విశాఖలో ‘ఇండియా ఆన్‌ ద మూన్‌’ భారీ ర్యాలీ  | India on the Moon is huge rally in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ‘ఇండియా ఆన్‌ ద మూన్‌’ భారీ ర్యాలీ 

Aug 26 2023 6:10 AM | Updated on Aug 26 2023 6:10 AM

India on the Moon is huge rally in Visakhapatnam - Sakshi

ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ‘ఇండియా ఆన్‌ ద మూ­న్‌’ పేరుతో విశాఖపట్నంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు 400 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు.

ఈ ర్యాలీని ప్రారంభించిన ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఇండియా మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌–3 సక్సెస్‌ కావడంతో భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత శాస్త్ర విజ్ఞానం వైపు దూసుకెళ్లాలన్నారు. ఈ మిషన్‌లో ఏయూ ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్‌ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి ప్రాతినిధ్యం వహించడం ఏయూకు గర్వకారణం అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement