Chandrayaan-3
-
‘మూన్ స్నైపర్’ బతికేనా?.. జపాన్ ‘దింపుడు కళ్ళం’ ఆశ!
జపాన్ ప్రయోగించిన ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ మూడు రోజుల క్రితం చంద్రుడిపైనున్న షియోలీ బిలం వాలులో దిగింది. ఆ ప్రదేశంలో ప్రస్తుతం భానోదయం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి ఆగమిస్తున్నాడు. ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) మాత్రం పడమటి దిక్కు వైపు మోహరించి ఉన్నాయి. ఫలితంగా వ్యోమనౌకలో సౌర విద్యుత్ తయారీకి ఇప్పుడు అవకాశం లేదు. అందుకే... భవిష్యత్తులో ల్యాండర్ పునఃప్రారంభ అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా తమ ‘మూన్ స్నైపర్’ బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేసినట్టు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సోమవారం ప్రకటించింది. వ్యోమనౌక ఆన్బోర్డ్ బ్యాటరీలో 12% (కనీస) పవర్ ఉందని, చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ దిగిన మూడు గంటలకు దాని బ్యాటరీని స్విచాఫ్ చేశామని ‘జాక్సా’ తెలిపింది. అవసరమైనప్పుడు ల్యాండరును రీ-స్టార్ట్ చేయడానికి అందులో ఉన్న 12% పవర్ సరిపోతుందని సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సూర్యుడు పడమటి దిక్కుకు వాలినప్పుడు ల్యాండర్ సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశముంది. అప్పుడు ల్యాండరును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం ‘జాక్సా’ వివరించింది. ప్రస్తుతం ల్యాండర్ నిద్రాణ స్థితిలో ఉంది. సౌరవిద్యుత్ తయారీ దృష్ట్యా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు వంటి వ్యోమనౌకల్ని సాధారణంగా జాబిలిపై సూర్యుడు సరిగ్గా ఉదయించే వేళల్లోనే/ప్రదేశాల్లోనే దిగేలా చూస్తుంటారు. చంద్రుడిపై పగటి సమయం (పగలు) 15 రోజులు ఉంటుంది. అలాగే రాత్రి సమయం కూడా 15 రోజుల పాటు ఉంటుంది. చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో భానుడు ప్రస్తుతం తూర్పు దిక్కు నుంచి పడమటి వైపుగా ప్రయాణం సాగిస్తున్నాడు. అక్కడ సూర్యుడు నడి నెత్తి నుంచి అంటే... మధ్యాహ్నం తర్వాత కాస్త ఆవలకు దిగి పొద్దు వాలితే గానీ ‘మూన్ స్నైపర్’ సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి సోకదు. సూర్యకాంతి తగిలితేనే, దాని నుంచి సౌరవిద్యుత్ తయారుచేసి వినియోగించుకోగలిగితేనే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకున్నట్టు. జపాన్ మూన్ మిషన్ విజయవంతమైనట్టు. తమ ‘స్లిమ్’ ల్యాండర్ నుంచి చాలా డేటా సేకరించామని, త్వరలో దాన్ని వెల్లడిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
చంద్రయాన్-3.. స్లీప్మోడ్లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందని సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్ను స్లీప్ మోడ్లో ఉంచారు. అయితే చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను బెంగళూరులో వారు ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్లో వివిధ దేశాలకు చెందిన కొన్ని పరికరాలను అమర్చారు. అయితే అందులో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)లోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ అరే (ఎల్ఆర్ఏ) చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని తెలిపారు. డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ నిత్యం పనిచేస్తోందని ఇస్రో చెప్పింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. చంద్రయాన్-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. -
సైన్సులో మన ఘన విజయాలు
చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్ మాడ్యూల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్ ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్కు సంబంధించి ఇదో రికార్డు. చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్ ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్యాన్ ’లో క్రూ ఎస్కేప్ మోడల్ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. అంతరిక్ష ప్రయోగాలకు ఆవల... దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్ఫెరోమీటర్ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్ కండక్టింగ్, ఫొటోనిక్ ప్లాట్ఫామ్ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో... భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. కర్నాల్(హరియాణా)లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీ గిర్ జాతి ఆవును క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం! కోవిడ్ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు పనికొస్తుందీ టీకా. విధాన నిర్ణయాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్ను 2023లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు లేవు. డీఎస్టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్సీఏ ఆరోపిస్తోంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్సీఏ నిర్ణయం డీఎస్టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్ను నాగ్పూర్లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విజ్ఞాన్ భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్ సైన్స్ ఫెస్టివల్కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం. దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు. ఇంకో సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ నికోటిన్ మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ .కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి స్వతంత్ర సంస్థలు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనూ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్య పరు స్తోంది. 2023లో భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం చంద్రయాన్ అనుకుంటే... సైన్స్ సంస్థల రాజకీయీకరణ అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
న్యూఢిల్లీ: చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్ల్యాండ్కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ల్యాండింగ్ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్ను అందుకున్నారు. అవార్డ్ ఇచి్చనందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. -
చందమామపై మన అడుగే తరువాయి!
అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తిన చంద్ర యాన్–3 విజయం తర్వాత, ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా 2040 నాటికి భార తీయ వ్యోమగాములు చంద్రు నిపైకి వెళ్ళే దిశగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. భవి ష్యత్తుపై దృష్టితో, ‘గగన్ యాన్’ ప్రోగ్రామ్లో భాగంగా, ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ భారతీయ వ్యోమగాములను ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ) లోకి పంపించి, మూడు రోజుల వరకు అక్కడ ఉంచి, మన దేశంలోని ఒక నీటి వనరుపై వారిని ల్యాండ్ చేసే (దించే) కార్యక్రమంలో మరొక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తోంది ఇస్రో. ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను ఆస్ట్రోనాట్– డెసిగ్నేట్లుగా ఎంపిక చేశాం. ప్రస్తుతం, వారు బెంగ ళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఏటీఎఫ్)లో మిషన్–నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. హ్యూమన్– రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (హెచ్ఎల్వీఎమ్3), క్రూ మాడ్యూల్ (సీఎమ్), సర్వీస్ మాడ్యూల్ (ఎస్ఎమ్) లతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్; లైఫ్ సపోర్ట్ సిస్టమ్లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ప్రారంభ దశలో ఉంటుంది. ఇంటి గ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్– క్రూడ్ మిషన్లు (జీ1, జీ2) మనుషులతో కూడిన మిషన్కు ముందు ఉంటాయి. సీఎమ్ను కూడా ఏర్పాటు చేస్తాం. సీఎమ్ అనేది సిబ్బంది కోసం అంతరిక్షంలో భూమి–వంటి వాతా వరణంతో నివాసయోగ్యంగా ఉండే స్థలం. వ్యోమగా ములు సురక్షితంగా తిరిగి రావడం కోసం ఉద్దేశించింది ఇది. భద్రతా చర్యలలో అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కూడా ఉంటుంది.టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) యొక్క మొదటి డెవలప్మెంట్ ఫ్లైట్ 2023 అక్టోబరు 21న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్ను విజయవంతంగా పరీక్షించగలిగింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుపడటం, బంగాళాఖా తంలో ఇండియన్ నావికదళం దానిని సురక్షితంగా రికవర్ చేయడం కూడా జరిగాయి. మానవ రహిత మిషన్లూ, అంతిమంగా మానవ సహిత అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందనీ అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం కీలకమైనది. ఇస్రో మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్, భారతదేశపు తొలి సౌర అన్వేషణ మిషన్ అయిన ఆదిత్య ఎల్1. ఇది ‘లాగ్రేంజ్ పాయింట్ 1’ యొక్క ప్రత్యేకమైన వాన్టేజ్ పాయింట్ నుండి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. చంద్రునిపైనా సూర్యునిపైనా చేసే పరిశోధ నల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఇస్రో కేంద్రాలు, విద్యా సంస్థల సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్లతో నిండిన ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక çసూర్యుని రహస్యాలను ఛేదించడానికి ప్రయోగిస్తున్నాం. 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఐదేళ్ల పాటు పని చేస్తుందని భావిస్తున్నాం. ఇది భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉన్న సూర్యుడు–భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) వైపు ఉద్దేశించిన మార్గంలో ఉంది. ఇక్కడే అది జనవరి 2024లో హాలో కక్ష్యలోకి చేర్చబడుతుంది. చంద్రయాన్–3 మిషన్ ఒక చరిత్రాత్మక విజయం. ఆ విజయం సిద్ధించిన ఆగస్టు 23ను ‘భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించడం ముదావహం. 14 రోజుల (ఎర్త్ డేస్) మిషన్ జీవిత కాలంలో, ఇది చంద్రుని మట్టిలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సల్ఫర్, మేంగనీస్, సిలికాన్, ఆక్సి జన్లను కనుగొన్న విలువైన డేటాను అందించింది. మనం తలపెట్టిన చిన్న శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ), పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్ఎల్వీ) ప్రోగ్రామ్, ఎక్స్–రే ఆస్ట్రానమీ మిషన్ ‘ఎక్స్పోశాట్’, స్పేస్ డాకింగ్ ప్రయోగం, ఎల్ఓఎక్స్ –మీథేన్ ఇంజన్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలు కలిసి, భారత్ అంతరిక్ష అన్వేషణలో కొత్త శకాన్ని నిర్వచించాయి. మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్ఎస్ ఎల్వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కి.మీ. ప్లానార్ ఆర్బిట్లో ప్రవేశపెట్టగలదు. బహుళ ఉప గ్రహాలను తీసుకెళ్లగలదు. ఉపగ్రహాలను ఎప్పుడు ఎక్కడ ఆర్బిట్లో ప్రవేశపెట్టాలనుకుంటే అప్పుడు ప్రవేశపెట్టగల (లాంచ్–ఆన్–డిమాండ్ ) సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని ప్రయోగించడానికి కనీçస మౌలిక సదుపాయాలు ఉంటే చాలు. అలాగే ప్రయోగించ డానికి ఖర్చు కూడా తక్కువే! ఎక్స్పోశాట్ అనేది భారత్ మొట్టమొదటి నిర్దిష్ట సైన్స్ మిషన్. ఇది శాస్త్రీయ పేలోడ్లను ఉపయోగించి తీవ్ర పరిస్థితుల్లోనూ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్–రే మూలాలను పరిశోధిస్తుంది. అటువంటి దీనిని 2023–2024లో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధ మయింది. స్పాడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్)ను 2024 మూడవ త్రైమాసికంలో ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇది మానవ అంతరిక్షయానంలో అనువర్తనాల పరిధితో డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినజంట అంతరిక్ష నౌక. ఈ మిషన్లో రెండు చిన్న– ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్గా, మరొకటి టార్గెట్గా, సహ–ప్రయాణికులుగా కలిపి ప్రయోగించబడతాయి. ‘భవిష్యత్తులో ‘చంద్రయాన్’ మిషన్ లలో చంద్రుని నుంచి శాంపిల్స్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేయడంలో డాకింగ్ ప్రయోగ విజయం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. రానున్న కాలంలో సాంకేతికత పరంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన ‘ఎల్ఓఎక్స్ మీథేన్’ (లిక్విడ్ ఆక్సి జన్ ఆక్సిడైజర్, మీథేన్ ఇంధనం) ఇంజిన్ల అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఇది అంగారక గ్రహం వంటి ఇతర గ్రహాలపై పర్యావరణాల ఉనికి కోసం మాన వుడు చేసే అన్వేషణను సులభతరం చేస్తుంది. అంత రిక్షంలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లను సంశ్లేషణ చేయడం ద్వారా తయారు చేయగలిగిన మీథేన్ అంత రిక్షంలో సుదూరం ప్రయాణించే నౌకలకు ఇంధనంగా ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అందుకే ఎల్ఓఎక్స్ మిథేన్ ఇంజిన్ల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం కలిగిందని చెప్పాలి. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ ప్రారంభించడం, వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్తో కూడిన అంతర్ గ్రహ అన్వేషణను ప్రారంభించడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రధాన మంత్రి నిర్దేశించుకున్నారు. ఇవన్నీ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా వేదికపై భారత్ ఉనికిని మరింత పటిష్టం చేస్తాయి. ‘భారత్ అంతరిక్ష కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త శిఖరాలను చేరుకోవ డానికి సిద్ధంగా ఉంది. ప్రయోగించబడిన ప్రతి మిషన్, ప్రతి ఆవిష్కరణతో ఇస్రో ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సగర్వంగా పునరుద్ఘాటిస్తుంది. (‘మలయాళ మనోరమ’కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అందించిన కథనం ఆధారంగా) -
కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత భారతదేశంలో ఒక వ్యక్తి బిలియనీర్ జాబితాలోకి చేరాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఇతని వల్ల చంద్రయాన్-3కు ఉపయోగం ఏమిటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం. కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్ 'రమేష్ కున్హికన్నన్' (Ramesh Kunhikannan) చంద్రయాన్-3 మిషన్లో కీలక పాత్ర పోషించారు. రోవర్, ల్యాండర్ రెండింటికీ అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్లను అందించి చంద్ర మిషన్ విజయంలో భాగస్వామి అయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కేన్స్ షేర్లు విపరీతంగా పెరిగాయి. కేన్స్ షేర్లు భారీగా పెరగటం వల్ల కంపెనీలో 64 శాతం వాటా కలిగిన కున్హికన్నన్ ఆస్తులు తారాస్థాయికి చేరి బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచాడు. ఈయన మొత్తం సంపద 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. వంద కోట్లు కంటే ఎక్కువ. కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతుందని ఫోర్బ్స్ నివేదించింది. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్లు సరఫరా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల లాభం మైసూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కున్హికన్నన్ 1988లో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా కేన్స్ను స్థాపించారు. అతని భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం సంస్థ చైర్పర్సన్గా ఉంది. స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కేన్స్ ఇండియాకు చాలా ఉపయోగపడింది. ఇదీ చదవండి: భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్ఇన్ సంచలన రిపోర్ట్! భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్తో జరిగిన సెమీఫైనల్స్లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్కు వెళ్లిన అల్లు అర్జున్కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్కు చేతిలో ఉన్న బ్యాట్ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్ను అన్ని మ్యాచ్లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్ను పాస్కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్–3 అంతరిక్ష నౌకను జూలై 14న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకమైన క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్లోని ఒక భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఎల్వీఎం–3 ఎం4కు చెందిన ఈ శకలం బుధవారం మధ్యాహ్నం 2.42 సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు గుర్తించామని గురువారం ఇస్రో వివరించింది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఉత్తర పసిఫిక్ సముద్రంలో పడే అవకాశాలున్నాయని తెలిపింది. భారత గగనతలంలోకి ప్రవేశించే అవకాశాల్లేవని ఒక ప్రకటనలో ఇస్రో స్పష్టం చేసింది. -
శాస్త్ర విజ్ఞానంలోనూ రాజకీయాలా?
దేశంలో గడచిన దశాబ్దాల్లో అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. అయితే రాజకీయ మద్దతుకూ, సైన్స్ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చేందుకు రాజకీయ వర్గాల మద్దతు అవసరం. దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. కానీ చంద్రయాన్ –3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్ పద్ధతులను అవమానించడమే! దేశంలోని చాలా శాస్త్రీయ సంస్థలు, పరిశో ధన సంస్థలు ఇటీవలి కాలంలో ‘సెల్ఫీ పాయింట్’లు ఏర్పాటు చేశాయి. ఇక్కడ సందర్శకులు సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీళ్లు, ఫేస్బుక్ స్టోరీల కాలంలో ప్రభుత్వ సంస్థలు ఇలాంటి గిమ్మిక్కులకు తెగబడటం ఎక్కువైంది. అయితే పరిశోధన సంస్థల విషయంలో ఉద్దేశం వేరు. సెల్ఫీ కేంద్రాలను ఒక నిర్దిష్ట శైలిలో నిర్మించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రతిదాంట్లో ప్రధాని ఛాయాచిత్రం ఒకపక్క, ఆ సంస్థ విజయాలు ఇంకోపక్క ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక జ్ఞానం ఉన్నవారికి కూడా దీని వెనుక మతలబు ఏమిటో అర్థం అవుతుంది. ఆయా సంస్థల విజయాలు ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలని పరోక్షంగా చెప్పే ప్రయత్నం ఇది. శాస్త్రీయ పరి శోధన సంస్థలు కూడా సులభంగా ఇందుకు అంగీకరించడం ఆశ్చర్య కరమైన విషయం కాదు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి చిన్న పోస్టర్ల స్థానంలో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేశారు. భారతీయ సైన్స్కు ప్రధాని దైవదూత అన్న మాదిరిగా సందేశాలివ్వడం కేవలం సెల్ఫీ పాయింట్లకే పరిమితం కాలేదు. వెబ్సైట్లు, సోషల్ మీడియా హాండిల్స్, సైంటిఫిక్ ల్యాబ్స్తోపాటు పాఠ్య పుస్తకాల్లోకీ చేరుతోంది. ‘ఎన్సీఈఆర్టీ’ గత నెలలో విడుదల చేసిన ‘చంద్రయాన్ ఉత్సవ’ పుస్తక శ్రేణిలోనూ ఇది కనిపించింది. పది పుస్తకాలతో కూడిన ఇవి వేర్వేరు తరగతులకు ఉద్దేశించారు. అన్నింటి లోనూ ప్రధాన ఇతివృత్తం చంద్రయాన్ –3 విజయానికి ప్రధాన సూత్ర ధారి ప్రధాని అని చూపడమే. అది కూడా 2019 నాటి చంద్రయాన్ –2 వైఫల్యం తరువాత! సెకండరీ స్టేజ్ (కోడ్ 1.4ఎస్)లో ‘గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాల ఫలితంగానే చంద్రయాన్ –3 విజయం సాధించింది’ అని స్పష్టంగా చెప్పారు. చంద్రయాన్ –2 పాక్షిక విజయంపై విశదీకరిస్తూ... ‘వనరులు, శ్రమ, డబ్బు నష్టపోయినా ప్రధాని నిరుత్సాహ పడలేదు. బదులుగా మరింత ఆత్మవిశ్వాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రజలను చైతన్యవంతులను చేశారు. సరికొత్త దార్శనికత ప్రదర్శించారు’ అని రాశారు.ఇందులో ప్రధాని ప్రస్తావన తొమ్మిది సార్లుంది. కానీ 2008లో చంద్ర యాన్ –1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికిని మొదటిసారిగా గుర్తించిన కీలకమైన విషయాన్ని మాత్రం విస్మరించారు. ఆత్మ విశ్వాసానికి దెబ్బ... చంద్రయాన్–3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్ పద్ధతులను అవమానించడమే. ఓ ప్రాజెక్టు విజయానికి రాజకీయ నేతలను కర్తలుగా చేస్తూ పొగడటం సైన్స్ను రాజకీయం చేయడమే అవుతుంది. రాజకీయ మద్దతుకూ, సైన్స్ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చుకునేందుకు రాజ కీయ వర్గాల మద్దతు అవసరం. దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా దేశ శాస్త్ర పరి శోధన రంగాల తీరుతెన్నులను పర్యవేక్షించారు. సైన్స్లో పెట్టుబడుల ఆవశ్యకత గురించి అటు ప్రజలకు, ఇటు అధికారులకు, పార్లమెంటేరియన్లకు అర్థమయ్యేందుకు కృషి చేశారు. ఇవన్నీ ఆయన వెసులు బాటు కల్పించే వాడిగా చేశారు కానీ, నేరుగా పరిశోధన కౌన్సిళ్ల వ్యవహారాల్లో తలదూర్చలేదు. గడచిన కొన్ని దశాబ్దాల్లోనూ అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. శ్రీహరికోట నుంచి జరిగిన ముఖ్యమైన ప్రయోగాల్లో అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయంగా బద్ధ శత్రువైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావును వేదిక పైకి ఆహ్వానించిన విషయం గుర్తుచేసు కోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా చంద్రయాన్ –1 ఆలోచన రూపుదిద్దుకుంది. కానీ పలు పార్లమెంటరీ కమిటీల్లో దీనిపై చర్చలు జరిగిన తరువాత గానీ ఆమోదించలేదు. తన పంద్రాగస్టు ప్రసంగంలో వాజ్పేయి చంద్రయాన్ –1 గురించి తొలిసారి ప్రకటించారు. ఇస్రో ఈ ప్రాజెక్టుకు సోమయాన్ అని పేరు పెడితే వాజ్పేయి దాన్ని చంద్రయాన్ అని మార్చారు. అయితే దీన్ని ఎప్పుడూ ఆయన తన వ్యక్తిగత విజయంగా చెప్పుకోలేదు. భారత్– అమెరికా అణు ఒప్పందం తుది దశ చర్చల వివరాలు ప్రతిపక్షాలకూ అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన సీనియర్ సలహాదారును నియమించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులను వాతావరణ మార్పులపై జరిగే సదస్సులకు హాజరయ్యే ప్రతినిధి బృందాల్లో భాగస్వాములను చేశారు. జోక్యంతో ప్రమాదం... శాస్త్ర పరిశోధనల విషయంలో రాజకీయాలు ప్రమాదకరం. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ పలుమార్లు తన బాస్ అయిన ప్రధాని మోదీ నేతృత్వం కారణంగానే 2014 తరువాత శాస్త్ర రంగంలో అనేక విజయాలు నమోదయ్యాయని పదేపదే చెప్పుకొన్నారు. ఇదే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోనూ వ్యక్తమైంది. ఇలాంటి ప్రకటనలు ఏళ్లుగా పని చేస్తున్న శాస్త్రవేత్తల నిబద్ధతను తక్కువ చేసి చూపుతాయి. చంద్రయాన్ –1 ఆలోచనకు బీజం 1999లో పడితే వాస్తవరూపం దాల్చింది 2008లో. దీని తరువాత చేపట్టిన ప్రయోగాలు... ఉదాహరణకు చంద్రయాన్ –3, ఆదిత్య ఎల్–1 కూడా 2014కు ముందే మొదలైనవి. వీటి విజయాలకు 2014 తరువాతి రాజకీయ నేతృత్వం కారణమని చెప్పుకోవడం అత్యంత కచ్చితత్వంతో ఎంతోకాలంగా విజయవంతంగా ఇస్రో అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ప్లానింగ్, మేనేజ్మెంట్ వ్యవస్థలను అవమానించడమే. 2014 కంటే ముందు ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యను, తరువాతి సంఖ్యను పోల్చడం కూడా సరికాదు. 2014 తరువాత ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యధికం మైక్రో శాటిలైట్ల మార్కెట్ పెరగడం పుణ్యంగా వచ్చినవి అని గుర్తుంచు కోవాలి. ఇంకో విషయం... సైన్స్ విషయాల్లో రాజకీయ జోక్యం పరిశోధన సంస్థల స్వతంత్రత తగ్గిపోయేందుకూ కారణమవుతుంది. ఇది కేంద్రీ కృత నిర్ణయాల అమలును ప్రోత్సహిస్తుంది. పరిశోధనల దిశను మారుస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇప్పుడు కేటాయిస్తున్న నిధులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ సిద్ధాంతాలకు నప్పని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను తొక్కిపెట్టడం వంటివి జరగొచ్చు. జోషీమఠ్కు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఇస్రో తన వెబ్సైట్ నుంచి తొలగించాల్సి రావడం గమనించాలి. సైన్స్ అవార్డులను ప్రస్తుత గవర్నమెంటు రద్దు చేసింది. గుట్టుచప్పుడు కాకుండా అనేక పరిశోధన కేంద్రాలను కూడా మూసేసింది. ఫ్యామిలీ హెల్త్ సర్వేల ఇన్ ఛార్జ్ శాస్త్రవేత్తను ఇటీవలే సస్పెండ్ చేసి, రాజీనామా చేసేలా చేశారు. జన్యుమార్పిడి పంటల విషయంలో గతంలో స్వతంత్రంగా వ్యవహరించిన ‘ద ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ’ కూడా ఇప్పుడు సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు సంతోషంగా అంగీకరిస్తోంది. ఎగిరే యంత్రాల విషయంలో భారతీ యుల జ్ఞానానికి డాక్యుమెంటరీ రుజువుగా వైమానిక శాస్త్రాన్ని ఎన్సీఈఆర్టీ ప్రస్తావిస్తే శాస్త్రవేత్తలు నోరెత్తకుండా ఉన్నారు. ఇవన్నీ సైన్స్ పురోగతికి ఏమాత్రం మేలు చేసేవి కావు. దినేశ్ శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
‘దుమ్ము’ రేపిన విక్రమ్!
బెంగళూరు: చంద్రయాన్–3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్మును వెదజల్లింది. ఫలితంగా అక్కడ చిన్న గుంతలాంటి ప్రదేశం ఏర్పడినట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ‘ఉపరితలంలోని ఏకంగా 2.09 టన్నులకు పైగా దుమ్ము, ధూళి, ఖనిజ శకలాల వంటివి 108 మీటర్ల పరిధిలో చెల్లాచెదురయ్యాయి. దాంతో విక్రమ్ చుట్టూ భారీ వలయాకార పరిధి (గుంత వంటిది) ఏర్పడింది’’ అని వివరించింది. ల్యాండింగ్కు ముందు, జరిగిన వెంటనే తీసిన ఫొటోలను ఉపగ్రహ ఆర్బిటార్లోని హై రిజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సైంటిస్టులు ఈ మేరకు వెల్లడించారు. -
డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్..!
సంక్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్ సోమనాథ్ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు. అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. -
2040నాటికి చంద్రునిపైకి వ్యోమగామి..సరికొత్త లక్ష్యాలతో భారత్
న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ గగన్యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ భవిష్యత్తు రోదసి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్మెంట్ భారత భావి చంద్ర మిషన్ల కోసం రోడ్మ్యాప్ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ మిషన్లోపీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు గగన్యాన్ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన టెస్టింగ్ ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరగనుంది. గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర చేయనున్నారు. కాగా గగన్యాన్ మిషన్ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. మానవ అంతరిక్ష విమాన మిషన్ ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్స్ట్రేటర్ మిషన్లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్లు (సీఈఎస్) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్), ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ ఫ్లైట్ గగన్యాన్ మిషన్లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్ని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్డౌన్తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది. TV-D1 Flight Test: The test is scheduled for October 21, 2023, at 0800 Hrs. IST from the First launchpad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission and the visibility from the Launch View Gallery (LVG) will be limited. Students and the Public can witness… pic.twitter.com/MROzlmPjRa — ISRO (@isro) October 17, 2023 -
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
భారత్ స్వరం మరింత బలపడుతోంది
పితోర్గఢ్: సవాళ్లతోనిండిన ప్రపంచంలో భారత్ వాణి మరింత బలపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ సత్తా చాటుకుందని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి గత 30, 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కీలక అంశాలపై సైతం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైందని తెలిపిన ప్రధాని మోదీ, చంద్రుడిపై వేరే ఏ దేశమూ చేరుకోని ప్రాంతంలోకి మనం వెళ్లగలిగామన్నారు. ‘ఒక సమయంలో దేశంలో నిరాశానిస్పృహలు ఆవరించి ఉండేవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల చీకట్ల నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు ప్రార్థించేవారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. వెనుకబడిన ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రజలు వలస బాట పట్టారు. పరిస్థితులు మారి అలా వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు’అని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచమంతటా సవాళ్లు నిండి ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్ వాణి గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచానికే భారత్ మార్గదర్శిగా మారడం మీకు గర్వకారణం కాదా? ఈ మార్పు మోదీ తీసుకువచ్చింది కాదు. రెండోసారి మళ్లీ అధికారం అప్పగించిన 140 కోట్ల దేశ ప్రజలది’అని ప్రధాని అన్నారు. గత అయిదేళ్లలో 13.50 కోట్ల ప్రజలను పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందన్నారు. పేదరికాన్ని అధిగమించగలమని దేశం నిరూపించిందని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రజలు తనను కుటుంబసభ్యునిగా భావించారని చెప్పారు. రూ.4,200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆదికైలాస శిఖరంపై ప్రధాని ధ్యానం అంతకుముందు, రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం జోలింగ్కాంగ్ చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన స్వాగతం పలికారు. జోలింగ్కాంగ్లోని పార్వతీ కుండ్ వద్ద ఉన్న శివపార్వతీ ఆలయంలో ఆరతిచ్చి, శంఖం ఊదారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని పరమేశ్వరుని నివాసంగా భావించే ఆది కైలాస పర్వత శిఖరాన్ని సందర్శించుకున్నారు. అక్కడ కాసేపు ధ్యానముద్రలో గడిపారు. అనంతరం అక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం గుంజికి చేరుకున్నారు. అక్కడి మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. స్థానికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ఉన్ని దుస్తులు, కళారూపాలతో ఏర్పాటైన ప్రదర్శనను తిలకించారు. భద్రతా సిబ్బందితోనూ ప్రధాని ముచ్చటించారు. అక్కడ్నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోరా జిల్లాలో పురాతన శివాలయం జగదేశ్వర్ ధామ్కు వెళ్లారు. అక్కడున్న జ్యోతిర్లింగానికి ప్రదక్షిణలు, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రధాని పితోర్గఢ్కు చేరుకున్నారు. అత్యల్పానికి నిరుద్యోగిత: మోదీ న్యూఢిల్లీ: నానాటికీ దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత గత ఆరేళ్లలో అతి తక్కువగా నమోదైందని తెలిపారు. తాజాగా జరిపిన ఓ సర్వేలో ఈ మేరకు తేలిందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ కౌశల్ దీక్షాంత్ సమారోహ్ను ఉద్దేశించి గురువారం ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్లో కొన్నేళ్లుగా ఉపాధి కల్పన కొత్త శిఖరాలకు చేరుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత బాగా తగ్గుముఖం పడుతోంది. అభివృద్ధి ఫలాలు పల్లెలను చేరుతున్నాయనేందుకు ఇది నిదర్శనం. ప్రగతిలో అవిప్పుడు పట్టణాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు, పనిచేసే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుండటం మరో సానుకూల పరిణామం. ఇదంతా మహిళా సాధికారత దిశగా కొన్నేళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల పర్యవసానమే’’ అని మోదీ చెప్పారు. -
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్) -
చంద్రయాన్-3 సక్సెస్ పేరిట రైస్ పుల్లింగ్.. పాత్ర పేరుతో 20కోట్లు..
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగ్రుతోంది. అయితే, కొందరు కేటుగాళ్లు చంద్రయాన్-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై హైదరాబాద్లో కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కొందరు కేటుగాళ్లు చివరిని చంద్రయాన్-3ని కూడా వదిలిపెట్టలేదు. చంద్రయాన్ సక్సెస్కు రైస్ పుల్లింగ్ కారణమని భారీ మోసానికి తెర లేపారు. చంద్రయాన్-3 విజయానికి ఉపయోగించిన పాత్ర అమ్ముతామని కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారవేత్త వద్ద నుంచి ఏకంగా రూ.20కోట్లు దోచేశారు. ఇది మహిళ గల పాత్ర అంటూ కలరింగ్ ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో, బాధితుడు.. నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్ కుమార్ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన -
చంద్రయాన్-3.. ఏం పర్వాలేదు
అహ్మదాబాద్: చంద్రయాన్-3 ప్రాజెక్టుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై అడుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసేసిందని, స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని వెల్లడించారాయన. గుజరాత్లోని గిర్ సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్లోనే ఉండడం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. స్లీప్ మోడ్లోనే ఉన్నా పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ‘‘చంద్రుడిపై రాత్రి పూట (భూమిపై 15 రోజులకు సమానం) పగలు కంటే దాదాపు 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే.. రోవర్ కచ్చితంగా మేల్కొంటుంద’’ని చెప్పారు. అయితే.. ప్రజ్ఞాన్ తిరిగి యాక్టివ్ కాకపోయినా పర్వాలేదని, ఇప్పటికే దాని పని అది పూర్తి చేసిందని అన్నారు. చంద్రుడిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నించినట్లు ఇటీవల ఇస్రో వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 2న రోవర్, 4న ల్యాండర్ను ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపింది. Chandrayaan-3 Mission: Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition. As of now, no signals have been received from them. Efforts to establish contact will continue. — ISRO (@isro) September 22, 2023 మరోవైపు.. ఖగోళాన్ని మరింతలోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్పోశాట్)పై ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. అలాగే.. రాబోయే రోజుల్లో శుక్ర గ్రహ పరిశోధనలకు ఇస్రో సంసిద్ధమవుతోందని తెలిపారాయన. -
ఆ కాలమానం కొలతలెలా?
చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడిన ట్లయింది. 2025 సంవత్సరం నాటికి మళ్ళీ మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని కూడా ప్రణాళికలు తయారవు తున్నాయి. వాటిలో నేరుగా మనుషులు ఉండకపోవచ్చు. కానీ మరమనుషులు తప్పకుండా ఉంటారు. ఆ యంత్రాలు అక్కడ బయట తిరిగి ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగిస్తాయి. వాటి కొరకు మనుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు. అంటే, భూమి మీద లాగే అక్కడ కూడా కార్యక్రమాలన్నీ ఒక కాల మానం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం వస్తుందన్నమాట! అందుకే చంద్రుని మీద కాలాన్ని లెక్కిండడం ఎలా అనేది ఇప్పుడు మానవాళి ముందున్న ముఖ్య మైన ప్రశ్నగా నిలిచింది. అపోలో వ్యోమగాములు చంద్ర గోళం మీద దిగారు. తమ పని తాము ముగించి తిరిగి వచ్చేశారు. అక్కడ వారికి కాలం కొలతలతో అవసరం రాలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఉంటాయంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరం అవుతాయి. భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే సమయాన్ని లెక్కించే పద్ధతిని అక్కడ కూడా అనుసరించవలసి ఉంది. ఈ మాట అనడానికి సులభంగానే ఉన్నా... అటు సాంకేతిక పరంగానూ, ఇటు రాజకీయపరంగానూ ఇది గొప్ప సమస్యగా ఉంది. అసలు చంద్రుని మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటి? భూమి మీద ఒక సెకండ్ అంటే ఎంతో తెలుసు. అందరూ తెలుసు అనుకుంటున్నారు కానీ అసలు లెక్క ఒకటి ఉంది. అది అంత సులభంగా తలకెక్కదు. ఎక్కినా మన దినసరి జీవితంలో దాన్ని వాడే అవకాశం ఉండదు. ఒక గడియారాన్ని సరైన సమయానికి మార్చాలన్నా, అంటే సెట్ చేయాలన్నా మరి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి అవసరం. భూమి మీద మనకు ఆ పద్ధతి అలవాటయింది. మానవుల శరీరాలు కూడా ఆ పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి. భూమి తన చుట్టు తాను తిరిగే కాలం మనకు తెలుసు. అది సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే మన కాలం కొలతలు కొనసాగుతున్నాయి. చంద్రగోళం మాత్రం తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం వెలుగు లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రగోళం ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుంది. చంద్రగోళం తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. మనకు ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే కనపడుతుంది. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే మనకు కనబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం. మనకు భూమి మీద సూర్యో దయం, అస్తమయం లాంటి కొలతలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద కాలం కొలతలు అంత సుల భంగా కుదరవు అని అర్థం. కనుకనే వాటి గురించి పరిశోధకులు గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు. చంద్రగోళం మీదకి బహుశా మన దేశం వాళ్లు కూడా వెళతారు. మరెన్నో దేశాల వాళ్ళు వెళతారు. కనుక అందరికీ అంగీకారమయ్యే లెక్కలు రావాలి. అక్కడికి వెళ్లిన అంతరిక్ష యాత్రికులు, తాము ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎంతకాలం పాటు ఉన్నాము అన్న సంగతులను లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కదలిక వేగాల ఆధారంగా చంద్రుని మీద కూడా ఇటువంటి కొలతలు రావాలి. ఇందుకు కావలసిన సాంకేతిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. మొత్తం మీద కొత్త రకం కాలం కొలతలు వచ్చేస్తున్నాయి అని మాత్రం అర్థం చేసుకోక తప్పదు. మానవ చరిత్ర మొత్తం మీద ఒక పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మరో మరో పద్ధతీ వస్తున్నదని అంటున్నారు పరిశోధకులు. కె.బి. గోపాలం వ్యాసకర్త ప్రముఖ సైన్స్ రచయిత ‘ 98490 62055 -
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!!
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!! -
Chandrayaan 3: లాండర్, రోవర్ నుంచి సంకేతాలు లేవు
బెంగళూరు: జాబిలిపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్–3 తాలూకు లాండర్, రోవర్లతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ఇస్రో శుక్రవారం ప్రకటించింది. విక్రమ్గా పిలుస్తున్న లాండర్, ప్రజ్ఞాన్గా పిలుస్తున్న రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో సుప్తావస్థలోకి పంపడం తెలిసిందే. ఇప్పుడు అవి తిరిగి యాక్టివేట్ అయే స్థితిలో ఏ మేరకు ఉన్నదీ పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇప్పటిదాకా అయితే వాటినుంచి తమకు ఎలాంటి సంకేతాలూ అందలేదని వివరించింది. వాటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్ట్ చేసింది. సెపె్టంబర్ 20 దాకా చంద్రుని మీద రాత్రి వేళ. 14 రోజులు రాత్రి ఉంటుంది. అప్పుడక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 120 డిగ్రీల దాకా పడిపోతాయి. దాంతో చంద్రయాన్ లాండర్, రోవర్ పాడయ్యే ప్రమాదముంది. అందుకే వాటిని ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపింది. ఇప్పుడు పగటి సమయం కావడంతో వాటిని యాక్టివేట్ చేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. -
PRS Legislative Research: నిర్ణీత సమయానికి మించి పనిచేసిన పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో లోక్సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. స్పెషల్ సెషన్లో లోక్సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది. -
లోక్సభలో డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్నాథ్ విచారం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్కు డానిష్ అలీ లేఖ లోక్సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు. అవి లోక్సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్ను ఆయన కోరారు. -
చంద్రయాన్-3 థీమ్తో గణేష్ మండపం.. వైరలవుతోన్న వీడియోలు
నాయకచవితి వచ్చిందంటే ఆ సందడే వేరు. వాడవాడలా బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో మండపాల్లో గణేశుడి ప్రతిమలు కొలువుతీరాయి. పోలీసు, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. Lift-off to rover roll-out, this Ganesh Pandal on #Chandrayaan3 is absolutely mind-blowing! #Virlavideo #India pic.twitter.com/Lvo7Mp98pN — Yauvani (@yauvani_1) September 22, 2023 ఈ క్రమంలో ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లో పలు గణేష్ మండపాలను చంద్రయాన్-3 థీమ్తో రూపొందించారు. ఇలాంటి ఒక గణేష్ మండపం నెట్టింట్లో వైరల్గా మారింది. చంద్రయాన్-3 నమూనాతో రూపొందించిన ఈ గణేషుడి వెనుక ఒక వైపు చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. #Chandrayaan3 Ganesh In Achampet Nagar Kurnool#ISRO pic.twitter.com/gHK6WyfxOQ — COC (@Controversyy3) September 21, 2023 మరోవైపు ఈ మిషన్ చంద్రుడి చుట్టూ పలుమార్లు తిరిగి.. అనంతరం విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. విభిన్నంగా ఉన్న చంద్రయాన్-3 గణేష్ మండపానికి సంబంధించిన వీడియో క్లిప్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. Ganesh Pandal representing #Chandrayaan3 😍👌🏼creativity.#GaneshChaturthi2023 pic.twitter.com/RDLznl9jLp — Tathvam-asi (@ssaratht) September 20, 2023 A heartfelt tribute to the brilliant ISRO scientists who make dreams of Chandrayaan 3 come true while adding a festive touch with Ganesh Chaturthi decorations. Your dedication inspires us all! #Chandrayaan3 #ISRO #GaneshChaturthi #Tribute #ScienceAndFestivity #FestiveEngineers pic.twitter.com/687JZweXsZ — PRATIK NAIK (@Pratiknaek89) September 20, 2023 -
చంద్రయాన్ -3: ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్ 3 మిషన్ గురించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవన్ను మేల్కొలిపే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. కాగా గత 14 రోజుల నుంచి చంద్రుడిపై చీకటి ఉండటంతో ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జాబిల్లిపై సూర్మరశ్మి వెలుతురు పడటంతో నేడు(శుక్రవారం) వీటిని పునరుద్దరించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ల్యాండర్ నుంచి తమకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదని ఇస్రో పేర్కొంది. తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని చెప్పింది. చదవండి: చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు Chandrayaan-3 Mission: Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition. As of now, no signals have been received from them. Efforts to establish contact will continue. — ISRO (@isro) September 22, 2023 కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. అయితే చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్ను స్లీప్ మోడ్లో ఉంచారు. ఇక నేడు సూర్యోదయం కావడంతో రోవర్పై సూర్యర్శ్మి పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: ఉగ్రవాద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీకి లోక్సభ స్పీకర్ వార్నింగ్.. -
చంద్రయాన్ 3:కీలక ఘట్టానికి రంగం సిద్ధం
చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో సమాయత్తమవుతోంది. నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ను మేల్కొల్పడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. సూర్యరశ్మి తాకగానే రోవర్ నుంచి సిగ్నల్ కన్ఫర్మేషన్ కోసం వేచి చూస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. రోవర్, ల్యాండర్ ఇంకా నిద్రాణ స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. #WATCH | On Vikram Lander and Pragyan Rover, former ISRO Chairman K Sivan says, "We have to wait and see. It has undergone a lunar night. Now the lunar day starts. So, now they will try to wake up. If all the systems are functioning, it will be alright...This is not the end, a… pic.twitter.com/le3hpbMGcd — ANI (@ANI) September 22, 2023 నిద్రాణ స్థితి.. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజుల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాయి. కీలక సమాచారాన్ని చేరవేశాయి. చంద్రునిపై 14 రోజులు పాటు పగలు, 14 రోజులు రాత్రి ఉంటోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న రోవర్ను, సెప్టెంబర్ 4న ల్యాండర్ విక్రమ్ను నిద్రాణ స్థితిలోకి పంపారు. మేల్కొల్పు.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్.. దక్షిణ ధ్రువానికి 600 మీటర్ల దూరంలో ఉంది. 14 రోజుల తర్వాత చంద్రునిపై నేడు సూర్యోదనయం కానుంది. సూర్యరశ్మి రోవర్పై పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇస్రో సేవలు అద్భుతం -
‘చంద్రయాన్–3’ ఓ అద్భుతం
అనంతపురం: ‘చంద్రయాన్–3 ప్రయోగంతో మనందరమూ ఓ అద్భుతాన్ని చూశాం. యావత్ ప్రపంచం గర్వించేలా చంద్రయాన్–3 విజయం సాధించింది. ఇది నవభారత విజయం. ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉంది’ అని జేఎన్టీయూ (ఏ) ఈసీఈ విభాగం పూర్వ విద్యార్థి (చంద్రయాన్ –3 ప్రాజెక్ట్లోని ఓ శాస్త్రవేత్త ) డాక్టర్ ఎ. సాయి చందన అన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో సైంటిస్ట్ ‘సీ’గా పనిచేస్తున్న ఆమెను జేఎన్టీయూ(ఏ)లో గురువారం ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ఈ.అరుణకాంతి, డాక్టర్ జి.మమత, డాక్టర్ డి.విష్ణువర్ధన్, ఈసీఈ విభాగాధిపతి ఎస్.చంద్రమోహన్రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్లు పి.రమణారెడ్డి, వి.సుమలత, అరుణ, మస్తానీ, లలితకుమారి, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం చంద్రయాన్–3 మిషన్లో ఇంజినీర్ల పాత్రను ఆమె వివరించారు. కీలక పాత్ర మాదే భూమి నుంచి చంద్రుని పైకి ఉపగ్రహం వెళ్లే మధ్యలో జరిగే నావిగేషన్ ప్రక్రియ మొదలు ల్యాండింగ్ అయ్యే వరకూ తమ బృందంలోని 30 మంది బాధ్యత వహించారన్నారు. ముందుగా తాము పరిశీలించిన తర్వాతనే ల్యాండర్కు ఎలాంటి సందేశమైనా పంపాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు విజయవంతం చేసేందుకు దాదాపు వెయ్యి పర్యాయాలు సిమ్ములేషన్ చేశామన్నారు. చంద్రయాన్–3 విజయంలో కీలక పాత్ర పోషించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నీటి జాడలున్నాయనే.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడలు ఉన్నాయని భావించడం వల్లనే రోవర్ను అక్కడ దింపినట్లు పేర్కొన్నారు. రాళ్లు, శిలలు తక్కువగా ఉండడంతో ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు మార్గం సుగమమైందన్నారు. ఆ ప్రాంతంలో మంచు స్పటికాల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని ఇస్రో గుర్తించిందన్నారు. అందులోనూ దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుందన్నారు. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయన్నారు. ఈ కారణాల రీత్యా అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఇస్రో అంచనా మేరకు పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చునన్నారు. నీరుంటే అక్కడ మానవ మనుగడ కూడా సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నానో శాటిలైట్లదే భవిష్యత్తు చంద్రయాన్–3 విజయవంతం చేయడంలో భారత శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని డాక్టర్ సాయిచందన కొనియాడారు. ఈ విజయం ద్వారా అంతరిక్ష పరిశోధనలకు 50 దేశాలు ఇస్రోతో ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. భవిష్యత్తు నానో శాటిలైట్లదే అవుతుందన్నారు. నానో శాటిలైట్ విప్లవానికి ఇస్రో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. -
ఇస్రోలో నారీశక్తి అభినందనీయం : శ్రీకృష్ణదేవరాయలు
-
‘చంద్రయాన్–3’ రీయాక్టివేట్కు సన్నద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్లో భాగంగా గత 23న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవంలో దిగి సేవలందించిన ల్యాండర్, రోవర్లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడి సమాచారాన్ని అందించింది. అనంతరం దక్షిణ ధృవం సూర్యరశ్మి లేకుండా చీకటితో నిండిపోయే సమయం ఆసన్నమవ్వడంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా ఈనెల 2న రోవర్ను, 4న ల్యాండర్ను స్లీపింగ్ మోడ్లోకి పంపించారు. ఇప్పుడు మళ్లీ ల్యాండర్, రోవర్లు ఉన్న ప్రాంతంలో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బుధ, గురువారాల్లో సూర్యరశి్మని ఉపయోగించుకొని.. ల్యాండర్, రోవర్లోని బ్యాటరీలు రీచార్జ్ అవుతాయని భావిస్తున్నారు. ఈనెల 22న ల్యాండర్, రోవర్ పనితీరును ఇస్రో పునరుద్ధరించే అవకాశముంది. బ్యాటరీలు రీచార్జ్ అయ్యి ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేస్తే.. ఇస్రో అంతరిక్ష చరిత్రలో ఇది మరో అద్భుతం కానుంది. -
రెండు రోజుల్లో చంద్రుడిపై పగలు.. రోవర్, ల్యాండర్ పరిస్థితి?
బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇప్పటికే కీలక సమాచారాన్ని అందించాయి. అయితే, చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో ఇస్రో.. ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్, రోవర్లను నిద్రాణ స్థితిలోకి పంపింది. రోవర్, ల్యాండర్ నిద్రలేచేనా? ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణస్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. అయితే, రోవర్, ల్యాండర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Chandrayaan-3 Mission: Vikram Lander is set into sleep mode around 08:00 Hrs. IST today. Prior to that, in-situ experiments by ChaSTE, RAMBHA-LP and ILSA payloads are performed at the new location. The data collected is received at the Earth. Payloads are now switched off.… pic.twitter.com/vwOWLcbm6P — ISRO (@isro) September 4, 2023 చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్ని ఇస్రో విడుదల చేసింది. మరోవైపు.. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!
Chandrayaan-3Technician selling idli ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 లాంచ్ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడన్న వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఇస్రోకు చెందిన HEC (హెవీఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో దీపక్ కుమార్ ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం వైరల్గా మారింది. బీబీసీ కథనం ఆధారంగా ఎన్డీటీవీ అందించిన రిపోర్ట్ ప్రకారం చంద్రయాన్-3 కోసం ఫోల్డింగ్ ప్లాట్ఫారమ్ అండ్ స్లైడింగ్ డోర్ను తయారు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి 18 నెలలుగా జీతం చెల్లించకపోవడంతో అతను రోడ్సైడ్ స్టాల్ను తెరిచాడు. హెచ్ఈసీలో పనిచేస్తున్న ఉప్రారియా ఏమన్నారంటే.. జీతం అందక కొన్నాళ్లు క్రెడిట్ కార్డ్తో నెట్టుకొచ్చా. ఆ తరువాత బంధువులు, స్నేహితుల ద్వారా దాదాపు నాలుగు లక్షల అప్పు చేశాను.. భార్య నగలు తాకట్టు పెట్టి కొన్ని రోజులు ఇంటిని నడిపించా.. ఇపుడిక అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఆవేదన వ్యక్తం చేశారు ఆకలితో చచ్చిపోవడం కన్నా అందుకే ఇక వేరే గత్యంతరం లేక కడుపు నింపుకుంనేందుకు ఆకలితో చచ్చిపోవడం కన్నా ఇడ్లీ దుకాణం బెటర్ అనే ఉద్దేశంతో ఈ దుకాణాన్ని తెరవాల్సి వచ్చిందని చెప్పారు. భార్య మంచి ఇడ్లీలు చేస్తుంది. వాటిని అమ్మడం ద్వారా రోజుకి 300-400 రూపాయలొస్తాయి. తద్వారా 50-100 రూపాయల లాభం వస్తుంది ఈ డబ్బుతోనే ఫ్యామిలీని నెట్టుకొస్తున్నానని తెలిపారు. అంతేకాదు తనకు ఇద్దరు కూతుళ్లని, ఈ ఏడాది ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్ నుంచి రోజూ నోటీసులు పంపుతున్నా రన్నారు. క్లాస్ రూంలో టీచర్లు హెచ్ఈసీలో పనిచేస్తున్న వారి పిల్లలు ఎవరని అడిగి మరీ అవమానించారనీ, దీంతో తన కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి రావడం చూసి గుండె పగిలిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉప్రారియా తోపాటు సంస్థలోని దాదాపు 2,800 మంది ఉద్యోగుల జీతాలు అందలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాకు చెందిన ఉప్రారియా 2012లో, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 8,000 జీతంతో HECలో చేరాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు. కానీ అతని అంచనాలు తల్లకిందులైనాయి. అయితే జీతాల సమస్యపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థకాబట్టి ఉద్యోగుల జీతభత్యాల బాధ్యత ఆ సంస్థదే అని తెలిపింది. కాగా ఇస్రో చంద్రయాన్-3 జూలై 14న విజయ వంతంగా ప్రయోగించింది. తద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై కాలిడిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. Meet Deepak Kumar Uprariya who sells Tea & Idli in Ranchi. He is a Technician, who worked for building ISRO's Chandrayaan-3 launchpad. For the last 18 months, he has not received any salary. "When I thought I would die of hunger, I opened an Idli shop" (BBC Reports) pic.twitter.com/cHqytJvtfj — Cow Momma (@Cow__Momma) September 17, 2023 -
ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా?
చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన 'చంద్రయాన్-3' గురించి దాదాపు అందరికి తెలిసిందే. ప్రారంభంలో అక్కడి సమాచారాన్ని చాలావరకు భూమిపైకి పంపిన ల్యాండర్, రోవర్ రెండూ కూడా ప్రస్తుతం స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఇవి అక్కడ ఎలా ఉంటాయనే సన్నివేశం ఊహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించారు. ఏఐ ఊహాజనిత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రస్తుతం చంద్రుని మీద చీకటి ఉన్న కారణంగా అవి నిద్రలోకి జారుకున్నాయి. చంద్రుడి సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టె సమయం 28 రోజులు, కావున అక్కడ 14 రోజులు చీకటి, మరో 14 రోజులు వెలుతురు ఉంటుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! ఏఐ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడి పరిసరాలు మొత్తం గ్రీన్ కలర్లో.. దాని మధ్యలో ల్యాండర్ ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం చంద్రుని మీద ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా గడ్డకట్టేంత ఉంటాయని, ఇలాంటికివన్నీ రోవర్ తట్టుకోగలదా అనేది ప్రశ్నార్థకం. అయితే ఈ నెల 22న పగటి సమయం మొదలవుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే ల్యాండర్ అండ్ రోవర్ మళ్ళీ పరిశోధనలు మొదలుపెడతాయి. AI imagines Chandrayaan-3's Vikram lander during cold night on the Moon..#Chandrayaan3 #Moon #AI #ISRO pic.twitter.com/lQow6B72s4 — Muskmelon (@gova3555) September 12, 2023 -
నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. "अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।" धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं। महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt — AAP (@AamAadmiParty) September 7, 2023 BJP के मुख्यमंत्री की सोच देखिए... हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके। इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे। और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db — Congress (@INCIndia) September 7, 2023 ఇది కూడా చదవండి: నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్ -
చంద్రయాన్–3లో మన కృష్ణమూర్తి
కాకినాడ: చంద్రయాన్–3 విజయవంతం కావడంలో మన కాకినాడ వాసి భాగస్వామ్యం కూడా ఉందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశమంతటా చంద్రయాన్ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే పుట్టి చదువుకున్న శాస్త్రవేత్త పాత్ర ఉంది. ఆయనే కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్లో చదువుకున్న కేవీ కృష్ణమూర్తి. ఆయన ఇస్రోలో స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ గ్రూపులో డ్యూటీ మేనేజర్గా పని చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సాంకేతిక విద్యపై ఆసక్తితో ఆంధ్రా పాలిటెక్నిక్లో మెకానికల్ పూర్తి చేశారు. దివంగత కొల్లూరు శ్రీరామమూర్తి అవధాని, లక్ష్మీసోదమ్మల నాలుగో సంతానం ఆయన. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి, అక్కడ ఎస్వీ రాజగోపాల్ ప్రోద్బలంతో ఏఎంఐఈఈలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సెంటర్ బదిలీ అయ్యారు. అక్కడ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ గ్రూపులో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నారు. చంద్రయాన్–3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్కు పీఎస్ఐ పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. ఈ ప్రక్రియ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్కు దోహదపడిందని ఆయన తెలిపారు. చంద్రయాన్–3 మిషన్ ఆపరేషన్లో ఆయన 45 రోజుల పాటు ఇతర శాస్త్రవేత్తలతో కలసి శ్రమించారు. ప్రస్తుతం ఆయన గగన్యాన్ ప్రాజెక్టులో కూడా పని చేస్తున్నారు. ఇస్రోలో 38 ఏళ్ల కెరీర్లో కృష్ణమూర్తి మూడు ప్రాజెక్టులకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్గా పని చేశారు. చంద్రయాన్–3 సక్సెస్ సమయంలో చివరి 17 నిమిషాలు నరాలు తెగేంత ఉత్కంఠను అనుభవించామని సాఫ్ట్ ల్యాండింగ్తో ఊపిరి పీల్చుకున్నామని కాకినాడలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా చెప్పారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ సామర్థ్యం, ఇతర కేంద్రాల డైరెక్టర్ల మార్గదర్శకాలతో చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైందని, ఈ మొత్తం ప్రాజెక్టులో తమ వాడు ఉండటం గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వెలిబుచ్చారు. కాగా ఆదిత్య ఎల్–1 శాటిలైన్లో ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కూడా కృష్ణమూర్తి ఆధ్వర్యంలోనే జరిగిందని అంటున్నారు. -
ఇది మాత్రమే అభివృద్ధి కాదు!
76 ఏళ్ల స్వతంత్ర భారతదేశం సాధించిన ఘనతల పరంపరలో తాజాగా ‘చంద్రయాన్–3’ వచ్చి చేరడం కేంద్రంలోని పాలక పార్టీ బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇస్రో శాస్త్రవేత్తలు సల్పిన నిర్వరామ కృషి ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం రాకెట్లను ఎడ్ల బండ్లపై తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా... తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు వారు నిస్వార్థంగా కృషి చేస్తూనే ఉన్నారు. చంద్రయాన్–3 విజయం భారత్ ప్రతిష్ఠను అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెంచేసింది. చంద్రయాన్–3 తర్వాత సూర్యయాన్ వైపు ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషిని సాగించడమూ భారతీయులందరికీ గర్వకారణమే. అయితే, దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ఈ ఘనత, అభివృద్ధి అన్ని రంగాలలో ప్రతిఫలిస్తు న్నాయా? అనివార్యంగా వేసుకోవలసిన ప్రశ్న ఇది. అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కొలమానంగా మానవాభివృద్ధి సూచిక, శిశు మర ణాల రేటు, పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ అంశాల ఆధారంగా భారత్తోపాటు ఇంచుమించుగా అదే సమయంలో స్వాతంత్య్రం పొందిన దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిని బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన అభివృద్ధి నివేదికలలో పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు; జీ7 కంట్రీస్గా పిలవబడే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డవ్ు, యునైటెడ్ స్టేట్స్లు; ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, హంగరీ, ఇండోనేషియా, ఇరాన్, మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియా, థాయ్లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోపాటు భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సాధించిన ర్యాంకింగ్ల ఆధారంగా అక్కడి స్థితిగతులు అర్థమవు తాయి. పైన పేర్కొన్న దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని పరిశీలిస్తే, 1960 నుంచి 2022 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో భారత్ది అడుగు నుంచి మూడవ స్థానం. కేవలం పాకిస్తాన్, నేపాల్ మాత్రమే భారత్ కంటే దిగువన ఉన్నాయి. 1950 నుంచి 2021 మధ్య కాలంలో 31 దేశాల మానాభివృద్ధి సూచికలను పరిశీలించినప్పుడు భారత్ 1950లో 26వ స్థానంలో ఉండగా, 2021 నాటికి 29వ స్థానానికి పడిపోయింది. 32 దేశాల్లో శిశు మరణాలకు సంబంధించి 1960–1975 మధ్య కాలంలో, ఆ తర్వాత 2021 వరకు నమోదైన గణాంకాలను పరి శీలిస్తే... 1960–1975 మధ్య అత్యధిక శిశు మరణాలు నమోదైన దేశాలలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 2021 నాటికి ఆ స్థానం మరింత దిగజారి కింది నుంచి 3వ స్థానానికి చేరుకొంది. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అంశంలో 31 దేశాలలో 1997 నుంచి 2022 మధ్యకాలంలో భారత్ది 21వ స్థానం. 1997–98లో భారత్ పార్లమెంట్లో మహి ళల ప్రాతినిధ్యం 7 శాతం ఉండగా, 2022 నాటికి అది 14.9 శాతంకు పెరిగింది. 140 దేశాల కంటే భారత్ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఎక్కడైతే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, ఆ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నా యని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక.. విద్యుత్, ఇంటర్నెట్ సేవల రంగాలలో మాత్రం భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 1993–2000 మధ్య కాలంలో దేశంలో 50 శాతం జనాభాకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందు బాటులో ఉండగా, ప్రçస్తుతం దేశంలో 99 శాతం మందికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, ఇంటర్నెట్ సేవల రంగాన్ని పరిశీ లిస్తే, 2020 నాటికి భారత్లో 43 శాతం జనాభాకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత్ పౌరహక్కులు, లింగ సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలలో ఎంతో వెనుకబడింది. మానవా భివృద్ధి సూచికల్లో ప్రధానమైన అంశంగా పౌరహక్కులను పరిగణిస్తారు. పౌరహక్కులలో భారత్ స్థానం 92గా ఉంది. అంటే, భారత్ కంటే 91 దేశాలు మెరుగైన పరిస్థి తుల్లో ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పలు రాజ్యాంగ వ్యవస్థలు దోహదం చేస్తాయి. అయితే, గత కొంతకాలంగా దేశంలోని పలు రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరిచే ప్రయత్నాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అతి ముఖ్యమైన అంశం. ఆ బాధ్యతను నిర్వహించే స్వతంత్ర సంస్థ ‘భారత ఎన్నికల కమిషన్’నే పూర్తిగా తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలను కేంద్రంలో అధికా రంలో ఉన్నవారు చేయడం ఆశ్చర్యకరం. భారత ఎన్నికల కమిషన్ తరఫున చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు నిర్వహిస్తారు. వారి నియామ కాలను చేపట్టే విధానాన్ని సమూలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి బదులుగా ఒక కేంద్ర మంత్రి నియమితులవుతారు. ఆ కేంద్రమంత్రిని ప్రధాన మంత్రే సభ్యుడిగా నియమిస్తారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు పూర్తిగా మారి పోతాయి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం అన్నది ఇకపై ఉండకపోవచ్చు. ఇది దేశ ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే చట్టం. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఐటీని, సేవల రంగంలోని అభివృద్ధినీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అందుబాటులోకి వచ్చిన అభివృద్ధినీ చూపి ఇదే దేశాభివృద్ధిగా చాటుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. అభివృద్ధికి నిర్వచనం మార్చేసి మేడిపండు లాంటి అభివృద్ధి చూపి అదే అభివృద్ధి అని ప్రచారం చేస్తే ఎలా? ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నమని వేరే చెప్ప వలసిన అవసరం లేదు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రం
ఢిల్లీ:చంద్రయాన్ 3 ప్రాజెక్టుని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ని విజయవంతంగా దింపింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ అజేయంగా నిలిచింది. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్ని ఇస్రో తాజాగా విడుదల చేసింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 చంద్రయాన్–3 మిషన్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగిన ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రమిది. ఆనాగ్రిఫ్ టెక్నిక్ను ఉపయోగించి ఇస్రో ఈ చిత్రాన్ని రూపొందించింది. -
ఆదిత్య హృదయం
రెండు వారాల్లో రెండు ప్రయోగాలు! ఒకటి చంద్రుడి పైకి... మరొకటి సూర్యుడి గురించి! భారత శాస్త్రవేత్తలు మన అంతరిక్ష ఆకాంక్షలను మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగంతో ఇప్పటిదాకా పరిశోధనల్లో అసూర్యంపశ్యగా మిగిలిపోయిన చంద్రుడి దక్షిణ ధ్రువప్రాంతంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని పంపడం, రోబోటిక్ ల్యాండర్ విక్రమ్– రోవర్ ప్రజ్ఞాన్లు చంద్రునిపై సుతిమెత్తగా దిగడం, వాటిలో పరికరాలు పంపు తున్న అపూర్వడేటా దేశ కీర్తిప్రతిష్ఠల్ని పెంచాయి. ఆ విజయ పరంపర సాగుతుండగానే, భూమికి అతి సమీప నక్షత్రం సూర్యుడి అధ్యయనానికి భారత్ తొలిసారి ఉపగ్రహాన్ని పంపడం విశేషం. చంద్రయాన్–3తో పోలిస్తే, ‘ఆదిత్య– ఎల్1’ ప్రయోగంలో నాటకీయత తక్కువే. కానీ, సెప్టెంబర్ 2న సక్సెసైన ఈ సౌరశోధనా ఉపగ్రహ ప్రయోగం మరో 4 నెలల్లో కీలకమైన భౌమ– సౌర లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)కు సురక్షితంగా చేరగలిగితే, ఎన్నో సౌర రహస్యాలు బయటకొస్తాయి. ఇప్పటికే చంద్రునిపై ఆక్సిజన్ జాడ సహా అనేకం కనుగొని, చంద్ర మండలం ఊహిస్తున్న దాని కన్నా ఎక్కువగానే ఆవాసయోగ్యమని మనం తేల్చాం. రేపటి శోధనలో ఆదిత్య హృదయం ఏం వెల్లడిస్తుందో ఆసక్తికరమే. దేశంలోని మరో ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేస్తున్న ఈ రోదసీ గవేషణతో సౌర వర్తన, అంతరిక్ష వాతావరణం, వైపరీత్యాల నుంచి మన అంతరిక్ష ఆస్తుల సంరక్షణ వగైరాలపై లోతైన అవగాహన కలగవచ్చు. అంతరిక్ష పరిశోధనలో అంతకంతకూ భారత్ ముంద డుగులు వేస్తున్నదనడానికి ఇది మరో కొండగుర్తు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’, అలాగే యూరోపియన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఈసా’లు సూర్యుడి గురించి ఇప్పటికే 20కి పైగా శాస్త్రీయ అంతరిక్ష ప్రయోగాలు జరిపాయి. అమెరికా, యూకేల సాయంతో జపాన్ సైతం తన పరిశోధక ఉపగ్రహాన్ని 2006లో ప్రయోగించింది. అయితే, మన ఇస్రో మాత్రం ‘చంద్రయాన్’ లాగానే ఈ సూర్య మండల గవేషణలోనూ తన వైన ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలని నడుం బిగించింది. ముఖ్యంగా సూర్య గోళానికి వెలుపల విస్తరించి ఉండే కాంతివలయమూ, సౌర వాతావరణానికి పైభాగమైన (కరోనా); సూర్యునిలో భాగమైన వెలుగులు విరజిమ్మే ప్రకాశమండలం (ఫోటోస్పియర్); ఆ చుట్టూ వ్యాపించే, సౌర వాతా వరణానికి దిగువ ప్రాంతమైన వర్ణమండలం (క్రోమోస్పియర్); సౌర పవనాలు – వీటన్నిటిపైనా దృష్టి సారించాలని రంగంలోకి దిగింది. ‘ఆదిత్య ఎల్1’లోని శాస్త్రీయ పరికరాల ద్వారా సౌర విద్యు దయస్కాంత క్షేత్రాలనూ, వెలువడే కణ ఉద్గారాలనూ లెక్కించాలని ప్రణాళిక వేసుకుంది. తద్వారా సూర్యుడి ప్రవర్తన గురించి కొత్త అంశాలను వెలికి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ ద్వారా చంద్రుడు, వెంటనే ఆదిత్య–ఎల్1 ద్వారా సూర్యుడు, ఆ వెంటనే శుక్రుడు, అటు పైన మానవ సహిత వ్యోమనౌకతో అంతరిక్ష యానమైన ‘గగన్యాన్’... ఇలా వరుసగా అనేక బృహత్ యజ్ఞాలను ఇస్రో చేపడుతోంది. బుధుడి తర్వాత మనకు అత్యంత సమీపంలో ఉన్న శుక్ర గ్రహపు మేళనాన్నీ, అక్కడి వాతావరణాన్నీ అధ్యయనం చేయడం ఒక ప్రాజెక్ట్ ఆలోచనైతే, ముగ్గురు భారత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, మళ్ళీ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకు రావడం మరో ప్రాజెక్ట్ లక్ష్యం. ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు (అమెరికా, రష్యా, చైనా) మాత్రమే ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపాయన్నది గమనార్హం. ఈ ప్రాజెక్టులన్నిటిలో ఇస్రో ఎంచుకున్న మార్గం ఒక్కటే – వీలైనంత తక్కువ ఖర్చులో ఉన్నత సాంకేతిక నవకల్పన! తాజా సౌరశోధననే చూస్తే– భూమి నుంచి 15 కోట్ల కి.మీ.ల దూరంలో సూర్యుడుంటాడు. మన ఆదిత్య–ఎల్1 వెళ్ళేది అందులో 15 లక్షల కి.మీ.ల దూరమే. అంటే, భూమి కన్నా ఒక్క శాతం మాత్రమే సూర్యునికి దగ్గరగా వెళుతుంది. అయితేనేం, సూర్య, భూమి రెంటి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండి, అందుకు తగ్గట్టు వ్యోమనౌక తిరిగేందుకు కావాల్సిన కేంద్రోన్ముఖ బలాన్నిఅందించే పరివేష కక్ష్య (హేలో ఆర్బిట్)లోని కీలకమైన లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)లో ఈ ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చు కాకుండానే మన ఉపగ్రహం సౌర మండలాన్ని నిరంతరాయంగా పరిశీలించవచ్చు. భూమి నుంచి 9.9 కోట్ల కి.మీ.ల దగ్గరున్నప్పుడు కుజుడి అధ్యయనానికి గతంలో మంగళ్యాన్ చేసిన మన అనుభవమూ ఆదిత్యకు పనికొచ్చింది. ఎల్1 వైపు సాగుతున్న ప్రయాణంలో ఆదిత్య ఉపగ్రహ కక్ష్యను ఇప్పటికి రెండుసార్లు విజయవంతంగా పెంచగలిగాం. సెప్టెంబర్ 10న మూడోసారి కక్ష్య పెంపు ఉండనుంది. వెరసి, ప్రయోగం నాటి నుంచి 125 రోజులకు, అంటే సుమారు నాలుగు నెలలకు పరివేష కక్ష్యలో ఎల్1 వద్ద మన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే అయిదేళ్ళ పాటు ఈ ఉపగ్రహం సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పంపనుంది. అంతా బాగుంటే, ఆ తర్వాత కూడా మరో పదేళ్ళ పైగానే అది పనిచేసే అవకాశం కూడా ఉందట. జ్ఞానమే సమున్నత అధికారమైన ఆధునిక సమాజంలో, దానిపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యాలతో మనం దీటుగా నిలబడేందుకు అంతకు మించి ఇంకేం కావాలి! అనేక దేశాల వల్ల కాని సూర్యచంద్ర శోధనను మనం సాధించ గలగడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనమే! 2020 నుంచి ప్రైవేటీకరణ బాట పట్టిన భారత అంతరిక్ష విధానంతో, 360 బిలియన్ డాలర్ల ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో గణనీయ మైన వాటా దక్కించుకోవడానికీ ఇలాంటి శోధనలు, విజయసాధనలు మరింత అవసరమే! -
జాబిల్లిపై మరోసారి ‘విక్రమ్’ ల్యాండింగ్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండర్ ‘విక్రమ్’ను మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. మొదట దిగిన ప్రాంతంలో కాకుండా మరో చోట విక్రమ్ క్షేమంగా దిగినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఎక్స్’లో వెల్లడించింది. తాము ఇచి్చన ఆదేశాలకు విక్రమ్ చురుగ్గా స్పందించినట్లు తెలియజేసింది. ల్యాండర్ తొలిసారిగా ఆగస్టు 23న చందమామ ఉపరితలంపై విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే. చంద్రయాన్–3 మిషన్ లక్ష్యంలో భాగంగా ల్యాండర్ను తాజాగా మరోచోట దించారు. కమాండ్ ఇచి్చన తర్వాత ల్యాండర్లోని ఇంజిన్లు ఫైర్ అయ్యాయని, తర్వాత ల్యాండర్ 40 సెంటీమీటర్ల మేర పైకి లేచిందని, 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ఉపరితలంపై దిగిందని ఇస్రో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మానవ సహిత ప్రయోగాలను నిర్వహించినపుడు వ్యోమగాములను క్షేమంగా తిరిగి భూమిపైకి తీసుకురావడానికి కిక్ స్టార్ట్ వంటిదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ల్యాండింగ్కు సంబంధించిన వీడియోను ఇస్రో విడుదల చేసింది. నిద్రాణ స్థితిలోకి ‘విక్రమ్’ చందమామపై మరో రెండు మూడు రోజుల్లో లూనార్ నైట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ విక్రమ్ను నిద్రాణ స్థితి(స్లీప్ మోడ్)లోకి మార్చినట్లు ఇస్రో ప్రకటించింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేసింది. ల్యాండర్ను స్లీప్ మోడ్లో ఉంచడంతో అందులోని పేలోడ్స్ డీయాక్టివ్ అయినట్లు వివరించింది. ల్యాండర్ రిసీవర్స్ మాత్రం చురుగ్గా పని చేస్తున్నట్లు తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై సౌరశక్తి తగ్గిపోయి, బ్యాటరీ అయిపోయిన తర్వాత ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ పూర్తిగా స్లీప్ మోడ్లో ఉంటాయని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేస్తాయా అంటే చెప్పలేమని ఇస్రో సైంటిస్టులు అంటున్నారు. మళ్లీ పని చేస్తే చంద్రయాన్–3 ప్రయోగం కొనసాగుతుంది. లేనిపోతే కథ ముగిసినట్లే. -
Chandrayaan3: మరోసారి విక్రమ్ సేఫ్ ల్యాండ్
బెంగళూరు: చంద్రయాన్-3 నుంచి ఇస్రో మరో అప్డేట్ ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు తెలిపింది. నిర్ణీత ప్రాంతం నుంచి సుమారు 30-40 సెం.మీ. దూరంలో జంప్ చేసింది విక్రమ్. ల్యాండింగ్ సమయంలో దుమ్ము, ధూళి పైకి లేచాయి. అయితే ఇది ఏ సమయంలో చేశారన్నదానిపై ఇస్రో స్పష్టత ఇవ్వలేదు. Chandrayaan-3 Mission: 🇮🇳Vikram soft-landed on 🌖, again! Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment. On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI — ISRO (@isro) September 4, 2023 ఇప్పటికే స్లీపింగ్మోడల్లోకి వెళ్లింది ప్రగ్యాన్ (ప్రజ్ఞాన్ రోవర్). ఇక ఇప్పుడు ల్యాండర్ విక్రమ్ను సైతం స్లీప్మోడ్లోకి తీసుకెళ్లింది ఇస్రో. చంద్రుడిపై సూర్యోదయం దాకా ఇస్రో ఎదురు చూస్తుంది. ఈ రెండూ సెప్టెంబర్ 22వ తేదీన తిరిగి యాక్టివ్ మోడ్లోకి వస్తాయి. ఆ మరుసటి రోజు పంపే డేటాపై ఇస్రో ప్రకటన చేసే అవకాశం ఉంది. -
ఇస్రోలో తీవ్ర విషాదం
చెన్నై: దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా..కొందరి గొంతు మాత్రమే ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి గుర్తుండిపోయే గొంతుక మేడమ్ వలార్మతిది. మన ఇస్రో ప్రయోగించిన పదుల సంఖ్యలో రాకెట్లకు కౌంట్డౌన్ చెప్పింది ఈమెనే. 1959లో తమిళనాడులోని అరియలూర్లో జని్మంచిన వలార్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్గా చేరారు. ఇస్రో ప్రయోగించిన రాకెట్లకు లాంఛింగ్ కౌంట్డౌన్ ఆమే చెప్పేవారు. ఇలా ఈమె విలక్షణమైన కంఠం దేశప్రజలకు సుపరిచితం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో ఈమె అందుకున్నారు. చివరిసారిగా చంద్రయాన్–3 మిషన్ రాకెట్కు వలార్మతినే కౌంట్డౌన్ చెప్పడం విశేషం. ఇస్రో నుంచి రిటైరైన ఈమె శనివారం సాయంత్రం గుండెపోటుకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. -
Chandrayaan-3: స్లీప్ మోడ్లోకి ప్రజ్ఞాన్..
శ్రీహరికోట: చంద్రయాన్–3 మిషన్లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసి స్లీప్ మోడ్లోకి వెళ్లిందని ఇస్రో శనివారం తెలిపింది. లూనార్ మిషన్లోని రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, చంద్రుడి ఉపరితలంపై రాత్రిళ్లు ఉండే అతిశీతల పరిస్థితులను తట్టుకుని ఉండేలా వాటిని స్లీప్ మోడ్లోకి పంపుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ల్యాండర్ చుట్టూ 100 మీటర్ల మేర రోవర్ ఇప్పటివరకు ప్రయాణించిందని చెప్పారు. అందులోని రిసీవర్ను ఆన్లోనే ఉంచి, పేలోడ్స్ను ఆఫ్ చేసి ఉంచుతామన్నారు. అందులోని డేటా బేస్ ల్యాండర్ ద్వారా ఇప్పటికే తమకు చేరిందన్నారు. ప్రస్తుతం వీటి బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జి అయి ఉన్నాయని, ఈ నెల 22వ తేదీన తిరిగి అక్కడ సూర్య కిరణాలు ప్రసరించిన తర్వాత వాటికి తిరిగి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. చంద్రుడిపై భారత రాయబారిగా రిసీవర్ ఎప్పటికీ అక్కడే ఉంటుందని చెప్పారు. Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
సూర్యుడిపై పరిశోధనల్లోనూ ఈసీఐఎల్ కీలకపాత్ర
కుషాయిగూడ: చంద్రయాన్–3 ప్రయోగానికి డీప్స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను అందజేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సూర్యుడిపై పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ ప్రయోగానికి అవసరమైన యాంటెన్నాను సైతం ఇస్రోకు అందజేసి మరోమారు సత్తా చాటుకుంది. శనివారం ప్రయోగించిన ఆదిత్య–ఎల్1కు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ యాంటెన్నా అందిస్తుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యాంటెన్నా 18 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నాయి. 15 లక్షల కి.మీ. దూరంలో కక్ష్యలో ఉన్న శాటిలైట్కు భూమి నుంచి నిర్థిష్టమైన సమాచారాన్ని చేరవేయడంలో యాంటెన్నా కీలకంగా వ్యవహరిస్తుందని వివరించాయి. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలోని బైలాలు గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఎంటీఏఆర్ సహకారం... ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయంలో హైదరాబాద్కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సైతం కీలక సహకారం అందించిందని సంస్థ ఎండీ పర్వత శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పీఎస్ఎల్వీ–సీ57 మిషన్లో భాగంగా లాంచింగ్ వాహనం కోసం లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లు, ఎలక్ట్రో–న్యూమాటిక్ మాడ్యూల్స్, ప్రొపల్షన్ సిస్టమ్, శాటిలైట్ వాల్వ్లు, సేఫ్టీ కప్లర్లు, లాంచ్ వెహికల్ యాక్చుయేషన్ సిస్టమ్ల కోసం బాల్ స్క్రూలు, కనెక్టర్ అసెంబ్లీలు, యాక్చుయేషన్ సిస్టమ్స్ హార్డ్వేర్, నోస్ కోన్ వంటి వాటిని సరఫరా చేశామన్నారు. -
ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ తరుణంలో ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో సైంటిస్ట్ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్. దీంతో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ నివేదికలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చంద్రయాన్ -3 సక్సెస్లో ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర’ పై ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 వంటి అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఒపిక, శక్తి కావాలి. అయితే, ‘ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం ద్వారా అలసట అనే విషయాన్ని పక్కన పెట్టాం. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారు. ఎక్కువ సేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఇస్రో సైంటిస్ట్ల పనితీరు అమోఘం ఇస్రో మాజీ డైరెక్టర్ సురేంద్ర పాల్ కేవలం రూ.150 రూపాయల ఖర్చుతో ఒక సాధారణ ఎద్దుల బండిపై కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రవాణా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు భారత్తో పాటు ఇతర దేశాల్లోని సైంటిస్ట్ల కంటే ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎక్కువగా ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ చెప్పారు. బాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే? ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ISRO Employees Salary Structure: ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా.. టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు & సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100) 👉: మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300) 👉: ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900) 👉: క్యాటరింగ్ సూపర్వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400) 👉: కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: ఫైర్మ్యాన్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అసిస్టెంట్ (రాజ్భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400) -
చంద్రుడిపై సల్ఫర్ నిజమే
బెంగళూరు: అత్యంత విలువైన సల్ఫర్ నిల్వలు చందమామ ఉపరితలంపై ఉన్నట్లు చంద్రయాన్–3 మిషన్ ఇప్పటికే గుర్తించింది. అయితే, ఈ విషయాన్ని మరో విభిన్నమైన పరీక్ష ద్వారా రోవర్ ప్రజ్ఞాన్ మరోసారి నిర్ధారించింది. రోవర్లోని అల్ఫా పార్టికల్ ఎక్స్–రే స్పెక్ట్రోస్కోప్(ఏపీఎక్స్ఎస్) సల్ఫర్ను స్పష్టంగా గుర్తించిందని ఇస్రో వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని చిన్నపాటి మూలకాలను కనిపెట్టిందని తెలియజేసింది. అయితే, చంద్రుడి మట్టిలోకి సల్ఫర్ ఎలా వచి్చందన్నది కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. అగి్నపర్వతం పేలడం వల్ల ఏర్పడిందా? లేక గ్రహశకలాల ద్వారా వచి్చందా? అన్నది సైంటిస్టులు తేల్చాలని వెల్లడించింది. జాబిల్లిపై ప్రజ్ఞాన్ చక్కర్లు చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో ‘ఎక్స్’లో షేర్ చేసింది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గురువారం షార్లోని బ్రహ్మప్రకాష్హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? -
ఇండిగో విమానంలో ‘నేషనల్ హీరో’: ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి...
ISRO Chief S Somanath: చంద్రయాన్ -3 సక్స్స్తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన తొలి దేశంగా భారత్న తన ప్రత్యేకతను చాటుకుంది. ఆగష్టు 23, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త చరితను లిఖించింది. చంద్రయాన్ -3 లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో మోస్ట్ వ్యూయడ్ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్పై గ్లోబల్గా ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన విమానం ఎక్కగానే ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్ను గుర్తుపట్టిన ఎయిర్ హోస్టెస్ నేషనల్ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్ ఎటెండెంట్ గూడీస్తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ ఆమె ఇన్స్టాలో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pooja Shah (@freebird_pooja) -
జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ తన పనిలో బిజిబిజీగా గడుపుతోంది. జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్ భలే ఉంది కదా..? అంటూ క్యాప్షన్ను కూడా జోడించింది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా దిగిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇదీ చదవండి: Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.? -
Chandrayaan-3: తొలిసారి విక్రమ్ను ఫోటో తీసిన రోవర్.. ఇదిగో ఫోటో
ఇస్రో చేపట్టిన చంద్రయాన్- మిషన్లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టి పరిశోధనలు సాగిస్తున్న ప్రగ్యాన్ రోవర్.. తొలిసారి విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసింది. బుధవారం ఉదయం 7.35 గంటలకు రోవర్ నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలు క్లిక్మనించిందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ కెమెరాలను బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబ్లో తయారు చేసినట్లు వెల్లడించింది. Chandrayaan-3 Mission: Smile, please📸! Pragyan Rover clicked an image of Vikram Lander this morning. The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam). NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE — ISRO (@isro) August 30, 2023 కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. ఇక విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఈ మిషన్కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు! -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్ను, రోవర్ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన చంద్రయాన్-3
బెంగుళూరు: చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసిన రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ క్రమంలో రోవర్లోని లేజర్-ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం(Cr), టైటానియం(Ti), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), సిలికాన్(Si), అల్యూమినియం(Al), ఇనుము(Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇది కూడా చదవండి: అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్ -
Chandrayaan-3: రోవర్కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్ నుంచి విడుదలైన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. రోవర్ తప్పించుకున్న బిలం ఇదే.. దారిమళ్లిన రోవర్ గుర్తులు -
Aditya-L1: 2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం
బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్ రెండో తేదీన ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పూర్తి దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈ శాటిలైట్ను రెండు వారాల క్రితమే శ్రీహరి కోటకు తరలించారు. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య–ఎల్1 అధ్యయనం జరుపుతుంది. సౌర వాతావరణంతోపాటు అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణంపై దాని ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. నిరాటంకంగా పరిశోధనలు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజ్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజ్ పాయింట్కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజ్ పాయింట్ల వద్ద ఉపగ్రహాలు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగడంతోపాటు నిర్దేశిత లక్ష్యాలను అందుకునే అవకాశముంటుందని అంచనా. ఈ కక్ష్యలో ఉండే ఆదిత్య–ఎల్1కు గ్రహణాలు, ఇతర గ్రహాలు అడ్డురావు. పరిశోధనలను నిరాటంకంగా జరిపేందుకు వీలుగా ఉంటుందని ఇస్రో తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో.. సుమారు 1,500 కేజీల బరువైన ఈ శాటిలైట్లో ఏడు పేలోడ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్(ఐఐఏ) ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ను తయారు చేసింది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ అస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్యూఐటీ)ని తయారు చేశారు. సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే కాగా, కొరోనా వద్ద 10 లక్షల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండటానికి కారణాలపై వీఈఎస్సీ వివరాలు సేకరించనుందని ఇస్రో వివరించింది. యూవీ పేలోడ్ను, ఎక్స్రే పేలోడ్స్ను వినియోగించుకుంటూ కొరోనాతోపాటు సోలార్ క్రోమోస్ఫియర్లపై ఆదిత్య–ఎల్1 పరిశీలనలు జరపనుంది. స్పెషల్ వాంటేజ్ పాయింట్ ఎల్1ను ఉపయోగించుకుని నాలుగు పేలోడ్లు సూర్యుడిపై ప్రత్యక్ష పరిశీలన జరుపుతాయి. మిగతా మూడు పేలోడ్లలో అమర్చిన పరికరాలు సూర్య కణాలపై పరిశోధనలు సాగిస్తాయి. కొరోనాలో ఉండే మితిమీరిన ఉష్ణోగ్రతలు, కొరోనల్ మాస్ ఇంజెక్షన్(సీఎంఈ), అంతరిక్ష వాతావరణం వంటి వాటిపైనా ఎస్యూఐటీ అత్యంత కీలకమైన సమాచారం పంపుతుందని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. -
చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో
సాక్షి, బెంగళూరు: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా, చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో దిగిన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పని తాను చేసుకెళ్తోంది. ఈ క్రమంలో రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గుంత కనిపించడంతో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. దీంతో, వెంటనే రోవర్ రూట్ మార్చారు. ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం..‘ఆగస్టు 27న రోవర్ ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో ఒక గుంత కన్పించింది. నాలుగు మీటర్ల వ్యాసంతో భారీ గుంత ఉంది. దీంతో తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్కు కమాండ్ ఇచ్చాం. ప్రస్తుతం రోవర్ తన కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది’ అని పేర్కొంది. ఈ మేరకు చంద్రుడిపై ఉన్న గుంతకు సంబంధించిన ఫొటోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే రోవర్లోని నావిగేషన్ కెమెరా ద్వారా ఈ గుంతను గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త మార్గంలో రోవర్ ప్రయాణించిన గుర్తులను కూడా షేర్ చేసింది. Chandrayaan-3 Mission: On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location. The Rover was commanded to retrace the path. It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF — ISRO (@isro) August 28, 2023 చంద్రుడిపై ఓవర్ హీట్.. ఇదిలా ఉండగా.. చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్లో అమర్చిన కంట్రోల్డ్ పెన్ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. 🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission: The launch of Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for 🗓️September 2, 2023, at 🕛11:50 Hrs. IST from Sriharikota. Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx — ISRO (@isro) August 28, 2023 ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. Chandrayaan-3 Mission: 🔍What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM — ISRO (@isro) August 26, 2023 ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన -
నిన్ను చూసి దేశం గర్విస్తుంది: అల్లు అర్జున్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్లు ఈటెను విసిరి పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు . ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్కు చెందిన త్రోయర్ అర్షద్ నదీమ్ (87.82 మీటర్లు) రజతం నెగ్గగా. ఈ పోటీలో నీరజ్ చోప్రాకు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) ఆ తర్వాత చెక్కు చెందిన వద్లెచ్ (86.67 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇప్పటికే చంద్రయాన్-3 సూపర్ విజయంతో ప్రపంచానికి తన సత్తా చాటిన భారత్ తాజాగ నీరజ్ చోప్రా ఈ విజయంతో మన జాతీయ జెండాను విశ్వవేదికపై మరోసారి ఎగురవేశాడు. ఈ ఆనంద సమయంలో టాలీవుడు నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు అందించాడు. ఈ రేస్లో మొదటిసారి భారత్కు స్వర్ణం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం దేశం గర్వించతగినదని బన్నీ అన్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) Fenkon toh aise fenko ki chaar log bole Kya fekta hai yaar. 88.17 mtr door Bhaala phenka and a World Athletics Championship Gold for our Champion #NeerajChopra . The mega run continues .pic.twitter.com/9TOFl4P6uM — Virender Sehwag (@virendersehwag) August 28, 2023 Neeraj Chopra is the GOAT 🇮🇳 First Indian to win a Gold Medal in the World Athletics Championships....!!!!!!pic.twitter.com/SyE0TtzDsX — Johns. (@CricCrazyJohns) August 27, 2023 -
'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి'
ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్ను రాజధానిగా మార్చాలని కోరారు. 'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్గా పేరు పెట్టారు. ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు
సూళ్లూరుపేట: చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశాం. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అక్కడున్నాయి. మేం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ’అని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్లో అమర్చిన కంట్రోల్డ్ పెన్ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. ఈ పేలోడ్ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో స్పేస్ ఫిజిక్స్ లా»ొరేటరీ, అహ్మదాబాద్లోని స్పేస్ అప్టికేషన్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. రోవర్పై జాతీయ జెండా, ఇస్రో సింబల్ ల్యాండర్ నుంచి విడిపోయి రోవర్ చంద్రుడిపై నెమ్మదిగా అడుగులు వేస్తూ చంద్రుడిపై పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించేసింది. చంద్రుడిపై రోవర్ దిగిన వెంటనే భారత ప్రభుత్వం మూడు సింహాలు గుర్తు, ఇస్రో సింబల్ను చంద్రుడిపై ముద్రించింది. జాతీయ జెండా, ఇస్రో సింబల్ రోవర్ మీదున్న ఛాయాచిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ప్రస్తుతం ల్యాండర్లో అమర్చిన పేలోడ్స్, రోవర్లో అమర్చిన పేలోడ్స్ తమ పనిని చేసుకుంటూ ఇ్రస్టాక్ కేంద్రానికి సమాచారాన్ని అందిస్తున్నాయి. -
మహిళా సాధికారతకు చంద్రయాన్–3 చిహ్నం
న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు. ‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయేలా జీ20 సదస్సు ‘సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు. తెలుగు కూడా ప్రాచీన భాషే ‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
Chandrayaan-3: 'శివ్ శక్తి' అని పేరు పెడితే తప్పేంటి?: ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్ కేరళలోని పౌర్ణమికవు-భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులు చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన స్థలాన్ని 'శివ్ శక్తి'గా నామకరణం చేయడంపై ప్రశ్నించగా అందులో తప్పేంటన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని భారతదేశం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు వెళ్లి చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేతలకు అభినందనలు తెలిపి విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన స్థలానికి 'శివ్ శక్తి' అని నామకారణం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ను ప్రశ్నించగా నాకైతే అందులో తప్పేమీ లేదనిపిస్తోందన్నారు. అలాగే చంద్రయాన్-2 అడుగుపెట్టిన స్థలానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. 'శివ్ శక్తి' 'తిరంగా' రెండూ భారతీయత ఉట్టిపడే పేర్లు. మనం చేస్తున్న పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేశ ప్రధానిగా పేరు పెట్టేందుకు ఆయనకు ప్రత్యేక అధికారముందన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడంపై స్పందిస్తూ నేను ఒక అన్వేషకుడిని.. నా జీవిత గమనంలో సైన్స్, ఆధ్యాత్మికత రెండూ భాగమే. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాను వేద గ్రంధాలను చదువుతూ ఉంటాను. విశ్వంలో ఉనికిని గుర్తించడానికి శూన్యంలో విహరిస్తూ ఉంటాను. సైన్స్ బాహ్య సంతృప్తినిస్తే ఆధ్యాత్మికత ఆత్మీయ సంతృప్తినిస్తుందని అన్నారు. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్లోని RAMBHA (అయాన్లు మరియు ఎలక్ట్రాన్లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander. ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd — ISRO (@isro) August 27, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం -
భద్రకాళి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు..
తిరువనంతపురం: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. గత బుధవారమే విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరింది. ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్.. కేరళ, తిరువనంతపురంలోని పౌర్ణమికవు-భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్ని అమ్మవారికి ప్రార్థనలు చేశారు. #WATCH | Kerala: ISRO chief S Somanath offers prayers at Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram. pic.twitter.com/8MjqllHeYb — ANI (@ANI) August 27, 2023 'చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించగల సామర్థ్యాన్ని మనకు ఉంది. అంతరిక్ష రంగం ఇంకా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి.. అదే మా లక్ష్యం. ప్రధాని మోదీ అందించిన దార్శనికతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం' అని సోమనాథ్ అన్నారు. బుదవారం భారతదేశ అంతరిక్షయాన చరిత్రలో లిఖించతగ్గ రోజుగా మారింది. చంద్రునిపై కాలుమోపిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా రికార్డ్ సృష్టించాం. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్గా కూడా పేరుపెట్టారు ప్రధాని మోదీ. చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదీ చదవండి: మోదీ మన్కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
మోదీ మన్కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే, జీ-20 సమావేశాలపై మాట్లాడారు. కాగా, మోదీ మన్కీ బాత్లో మాట్లాడుతూ.. సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకున్నయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత బలోపేతం చేస్తుందన్నారు. జీ-20కి భారత్ నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "The month of September is going to witness the potential of India. India is fully prepared for the G-20 Leaders Summit. Heads of 40 countries & many global organisations will be coming to Delhi to… pic.twitter.com/lgEdcd7XMy — ANI (@ANI) August 27, 2023 అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో ‘సంస్కృతంలో మాట్లాడే క్యాంప్’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. సంస్కృతం అందరూ నేర్చుకోవాలన్నారు. అంతేకాదు.. తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh — ANI (@ANI) August 27, 2023 -
చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’గా పిలుద్దామన్న ప్రధాని మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
బెంగళూరు: చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయోగం విశేషాలివే.. ► భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు ► భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది ► లాంగ్రేజియన్1 పాయింట్లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు. ► ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు ► సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్1 అధ్యయనం చేస్తుంది. ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. ► మొత్తం ఏడు పే లోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది రికార్డే ► ఇస్రో చరిత్రలో 2023 ఒక రికార్డుగా మిగిలిపోనుంది. సూర్య చంద్రుల లోతుల్ని తెలుసుకోవడానికి రెండు నెలల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేయడం చరిత్రే మరి. చంద్రయాన్–3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో ఇప్పుడు అన్ని దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆదిత్య–ఎల్1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందనే విశ్వాసం ఏర్పడింది. 2024 చివరికి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి భారతీయుల మరో స్వప్నాన్ని తీర్చాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఊహాచిత్రం -
ఇకపై ఆ ప్రాంతాన్ని ‘శివశక్తి’గా పిలుచుకుందాం
శివాజీనగర: చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 ల్యాండర్ దిగిన ప్రాంతం ఇకపై ‘శివశక్తి’ పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్ జరిగిన రోజు(ఆగస్ట్ 23వ తేదీ)ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏథెన్స్ నుంచి తిరుగు పయనమైన మోదీ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు. చంద్రయాన్–3 విజయవంతమైన సందర్భంగా బెంగళూరులో ఇస్రో వారి టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ సెంటర్లో ఇస్రో శాస్తవేత్తలను కలిశారు. విజయం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని మనసారా అభినందించారు. వారి సమక్షంలో భావోద్వేగంతో మాట్లాడారు. ‘ భారత అంతరిక్ష ప్రయోగాల పథాన్ని ఈ విజయం నిజంగా అసాధారణమైన ఆనందంతో నింపేసింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’గా, 2019లో చంద్రయాన్–2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్గా పిలుచుకుందాం. శివశక్తిలోని శివ.. మానవత్వం శ్రేయస్సుకు ప్రతీక. శక్తి.. మానవాళి సంక్షేమ ఆకాంక్షలకు తగిన ధైర్యం, స్థైర్యాన్ని అందిస్తుంది. అందుకే ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం చేశా’ అని అన్నారు. ‘భారతీయ గ్రంథాల్లోని ఖగోళ సూత్రాలను శాస్త్రీయంగా రుజువుచేసేందుకు నవతరం ముందుకు రావాలి. వాటిని అధ్యయనం చేయాలి. ఇది మన వారసత్వానికి, శాస్త్రానికి ఎంతో ముఖ్యం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై ఇందుకు సంబంధించి రెట్టింపు బాధ్యత ఉంది. వందల ఏళ్ల బానిసత్వం కారణంగా భారత ఉజ్వల శాస్త్రీయ విజ్ఞానం మరుగునపడింది. ‘ఆజాదీ కా అమృత్’ కాలంలో ఆ విజ్ఞాన నిధిని మళ్లీ వెలికితీసి ప్రపంచానికి చాటి చెప్పాలి’ అని మోదీ అభిలషించారు. ఇబ్బంది పడొద్దనే సీఎం, గవర్నర్లను వద్దన్నా మొదట బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడి నుంచి కాన్వాయ్లో ప్రజలకు చేతులు ఊపుతూ మినీ రోడ్షో నిర్వహించారు. అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ఇస్రో కార్యాలయానికి చేరుకున్నారు. బెంగళూరులో ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి రాలేదు. ఇందుకు కారణాన్ని మోదీనే వివరించారు. ‘ గ్రీస్ నుంచి సుదూర ప్రయాణం కారణంగా సరిగ్గా ఎన్ని గంటలకు విమానం ల్యాండ్ అవుతుందో తెలీదు. గవర్నర్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డెప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాకోసం అనవసరంగా చాలా సేపు వేచిఉండాల్సి రావొచ్చు. అందుకే స్వాగతం పలికేందుకు రావద్ద ని ముందే తెలియజేశా’ అని మోదీ స్పష్టత నిచ్చారు. కాగా, మోదీ వివరణపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘మోదీ కంటే ముందే ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం, డెప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు. అది మోదీకి సుతరాము నచ్చలే దు. అందుకే ఈసారి ఆయన వచ్చినపుడు సీఎంను రావొద్దని చెప్పారు’ అని ఆరోపించారు. తర్వాత ఢిల్లీకి చేరుకున్న మోదీ పాలెం ఎయిర్పోర్టులో తనకు స్వాగతం పలికిన బీజేపీ చీఫ్ నడ్డా, పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ‘చంద్రయాన్ విజయంతో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని.. యువతరంలో శాస్త్రాయ విజ్ఞానంపై మక్కువ పెంచేందుకు ఉపయోగించాలి. అప్పుడే 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్ అనే కల నెరవేరుతుంది’ అని అన్నారు. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ ‘చంద్రయాన్–3 విజయం తర్వాత ఇక్కడికొచ్చేందుకు, మిమ్మల్ని అభినందించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశా. పని పట్ల మీ అంకితభావం, నిబద్ధత, ధైర్యసాహసాలు, తెగువకు నా సెల్యూట్’ అని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘చందమామను భారత్ చేరుకుంది. ల్యాండర్, రోవర్ రూపంలో మన జాతి గౌరవం చంద్రుడిపై సగర్వంగా అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న మహిళా శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నా. దేశ నారీశక్తి ఈ ప్రాజెక్టులో పెద్దపాత్ర పోషించింది. మనోధైర్యం ఉంటే విజయం గ్యారెంటీ. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల నుంచి స్ఫూర్తి పొందేందుకు ఆగస్ట్ 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకుందాం’ అని మోదీ అన్నారు. ‘జై విజ్ఞాన్...జై అనుసంధాన్ అనే నినాదం ఇచ్చారు. ‘విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాను. అయినా నా మనస్సు, ఆలోచన మొత్తం ఇక్కడే ఉన్నాయి. అందుకే గ్రీస్ దేశం నుంచి మిమ్మల్ని కలవడానికే నేరుగా ఇక్కడికొచ్చా. ఇప్పటి వరకు భారత్లోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేది. ఇకపై చంద్రునిపైనా త్రివర్ణ పతాకం వెలుగులీనుతుంది. ప్రస్తుతం సాధించిన అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. ఆ ఫలితాలు కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఉపయోగపడాలి’ అని మోదీ అన్నారు. -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
ఇస్రో శాస్త్రవేత్త కోటగిరి శ్రీలేఖ
నల్గొండ: దేశం గర్వించదగిన చంద్రయాన్ – 3 విజయవంతం అవడం, ఈ మిషన్ ప్రాజెక్ట్లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీలేఖ. ఇస్రోలో టెస్టింగ్ అండ్ అనలిస్ట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ లాండర్స్లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె చంద్రయాన్–3 సక్సెస్ను శనివారం ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రపంచం చూపు ఇస్రో వైపు ఉంది. ఇలాంటప్పుడు నేను ఇస్రోలో వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. చేయబోయే పనులకు ఎంతో బూస్టింగ్గానూ ఉంది. నేను పుట్టి పెరిగింది నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం. మా తల్లిదండ్రులు కోటగిరి శంకర్, కోటగిరి పద్మ. సూర్యాపేటలో 8వ తరగతి చదువుకున్నా. ఆ తర్వాత చదువురీత్యా మా అన్నయ్య, నన్ను హైదరాబాద్లోనే ఉంచారు. ఐఐటీ జెఈఈలో ర్యాంకు వచ్చాక, మా అన్నయ్య ఇచ్చిన గైడెన్స్తో స్పేస్ సైన్స్ తీసుకున్నా. అన్నయ్య టీచింగ్ ఫీల్డ్లో ఉండటం కూడా నాకు బాగా హెల్ప్ అయ్యింది. తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువు పూర్తయ్యాక ఇస్రోలో జాబ్ వచ్చింది. ఈ పదేళ్లలో ఎన్నో మిషన్ ప్రాజెక్ట్స్లో భాగమయ్యాను. వర్క్ షెడ్యూల్స్ ప్రకారం టైమింగ్ గురించి అస్సలు బేరీజు వేసుకోవడం ఉండదు. అచీవ్మెంట్ వైపుగానూ దృష్టి ఉంటుంది. ఉద్యోగమూ, కుటుంబమూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. నా వర్క్ షెడ్యూల్స్ని, మా ఐదేళ్ల అమ్మాయి పెంపకం విషయంలో బ్యాలెన్స్ మా కుటుంబం నుంచి ఉండే సపోర్ట్ నాకు పెద్ద బలం. -
అందిన ‘మామ’ అందరివాడా?
అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ. కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు. చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప డింది. ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు. ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో! అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే! భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే. ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే. బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం! లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి. ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు. భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి. వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు. కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం. ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు. ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం. అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు. ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు. విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి. అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి! మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు. అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు. చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి. కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు. భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
క్రికెట్టూ కాదు..సినిమాలు కాదు..ఇదీ లెక్క: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 సక్సెస్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చంద్రుడి దక్షృణ ధృవంపై అడిగిడిన తొలి దేశంగా భారత్ ఘనతను దక్కించుకోవడంపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇందంతా ఒక ఎత్తయితే యూ ట్యూబ్లో అత్యంత అధికమైన వ్యూయర్షిప్ను సాధించిన టాప్లో నిలచింది. దీనిపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్లో టాప్ రికార్డ్ క్రికెట్ కాదు. సినిమాలు కాదు. సైన్స్ & టెక్నాలజీ. చాలా గర్వంగా ఉంది. వ్యూస్ రేసులో పోడియం అగ్రస్థానంలో నిలిచింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. Not Cricket. Not Movies. It was Science & Technology—and pride—that took the top of the podium in the viewership race. The future is bright… https://t.co/8eZZOy55Up — anand mahindra (@anandmahindra) August 26, 2023 -
జాబిల్లిపై రోవర్ చక్కర్లు.. వీడియో చూశారా?
Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్లను అందిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO. తాజాగా చంద్రుడిపై రోవర్ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను విడుదల చేఏసింది. జాబిల్లిపై రోవర్ తిరుగుతుండగా.. ఆ చక్రాల గుర్తులు పడడం.. ఇస్రో షేర్ చేసిన వీడియోలో చూడొచ్చు. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి అన్వేషణ.. గడ్డ కట్టిన నీటి అణువులను ప్రగ్యాన్(ప్రజ్ఞాన్) రోవర్ పరిశోధించనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి రెండువారాల పాటు ఇదే పనిలో ఉంది రోవర్. Chandrayaan-3 Mission: 🔍What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM — ISRO (@isro) August 26, 2023 -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్స్టార్కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..
అహ్మదాబాద్: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరత్కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు -
ప్రధాని మోదీ భావోద్వేగం..
బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఇస్రో కమాండ్ సెంటర్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. భారత్ చంద్రునిపైకి చేరుకుందని అన్నారు. జాతి గౌరవాన్ని చంద్రమండలం వరకు తీసుకువెళ్లామని చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో చంద్రయాన్ 3 మిషన్ ఓ అద్భుత ఘట్టం అని అన్నారు. PM Modi gets emotional while addressing ISRO scientists on Chandrayaan-3 success. Watch what he said 📹#PMModi #Chandrayaan3Success #ISRO #Chandrayaan3 | @isro @narendramodi @PMOIndia pic.twitter.com/P7DVbpR69u — Moneycontrol (@moneycontrolcom) August 26, 2023 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ జాబిల్లి దక్షిణ ధృవాన్ని బుధవారం చేరింది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా బయటకు వచ్చి వివరాలను సేకరించే పనిని ప్రారంభించింది. అయితే.. చంద్రయాన్ 3 ల్యాండర్ జాబిల్లిని చేరినప్పుడు ప్రధాని మోదీ బ్రిక్స్ సదస్సుకు హాజరవడానికి దక్షిణాఫ్రికా వెళ్లారు. అనంతరం ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గ్రీస్కు వెళ్లారు. నేరుగా గ్రీస్ నుంచి నేడు బెంగళూరుకు చేరుకున్నారు. ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్కు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. సాహసోపేతమైన ఘట్టంగా అభివర్ణించారు. కేవలం భారతీయులకే గాక యావత్ ప్రపంచ విజ్ఞానానికి ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
చంద్రయాన్–3పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: చంద్రుడి దక్షిణ దవంపై చంద్రయాన్–3 ద్వారా అడుగు పెట్టిన భారతదేశ శాస్త్రవేత్తల ఘనతపై బంజారహిల్స్ నందినగర్లోని ఖుష్బూ విద్యానికేతన్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయోగంలోని సాంకేతికతకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ ప్రత్యేకతలతో పాటు అక్కడి స్థితి గతులను అది ఏ విధంగా పంపిస్తుందో వంటి ఆసక్తికరమైన విషయాలను పాఠశాలలోని సైన్స్ టీచర్ రేష్మ విద్యార్థులకు వివరించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెరుగుతుందని ప్రిన్సిపాల్ రాజ్దేవి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రయాన్ ప్రయోగంపై 5వ తరగతి విద్యార్థి సయ్యద్ మోయినుద్దీన్ ఖాదర్ రూపొందించిన ప్రజంటేషన్ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
చంద్రయాన్-3 దిగిన స్థలం శివశక్తి పాయింట్: ప్రధాని మోదీ
బెంగుళూరు: దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలు వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని ఆయన అభినందించారు. శనివారం ఉదయాన్నే బెంగుళూరులోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగుళూరు వచ్చానని అన్నారు. అనంతర ఇస్రో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది సరికొత్త భారతదేశానికి వేకువని కొనియాడారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ప్రజలను ఉత్సాహపరిచారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. తొలుత చంద్రయాన్-3 బృందంతో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్ ప్రధానికి చంద్రయాన్-3 ప్రయోగంలో వివిధ దశల గురించి వివరించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు భారత్ చంద్రుడిపై అడుగు పెట్టింది. భారతదేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతుంది. నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా నా మనసంతా ఇక్కడే ఉంది. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశాను. భారత్ సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి చూపించింది.. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను. చంద్రయాన్-3 విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా భారత జెండా ఎగురుతోంది. ఇస్రో సాధించిన విజయం దేశానికే గర్వకారణం. భారతదేశం శక్తి సామర్ధ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. దేశాభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. చంద్రయాన్-3 అడుగుపెట్టిన స్థలాన్ని శివశక్తి పాయింట్గా నామకరణం చేస్తున్నాం. చంద్రయాన్-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్గా పేరు పెడుతున్నాం. ఈ ప్రయోగంలో మహిళా సైంటిస్టుల పాత్ర ఎంతో ఉంది. భారత సాంకేతిక శక్తిని ప్రపంచమంతా చూస్తోంది. అంతరిక్ష రంగంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందామన్నారు. #WATCH | The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/1zCeP9du8I — ANI (@ANI) August 26, 2023 -
బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు
బెంగుళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. PM Modi lands in Bengaluru, says looking forward to meet exceptional ISRO scientists Read @ANI Story | https://t.co/lBUldil6MS#PMModi #Bengaluru #isroscientists #ISRO pic.twitter.com/d6xeK7ZXIY — ANI Digital (@ani_digital) August 26, 2023 దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని అనంతరం గ్రీస్ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుండి నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. బెంగుళూరు చేరుకోగానే అయన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. PM Modi lands in Bengaluru, says looking forward to meet exceptional ISRO scientists Read @ANI Story | https://t.co/lBUldil6MS#PMModi #Bengaluru #isroscientists #ISRO pic.twitter.com/d6xeK7ZXIY — ANI Digital (@ani_digital) August 26, 2023 ఇప్పుడే నేను బెంగుళూరు చేరుకున్నాను. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి భారత దేశాన్ని గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. వారి అంకితభావమే అంతరిక్ష రంగంలో వారు ఇన్ని ఘనతలు సాధించడానికి కారణం.' అని రాశారు. #WATCH | Bengaluru, Karnataka | PM Narendra Modi says "I could not stop myself as I was not in the country, but I decided to visit Bengaluru first and meet our scientists right after visiting India." pic.twitter.com/fylaqqSftd — ANI (@ANI) August 26, 2023 విమానాశ్రయం చేరుకున్నాక ఎయిర్పోర్ట్ వద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్న వారికి అభివాదం తెలిపిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన వేళ నేనిక్కడ లేను.. అందుకే నన్ను నేను ఆపుకోలేకపోయాను. భారతదేశంలో అడుగుపెడుతూనే శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరు వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఆయన 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' అని నినదించారు. #WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry — ANI (@ANI) August 26, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు -
చంద్రయాన్– 3 సక్సెస్లో మన పాత్ర
హైదరాబాద్: చంద్రయాన్– 3లో కీలకమైన ల్యాండర్, రోవర్, ప్రొఫెల్లషన్ మాడ్యూల్, బ్యాటరీ స్లీవ్స్ పరికరాలను అందించి ఇస్రో చరిత్రలో కూకట్పల్లి స్థానాన్ని నిలబెట్టిన బి.నాగభూషణ్రెడ్డి (బీఎన్ రెడ్డి)పై నగర వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా 50 ప్రయోగాల్లో తన భాగస్వామ్యాన్ని నిలబెట్టుకొని అన్నింటిలో సమర్థతను నిరూపించుకొని ఇస్రో వంటి సంస్థల్లో శభాష్ అనిపించుకున్న నాగభూషణ్రెడ్డికి అడుగడుగునా ప్రశంసలు అందుతున్నాయి. ఆయన ప్రస్థానం ఇలా సాగింది.. మొదట చిన్నతరహా పరిశ్రమలో ఉద్యోగం.. విజయవాడలో ఇంజినీరింగ్ 1982లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన బీఎన్ రెడ్డి చిన్న తరహా పరిశ్రమలో ఉద్యోగం చేసి అనంతరం 1984లో బాలానగర్ సీఐటీడీలో ఎంటెక్ మెకానికల్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన బీఎన్ రెడ్డి తాను కూడా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 1994లో నాగసాయి పెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. హెచ్ఎఎల్, బీఈఎల్తో పాటు యూఏఐ ఎయిర్క్రాఫ్ట్ వంటి సంస్థలకు విమాన విడి భాగాలను అందజేసిన నాగసాయి కంపెనీ ఇస్రోకు బీఎన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతో పలు దఫాల ఇంటర్వ్యూలతో పాటు ఆయన తయారు చేసిన పరికరాలపై ప్రమాణాల పరీక్షలు నిర్వహించిన అనంతరం అవకాశం కల్పించారు. మొట్టమొదటగా ఇన్సాట్ 2ఈలో ఆయనకు భాగస్వామ్యం కల్పించారు. దీంతో ఆయన తయారు చేసిన వస్తువుల నాణ్యతతో కన్పించటంతో అప్పటి నుంచి 25 సంవత్సరాలుగా ఇస్రోకు పరికరాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్– 3 సక్సెస్తో బీఎన్ రెడ్డి ప్రతిభ సమున్నత శిఖరాలకు చేరింది. చంద్రయాన్కు ఏయే పరికరాలు అందించారంటే.. చంద్రయాన్– 3లో బ్యాటరీలు, ల్యాండర్, రోవర్, ప్రొఫెల్లషన్ మాడ్యూల్ వంటి పరికరాలు అందజేశారు. ప్రస్తుతం ల్యాండర్ చంద్రమండలంలో ఉంది. రోవర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. అంతకు ముందు ప్రొఫెల్లషన్ మాడ్యూల్ చంద్రునికి 153 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది. ఇంత సాహసోపేతమైన కార్యాచరణలో తాను భాగస్వామి కావడం ఎంతో అదృష్టమని బీఎన్ రెడ్డి హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు.. 1998 నుంచి ఇన్సాట్ 2ఈ మొదలుకొని ఆదిత్య ఎల్1తో పాటు గగన్యాన్లో కూడా బీఎన్ రెడ్డి భాగస్యామ్యం అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో అన్నింటిల్లో ఆయనకు ఇస్రో నుంచి సంపూర్ణ మద్దతు లభించటమే కాకుండా ప్రశంసలు కూడా అందాయి. ఇస్రోకు పరికరాలు ఎందుకు అందించాలనుకున్నారంటే.. బీఎన్ రెడ్డి 1992లో ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం చేసిన తర్వాత 1994లో నాగసాయి పెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి హెచ్ఏఎల్, బీఈఎల్తో పాటు యూఏఐ ఎయిర్క్రాఫ్ట్ వంటి సంస్థలకు పరికరాలు అందజేశారు. 1998లో ఇస్రోకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఇస్రో వారు పలు దఫాలుగా తన పరికరాల నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను 1998లో ఇన్సాట్– 2ఈ ద్వారా ఈ ప్రయోగాలకు పరిచయం చేశారు. అప్పటి నుంచి తన కార్యాచరణ కొనసాగుతూనే ఉంది. ఎన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి? 1998 నుంచి బీఎన్ రెడ్డి తయారు చేసే ప్రతి పరికరం ఉపయోగపడింది. 50 ప్రయోగాల్లో ఒక్క ప్రయోగం మినహా మిగిలిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. ఇన్సాట్ సిరీస్, జీ శాట్ సిరీస్, చంద్రయాన్– 1, 2, 3, గగన్యాన్, కార్టో శాట్, ఐఆర్ఎన్ఎస్ శాటిలైట్ వంటి అనేక ప్రయోగాల్లో పరికరాలను అందజేశారు. విశ్వవ్యాప్తంగా ప్రశంసలు.. ‘మారుమూల గ్రామం నుంచి నేను హైదరాబాద్కు వచ్చి ఇస్రోకు అవసరమైన పరికరాలు తయారు చేయడం ఎంతో గర్వకారణం. జీవితంలో ఇంకేం సాధించాలి? రాష్ట్రాలు దాటితేనే ఒక గొప్ప. అలాంటిది దేశాలే కాకుండా అంతరిక్షంలోకి నేనే వెళ్లినట్లుగా సంతోషపడుతున్నాను. ఇప్పటికే నాకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బంధువులతో పాటు శాస్త్రవేత్తలు ప్రతి రోజూ ఫోన్ చేయటం నా అదృష్టం’గా భావిస్తున్నా అన్నారు బీఎన్ రెడ్డి. -
విశాఖలో ‘ఇండియా ఆన్ ద మూన్’ భారీ ర్యాలీ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ‘ఇండియా ఆన్ ద మూన్’ పేరుతో విశాఖపట్నంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు 400 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఇండియా మూన్ మిషన్ చంద్రయాన్–3 సక్సెస్ కావడంతో భారత్కు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత శాస్త్ర విజ్ఞానం వైపు దూసుకెళ్లాలన్నారు. ఈ మిషన్లో ఏయూ ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి ప్రాతినిధ్యం వహించడం ఏయూకు గర్వకారణం అన్నారు. -
Chandrayaan-3: ల్యాండర్ నుంచి చంద్రుడిపైకి ప్రజ్ఞాన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్లో భాగంగా చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్ నుంచి ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తున్న వీడియోను, ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. వీటిని ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియో, ఫొటోలను విక్రమ్లోని ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీటిని చిత్రీకరించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి ఇప్పటిదాకా 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
నవభారత జయధ్వానం
చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న శక్తిగా భావిస్తున్న అంతర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగుపరుస్తుంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారత శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శనలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చుకున్నవిగా వాటిని కొట్టిపారేసింది. చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. ఉత్కంఠ వీడిపోయింది. నిర్దేశించిన రోజు, సమయం, ప్రదేశంలో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన చంద్రయాన్–3 సాధించిన మహాద్భుతమైన విజయం పట్ల భారతదేశం సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ నాయకత్వ చిహ్నాలలో సాంకే తిక పురోగతి ఒకటి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్–3 ల్యాండ్ అయింది. అన్వేషణ కోసం ప్రత్యేకంగా సవాలు విసిరేటటువంటి, పెద్దగా అర్థం చేసుకోని స్థలాన్ని ఎంచు కున్న ఏకైక అంతరిక్ష దేశం భారత్. చంద్రుని అసలైన తత్వం ఇప్పటికీ కలిగి ఉన్నది దాని ధ్రువ ప్రాంతాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ఉపరితలం చాలా వరకు పెద్ద, చిన్న గ్రహ శకలాల శిథిలాలతో కప్పబడి ఉంది. ఈ శకలాలు వెయ్యేళ్లపాటు చంద్రునిపై పెనుదాడి చేసి, దానిపై పొరలు పొరలుగా పేరుకు పోయాయి. చంద్రుడి లోపలి నీటి కోసం వెతకడంతో సహా ‘ప్రజ్ఞాన్ రోవర్’ చేయబోయే ప్రయోగాలు, మనకు సమీపంలోని ఖగోళ పొరుగు గురించిన కొత్త జ్ఞానాన్ని వెల్లడిస్తాయి. సున్నితంగా ఉన్న మన సొంత భూగ్రహం చరిత్ర, తయారీలపై మన అవగాహనకు కూడా ఇది సాయపడుతుంది. ఎదుగుతున్న శక్తి ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహ న్నెస్బర్గ్లో ఉన్నప్పుడు, యాదృచ్ఛికంగా అంతరిక్ష పరిశోధనలో ఈ గొప్ప విజయం లభించింది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న దేశాల సమూహంగా మొత్తం బ్రిక్స్ ప్రభావాన్ని కూడా ఇది ఇతోధికంగా పెంచుతుంది. చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయో గాల్లో అనుభవజ్ఞ దేశంగా ఉన్న రష్యా తన మూన్ ల్యాండింగ్ ప్రాజెక్ట్ను భారతదేశం ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రారంభించడం యాదృచ్ఛికమే కావొచ్చు. అయినా రష్యా వైఫల్యం, భారత్ విజయాలను పక్కపక్కనే అంచనా వేయడం జరుగుతుంది. వనరుల పరంగా, అధునాతన అంతరిక్ష శక్తిగా దాని హోదాను కొనసాగించడంలో రష్యా వైఫల్యాన్ని దాని క్షీణత, అసమర్థతా లక్షణాలుగా చూస్తున్నారు. అంతరిక్ష ప్రయోగం అనేది అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అన్వేషణ. 2019 సెప్టెంబరులో చంద్రయాన్–2 చంద్రుని ఉపరితలంపై కూలిపోయినప్పుడు భారతదేశం కూడా నిరాశకు గురైంది. ఇప్పుడు రష్యా తన ఎదురుదెబ్బను అధిగమించి అంతరిక్ష రంగంలో మళ్లీ తన శక్తి పుంజుకోదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. అయినా దృక్కోణాలు ముఖ్యమవుతాయి. భారతదేశాన్ని అభి వృద్ధి చెందుతున్న శక్తిగా, రష్యాను క్షీణిస్తున్న శక్తిగా భావిస్తున్న అంత ర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన సమానమైన ర్యాంక్లో తాను లేనందున, ఉక్రెయిన్ యుద్ధం ఆ స్థానాన్ని ఏ విధంగానూ దెబ్బతీయలేదనే భావ నను ఎదుర్కోవడానికి రష్యా ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. రష్యన్ మీడియాలో కూడా, విఫలమైన మూన్ మిషన్ అందుకున్న పరిమితమైన కవరేజీని చూసినట్లయితే, దాని రాజకీయ, మానసిక తిరోగమనం చాలా స్పష్టంగా తెలుస్తోంది. చైనా వైఖరి మారేనా? ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా చైనా ఎప్పుడూ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శ నలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చు కున్నవిగా వాటిని చైనా కొట్టిపారేసింది. అయితే చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా చైనా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. బహుశా భారత్ సాధించిన ఈ విజయంతో చైనా తన అహంకారాన్ని తొలగించుకుని, నమ్రతతో కాకపోయినా మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సిన దేశంగా భారత్ను పరిగణించవచ్చు. ఒకరినొకరు సమానంగా చూసుకుంటేనే ఇరు దేశాలు తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోగలవు. చంద్రయాన్–3 విజయా నికి చైనా ఎలా స్పందిస్తుందనేది, తూర్పు లదాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద హింసాత్మక ఘర్షణల తర్వాత భారతదేశం పట్ల దాని వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేది సూచిక అవుతుంది. చంద్రయాన్–3 ప్రాజెక్టులో విజయం రాబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశంగా భారత్ హోదాను పెంచుతుంది. శిఖరాగ్ర సమావేశానికి ఇప్పటికే లభిస్తున్న విస్తృత ప్రచారం నేపథ్యంలో, చంద్రయాన్–3 భారత్ కీర్తి ప్రతిష్ఠలకు మరో పార్శా్వన్ని జోడిస్తుందనడంలో సందేహం లేదు. శిఖరాగ్ర సదస్సు చర్చల సమ యంలో, భారతదేశ స్వరం ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. దాని వివిధ కార్యక్రమాలు గౌరవప్రదంగా పరిగణించబడతాయి. అయితే ఇవన్నీ తదనంతర చర్యలలో ప్రతిఫలిస్తాయో, లేదో చూడాలి. దూరదృష్టి ఫలితం భారతదేశం కోసం, దాని అభివృద్ధి వ్యూహం కోసం తగిన పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రయాన్–3 సాధించినదంతా కూడా దేశం పేదగా ఉండి, అభివృద్ధి చెందుతున్నదైనప్పటికీ... అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శ్రేష్ఠమైన సంస్థలను స్థాపించాలనే తొలితరం నాయకుల దూరదృష్టి ఫలితమే. భారతదేశ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అటామిక్ ఎనర్జీ కమిషన్ను 1948లోనే తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఛైర్మన్గా ఏర్పాటైంది. అప్పటి రాజకీయ నాయకత్వం ఈ అధునాతన శాస్త్రీయ సాధనకు ఇచ్చిన అధిక ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తుంది. వాస్తవానికి, అంతరిక్ష పరిశోధనను సుప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి నేతృత్వంలో 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్ నేష నల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని పిలిచే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి అప్పగించారు. దీని తర్వాత 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పాటైంది. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ నమూనాలో ఇండియన్ స్పేస్ కమిషన్ ను ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిషన్లు భారతదేశ అధునాతన శాస్త్ర, సాంకేతికతకు మూలస్థంభాలుగా నిలిచి, గణనీయమైన స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. అంతేకాకుండా వీటికి బాగా నిధులు సమకూరుస్తున్నారు కూడా. ఈ ముందస్తు, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ కార్మికుల కృషి వల్ల ఇప్పుడు భారతదేశం చేపట్టిన తాజా అంత రిక్ష యాత్ర విజయవంతమైంది. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
చంద్రయాన్-3: మరో వీడియో వదిలిన ఇస్రో
చంద్రయాన్-3లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వీడియో విడుదల చేసింది. వీడియోలో చంద్రుడి ఉపరితలంపై ర్యాంప్ను ల్యాండర్ వదులుతున్న దృశ్యాల్ని, అలాగే.. సోలార్ ప్యానెల్పని ప్రారంభించిన వీడియోను ఇస్రో షేర్ చేసింది. రెండు-విభాగ ర్యాంప్ రోవర్ రోల్-డౌన్ను సులభతరం చేసింది. సోలార్ ప్యానెల్ రోవర్కు శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించింది. రోవర్ రోల్డౌన్కు ముందు ర్యాంప్-సోలార్ ప్యానెల్ వేగవంతమైన విస్తరణ ఎలా జరిగిందో ఇక్కడ ఉంది. Ch-3 మిషన్లో మొత్తం 26 విస్తరణ యంత్రాంగాలు U R రావు శాటిలైట్ సెంటర్ (URSC)/ISRO, బెంగళూరులో అభివృద్ధి చేయబడ్డాయి అని తెలిపింది. A two-segment ramp facilitated the roll-down of the rover. A solar panel enabled the rover to generate power. Here is how the rapid deployment of the ramp and solar panel took place, prior to the rolldown of the rover. The deployment mechanisms, totalling 26 in the Ch-3… pic.twitter.com/kB6dOXO9F8 — ISRO (@isro) August 25, 2023 -
చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ఫొటోలు రిలీజ్
న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో తదుపరి దశ ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. ఈ దృశ్యాలను ఇస్రో తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. బుధవారం నిర్ణీత సమయంలోనే చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3 ప్రయోగం మలిదశకు చేరుకుంది. కోట్లాది భారతీయుల కలల్ని సాకారం చేస్తూ జాబిల్లిని ముద్డడాడిన చంద్రయాన్-3 ల్యాండర్ ఆరోజే చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీయాగా వాటిని ఇస్రో సంస్థ సోషల్ మీడియాలో పొందుపరచింది. ఇక ఈ రోజు ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై అడుగు పెట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. "చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఎలా అడుగుపెట్టిందో చూడండి.." అని రాసింది ఇస్రో సంస్థ. ... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W — ISRO (@isro) August 25, 2023 ఇప్పటివరకు మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై అడుగు మోపగా నాలుగో దేశంగా భారత దేశం అక్కడికి చేరుకొని చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ లోని రెండు పరికరాలు, ల్యాండర్లోని మూడు పరికరాలు ILSA, RAMBHA,ChaSTE సక్రమంగానే పనిచేస్తున్నాయని అది చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనల ప్రారంభించిందని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు ప్రధానంగా చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను నిశితంగా పరిశీలిస్తాయని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో మార్పులు.. -
ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో మార్పులు..
సాక్షి, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ కూటమి సమావేశాలకు హజరయ్యారు. కాగా, ఈ పర్యటన ముగించుకుని మోదీ.. రేపు(శనివారం) భారత్కు చేరుకోనున్నారు. అయితే, ఆయన తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ నేరుగా బెంగళూరు చేరుకోనున్నారు. ఈ క్రమంలో మోదీ.. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు చేరుకుని చంద్రయాన్-3 బృందాన్ని కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించి ముచ్చటించనున్నారు. అనంతరం, ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక, ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ బెంగళూరు వస్తున్న నేపథ్యంలో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కర్ణాటక బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. ప్రధాని రాక సందర్భంగా నగరంలో మెగా రోడ్ షో నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.అశోక తెలిపారు. హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్లో 6,000 మందికి పైగా జనంతో పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలుకనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
Chandrayaan-3: జాబిల్లిపై భారత్ నడక
బెంగళూరు/న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్లో తయారు చేసిన ఈ రోవర్ ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం పెరుగుతుందా? చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్గా మార్చుకొని పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. గూగుల్ డూడుల్గా చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ విజయం పట్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్ డూడుల్గా చంద్రయాన్–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది. 26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు. మనిషి మనుగడకు అవకాశం శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. అందుకే చంద్రయాన్–3 ల్యాండర్ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. రోవర్ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు. గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్ దిగింది. రోవర్లోని రెండు పరికరాలు, ల్యాండర్లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా చేయిస్తాయని తెలిపారు. -
చంద్రయాన్–3లో ఈసీఐఎల్ కీలక భూమిక
కుషాయిగూడ (హైదరాబాద్): చంద్రయాన్–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్ కమ్యూనికేషన్కు కీలకమైన 32 మీటర్ డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను సరఫరా చేసిందని సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్ రీసెర్చ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఐఎస్టీఆర్ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్ అండ్ ట్రాక్ మౌంట్, బీమ్ వేవ్ గైడ్, ఫీడ్ సిస్టమ్తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి. చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్తో పాటుగా సేఫ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ (పీఎల్సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్యాన్, మంగళ్యాన్–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. -
చంద్రయాన్ 3 సక్సెస్.. హరీశ్ శంకర్ ట్వీట్పై ట్రోలింగ్
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 జెండా పాతడంతో యావత్ భారతదేశం సంతోషంలో మునిగి తేలుతోంది. ఎవరూ అందుకోలేని ఘనతను మన దేశం సాధించడంతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నారు కూడా! ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షేర్ చేసిన ప్రకాశ్రాజ్ను నెటిజన్లు ఓ ఆటాడేసుకున్న సంగతి తెలిసిందే! తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ట్విటర్లో షేర్ చేసిన ఫోటోపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రుడిపై జెండా.. జెండాపై చంద్రుడు(పాక్ జాతీయ పతాకం).. రెండూ ఒకటి కాదు అంటూ ఓ మీమ్ షేర్ చేశాడు హరీశ్. ఇది చూసిన జనాలు మధ్యలో పాకిస్తాన్ను తేవడం అవసరమా? అసలు ఆ దేశంతో మనకు పోలికేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. 'మనకంటే దిగువన ఉన్న వాళ్లతో కాదు, మనకంటే గొప్పగా ఉన్నవాళ్లతో పోల్చుకోవాలి', 'ఈ విమర్శలు పక్కనపెట్టి చంద్రయాన్ 3 విజయంలో పాలుపంచుకున్నవాళ్లను ప్రశంసించండి' అని చురకలంటిస్తున్నారు. 'మనం అందుకున్న విజయాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప పక్కదేశాన్ని వెక్కిరించకూడదు.. ఒక సెలబ్రిటీవైన నువ్వు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మనం తోపులు అని చెప్పుకోవడానికి ఎదుటివాళ్లను ఎందుకు తక్కువచేయడం?..', 'అయినా అమెరికా, చైనా వంటి దేశాలతో మనం పోటీపడాలి, పోల్చుకోవాలే.. అంతే కానీ పాక్ లాంటి దేశాలతో కాదు.. అసలు నువ్వు డైరెక్టర్ ఎలా అయ్యావో.. ఏంటో?' అని విమర్శిస్తున్నారు. Haahhahaha mana janaala sense of humour 🙏🙏🙏🙏 pic.twitter.com/x0ZOlQWTgu — Harish Shankar .S (@harish2you) August 23, 2023 చదవండి: ఈసారి ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేదు..లిస్టులో 20 మందికి పైగా కంటెస్టెంట్లు! కమెడియన్స్ నుంచి హీరోల దాకా.. -
మూన్పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
Chandrayaan-3: అబుదాబిలో భారత్ మాతా కీ జై
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత అద్భుత ఘట్టంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ నిలిచిపోయింది. ఈ అరుదైన ఘనతను చూడడానికి దేశవిదేశాల్లోనూ ప్రజలు ఆసక్తి కనబరిచారు. అలాగే.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి అక్కడి ఇండియన్ కమ్యూనిటీస్. ఈ క్రమంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఉంటున్న ప్రవాస భారతీయులందరు ఒక్క దగ్గర ఉండి వీక్షించేందుకు ఇండియా సోషల్ అండ్ కల్చర్ సెంటర్ ముఖ్య ప్రాంగణంలో LED స్క్రీన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందలాది ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకొని చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం పై లాండ్ అవడం వీక్షించారు. ఎక్కువ మంది తెలుగు ప్రజలు.. అందునా తెలంగాణ ప్రజలు ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. చంద్రయాన్ 3 లాండింగ్ చివరి క్షణాలలో ప్రాంగణం అంతా భారత్ మాతా కీ జై నినాదాలతో మారు మోగింది. ఈ క్షణాలు భారతీయలందరి హృదయాలలో ఒక గర్వం తో కూడిన ఆనందం చేకూర్చిందని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజశ్రీనివాస రావు, గోపాల్ మరియు ఎట్టి రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే ISC ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇది ‘భారతీయలందరికి మరచిపోలేని అనుభూతి’గా పేర్కొన్నారు. -
‘చంద్రయాన్-3లో ప్రయాణించిన వారికి సెల్యూట్’.. మంత్రిపై ట్రోల్స్
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం బుధవారం విజయవంతం అయ్యింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై మువ్వన్నెల జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ల్యాండర్తోపాటు రోవర్ కూడా క్షేమంగా దిగడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చివరి దశలో వ్యోమనౌక జాబిల్లిపై కాలు మోపే క్షణాలను టీవీలు, ఫోన్లలో ప్రత్యక్షంగా చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చంద్రయాన్-కు సంబంధించి రాజస్థాన్ మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్ రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాలశాఖ మంత్రి అశోక్ చందన్.. చంద్రుడి మీదకు వెళ్లిన ప్రయాణికులకు సెల్యూట్ అంటూ నోరూజారారు.. ‘చంద్రుడిపై సురక్షితంగా కాలుమోపాం.. అందులో ప్రయణించిన వారికి సెల్యూట్. సైన్స్ స్పేస్ రీసెర్చ్లో ఇండియా మరో అడుగు ముందుకేసింది. మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా’ అని మీడియాతో ముందు తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కాగా చంద్రయాన్-3 మానవ రహిత మిషన్. ఇస్రో ఇందులో కేవలం విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ మాత్రమే పంపిన విషయం తెలిసిందే. వ్యోమగాములను రోదసిలోకి పంపలేదు. అయితే మంత్రి స్థానం ఉన్న అశోక్ చందన్. ప్రయోగం గురించి తెలుసుకోకుండా, సరైన అవగాహన లేకుండా మాట్లాడి ట్రోల్స్కు గురవుతున్నారు.దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తూ.. మంత్రికి చురకలంటిస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రజ్ఞాన్’.. అక్కడ తన అధ్యయనం మొదలుపెట్టింది. చంద్రుడిపై వాతావరణ, నీటి వనరులు, భూగర్భ శాస్త్రం, భవిష్యత్తులో మానవ మనుగడకు సామర్థ్యాలను అధ్యయనం చేయనుంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. -
చంద్రయాన్-3 సక్సెస్: సోషల్మీడియాలో 45 ట్రిలియన్ డాలర్ల మోత
Chandrayaan-3 VS 45 Trillion చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండింగ్ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ తరువాత ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందించాయి. అయితే బ్రిటీష్ మీడియాలో జెలసీతో అనూహ్య వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో ఇండియానుంచి బ్రిటిష్ వలసపాలకులు కొల్లగొట్టిన 45 ట్రిలియన్ డాలర్లు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చాయి. (చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్లో టాప్ రికార్డ్) సోషల్ మీడియాలో,ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. భారత ఘనతపై అక్కసు వెళ్లగక్కుతున్న జర్నలిస్టు పాట్రిక్ క్రిస్టీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూన్ మిషనను అభినందిస్తూనే చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాలుగా యూకే నుంచి 2.5 బిలియన్డాలర్లను విదేశీ సహాయాన్ని వెనక్కి ఇవ్వాలంటూ పాట్రిక్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు న్యాయవాది శశాంక్ శంకర్ ఝా భారతీయులనుంచి దోచుకున్న45 ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలంటూ కౌంటర్ ఇచ్చారు. India has become the first country to successfully land a spacecraft near the south pole of the moon so why did we send them £33.4 million in foreign aid which is set to rise to £57 million in 24/25 Time we get our money back. — Sophie Corcoran (@sophielouisecc) August 23, 2023 అలాగే అంతరిక్షంలోని రాకెట్లను పంపించేందుకు ఇక దేశాలకు యూకే సాయం అందించకూడదు అంటూ సోఫియా కోర్కోరన్ ట్వీట్ చేశారు. అంతేకాదు తమ డబ్బు తిరిగి తమకు కావాలని కూడా ఈమె పేర్కొన్నారు. దీంతో భారతీయ యూజర్లు మండిపడుతున్నారు. భారతదేశం నుండి దోచుకున్న సొమ్ము 45 ట్రిలియన్ డాలర్లు అని కమెంట్ చేస్తున్నారు. మా కొహినూర్ మాకిచ్చేయండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు భారత్ 2015నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదంటూ పేర్కొన్నారు. ‘Britain, give us back our $44.997 TRILLION!’ Hi @PatrickChristys, @GBNEWS Thank you for reminding about the grant. Now ‘as a rule, salute us & return $45 TRILLION you’ve looted from us’ Britain gave, as you say, £2.3 BILLION i.e. $2.5 BILLION. Deduct it & return the… pic.twitter.com/9lSfwpvoWn — Shashank Shekhar Jha (@shashank_ssj) August 23, 2023 కాగా 1765 -1938 మధ్య కాలంలో బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్డాలర్ల మొత్తాన్ని దోచుకుందని ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన పరిశోధన తర్వాత తొలుత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్ పన్ను మరియు వాణిజ్యంపై దాదాపు రెండు శతాబ్దాల వివరణాత్మక డేటాను విశ్లేషించిన తర్వాత ఈ డేటాను వెల్లడించారు.అయితే ఈ ఏడాది మార్చిలో ది గార్డియన్ నివేదిక ప్రకారం, భారతదేశానికి యూకే సహాయం 2015లో ఆగిపోయింది. అయితే ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష ప్రకారం సుమారు 2.3 బిలియన్లు పౌండ్లు (రూ. 23,000 కోట్లు) 2016 -2021 మధ్య భారతదేశానికి అందాయి. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. దశాబ్దాలు పాటు భారత్ను పాలించిన బ్రిటీషర్లుమనదేశంలోని ఎనలేని సంపదను దోచుకుపోయారు. బంగారం, వజ్ర వైడూర్యాలు లాంటి ఎంతోఘనమైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. ఇండియా నుంచి బ్రిటీషర్లు తమ దేశానికి తరలించిన సంపద.. ప్రస్తుత విలువలో దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానం. -
చంద్రయాన్-3 సక్సెస్.. ఈ సారి వరల్డ్కప్ టీమిండియాదే! ఎలా అంటే?
చంద్రయాన్ -3 విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిలిపై భారత పతాకం రెపాలపలడింది. చంద్రుడి దక్షిణ దృవంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ ఘనత సాధించినందుకు ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నారు. ఇక చంద్రయాన్ -3 విజయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ట్విట్లో ఏముందంటే? 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు తలతెత్తడంతో చంద్రయాన్-2 చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు దేశ ప్రజలందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే ఏడాది భారత క్రికెట్ జట్టు కూడా 2019 వన్డే ప్రపంచకప్లో తీవ్ర నిరాశపరిచింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది. దీంతో ఒకేడాది భారత్కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే యాదృచ్చికంగా చంద్రయాన్-3, వన్డే ప్రపంచకప్ సరిగ్గా మళ్లీ ఒకే ఏడాది షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ క్రమంలో చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో.. భారత జట్టు కూడా వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంటుందని ఆర్ధం వచ్చేలా ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. చదవండి: హార్దిక్, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే! 𝗕𝗘𝗟𝗜𝗘𝗩𝗘 🇮🇳#OneFamily #Chandrayaan_3 #Ch3 #Chandrayaan3 #VikramLander pic.twitter.com/kU9InzTlD4 — Mumbai Indians (@mipaltan) August 23, 2023 -
"చంద్రుడు" ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసా!
భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. చందమామ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ని సురక్షితంగా దించిన నాల్గో దేశంగా ఘనత సాధించింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజుల పాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ముగించింది. ఈ విజయం దేశ ప్రజలను ఆనందోత్సాహల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా ఓ పండుగను తీసుకొచ్చింది ఈ విజయం. ఇక ఖగోళ శాస్త్ర పరంగా అంతరిక్షంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి కుతూహలంగానే ఉంటుంది. అందులోనూ మనం చిన్నప్పటి నుంచి మామ అని ఇష్టంగా పిలుచుకును చంద్రుడు గురించి ఐతే ఆ జిజ్ఞాస మరింత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడిపై మచ్చ ఉందని ఏవేవో చందమమా కథలను చెప్పుకునేవాళ్లం. అలాంటి చంద్రుడు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసుకుందామా!. చంద్రుని గురించి పౌరాణికంగా చాలా విషయాలను కథలు కథలుగా తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం చంద్రుడుని మనః కారకుడని అంటారు. చంద్రుడు మనిషి మససుపై అధిక ప్రభావం చూపుతాడని, చంద్రుని ఆధారంగానే మనిషి ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. మనిషి నిద్రపై కూడా చంద్రుని ప్రభావం ఉంటుందని అంటారు. మానసిక ఆరోగ్య దగ్గర నుంచి శారీరకంగా.. గుండె ఆరోగ్యం వరకు ఆయన ప్రభావం ఉంటుందని అంటారు. పౌర్ణమి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. పౌర్ణమి మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పర్యావరణ కారకాలు వ్యక్తుల మానసిక కల్లోలానికి కారణమవుతాయని అందువల్ల వారు నిరాశకు లేదా ఉన్మాదానికి లోనై అకృత్యాలకు పాల్పడతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భావోద్వేగాలకు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి అయిన "బైపోలార్ డిజార్డర్" వ్యక్తులపై పరిశోధనలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వ్యక్తులు నిద్రలోని మార్పులకు, తరుచుగా కనిపించే మాంద్య లక్షణాల నుంచి ఉన్నాద లక్షణాలకు మారడంపై చంద్రుని ప్రభావం ఉన్నట్లు తేలింది. అలాగే బైపోలార్ డిజార్డర్ ఉన్న ఓ స్త్రీపై మూన్ మూడ్ కనెక్షన్ కోసం లైట్ థెరఫీని ఉపయోగించి కొన్ని మందుల మార్చడం ద్వారా చంద్రుని ప్రభావాల ఆధారంగా చికిత్స చేయవచ్చని వెల్లడైందని మాలిక్యులర్ సెక్రియాట్రిక్ జర్నల్లో తెలిపారు శాస్త్రవేత్తలు. నిద్రను ఎలా ప్రభావితం చేస్తాడు? పౌర్ణమి రోజుల్లో చాలామంది వ్యక్తులు సాధారణ సమయం కంటే ఆలస్యంగా నిద్రపోతారని అంటున్నారు నిపుణులు. పౌర్ణమికి ముందు రోజుల నుంచే ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుందని చెబుతున్నారు. నిద్రపోవడం అనేది పౌర్ణమితో ముడిపడి ఉందని పరిశోధనల్లో తేలింది కూడా. ఐతే స్లీప్ లేటెన్సీ..నిద్రలోకి జారుకోవడం లేదా మొదటి నిద్రలోనే గాఢ నిద్రలోకి వెళ్లడం అనేది కూడా ఆల్కహాల్ లేదా కొన్ని రకాల మందుల ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది. . పౌర్ణమి, అమావాస్య సమయంలో హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గదలను గమనించినట్లు పరిశోధన పేర్కొంది. పౌర్ణమి, అమావాస్య తిథుల్లో తొందరగా రక్తపోటు సాధారణ స్థాయికి తిరిగి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. బహుశా అందువల్లే కాబోలు పెద్దలు ఈ రోజు పౌర్ణమి ఇవే చేయాలి. అమావాస్యని అలాంటివి చేయకూడదు వంటి నియమాలు పెట్టారు. ముందు జాగ్రత్తతోనే నియమాలు పెడితే మనం చాదస్తంగా కొట్టిపారేస్తున్నాం. సైన్సుపరంగా వారు పెట్టినవి నిజమని తేలేంత వరకు అంగీకరించం మనం. గమనిక: ఈ కథనం చంద్రుని శక్తి గురించి కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. సైన్సుపరంగా రుజువైందని తెలియడం కోసం. దీన్ని ఆధారంగా మీరు ఔషధాలను ఉపయోగించడం లేదా ప్రయోగాలు చేయడం వంటి పనులు చేయొద్దు. ఏదైనా వైద్యులు, నిపుణులు సలహాల మేరకే పాటించాలి. ఇది కేవలం అవగాహన కల్పించాలనే ఉద్దేశం మాత్రమే. (చదవండి: మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు ఏంటో తెలుసా!) -
చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్లో టాప్ రికార్డ్
Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని దక్కించుకుంది. జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్-3 మిషన్ సాధించింది. యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో చంద్రయాన్ -3 లైవ్ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్బాల్ మ్యాచ్: 6.15 మిలియన్లు బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్బాల్ మ్యాచ్: : 5.2 మిలియన్లు వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్బాల్ మ్యాచ్ : 4.8 మిలియన్లు అమెరికా స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు బీటీఎస్ బటర్ వెన్న: 3.75 M యాపిల్ లైవ్ ఈవెంట్ 3.69 M జానీ డెప్ v అంబర్ ట్రయిల్ : 3.55 మిలియన్లు ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్బాల్ మ్యాచ్ : 3.53 మిలియన్లు కారియోకో చాంపియషన్ షిప్ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్: 3.25మిలియన్లు Most Viewed Live Streams on YouTube ▶️ 1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥 2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M 3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M 4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M 5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M 6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M 7. 🇺🇸 Apple: 3.69 M 8. 🧑⚖️🇺🇸… — The World Ranking (@worldranking_) August 23, 2023 -
Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్ ఘన విజయం సాధించి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రగ్యాన్’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్ క్షేమంగా దిగడంతో భారత్ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్కూడా సక్సెస్ఫుల్గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్ చేసింది ‘చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి కోసం భారత్లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సజావుగా బయటకు వచ్చింది. భారత్ చంద్రుడిపై నడిచింది. మిషన్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తర్వలోనే షేర్ చేస్తాం’ అంటూ పేర్కొంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. Chandrayaan-3 Mission: Chandrayaan-3 ROVER: Made in India 🇮🇳 Made for the MOON🌖! The Ch-3 Rover ramped down from the Lander and India took a walk on the moon ! More updates soon.#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 24, 2023 ఆ సంతోషం మాటల్లో చెప్పలేం: ఇస్రో చైర్మన్ చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుక్నుఆమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చేప్పలేమన్నారు. ఫెయిల్యూర్ ఘటనలు మనకు అనేక పాఠాలు నేర్పుతాయని తెలిపారు. మేము రోబోటిక్ పాత్ ప్లానింగ్ ప్రయోగం కూడా చేస్తామని చెప్పారు. కాగా మైక్రోవేవ్ సైజ్ ఉన్న ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు (1,640 అడుగులు) వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు.రోవర్లో కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఖనిజశాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తుంది. Photo Courtesy: IndiaToday ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై 14 రోజులు తిరుగుతూ పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్లు ఉన్నాయి. రోవర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొంది చంద్రయాన్-3 ఆర్బిటర్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇక 40 రోజుల రోజుల ఉత్కంఠకు బుధవారం శుభం కార్డు పడిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయి. అగ్రరాజ్యాలను తోసిరాజంటూ.. భారత్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. చందమామపై ల్యాండర్ను భద్రంగా దించిన నాలుగో దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్–3 విజయంపై దేశ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లు విరిశాయి. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక భారత్కు వివిధ దేశాల అధినేతల నుంచి అభినందనలు అందాయి. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్
చందమామపై మన విక్రమ్ కాలుమోపుతున్నప్పటి ఆ కొన్ని నిమిషాలు సస్పెన్స్ సినిమా క్లైమాక్స్ని తలదన్నేలా ఉత్కంఠ రేపాయి. ఒక హీరో సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేస్తుంటే విజిల్స్ వేయడం సహజం.. అలా బుధవారం సాయంత్రం కొన్ని కోట్ల మంది భారతీయులు కూడా విజిల్స్ వేశారు. అంతేకాకుండా వారందరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మన ఇస్రోని, శాస్త్రవేత్తల బృందం ఘనతని కొనియాడుతూ వారి ఆనందాన్ని మన సినీ తారలతో పాటు ప్రపంచం మొత్తం సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్కు చెందిన నటి హర్ షిన్వారీ చంద్రయాన్ -3 విజయం సాధించడంతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ భారత్కు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా తన సొంత దేశం అయిన పాకిస్థాన్ పై తీవ్రమైన విమర్శలు చేసింది. భారత్తో శత్రుత్వాన్ని పక్కనపెడితే ఎవరైనా ఇస్రోను అభినందించాల్సిందేనని ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్) పాకిస్తాన్, భారత్ మధ్య అన్ని కోణాల్లో అంతరం పెరిగింది. భారత్ను తాము అందుకోవాలంటే సుమారు 2,3 దశాబ్దాలు పట్టవచ్చని ఆమె అభిప్రాయ పడింది. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి పాకిస్తాన్ తలదించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. దురదృష్టవశాత్తు తమకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం పాకిస్తాన్ ప్రజలే అని తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపింది. దీంతో పలువురు పాకిస్థానీయులు కూడా ఆమెకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు. Apart from animosity with India, I would really congratulate ISRO for making history in the space research through Chandaryan3. The gap between Pakistan and India has widened to such a level in all aspects that now it will take two to three decades for Pakistan to reach there.… — Sehar Shinwari (@SeharShinwari) August 23, 2023 -
చంద్రయాన్-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్
ప్రభాస్- కృతి సనన్ నటించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్తో పాటు ఆ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఒక రకంగా ప్రభాస్ నటించిన ఏ సినిమాకు ఇంతలా వ్యతిరేఖత రాలేదనే చెప్పాలి. తాజాగ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయింది. చంద్రమండలంపై భారత్ అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే) చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయింది. కానీ 'ఆదిపురుష్' కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ లెక్కన 'ఆదిపురుష్' కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు ఖర్చుపెడితే బాగుంటుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివిధ సినిమాలకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యయాలతో చంద్రయాన్-3 బడ్జెట్ను నెటిజన్లు పోలుస్తూ... ఇస్రోను ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కూడా 'ఓపెన్హైమర్' సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే దర్శకుడు సుమారు పదేళ్ల కిందటే ఇంటర్స్టెల్లార్ అంతరిక్షం కాన్సెప్ట్తో వచ్చిన సనిమా కోసం ఏకంగా రూ.1350 కోట్లు ఖర్చుబెట్టాడు. -
చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా..
చంద్రయాన్ ల్యాండర్.. బంగారు రంగులో మెరిసి పోతూ ఉంటుంది. పైగా.. ఏదో గిఫ్ట్ప్యాక్ చుట్టిపెట్టి నట్లు గోల్డ్ ఫాయిల్లాగా ఉంటుంది. ఇంతకీ మెరిసేదంతా బంగారమేనా? అస్సలు కాదు.. ఇది మల్టీ లేయర్ ఇన్సులేషన్.. అనేక పొరలుగా ఉంటుంది. ఉష్ణ నిరోధకంగా దీన్ని ఉపయోగి స్తారు. అంతరిక్షంలోకి ఉపగ్రహం వెళ్లినప్పుడు అక్కడి ఉష్ణోగ్రతలు వాటిల్లోని పరికరాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల అవి సరిగా పనిచేయలేక పోవచ్చు. దాన్ని నివారించడానికి ఇలా కప్పి ఉంచుతారు. మూన్ గురించి.. మీకు తెలుసా? మనం అనుకు న్నట్లు.. చంద మామ గుండ్రంగా ఉండడు.. గుడ్డు ఆకారంలో ఉంటాడు.. అలాగే చల్లనయ్య.. తెల్లనయ్య కాదు.. దగ్గర్నుంచి చూస్తే.. ముదురు బూడిద రంగులో ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా.. చంద్రునిలోని 59 శాతం మాత్రమే మనకు కనిపిస్తుందట. అంతేకాదు.. చంద్రుడిని దగ్గర నుంచి చూస్తే.. భారీ గుంతలులాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ.. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఖగోళ వస్తువులు దాన్ని ఢీకొన్నప్పుడు ఏర్పడినవే.. చదవండి: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
మూన్ మూడ్: చంద్రయాన్–3 షేర్లు జిగేల్
చంద్రయాన్–3 చంద్రుడిపై విజయవంతం నేపథ్యంలో అంతరిక్షం, రక్షణ రంగ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఎస్ఈలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 15 శాతం దూసుకెళ్లగా.. స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.5–3.6 శాతం మధ్య జంప్చేశాయి. చంద్రయాన్–3 మిషన్కు సెంటమ్ 200కుపైగా కీలక మాడ్యూల్స్ను సరఫరా చేసింది. ఇక ఈ బాటలో భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్అండ్టీ 3–1.5 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలకు చేరడం గమనార్హం! చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే
ప్రపంచ వ్యాప్తంగా ఆందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. భారతీయులందరి గుండెల్లో ఆనందాలు నింపుతూ.. చంద్రయాన్-3 చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంటే.. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆనందంతో తిలకించారు. నేడు గర్వంగా భారతీయ జెండాను చంద్రమండలంపై ఎగురువేశాం అనే ఆనందం వెనుక ఎంతో శ్రమతో పాటు కన్నీళ్లు,ఉద్వేగం ఇముడుకొని ఉన్నాయి. ఇదంతా ఒక సినిమాగా మన కళ్లుకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తే అది నిజంగా అద్భుతమే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్) గతంలో చంద్రయాన్-2 వైఫల్యాలను గుర్తుచేసుకుంటూ మన ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన చంద్రయాన్-3లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చంద్రుడి మీది విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రయాన్-2 నుంచి చంద్రయాన్-3 విజయం వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా అదిగమించారో తెలుపుతూ ఒక సినిమాగా తీసి భారతీయులకు చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఆసక్తకరమైన సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్తో పాటు పలువురు నెటిజన్లు కూడా చంద్రయాన్ 3 బయోపిక్ తీయమని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏదైనా సెన్సేషన్ సృష్టించిన ఘటన జరిగితే ఆ అంశంపై సినిమా తీయడం మేకర్స్కు అలవాటే... బాలీవుడ్లో బయోపిక్ సినిమా తీయాలంటే మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్.... ఇప్పటికే ఆయన మిషన్ మంగల్, రామసేతు,కేసరి,OMG వంటి విభిన్న చిత్రాలతో మెప్పించాడు. దీంతో చంద్రయాన్-3 సినిమా తీస్తే ఆయన మాత్రమే న్యాయం చేయగలడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో అక్షయ్ కుమార్కు మంచి అనుబంధమే ఉంది. అందులో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే చంద్రయాన్-3 విజయవంతం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ను అక్షయ్ తెరకెక్కిస్తారని పలువురు అంటున్నారు. -
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర..
