
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మునిసిపాలిటీలోని రెండు వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని, కౌన్సిలర్లకు ఈ నెల 10లోగా నోటీసులు జారీ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment