అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు  | Devadaya Department has issued orders to organize honor programs for priests: ap | Sakshi

అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు 

Apr 9 2024 4:36 AM | Updated on Apr 9 2024 4:36 AM

Devadaya Department has issued orders to organize honor programs for priests: ap - Sakshi

నేడు రాష్ట్రస్థాయిలోను, అన్ని జిల్లాల్లోను దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ 

ప్రతి జిల్లాలో ఇద్దరు అర్చకులు, ఒక వేదపండితుడికి సత్కారం  

సాక్షి, అమరావతి: క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభు­త్వం అధికారికంగా నిర్వహించనుంది. మంగళవారం తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమా­వేశ మందిరంలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బ­రామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తా­రు.

ఈ సందర్భంగా 18 మంది వేద పండితులను ఘనంగా సత్కరిస్తారు. అన్ని జిల్లాల్లో ఉగాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా వేదపండితులు, అర్చకులకు సన్మాన కార్యక్రమాల నిర్వహణకు దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో 62 ఏళ్లకు పైబడిన అర్చకులు ఇద్దరిని, ఒక వేద పండితుడిని సత్కరించాలని సూచించారు. సన్మాన గ్రహీతలకు ప్రశంసాపత్రం, రూ.10,116 సంభావన, శాలువా, కొత్తవస్త్రాలు, పండ్లు అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement