యులు 602 సహాయక సిబ్బందితో కలిసి 4 ఆయుష్ బోధనా ఆసుపత్రులలో సేవలు అందించారు. -
21న విజయవాడలో యోగాసనాల పోటీలు
సాక్షి, అమరావతి: జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిషనర్ రాములు తెలిపారు. 8 ఏళ్లు పైబడిన వారందరూ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని వెల్లడించారు. ఎంపిక చేసిన 16 ఆసనాలలో 8 ఆసనాలను వేయగలిగిన వారు సంబంధిత ఫోటోలను advyoga2022@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. ఫొటోతో పాటు పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, చిరునామా, కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వివరాలను జత చేయాలన్నారు. జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఫొటోలు పంపాల్సి ఉంటుందన్నారు. పంపిన ఫోటోలను ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం ఎంపికైన వారు జూన్ 10న న్యాయ నిర్ణేతల సమక్షంలో అవే ఆసనాలను ఆన్లైన్లో వేయాలన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్ 21న విజయవాడలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. వివరాల కోసం 9441014521 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ
గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్ ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్ను తులసీభాయ్గా ప్రధాని పేర్కొన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియా ఛాంపియన్గా నిలుస్తోందన్నారు. 150కి పైగా ఎంవోయూలు గుజరాతి రాజధాని గాంధీనగర్లో ఆయుష్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఔషధ మొక్కలకు ఇండియా పుట్టిళ్లన్నారు. మెడిసినల్ ప్లాంట్స్ని గ్రీన్గోల్డ్గా అభివర్ణించారు. ఆయుష్ ఉత్పత్తి చేస్తున్న మందులు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని తెలిపారు. ఆయుష్ ఆహార్ ద్వారా ఫుడ్ సప్లిమెంట్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయుష్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు, తయారీదారులతో బలమైన నెట్వర్క్ తయారు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 50 కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. గ్రీన్ గోల్డ్ ఆయుర్వేదాన్ని గ్రీన్ గోల్డ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయుర్వేదానికి రోజురోజుకు డిమాండ్ పెరుగతుందన్నారు. 2014లో మూడు బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయుష్ ఉత్పత్తుల విలువ నేడు 18 బిలియన్ డాలర్లకు పెరగడమే ఇందుకు ఉదాహారణ అన్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియా వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ వీసాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. భారత్ను మరువలేం సంప్రదాయ మెడిసిన్స్ని ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వాన్ని మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాత్ మెచ్చుకున్నారు. వైద్య రంగంలో మారిషన్కు భారత్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. మారిషన్లో ఆయుర్వేద కాలేజీ నిర్మించడంతో పాటు కోవిడ్ సమయంలో భారత్ ఎంతో అండగా ఉందని ఆయన తెలిపారు. చదవండి: సంప్రదాయ వైద్యానికి సమయమిదే! -
నెల్లూరు ఆనందయ్యకు నోటీసులు జారీ
-
ఆనందయ్య మందుకు ‘ఆయుష్’ అంగీకారం
సాక్షి, అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
కారుకు రూ.2 లక్షలు, నెల ఖర్చేమో రూ.3 లక్షలు
సాక్షి, అమరావతి: అసలే అంతంత మాత్రం నిధులతో నెట్టుకొచ్చే ఆయుష్ విభాగంలో కార్ల నిర్వహణలో జరుగుతున్న దుబారాను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయుష్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న ఈ పరిస్థితి గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. 2006లో కొన్న క్వాలిస్ కారును ఇప్పటికీ వాడుతున్నారు. ఆ కారును అమ్మితే ఇప్పుడు రూ.2 లక్షలు కూడా రావు. కానీ దీనికి నలుగురు డ్రైవర్లు, నెలకు 200 లీటర్ల డీజిల్, మరమ్మతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తదితరాలన్నీ కలిపి దాదాపు రూ.3 లక్షలవుతోంది. ముగ్గురు ప్రభుత్వ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ వేతనం ఉంది. ఒక ఔట్సోర్సింగ్ డ్రైవర్కు రూ.15 వేలు. గతంలో రెండు కార్లుండగా ఒక కారు నెలల తరబడి షెడ్లో ఉంది. ప్రస్తుతం నడుస్తున్న క్వాలిస్ కారుకు నలుగురు డ్రైవర్లు అవసరం లేదన్నది అక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. నెలకు ఒక కారు వ్యయం వేతనాలతో కలిపి రూ.3 లక్షలంటే ఏడాదికి రూ.36 లక్షలు. డ్రైవర్లు అధికంగా ఉంటే కలెక్టర్కు సరెండర్ చేస్తే అవసరమున్న చోట వినియోగించుకుంటారు. కానీ గత 15 ఏళ్లుగా ఈ పనిచేయడం లేదు. ఈ నిర్వహణ భారాన్ని చూసి అక్కడి ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. చదవండి: కోళ్లయందు ‘కడక్నాథ్’ వేరయా..! -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఆయుష్ కిట్ల రూపకల్పన అద్భుతం : ఈటెల
సాక్షి, హైదరాబాద్ : ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి ఈ కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ .. ఆయుర్వేదం అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రమని పేర్కొన్నారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆయుష్ డిపార్ట్మెంట ఐదు రకాల మందులతో ఆయుష్ రక్ష కిట్స్ను రూపొందించారన్నారు. ఆయుష్ కిట్స్ తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచానికి ఇలాంటి వైద్యాన్ని అందించిన దేశం భారత దేశం మాత్రమేనన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు. (లాక్డౌన్: భారీగా రోడ్డెక్కిన వాహనాలు) అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, ఐజిపి హోమ్ గార్డ్స్ బాలనాగాదేవి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డిలకు మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ రక్ష కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డెరైక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ లాబొరటరీ డైరెక్టర్ శ్రీనివాస చారీ, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ కె సి. డాక్టర్ శ్రీకాంత్ బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషద్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు, డాక్టర్ సురేష్ జకోటియ పాల్గొన్నారు. ఈ కిట్స్ తో పాటు విశ్వ ఆయుర్వేద పరిషద్ తరపున 250 గ్రాముల చవన్ ప్రాష్ను రెండు వేల యూనిట్లుగా పంపిణీ చేస్తున్నట్లు సెక్రెటరీ తెలిపారు. (మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..!) -
ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు. #WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX — ANI (@ANI) May 7, 2020 అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి) -
గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కారు తీపికబురు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్లో పీజీ సీట్లలో చోటు కల్పించింది. గత ఐదేళ్లలో ఆయూష్ పీజీ సీట్లలో గిరిజన (ఎస్టీ) రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై గిరిజన మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కంటి వెలుగుతో ‘ఆయుష్’ ఖాళీ
కామారెడ్డి అర్బన్ : జిల్లా కేంద్రంలోని ఆయుష్ విభాగంలో ఆయుర్వేదం, నాచురోపతి, హోమి యోపతి వైద్యశాలలు ఒకే ప్రదేశంలో నిర్వహి స్తున్నారు. కాగా హోమియోపతి ఆసుపత్రికి కొనేళ్లుగా వైద్యుడు లేడు. ఆయుర్వేద, నేచురోపతికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు సేవలు అందిస్తున్నారు. హోమియోపతి వైద్యానికి వచ్చే వారికి కాంపౌండరే తనకు తెలిసిన మందులు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగులు ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులైన కాళ్లు, మోకాళ్ల నొప్పులు, కిడ్నీ, చర్మసంబంధిత వ్యాధులు, అలర్జీలు, గర్భాశయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యం కోసం వస్తున్నారు. వీరికి నాచురోపతి, ఆయుర్వేదంలో మంచి మందులు లభిస్తున్నాయి. దీంతో రోజు దాదాపు 50 మంది వరకు రోగులు వస్తున్నారు. జిల్లాలో కామారెడ్డితోపాటు పిట్లం, మాచారెడ్డి, పెద్దకొడప్గల్, ఎర్రాపహాడ్లలోని ఆయుష్ వెద్యశాలల కాంట్రాక్ట్ వైద్యులందరికీ కంటివెలుగు డ్యూటీలు వేశారు. దీంతో ఆయుష్ వైద్య సేవలు అందకుండాపోయాయి. కంటి వెలుగు డ్యూటీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వ తేదీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. కామారెడ్డి ఆయుష్లో పనిచేస్తున్న వైద్యులను ఆరు నెలల పాటు డిప్యూటేషన్పై కంటి వెలుగు బాధ్యతలు అప్పగించారు. దీంతో సంప్రదాయ వైద్య సేవల కోసం వస్తున్న రోగులకు వైద్యం అందకుండాపోయింది. వైద్య సేవల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. కాగా కంటి వెలుగు కార్యక్రమంలో కంటివైద్యానికి ఎలాంటి సంబంధం, అర్హత లేని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల సేవలు వినియోగించుకుంటుండడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంటి వెలుగు డ్యూటీలను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని రోగులు కోరుతున్నారు. సీఎం ఆదేశాలు ఇలా...వైద్య అధికారులు మరోలా... ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగుపై పలు సూచనలు చేశారు. కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్యసేవలకు అటంకం కలుగకుండా చూడాలన్నారు. కంటి పరీక్షల శిబిరంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న వారిని వినియోగించవద్దని సూచించగా.. అందుకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆర్యోగశాఖ అధికారులు ఆయుష్ కాంట్రాక్ట్ వైద్యులకు కంటి వెలుగు డ్యూటీలు వేసి రెగ్యులర్ వైద్యులను మినహాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా కేంద్రమైనా పరిస్థితి మారలే.. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని నియామకాలు జరిగి కామారెడ్డి ఆయుష్ ఆస్పత్రి పరిస్థితి మెరుగు పడుతుందని ప్రజలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినప్పటికీ వైద్య సేవలు మెరుగుపడడం లేదు. కనీసం డిప్యూటేషన్పైకూడా హోమియోపతి వైద్యుడిని నియమించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ప్రజలు వినతులూ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. -
కిడ్నాపైన విద్యార్థి దారుణ హత్య
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
సింగిల్ షెడ్యూల్లో...
ఆయూష్, వర్ణిక హీరో హీరోయిన్లుగా రవికుమార్ పొన్నగంటి దర్శకత్వంలో వ్యాంకిష్ మీడియా పతాకంపై షేక్ గౌస్ నిర్మిస్తున్న చిత్రం గుంటూరులో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్లాప్నివ్వగా, నిర్మాత షేక్ గౌస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. గుంటూరు ఎస్.పి వై.టి. నాయుడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ –‘‘నాన్స్టాప్గా ఒకే షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేయనున్నాం. కలకత్తా, వైజాగ్, బ్యాంకాక్లో షూటింగ్ జరపనున్నాం. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అమ్మపండు, కెమెరా: దుర్గా ప్రసాద్. -
మూడు రెట్ల వృద్ధి:2.6 కోట్ల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: 2022 నాటికి ఆయుష్ రంగంలో మూడు రెట్ల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయుష్ పరిశ్రమ భవిష్యత్తులో రెండంకెల వృద్ధిని సాధించనుందని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభింస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. 2020 నాటికి 26 మిలియన్ల మందికి పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ నేటి (డిసెంబర్4) నుంచి మూడు రోజులపాటు జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ వెల్నెస్, ఆరోగ్య 2017 సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఆయుష్ రంగం ప్రగతి దిశగా పయనిస్తోందని.. ఈ రంగంలో మున్ముందు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సురేశ్ ప్రభు అన్నారు. 2020 నాటికి ఈ రంగం ప్రత్యక్షంగా 10లక్షల మందికి, పరోక్షంగా 2.5 కోట్ల మందిని ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి కలిసి ఉన్న ఆయుష్రంగం ద్వారా దేశీయంగా రూ. 500కోట్లను ఎగుమతుల ద్వారా రూ.200 వందలకోట్లను సాధిస్తుందని అంచనా వేసినట్టు చెప్పారు. సంప్రదాయ ఔషధాలపై అవగాహన కల్పించేందుకు భారత్తో కలిసి అనేక దేశాలు పనిచేస్తున్నాయని, అందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్రమంత్రి ప్రభు వెల్లడించారు. దాదాపు 6,600 ఔషధ మొక్కల సంపదతో ప్రపంచంలోని ఆయుష్ మరియు ఔషధ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. అలాగే ఆయుష్లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైద్యరంగంలో స్టార్టప్లు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో అనేక అవకాశాలున్నాయని ప్రభు తెలిపారు.వచ్చే ఐదేళ్లలో ఆయుష్ రంగం మూడు రెట్ల పరిమాణాన్ని పెంచేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ వైద్య రాజేష్ వెల్లడించారు. -
ఆ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య,ఆరోగ్య రంగం రెండంకెల వృద్ధి సాధించే క్రమంలో ఆయుష్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.2020 నాటికి ఆయుష్ పరిశ్రమలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 2.5 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సమకూరుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆయుర్వేద, యోగ,నేచురోపతి,యునాని,సిద్ధ,హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆయుష్ మార్కెట్ రూ 500 కోట్లుకాగా, రూ 200 కోట్ల మేర ఎగుమతులు సాగుతున్నాయి. హాలిస్టిక్ హెల్త్కేర్లో స్టార్టప్ల కోసం యువత ఆసక్తి కనబరుస్తోందని మంత్రి తెలిపారు. వెల్నెస్,ఆరోగ్య 2017 సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. సంప్రదాయ వైద్య విధానాల విషయంలో సాంకేతికత, విజ్ఞానాన్ని మేళవించేందుకు పలు దేశాలతో్ కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఆయుష్ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించిందని తెలిపారు. -
ఆయుష్, సుభాష్లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ షూటర్లు సత్తా చాటారు. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోటీల్లో 7 పతకాలతో ఆకట్టుకున్నారు. మంగళవారం జరిగిన స్కీట్ ఈవెంట్లో ఆయుష్ రుద్రరాజు, సుభాష్ చింతలపాటి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. ఎన్–79 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ఆయుష్ 60 పాయింట్లకు గానూ 48 పాయింట్లు స్కోర్ చేయగా, 46 పాయింట్లు సాధించిన గుస్తీ నోరియా (తెలంగాణ) రజతాన్ని సాధించాడు. సుభాష్ చింతలపాటి (తెలంగాణ) 38 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెలచుకున్నాడు. ఎన్–80 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సుభాష్ (తెలంగాణ) 125 పాయింట్లకు 110 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆయుష్ 103 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఎన్–82 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ మహిళల, జూనియర్ మహిళల విభాగంలో రాష్ట్రానికి చెందిన దండు కాత్యాయని రాజు విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను గెలుచుకుంది. ఇందులో పతకాలు సాధించిన షూటర్లు ఢిల్లీలో జరిగే జాతీయ షూటింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. ఇతర విభాగాల విజేతల వివరాలు జడ్–79 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ పురుషులు: 1. మునెక్, 2. రిజ్వాన్ ఉస్మాన్, 3. మొహమ్మద్ సలీమ్ మూసా. జడ్–81 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ జూనియర్ పురుషులు: 1. మునెక్, 2. ఆర్. నవనీతన్. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
-
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్లో స్వీకరణ మే 12న పరీక్ష.. అదేనెల 22న ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2017 షెడ్యూల్ జారీ అయింది. మే 12న నిర్వహించనున్న ఎంసెట్కు వచ్చేనెల 3 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. సోమవారమిక్కడ జేఎన్టీయూహెచ్లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.250 చెల్లించాలి. ఇతర విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ నిర్వహణ కోసం 25 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 6, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 16, ఆంధ్రప్రదేశ్లో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కర్నూలులోనూ సమన్వయ కేంద్రం ఏర్పాటు చేసినా.. ఈసారి ఇవ్వలేదు. మహబూబ్నగర్, వనపర్తి సమన్వయ కేంద్రాలు సమీపంలోనే ఉండటం, కర్నూలులో పరీక్ష రాసే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా నిర్మల్, భువనగిరి, శంషాబాద్, పెద్దపల్లిలో సమన్వయ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్లో 2 జోనల్ కేం ద్రాలను తగ్గించినట్లు పేర్కొ న్నారు. గతేడాది ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు వెల్లడిం చారు. సమావేశంలో ఎంసెట్ కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.మల్లేశం, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్, కో–కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్పై ఆరోగ్య శాఖకు లేఖ రాస్తాం నీట్ పరిధిలోకి ఆయుష్ కోర్సులు వెళ్లే విషయంలో తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని పాపిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల తోపాటు ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి, యోగా) కోర్సులకు ఎంసెట్ చేపడుతున్నామన్నారు. ఆయుష్పై స్పష్టత కోసం వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తారా? తాము ఎంసెట్ నిర్వహించాలా? అన్న అంశాన్ని అడుగుతామని, వారి నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుతించబోమని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈసారి గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్నది తర్వాత నిర్ణయిస్తామన్నారు. మే నెలాఖరుకల్లా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని, ఈసారి త్వరగా ప్రవేశాలు చేపట్టి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 2018 నుంచి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్లో ఆన్లైన్ పరీక్షలు భవిష్యత్లో ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో చేప ట్టేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్రెడ్డి తెలి పారు. గతేడాది అగ్రికల్చర్ ఎంసెట్ను ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో నిర్వ హించినా... ఈసారి ఆఫ్లైన్లోనే నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఏపీలో అన్ని పరీక్షలను ఆన్లైన్లో నిర్వ హించేందుకు చర్యలు చేపట్టారని, అక్కడి ఫలి తాలను పరిశీలించి, భవిష్యత్లో అవసర మైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసారి ఈసెట్, పీజీఈసెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిం చేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
అంపశయ్యపై ఆయుష్
నెల్లూరు(అర్బన్) : భారతదేశ అతి ప్రాచీనమైన వైద్యవిధానాలతో రోగికి చికిత్సనందించి ఆరోగ్యవంతులను చేయడానికి ఉద్దేశించిన శాఖ ఆయుష్(ఆయుర్వేద, యోగ అండ్ నాచురోపతి, యునాని, సిద్ద అండ హోమియోపతి). అల్లోపతి ద్వారా నయంకాని దీర్ఘకాలిక నొప్పులు, తిమ్మిర్లు, అజీర్తి, వైరల్ ఇన్ఫెక్షన్లు నయమవుతుండటంతో సంప్రదాయ వైద్య విధానాలకు ఆదరణ పెరిగింది. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2002లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) పథకం ద్వారా పీహెచ్సీలకు అనుబంధంగా ఆయుష్ వైద్యశాలలను ఏర్పాటు చేసి నిధులు అందిస్తోంది. అయితే ఈ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆయుష్లోని ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరిగానే ఐదున్నరేళ్లు కష్టపడి ఆయుష్ పరీక్షలు కూడా పాసై వృత్తిలో చేరిన డాక్టర్లయినా, వారిని కూడా చిన్నచూపు చూస్తుండటంతో వారు ఆందోళన బాట పడుతున్నారు. అన్నీ ఖాళీలే జిల్లాలో 22 ఆయుర్వేద ఆస్పత్రులున్నాయి. వీటిలో 22 మంది డాక్టర్లుండాల్సి ఉండగా 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వీరికి సహాయకులుగా ఉండాల్సిన అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 13 హోమి యో ఆసుపత్రిలున్నాయి. ఇందులో 13 మంది వైద్యు లకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 యునాని పోస్టులకు 3 ఖాళీలే. అలాగే నేచురోపతి వైద్యంలో 3 పోస్టులుంటే ఒక్కటీ భర్తీ చేయలేదు. ఇవే కాక జిల్లాలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో 24 రెగ్యులర్ ఆయుర్వేద డిస్పెన్సరీలున్నాయి. రెగ్యు లర్ పోస్టుల్లో మాత్రం రెండు ఆయుర్వేద పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అల్లూరులోని ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి పోయి కూలేందుకు సిద్ధం గా ఉంది. దీంతో వరండాలో డిస్పెన్సరీని మాత్రమే నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ హోమియో డిస్పెన్సరీలు 13 ఉండగా వాటిలో నలుగురు డాక్టర్లు లేరు. జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీకి 6 నెలల క్రితం మెరిట్లిస్టును ప్రకటించారు. అయినా వైద్య శాఖ నేటికీ పోస్టులను భర్తీ చేయకపోవడం చూస్తే ఆయుష్ డాక్టర్లపట్ల అధికారుల నిర్లక్ష్యవైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వేధిస్తున్న మందుల కొరత ఆయుష్కు చెందిన అన్ని డిస్పెన్సరీల్లో ఓపీ సరాసరి 50గా ఉంది. నెల్లూరులోని కుక్కలగుంట హోమియో ఆస్పత్రిని పరిశీలిస్తే అక్కడ ప్రతిరోజు దాదాపు 100 మంది వరకు రోగులు వస్తున్నారు. అయితే సంప్రదాయ వైద్యవిధానాలను ఆశ్రయించే రోగులకు తగిన విధంగా మందులను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు . దీంతో రోగులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జన్మభూమి సభలు నిర్వహించినప్పుడు గ్రామ సభల్లో ఆయుర్వేద మందులను దాదాపు ఖాళీ చేసేశారు. ఇక వైద్యం కోసం ఓపీకి వచ్చే రోగులకు మందులు ఇవ్వలేక డాక్టర్లు ఒకటి, అరా ఇచ్చి సర్దుబాటు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక అసలు రాష్ట్రానికి ఇంకా ఫార్మసీ కూడా ఏర్పాటు చేయలేదు. అధికారులు అరకొర మందులు కొనుగోలు చేసి డిస్పెన్సరీలకు పంపుతున్నారు. పోస్టుల భర్తీలో ఆయుష్కు అన్యాయం ఎన్ఆర్హెచ్ఎం, ఆర్బీఎస్కే లాంటి స్కీముల కింద మంజూరైన పోస్టుల్లో ఆయుష్ శాఖకు 50 శాతం పోస్టులు కేటాయించాలని జీవోలో స్పష్టంగా ఉంది. అయినా ఈ పోస్టులను కూడా అల్లోపతి డాక్టర్లతో నింపి ఆయుష్ డాక్టర్లకు అన్యాయం చేస్తున్నారు. జీతాలకు నోచుకోని డాక్టర్లు ఆయుష్ డాక్టర్లు ఐదు నెలలుగా జీతాలకు నోచుకోలేదు. బడ్జెట్ ఉన్నప్పటికీ తగిన విధంగా ఫైలు ఎప్పటికప్పుడు రన్ చేయడంలో ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పేరుకే డాక్టర్లు అయినప్పటికీ భార్యా, బిడ్డలకు తిండిపెట్టేందుకు అప్పులపాలవుతున్నారు.దీంతో ఆయుష్శాఖకి చెందిన ఉద్యోగులు, డాక్టర్లు ఆందోళనలకు పూనుకుంటున్నారు. మా పోస్టులు మాకే దక్కాలి ప్రభుత్వ జీవో ప్రకారం మాకు దక్కాల్సిన పోస్టులను కూడా అల్లోపతి వారితో భర్తీ చేయడం అన్యాయం. మా పోస్టులను మాకే ఇవ్వాలి. ప్రభుత్వం చిన్న చూపుచూడటం తగదు. సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆందోళనకు శ్రీకారం చుడుతున్నాం. డా.శ్రీనివాసరావు , నేషనల్ ఆయుష్ మెడికల్ అసోసియేషన్(నామా) జిల్లా అధ్యక్షుడు అల్లోపతి ప్రాక్టీసు చేసేందుకు అనుమతించాలి మేము కూడా ఐదున్నరేళ్లు వైద్య కోర్సులు చేశాం. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ కూడా మాకు అల్లోపతి వైద్య విధానంలో మూడు నెలల పాటు రిఫ్రెషర్ శిక్షణనిచ్చి అల్లోపతివైద్యం చేసేందుకు అనుమతించాలి. డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జీతాలు తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. డాక్టర్ సిరాజ్, నామా జిల్లా కార్యదర్శి త్వరలో జీతాలు ఇస్తాం. పోస్టులను భర్తీ చేస్తాం. టెక్నికల్ సమస్యల వల్ల తాత్కాలికంగా ఆయుష్ డాక్టర్లకు జీతాల సమస్య ఏర్పడింది. త్వరలో జీతాలు ఇస్తాం. అలాగే గతంలో పోస్టుల భర్తీకి మెరిట్ లిస్టు ప్రకటించిన మాట వాస్తవమే. ఈ మెరిట్ లిస్టుకు అనుగుణంగా వెంటనే పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. డా.వరసుందరం, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి -
జీతాలు లేక ఆయుష్ ఉద్యోగుల ఇబ్బందులు
భీమవరం(ప్రకాశం చౌక్): గత 6నెలలుగా జీతాలు అందక జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆయుష్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుష్లో హోమియోపతి,నేచరోపతి,యూనాని, ఆయుర్వేదం తదితర విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే అయుష్ ఉద్యోగులు వేతనాలు అందక విలవిలాడుతున్నారు. జిల్లాలో సుమారు 70 మంది సిబ్బంది, ఐదుగురు వైద్యులు పనిచేస్తున్నారు. వీరిలో వైద్యునికి ప్రతి నెల సుమారు 18 వేలు, కాంపౌడర్కి 9200,స్ఎన్ఓలకు 6700 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే గత 6 నెలలుగా జీతాలు రాకపోవడం, పైగా పెద్ద నోట్లు రద్దుకావడంతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీతాలు అందకపోయిన వారు అష్టకష్టాలు పడి వీధులకు హజరు కావాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.వేతనాలు అందక,అప్పు పుట్టక నరకం చూస్తున్నాము అని వారు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి అయుష్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలల జీతాలు అందాల్సి ఉంది: కృష్ణ, ఆయుష్ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ విభాగంలో పనిచేసి ఉద్యోగులకు 8 నెలలకు జీతాలు చెల్లించాల్సి ఉంది.పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి 6 నెలలకు వేతనాలు రావాల్సి ఉంది.వేతనాలు అందక ఆయుష్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నప్పటికి ప్రభుత్వం,వైద్యా శాఖ అధికారులు పట్టించుకొవడం లేదు.ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆయుష్ ఉద్యోగులకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి. -
విజేతలు ఆయుష్, దేవకి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్లో ఆయుష్, దేవకి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, డీపీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో కేటగిరీ- బాలుర విభాగంలో ఆయుష్ శర్మ అగ్రస్థానం సాధించగా... వినయ్ రోహిత్ రన్నరప్గా నిలిచాడు. కేటగిరీ-బి బాలికల విభాగంలో దేవకీ రెడ్డి, రాగిణి సైని... బాలుర విభాగంలో నవ్జయ్ జైశ్వాల్, తేజ్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో నగరానికి చెందిన 25 పాఠశాలల నుంచి మొత్తం 95 మంది చిన్నారులు తలపడ్డారు. ఇతర విభాగాల విజేతల వివరాలు కేటగిరీ- సి బాలురు: 1. శ్రేయస్, 2. విలోక్ గద్వాల్. బాలికలు: 1. స్నేహ సింగ్, 2. ఆరోహి కటారియా. కేటగిరీ-డి బాలురు: 1. ప్రవల్ రెడ్డి, 2. వరుణ్దీప్ సింగ్. బాలికలు: 1. అమ్రిత మండవ. కేటగిరీ- ఇ బాలురు: 1. అక్షయ్, 2. వేదాన్ష రావు. బాలికలు: 1. శ్రీహిత మండవ, 2. రమ్య గుప్తా. -
ఆక్సిజన్ బదులు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించి..
ఇండోర్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రి నిర్లక్ష్య నిర్వాకంతో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆక్సిజన్కు బదులు అతడికి నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించడంతో ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఇండోర్లోని మహారాజా యశ్వంత్రావ్ ఆస్పత్రిలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ఆపరేషన్ థియేటర్ను మూసివేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదుచేశారు. ఈ శుక్రవారం ఆయూష్ (8), రజ్ వీర్ (18 నెలలు) అనే చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. ఒకరు అనస్తీషియా పేషెంట్ కాగా, ఆయూష్ శ్వాస సంబంధమైన రోగి. అయితే, ఆపరేషన్థియేటర్లో అప్పటికే ఉన్న ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్లలో పొరపాటున అనస్తీషియాకు ఉపయోగించే నైట్రస్ ఆక్సైడ్ను ఆయుష్కు పెట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వైద్యులు మాత్రం రెండు సిలిండర్లను గుర్తించేలా వేర్వేరు పైపులు వాటికి అమర్చామని అయితే, ఈ పొరపాటుకు కారణం వాటికి పైపులు బిగించే కాంట్రక్టరు అయి ఉండొచ్చని చెప్పడంతో అతడి అరెస్టుకు దారి తీసింది. కాగా, ఆ కాంట్రాక్టరు మాత్రం ఈ విషయంలో తనను బలిపశువును చేశారని, పైపులు బిగించడమే తన విధి తప్ప దేనికి ఎలాంటి పైపును ఉపయోగించుకుంటారో అనే విషయం ఆస్పత్రిదే బాధ్యత అని వాపోయాడు. -
ఆయుష్షు పోస్తాం
ఆయుష్కు ప్రోత్సాహం అన్ని జిల్లా కేంద్రాల్లో 50 పడకల ఆస్పత్రులు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ బెంగళూరు: ఆయుష్కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రోత్సాహాన్ని అందజేస్తోందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. బెంగళూరులోని ప్రముఖ ఆయుర్వేద వైద్య చికిత్సా కేంద్రంలో ‘శతాయు ఆయుర్వేద’ 115వ వార్షికోత్సవ సంబరాలతో పాటు ఆసంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘లివర్ కేర్-కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్’ కేంద్రాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్, రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప గురువారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి యు.టి.ఖాదర్ మాట్లాడుతూ.....పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆయుర్వేదంపై అవగాహనను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో వివిధ ఔషధ మొక్కల పంపిణీని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 50 పడకల ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మంగళూరు, గదగ్లలో ఈ తరహా ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక ఇదే సందర్భంలో తాలూకా కేంద్రాల్లో 10 పడకల ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు సైతం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శతాయు ఆయుర్వేద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) డాక్టర్ క్రిష్ణ మాట్లాడుతూ.....ప్రస్తుత ఆధునిక జీవన విధానం కారణంగా అనేక విధాలైన వ్యాధులకు మానవుడు లోను కావాల్సి వస్తోందని అన్నారు. వీటి చికిత్స కోసం అలోపతి మందులు వాడుతుంటే, వాటితో మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేద వైద్య విధానం ద్వారా వివిధ వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి స్థాయి చికిత్స అందజేయవచ్చని అన్నారు. ఈ దిశగానే తమ సంస్థ పనిచేస్తోందని వెల్లడించారు. -
యోగా చేసేటప్పుడు ఆ 'మంత్రం' కంపల్సరీ కాదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో 'ఓమ్'ను, ఇతర వైదిక మంత్రాలను పాఠించడం తప్పనిసరి కాదని, ఈ విషయంలో ఎవరి అభిమతం మేరకు వారు వ్యవహరించవచ్చునని కేంద్ర ఆయూష్ మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది. అంతర్జాతీయో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే 45 నిమిషాల యోగా కార్యక్రమంలో 'ఓమ్'తోపాటు ఇతర వైదిక మంత్రాలను మొదటగా పాఠించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్క్యులర్ వివాదాస్పదమయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు 'ఓమ్' అని పాఠించడం మతపరంగా ఇబ్బందిగా భావిస్తారని, దీనిని తప్పనిసరి చేయరాదని జేడీయూ నేత కేసీ త్యాగీ కేంద్రానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఆయూష్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గనెరివాలా మాట్లాడుతూ 'యోగా కార్యక్రమం ప్రారంభానికి ముందు 'ఓమ్' అని పాఠించడం తప్పనిసరి కాదు. ఇది స్వచ్ఛంద అంశమే. ఎవరైనా కావాలంటే మౌనంగా ఉండవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ విషయంలో మీడియా కథనాలు యోగా దినోత్సవాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నాయి. 'ఓమ్' మంత్రం యోగాలో సమగ్రభాగం. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పాఠించాలని ఎలాంటి నిబంధనలు లేవు' అని చెప్పారు. -
మధుమేహానికి ఆయుష్-82 ఔషధం
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్స కోసం కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన మండలి(సీసీఆర్ఏఎస్) ఆయుష్-82 పేరుతో కొత్త ఔషధాన్ని తయారు చేసింది. పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయని, రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయని ఆయుష్ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ శుక్రవారం లోక్సభకు తెలిపారు. ఐదు మొక్కలతో ఈ ఔషధాన్ని తయారు చేశారన్నారు. చాక్లెట్తో డయాబెటిస్కు చెక్! లండన్: రోజూ స్వల్ప మొత్తంలో చాక్లెట్లు తినే వారిలో ఇన్సులిన్ సామర్థ్యం పెరిగి, డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని బ్రిటన్లోని వార్విక్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. రోజూ 100 గ్రాముల చాక్లెట్ తింటే ఇన్సులిన్ సామర్థ్యం పెరిగి, కాలేయం ఎంజైములు వృద్ధి చెందాయని పరిశోధకులు గుర్తించారు. -
ఆయుష్ ఉండేనా?
పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు{పభుత్వ సన్నాహాలు సర్కారుతో సంప్రదిస్తోన్న పలు కంపెనీలు ఉద్యోగుల్లో భయం.. భయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తోన్న ఆయుష్కు ఆయువు మూడినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయంలో ఆదర్శరైతులు.. ఉపాధి పథకంలో.. ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించిన ప్రభుత్వం తాజాగా వైద్యశాఖలోనూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏజెన్సీల ద్వారా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీంతో ఆయుష్.. ఉంటుందా... ఊడుతుందా అర్థంకాక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పలమనేరు: భారతీయ సాంప్రదాయ వైద్య విధానంగా పేరున్న ఆయుష్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయుష్ సేవలను పీపీపీ( పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్) ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సమయాత్తమైనట్టు తేలిపోయింది. ఈ విధానంతో తమకు ముప్పు తప్పదని ఆయుష్లోని ఉద్యోగులు, కొత్త కొలువుల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏడేళ్లుగా ఆయుష్లో నోటిఫికేషన్ లేక ఎదురుచూపులు చూస్తున్న తరుణంలో ప్రయివేటు ఏజెన్సీలు కింద కాంట్రాక్టు వైద్యులుగా పనిచేయాల్సిందేనేమోనన్న భయం రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్రం ఆయుష్ విభాగాన్ని మరింత భలోపేతం చేసేందుకు భారీగా నిధులను అందస్తోంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం పీపీపీని ప్రవేశపెట్టేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం విధానం ఇలా... జిల్లాలోని ఆయుష్( అల్లోపతి,యోగా అండ్ నేచురోపతి,యునాని, సిద్ద, హోమియోపతి)లో మొత్తం 48 వైద్యశాలలున్నాయి. ఇందులో రెగ్యులర్, ఎన్హెచ్ఆర్ఎం ద్వారా కాంట్రాక్టులలో దాదాపు 150 మంది వరకు ైవె ద్యులు, వందల సంఖ్యలో కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు గామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే ఆయుష్కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏజెన్సీల ద్వారా ఇవే సేవలు అందుబాటులో కొస్తే ఆయుష్ ఇక తెరమరుగైనట్లేన న్న వాదనలు వినిపిస్తున్నాయి. పీపీపీతో ఇలా... దేవాదాయశాఖ తన పరిధిలోని భూములను కారు చౌకగా...కంపెనీలకు ఇస్తే.. ప్రయివేటు కంపెనీలు తమ సిబ్బంది, పరికరాలతో వైద్యసేవలందించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే వైద్యుల నియమకం, మందుల పంపినీని ఏజెన్సీలే నిర్వహించనున్నాయి. ఇప్పటికే కేరళ ఆయుర్వేదం, కోటకల్ ఆయుర్వేదం,ఆర్య వైద్య నిలయం, శాంతగిరి తదితర సంస్థలు పీపీపీలోకి వెళ్లి సేవలందించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. వీరి ఆధ్వర్యంలో ఈ సేవలు జరిగితే భవిష్యత్తులో ఆయుష్ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. మరోవైపు ఈ శాఖలో నోటిఫికేషన్పడి సుమారు ఏడేళ్లవుతోంది. జిల్లాలో దాదాపు 200 మంది కొత్త నిరుద్యోగులు ఆయుష్లో కొలువుల కోసం వేచి చూస్తున్నారు. అయితే ప్రభుత్వం పీపీపీని అమలు చేస్తోండడంతో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటారా లేక ఏజేన్సీల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించుకుంటారా అనే ఆయోమయం ఉంది. ఏదేమైనా ప్రభుత్వ కొత్త విధానం ఆయుష్ను పెంచుతుందా లేక ఉన్న ఆయుష్ను తగ్గిస్తుందా వేచి చూడాల్సిందే. -
కొత్త వేదం
ఆయుష్, ప్రార్థన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నారు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందువులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. చాలా సంవత్సరాల కిందట భారతీరాజా దర్శకత్వంలో ‘జమదగ్ని’ అనే చిత్రంలో నటించాను. ఆ సందర్భంలో ఆయన తీసిన ఒక సినీమాని నాకు ప్రత్యేకంగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. చిత్రం పేరు ‘వేదం పుదిదు’ (వేదం కొత్తది). స్థూలంగా కథ ఇది. ఊరి పెద్ద తక్కువ కులస్తుడు. అతని కారణంగా ఓ బ్రాహ్మణుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అతని కొడుకు 9 ఏళ్ల పసివాడు. ఊరి పెద్ద, భార్య ఆ కుర్రాడిని చేరదీసి సాకారు. అతన్ని బ్రాహ్మణుడిగానే పెంచారు. విద్యాబుద్ధులకి గురువుల దగ్గరికి తీసుకెళ్లారు. గురువు గారి వీధి అరుగు మీద కుర్రాడు వేదం చెప్పుకుంటూంటే దూరాన చెట్టుకింద గొంతికిలా కూర్చుని ఉండేవాడు ఊరి పెద్ద. ఊరి పెద్ద అంటే అందరికీ సింహస్వప్నం. కాని కుర్రాడికి తన అజ్ఞానం కారణంగా, కులం కారణంగా నష్టం కలగకుండా అప్రమత్తంగా పెంచే పెద్ద దిక్కు. కుర్రాడు వేదపండితుడయ్యాడు. తనని పెంచిన దంపతుల మీద ఆత్మీయతని పెంచుకున్నాడు. ఊరి పెద్ద కన్నుమూశాడు. కుర్రాడు శాస్త్రోక్తంగా తండ్రికి చేసినట్టు అంత్యక్రియలు జరిపాడు. విద్య సంస్కారాన్ని నేర్పింది. బాంధవ్యం రుణం తీర్చుకుంది. ఇది కొత్త వేదం అన్నా రు రచయిత, దర్శకుడు భారతీరాజా. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక - బెంగాలులో మతకల్లోలం పెచ్చురేగింది. మహాత్ముడు నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఒక హిందువు వచ్చి ‘‘నేను ఓ ముస్లిం కుర్రా డిని తల గోడకి కొట్టి చంపాను బాపూ’’ అని నిస్సహా యంగా చెప్పుకున్నాడు. బాపూజీ అతన్ని చూసి ‘‘దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఓ చిన్న కుర్రాడిని చేరదీసి పెంచు. అయితే అతను ముస్లిం కుర్రాడయి ఉండాలి. అతన్ని ముస్లింగానే పెంచాలి’’ అన్నాడు. మానవత్వానికి మతం లేదు. కులం లేదు. వివక్ష లేదు. ఇప్పుడు ఇటీవలి కథ. మహ్మద్ షానవాజ్ జహీర్, ప్రవీణ్ దయాళ్ - ఇద్దరూ పైలట్లు. కలసి పనిచేస్తారు. ఆత్మీయ మిత్రులయ్యారు. ప్రవీణ్ ఒక ఎయిర్ హోస్టెస్ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు - ఆయుష్, ప్రార్థన, 2012లో ఆమె కన్నుమూసింది. ఇతనూ అనారోగ్యంలో పడ్డాడు. ‘‘నాకేమయినా అయితే నా పిల్లల్ని చూసుకోండి’’ అని ప్రవీణ్ మిత్రుడు జహీర్ దగ్గర మాట తీసుకున్నాడు. తర్వాత ఆ సంవత్సరమే అతనూ కన్నుమూశాడు. జహీర్ వెంటనే చొరవ తీసు కోని కారణాన పిల్లల్ని కారు డ్రైవర్ సాకుతున్నాడు. తన ఉద్యోగం రద్దీలో మిత్రుడికిచ్చిన మాటని మరిచిపోయా డు జహీర్. ఒక రోజు పిల్లలిద్దరూ అతనికి ఫోన్ చేశారు, కంటతడి పెట్టుకుంటూ. జహీర్ గతుక్కుమన్నాడు. వెం టనే రంగంలోకి దూకాడు. ప్రవీణ్ పోయాక ఇండియన్ పైలట్ల అసోసియేషన్ ఒక కోటి రూపాయలు సమీకరిం చి - పిల్లల పేరిట బ్యాంకులో వేసింది. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులూ, పిల్లల బాధ్యతా తనకి అప్పగించాలని కోర్టుని ఆశ్రయించాడు. అయితే ఈ అనుమతికి కొన్ని పరిధులున్నాయి. తను ముస్లిం. పిల్లలు హిందువులు. భారత దేశ చరి త్రలో ఇంతవరకూ మతాంతర ఒప్పందానికి ఏ కోర్టూ అనుమతిని ఇవ్వలేదు. అయినా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వజీరీ (గమనించాలి- ఇతను ముస్లిం) ఈ పిల్లల పోషణా భారాన్ని జహీర్కి అప్పగించారు. ఆయన తీర్పులో మాటలు: ‘‘వివిధ సాహిత్యాలలో కవులూ, రచ యితలూ మానవ సంబంధాలు మతాతీతమైనవని పేర్కొన్నారు. మానవ శ్రేయస్సుకి మూలసూత్రం పసి జీవితా లను కాపాడడమే’’. నీదా ఫజ్లీ, జావేద్ అఖ్తర్ మాటల్ని ఉదహరిస్తూ ‘‘అనాథపిల్లలను సంరక్షించి, సాకడం అపూర్వమైన మానవధర్మాలలో ఒకటి’’ అన్నారు. పక్కింటి వ్యక్తి అరుణ్ సాయనీకి ఆ పిల్లలిద్దర్నీ జహీర్ హిందూ సాంప్రదాయ రీతుల్లో పెంచుతున్నట్టు పర్య వేక్షించే పనిని అప్పగించారు న్యాయమూర్తి. యోగేష్ జోగియా అనే న్యాయవాది ఈ కేసుని ఉచితంగా నిర్వ హించారు. భారతదేశంలో మతాతీతమైన గొప్ప తీర్పు గా దీనిని అభివర్ణించారు. ఆయుష్, ప్రార్ధన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నా రు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందు వులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. ఆయుష్ పబ్లిక్ స్కూలులో చదువు తున్నాడు. పెద్దయాక ఏమవుతాడు? పైలట్ని అవుతా నన్నాడు. ప్రార్ధన డిజైనర్ అవుతానంది. కాలం మారుతోంది. మానవ సంబంధాలకు ఉదా త్తమయిన విలువలు జత అవుతున్నాయి. ‘కొత్త వేదం’ కొత్తగా, గొప్పగా నిలదొక్కుకుంటోంది. ఆనాడు మహాత్ముడు చెప్పింది నీతి. ఈనాడు జహీ ర్ పాటించింది. నియతి. వెరసి - మానవ సమాజానికి కరదీపిక కాగలిగిన - నిఖార్సయిన మానవత్వం. - గొల్లపూడి మారుతీరావు -
'ఆ రోజు మీకు ఇష్టమైన దైవాన్నే తలుచుకోండి'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పాల్గొనే ముస్లింలు శ్లోకాలనే చదవాల్సిన అవసరం లేదని.. వారికి ఇష్టమైనా అల్లా నామాన్ని తలుచుకోవచ్చని గోవా మంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. యోగా దినోత్సవం రోజు కుల మత భేదాలు లేకుండా అందరు పాల్గొనాలనే ఉద్దేశంతో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందులో నుంచి ఇప్పటికే సూర్య నమస్కారాన్ని పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నందున అందులో ముస్లింలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. యోగాలోని శ్లోకాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధమైనవని, తమను అందులో పాల్గొనకుండా మినహాయింపు ఇవ్వాలని కొందరు ముస్లిం పెద్దలు ఆయనను కలవడంతో ఈ విషయం చెప్పారు. ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అది ఎలాంటి వివాదం లేకుండా నిర్వహించాలని నిర్ణయించామని, అందుకు అనుకూలమైన సడలింపులు కూడా కేంద్రం కల్పించిందని సుష్మా స్వరాజ్ ప్రకటించారని, అందరినీ దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం సజావుగా జరగాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు. -
అంపశయ్యపై ‘ఆయుష్’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆయుష్ శాఖ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దేశీయ, సంప్రదాయ వైద్యం, ఆయుష్షు రోజురోజుకూ తగ్గుతోంది. ఆయుర్వేదిక్, హోమియో, యునాని, యోగా, సిద్ధదేశీయ వైద్యాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆయుష్ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్యానికి ప్రజల్లో ఆదరణ ఉంది. ఆయుష్ శాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర ఉద్యోగులు ఒక్కొక్కరు ఉద్యోగ విరమణ పొందుతుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నారుు. రెగ్యులర్ డిస్పెన్సరీలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. రెగ్యులర్ డిస్పెన్సరీలో 18 ఏళ్ల కింద చేపట్టిన నియామకాలు మినహా... ఆ తర్వాత పోస్టింగ్లు లేవు. ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు దేశీయ వైద్యాన్ని అందించాలన్న చిత్తశుద్ధి గత పాలకుల్లో కొరవడడంతో ప్రజలకు దేశీయ, సంప్రదాయ వైద్యం అందని ద్రాక్షగా మారింది. నిలిచిన నియూమకాలు ఆయుష్ సేవలు విస్తృతం చేయడం, గ్రామీణ ప్రాంత ప్రజలకు దేశీయ వైద్యాన్ని చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం 2008-2009లో ఎన్ఆర్హెచ్ఎం ద్వారా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆయుష్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో నియామకాలు కూడా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఆయుర్వేదిక్, యునాని, హోమియో, నేచురోపతి డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టింది. రెండు దశల్లో చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో మూడో దశ నియామకాలు నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయుష్కు గుర్తింపునిచ్చి నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది. ఖాళీలు ఇలా.. వరంగల్లో ఉన్న ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలక కార్యాలయం(ఆర్డీడీ) పరిధిలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని ఆయుష్ డిస్పెన్సరీల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డిస్పెన్సరీలకు సంబంధించి వరంగల్ ఆర్డీడీ పరిధిలో 185 ఆయుష్ డిస్పెన్సరీలు ఉంటే.. 43 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 181 కాంపౌండర్ పోస్టులకు 78 పోస్టులు భర్తీ కాలేదు. స్వీపర్/స్కావెంజర్ పోస్టులు 16, నర్సింగ్ ఆర్డర్లీస్ పోస్టులు 96 పోస్టులకు 15, ఏఎన్ఎంలు 9 పోస్టులకు 6, అటెండర్ 3 పోస్టులకు ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఎన్ఆర్హెచ్ఎం కింద రెండు దశల్లో 178 డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. 69 పోస్టుల్లో వైద్యులు ఉండగా, 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 178 కాంపౌండర్ పోస్టులకు 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 178 స్వీపర్/నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల్లో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో వైద్యులు, వైద్య సహాయకుల సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఆయుష్ సేవలు అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైనా చొరవ తీసుకుని పోస్టులను భర్తీ చేయూల్సిన అవసరం ఉంది. -
ముఖమంతా మొటిమలు... తగ్గినచోట మచ్చలు..?
నా వయసు 19. గత సంవత్సరకాలంగా ముఖం మీద మొటిమలతో బాధపడుతున్నాను. చూడటానికి ఇబ్బందిగా ఉంది. అవి తగ్గినచోట చిన్న చిన్న గుంతలు, మచ్చలు ఏర్పడ్డాయి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇవి పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - రమాదేవి, డోర్నకల్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ యుక్తవయసులో వచ్చే సాధారణ సమస్య ఇది. దీనిని ఆయుర్వేదంలో ‘తారుణ్యపిడిక లేక యవ్వన పిడిక’ అనే పేరుతో వర్ణించారు. మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వీటిని బలవంతంగా చిదపటానికి ప్రయత్నించవద్దు. నీళ్లు ఎక్కువగా తాగండి. కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. విటమిన్ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్సులు లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు మునగాకు, మునగకాడలు, ఆకుకూరలు, నువ్వులు, ఎండుఫలాలు, శాకాహారం మొదలైనవి. కాలానుగుణంగా లభించే తాజాఫలాలు (జామ, దానిమ్మ, బత్తాయి మొదలైనవి) బాగా తినండి. ముఖ శుభ్రతకు సబ్బులకు బదులు సున్నిపిండి లేదా శనగపిండి వాడండి. రోజూ రెండుపూటలా ప్రాణాయామం చెయ్యండి. తగినంత శారీరక వ్యాయామం కూడా అవసరం. ఔషధం : గంధకరసాయన (మాత్రలు) : ఉదయం - 2, రాత్రి - 2 (పరగడుపున) ఆరోగ్యవర్ధని (మాత్రలు) : ఉదయం - 1 రాత్రి - 1 (తిన్న తర్వాత) మహామంజిష్ఠాదికాఢ, శారిబాద్యాసవ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక కప్పులో కలుపుకొని నాలుగు చెంచాల నీళ్లు కలిపి రెండుపూటలా తాగండి. కుంకుమాదిలేపం (పైపూతకు) : రాత్రివేళ పైపూతగా పూసుకోవాలి. సూచన: పింపుల్స్ పగిలి దురదగా అనిపిస్తే, అక్కడ గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసి, అనంతరం తులసి ఆకురసంలో కొంచెం పసుపు కలిపి, పైపూతగా పెట్టుకోండి. నా వయసు 23 ఏళ్లు. మూత్రవిసర్జన చేసినప్పుడు చాలా సన్నటిధారతో ఆలస్యంగా వస్తోంది. అంగం మీద చర్మం వెనకకు రావడం లేదు. దయచేసి ఆయుర్వేద మందులు సూచించండి. - శ్యాంబాబు, సిద్ధిపేట ఈ సమస్యని ఆయుర్వేదంలో ‘నిరుత్థ ప్రకశ’ (ఫైమోసిస్)గా అభివర్ణించారు. ఇది మందుల వల్ల తగ్గేది కాదు. మీరు సర్జన్ (శస్త్రకర్మనిపుణుడి)ని సంప్రదించండి. వారు ‘సున్తీ’ ఆపరేషన్ చేస్తారు. ఈ సమస్య శాశ్వతంగా నయమైపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్