న్యూఢిల్లీ: చంద్రుని దక్షిణ ధ్రువం మీద సగర్వంగా జెండా పాతి చంద్రయాన్ –3 విజయనాదం చేసింది. దేశ దక్షిణ కొసన తమిళనాడులో మారుమూల విసిరేసినట్టుగా ఉండే నమ్మక్కల్లో సంబరాలు మిన్నంటాయి. ఎందుకంటే చంద్రయాన్ ప్రయోగాల్లో అక్కడి మట్టిదే ప్రధాన పాత్ర మరి! ఎందుకు, ఎలా అన్నది ఓ ఆసక్తికరమైన కథ...! అంతరిక్షంలో ప్రయోగం పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్లో ఉండదు. ఉపగ్రహాలు, నింగిలోకి పంపేటప్పడు ఉపయోగించే వాటి పనితీరును భూమిపైనే పరిశీలిస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తారు. 2008లో చంద్రయాన్–1 అనంతరం తర్వాతి ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్న రోజులవి. చంద్రునిపై సఫ్ట్ లాండింగే లక్ష్యంగా చంద్రయాన్ –2 ను తయారు చేశారు. అది చంద్రునిపై దిగితే అందులోని రోవర్ బయటికి వచ్చి చంద్రుని నేలపై నడిచేలా ప్లాన్ చేశారు. అందుకోసం లాండర్ను ఎక్కడ దించాలి? రోవర్ ఎలా నడవాలి? ఇవన్నీ ప్రశ్నలే. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. వాటికి సమాధానం వెదికేందుకు ఇస్రో సిద్ధమైంది. అందుకు చంద్రునిపై ఉండే మట్టి మాదిరి మట్టి కావాలి. అందుకోసం వెదుకులాట మొదలైంది. వారికి సరిపోయే మట్టి చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో నమ్మక్కల్ లో దొరికింది. 2021లో అక్కడి నుంచి 50 టన్నుల మట్టి సేకరించారు. 2019లో చంద్రయాన్ –2 మిషన్లో ఆ మట్టితోనే ల్యాండర్, రోవర్ అడుగులను పరీక్షించారు. తాజాగా చంద్రయాన్ –3 ప్రయోగాలకు నమ్మక్కల్ మట్టినే వాడారు. అది అనర్తో సైట్ మృత్తిక ‘చంద్రుని ఉపరితలం మీద ఉన్నది అనర్తో సైట్ రకం మృత్తిక. తమిళనాడులోని కొన్ని చోట్ల అదే రకం మట్టి ఉన్నట్టు మేం యాదృచ్ఛికంగా చేసిన భూగర్భ పరిశోధనల్లో తేలింది. కున్నమలై, సీతంపూంది వంటి నమ్మక్కల్ పరిసర ప్రాంతాల్లో అది పుష్కలంగా దొరికింది’అని పెరియార్ విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ అయిన ఎస్.అన్బళగన్ వెల్లడించారు. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. -
చంద్రయాన్పై కార్పొరేట్ల హర్షం.. ఎవరేమన్నారంటే..
చంద్రయాన్–3 విజయవంతం కావడంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ టీమ్ను ప్రశంసించారు. గర్వకారణం... ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. భారత అంతరిక్ష, సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో బృందానికి శుభాభినందనలు. రాబోయే తరాలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ సామర్థ్యానికి నిదర్శనం ఇస్రో, భారత సైంటిస్టులు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలకు ఈ విజయం ఒక నిదర్శనం. ఈ అపూర్వ ఘట్టంలో భాగం కావడం మాకెంతో గర్వకారణం. – ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ సీఈవో జాబిల్లి చేతికి అందింది మానవ జాతి ఆరంభం నుంచి చంద్రుడిని చూస్తూ కలలు కంటూనే ఉంది. చందమామ తన మాయా జాలంతో మనల్ని స్వాప్నికులుగా మార్చింది. నేడు ఆ మాయ, సైన్స్ కలిసి జాబిల్లిని మన చేతికి అందించాయి. – ఆనంద్ మహీంద్రా, పారిశ్రామిక దిగ్గజం చారిత్రక క్షణం ఇస్రో బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం. అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా అమలు చేయగలగడం దేశానికి తన సామర్థ్యాలపై గల నమ్మకానికి నిదర్శనం. ఇది 140 కోట్ల మంది భారతీయులకు చారిత్రక క్షణం. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్ అద్భుత ఘట్టం భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇది మరో అద్భుత ఘట్టం.. మన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం. మూడు దశాబ్దాలుగా భారతీయ స్పేస్ ప్రోగ్రామ్తో అనుబంధం కలిగి ఉండటం మాకు గర్వకారణం. – పర్వత్ శ్రీనివాస్ రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
ఆచంద్ర తారార్కం ఈ మహిళల కీర్తి
‘ఇస్రో’లో పనిచేసిన తొలి తరం మహిళా శాస్త్రవేత్తల మాటల్లో తరచు వినిపించే మాట...‘ఆరోజుల్లో ఇస్రోలో చా...లా తక్కువ మంది మహిళలు ఉండేవారు’ చంద్రయాన్–3కి సంబంధించి నిన్నటి ప్రత్యక్ష ప్రసారాన్ని గమనిస్తే... ఆ ప్రాజెక్ట్లో భాగమైన ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఉత్సాహంగా కనిపిస్తారు. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అది సంఖ్యాబలమే కాదు సామర్థ్య బలం కూడా. ‘ఇస్రో’ సాధించిన ఎన్నో విజయాలలో మహిళా శాస్త్రవేత్తలు భాగం అయ్యారు. ముఖ్యంగా ‘చంద్రయాన్–3’ ప్రాజెక్ట్లో రీతూ కరిధాల్ నుంచి కల్పనా కాళహస్తి వరకు ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు మేధోశ్రమ చేశారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఇస్రో సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను’ అని కలలు కనే ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయ గాధలు ఇవి. రాకెట్ ఉమన్: రీతూ కరిధాల్ అన్ని దశలను పూర్తి చేసుకొని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన క్షణం ఒక చారిత్రక సందర్భం. ఎంత కృషి చేస్తే ఒక విజయం సొంతం అవుతుందో చెప్పిన సందర్భం. అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన ‘చంద్రయాన్–3’లో భాగమైన అనేకమంది మహిళలలో రీతు కరిధాల్ ఒకరు. గత నెలలో... మూడు దశలను పూర్తి చేసుకొని చంద్రయాన్–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్లిన తరువాత ఉత్తర్ప్రదేశ్లో లక్నోలోని ఒక ఇంట్లో ఆనందం అంబరాన్ని తాకింది. వారు ఆనందంతో బాణాసంచా కాల్చారు. మిఠాయిలను చుట్టుపక్కల వారికి పంచారు. ఇక నిన్నటి రోజు ఆ ఆనందం స్థాయి ఎల్లలు దాటి ఉండవచ్చు. ఇది కోట్లాదిమంది భారతీయుల ఇంట్లో కనిపించే సాధారణ దృశ్యమే కావచ్చు. కాని ఆ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఇంట్లో పుట్టిన రీతూ కరిధాల్ ప్రసిద్ధ చంద్రయాన్–3 మిషన్ డైరెక్టర్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి. అదేపనిగా నింగిలోకి చూసేది. ఏవేవో ఊహించుకునేది. అప్పటికి అవి శాస్త్రీయతకు నిలవని ఊహలు కావచ్చు. అయితే రీతూ కరిధాల్ శాస్త్రీయ రంగంలో దిగ్గజంగా వెలగడానికి ఉపకరించిన ఊహలు. కట్ చేస్తే.... 1997... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లోకి అడుగు పెట్టింది రీతు. చంద్రుడిపై అడుగు పెట్టినంత ఆనందంగా అనిపించింది. ‘ఇస్రో’ గురించి వింటూ, చదువుతూ పెరిగిన రీతు అదే ‘ఇస్రో’లో ‘మిషన్ ఎనాలసిస్ డివిజన్’లో ఉద్యోగిగా చేరింది. అప్పట్లో ‘ఇస్రో’లో తక్కువ మంది మహిళలు పనిచేసేవారు. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్లేది. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయినా సరే, ఎప్పుడూ భయపడేది కాదు. అసలు సిసలు భయం మాత్రం తొలి టాస్క్ రూపంలో ఎదురైంది. ‘నేను చేయగలనా?’ అని మొదట ఆందోళన పడింది రీతు. చేతులెత్తేయడం తేలిక. ‘చేయగలను’ అనుకోవడం కష్టం. అయితే కష్టపడే వారే విజేతలవుతారు.‘యస్ నేను చేయగలను’ అంటూ తొలి టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసి ‘భేష్’ అనిపించుకుంది. ‘నాకు అప్పగించిన టాస్క్ను సీనియర్లు చేసే అవకాశం ఉన్నప్పటికీ నన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఇది నన్ను పరీక్షించడానికి వచ్చిందా? అదృష్టవశాత్తు వచ్చిందా? అనేది తెలియదుగానీ నా విజయానికి కారణం... ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ చదువుకున్నాననే ధైర్యం కంటే నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసం’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది రీతు. ఆ ఆత్మవిశ్వాసం అప్పుడే కాదు ఇప్పటికీ రీతు వెన్నంటే ఉంది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళయాన్ మిషన్’లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా, చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్గా పనిచేయడానికి ఇంధనంగా మారింది. చంద్రయాన్–3తో రీతూ కరిధాల్ ఒక చారిత్రక విజయంలో భాగం అయింది. శాస్త్రవేత్తలు కావాలనుకునే కలలు కనే అమ్మాయిలకు రీతు కరిధాల్ స్ఫూర్తి ఇస్తుంది. ‘నా విజయ మంత్రం ఇది’ అని ఆమె ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పలేదుగానీ పరోక్షంగా వినిపించే మాట...టైమ్ మేనేజ్మెంట్. కాలం విలువ తెలిసిన వారే ‘టైమ్ మేనేజ్మెంట్’ను ఇష్టంగా ఆచరిస్తారు. ఆ ఆచరణే ఎన్నో విజయాలను బహుమానంగా ఇస్తుంది. స్ఫూర్తిదాయక శక్తిమంతులు స్పేస్ మిషన్లలో భాగమైన మహిళా శాస్త్రవేత్తల గురించి మిన్నీ వేద్ ‘దోజ్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ స్టోరీస్’ అనే స్ఫూర్తియదాయకమైన పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకంలో ‘రాకెట్ ఉమెన్’గా పేరు గాంచిన రీతూ కరిధాల్ సక్సెస్ స్టోరీ కూడా ఉంది. ‘కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాను. వృత్తిపరమైన విజయాలకు కుటుంబమే పెద్ద బలం’ అంటుంది రీతు. ‘ఇస్రో’లో రీతులాగే ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఉన్నతస్థానాల్లో ఉన్నారు. అయితే ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదని వారి ప్రయాణాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ‘ఇస్రో’లో పనిచేయాలని అనుకోవడానికి కారణం నుంచి... ఎదుర్కొన్న ఒత్తిళ్ల వరకు వారి మాటల్లో కనిపిస్తాయి. ఇస్రో స్పేస్ సైన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసిన సీతా సోమసుందరం ఇలా అంటోంది... ‘నేను ఇస్రోలో చేరిన కాలంలో ఇంజనీరింగ్, సైన్స్లలో మహిళలు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కొందరు సీనియర్లకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. అందులో ఒకటి... మహిళలు ఎక్కువగా కష్టపడలేరు. పరిమిత పనిగంటల్లోనే పనిచేయగలరు. ఇంటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంకితభావం ఉండదు. అయితే ఇది తప్పుడు భావన అని ఇస్రోలో ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు నిరూపించారు’. ‘ఏదో ఉద్యోగం చేస్తున్నాను అనే భావన కాకుండా విజయంలో భాగం కావాలనే సంకల్ప బలం మహిళా శాస్త్రవేత్తలలో కనిపిస్తుంది. ఎన్నో విజయాలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించారు. డెడ్ లైన్లను సవాలుగా తీసుకోవడం నుంచి మిషన్, నేవిగేషన్, కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్, స్పేస్ క్రాఫ్ట్ డిజైన్, ట్రాకింగ్లాంటి మేజర్ ఏరియాలలో కీలక పాత్ర పోషించి తమ సత్తా చాటారు’ అంటుంది మంగళ్యాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పని చేసిన ఎస్.అరుణ. స్పేస్ సైంటిస్ట్లు అనగానే ఏవో గంభీరమై ఊహలు తారసపడతాయి. అయితే ఈ ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల మాటలు విన్న తరువాత ‘అందరిలాగే సాధారణ జీవితం... కానీ అసాధారణ సంకల్ప బలం’ అనే సత్యం ఆవిష్కారం అవుతుంది. ‘ఇస్రోకు చైర్ ఉమన్ (చైర్ పర్సన్) ఎప్పుడూ?’ అనే ప్రశ్న వస్తుంటుంది. ‘ఇస్రో’ విజయాలలో భాగం అవుతున్న మహిళల అంకితభావాన్ని చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు’ అనిపిస్తుంది. ‘ఇస్రో’లో జెండర్–న్యూట్రల్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందనే మంచి మాటలు కూడా దీనికి కారణం. కొన్నిసార్లు లోతైన భావాలు పలకడానికి పదాలు, పుస్తకాలు తెల్లముఖం వేస్తాయి. కళ్లు మాత్రమే నిశ్శబ్దంగా చెబుతాయి. చంద్రయాన్–3 ల్యాండింగ్కు సంబంధించి నిన్నటి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శాస్త్రవేత్తల కళ్లలో కనిపించిన ఉత్సాహాన్ని, అంకితభావాన్ని గమనిస్తే ఇంకా ఎన్నో విజయాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయని అనిపిస్తుంది. సంతోష క్షణాలు: కల్పనా కాళహస్తి కల్పనా కాళహస్తిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా. చెన్నైలో బి.టెక్ (ఈసీఈ) చదివారు. తండ్రి మద్రాసు హైకోర్టులో ఉద్యోగి. తల్లి గృహిణి. ఇస్రోలో పనిచేయాలని తన చిన్ననాటి నుంచి కలలు కనేది. అనుకున్నట్టుగానే 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. తొలుత శ్రీహరికోటలో ఐదేళ్లు పనిచేశాక బెంగళూరులోని శాటిౖలñ ట్ సెంటర్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. కరోనా పాండమిక్ సమయంలో అనేక అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ‘చంద్రయాన్–3’ మిషన్లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈమె గతంలో చంద్రయాన్–2, మంగళయాన్ ప్రాజెక్టుల్లోనూ కీలక బాధ్యతల్ని నెరవేర్చారు. ఆమె నైపుణ్యం, అంకితభావం, దూరదృష్టి వంటివి మిషన్ విజయవంతం కావడంతో గణనీయంగా తోడ్పడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇవి చాలా సంతోషభరితమైన క్షణాలుగా ఎప్పటికీ ఉండిపోతాయి. చంద్రయాన్ 2 కాలం నుంచి లభ్యమైన ఎన్నో అనుభవాలతో ఈ మిషన్ను లోప రహితంగా రూపొందించాం అని చెప్పారు. వినిపించే గొంతుక: పి.మాధురి శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రజలకు బయటికి కనపడే అక్కడి సిబ్బంది/ సైంటిస్టుల్లో పిల్లల మాధురి ఒకరు. ఈమె షార్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ సమయంలో వినిపించే వ్యాఖ్యానాలు, ప్రజలకు వివరించే అంశాల గొంతుక ఆమెదే. వీళ్లే కాకుండా చంద్రయాన్–3 మిషన్లో మొత్తం 54 మంది మహిళా సైంటిస్టులు / ఉద్యోగులు / సిబ్బంది ఉన్నారు. వీళ్లలో చాలా మంది మహిళలు ఎంతో కీలకమైన బాధ్యతలు నెరవేర్చే డిప్యూటీ డైరెక్టర్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ స్థాయి నుంచి అనేక స్థాయుల్లో పనిచేస్తూ... కీలకమైన, భారత్కు గర్వకారణమైన ఈ ప్రాజెక్టును విజయవంతం చేశారు. -
చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను అధ్యయనం చేయడం కోసం ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్–3 ప్రయోగం చేపట్టారు. ఈ మిషన్లో 5 ఇస్రో పేలోడ్స్, నాసాకు చెందిన ఒక పేలోడ్ను పంపించారు. ల్యాండర్ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలంపై దించి పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి సోకదని, చీకటిగా ఉంటుందని చెబుతున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్) నుంచి అటు భూమిని, ఇటు చంద్రుడిని అధ్యయనం చేయడానికి ‘ఆర్బిటార్ స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్’అనే ఒక సైంటిఫిక్ పరికరం అమర్చి పంపారు. ఈ సైంటిఫిక్ పేలోడ్తో ముఖ్యంగా చంద్రుడి ఉపరితలం నివాసయోగ్యంగా ఉందా? అనేది అధ్యయనం చేస్తారు. అలాగే చంద్రుడిపై జరుగుతున్న మార్పులను తెలుసుకోవచ్చు. జాబిల్లిని అధ్యయనం చేయడానికి ఇది ప్రయోగాత్మక పేలోడ్ కావడం విశేషం. ల్యాండర్లో పేలోడ్స్ ఇవీ... ► ల్యాండర్లో మూడు పేలోడ్స్ ఉన్నాయి. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ (రంభ–ఎల్పీ) అనే సైంటిఫిక్ పేలోడ్తో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎల్రక్టాన్లు, చంద్రుడి అంతర్భాగం దాగి ఉన్న ఖనిజాలపై పరిశోధన చేస్తారు. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్»ౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ అనే పేలోడ్స్తో చంద్రుడిపై లాండింగ్ సైట్ చుట్టూ ప్రకంపనలను గుర్తిస్తారు. రోవర్లోని పేలోడ్స్ ► చంద్రుడి ఉపరితలం మూలక కూర్పును అధ్యయనం చేయడానికి రోవర్లో రెండు సైంటిఫిక్ పరికరాలను అమర్చి పంపారు. ఇందులో అల్ఫా పారి్టకల్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్తో చంద్రుడిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధిస్తారు. చంద్రుడిపై రసాయనాలుంటే వాటిని కూర్పు చేయడానికి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పేలోడ్తో చంద్రుడిపై రాళ్లను అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా చంద్రుడిపై నేల స్వభావం ఎలా ఉందో గుర్తిస్తారు. ► గ్యాస్, ప్లాస్మా పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి, చంద్రశ్రేణి అధ్యయనాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ శ్రేణి అనే ఒక సైంటిఫిక్ పరికరాన్ని కూడా రోవర్లో అమర్చారు. ఇది కూడా చంద్రుడిపై మరింత అధ్యయనం కోసమే. -
చంద్రయాన్ –3 తరువాత?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్ మాత్రమే విజయం సాధించగలిగింది. కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే. కలిసొచ్చే జుగాడ్... చంద్రయాన్ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ లాంఛ్ వెహికల్ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం. భవిష్యత్తు అవసరాల కోసం? 1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు. ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్లో చంద్రయాన్–3 ఫస్ట్లుక్ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది. 1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) 2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) 3. రోవర్ ► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్ను కలిగి ఉన్నాయి. ► ఇక ల్యాండర్ మాడ్యూల్ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. ► చంద్రయాన్–3 మిషన్ లాంచ్వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్ని ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది. ► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు. ► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది. ► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది. ► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది ► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది. ► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్ విజయం కాదని చెప్పారు. ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సకెŠస్స్ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే.. అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు. భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్ టూర్ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు. -
వీర విక్రమ.. చంద్ర దిగ్గజ.. జయహో
ఎన్నాళ్లో వేచిన సాయంత్రం. నగరమంతటా ఉత్కంఠమయం. చందమామపైకి విక్రమ్ ఎప్పుడెప్పుడు వెళ్తాడా అనే ఉద్విగ్న సమయం. చివరికి ‘మామ’ను ముద్దాడిన ఆనంద వీక్షణం. నగరం ఒక్కసారిగా హర్షాతిరేకాలతో తడిసిముద్దైన తన్మయత్వం.. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్– 3 ప్రయోగం విజయవంతం. అంబరమంటిన సంబరం. అంతర్జాతీయ అంతరిక్ష యవనికపై ఇండియా జెండా సమున్నతంగా ఎగిసిన వేళ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అరుదైన క్షణాల కోసం నగర వాసులు నరాలు తెగే ఉత్కంఠగా ఎదురుచూశారు. విక్రమ్ రోవర్ ల్యాండింగ్ను చూడటానికి టీవీలకు అతుక్కుపోయారు. పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులతో పాటు పౌరులంతా ఈ అద్భుత క్షణాలను వీక్షించడానికి ప్రత్యేక ప్రసార వేదికలను ఏర్పాటు చేయడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో/కూకట్పల్లి/గన్ఫౌండ్రీ/సంతోష్నగర్/ ఉస్మానియా యూనివర్సిటీ చంద్రయాన్– 3పై బుధవారం ఉదయం నుంచే సిటీజనులు సోషల్ మీడియా వేదికగా అప్డేట్స్ను షేర్ చేస్తూ ఆసక్తి కనబరిచారు. సాయంత్రం 5.44 గంటలకు చంద్రయాన్ తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందని తెలియడంతో టీవీలకు అతుక్కుపోయారు. నగరంలోని బిర్లా ప్లానెటోరియం, సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లు వేదికలుగా లైవ్షోలు ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్లానెటోరియంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని సేఫ్ ల్యాండింగ్ను వీక్షించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా వేదికగా, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో వందల సంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. పలు రెస్టారెంట్లు, మాల్స్ల్లోనూ చంద్రయాన్ను ప్రత్యక్షంగా వీక్షించారు. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో వేడుకలను నిర్వహించారు. చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలంటూ బంజారాహిల్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్ –3 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా పలువురు ప్రముఖులు తమ స్పందనలు ఇలా వ్యక్తం చేశారు. అపుడే చెప్పెను రాకేశ్ శర్మ.. ఇటీవల నగరలోని ఉస్మానియా వేదికగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ ఇస్రో పరిశోధనల గురించి పలు అంశాలను వెల్లడించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3, గగన్యాన్లకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజవంతం అవుతుందని, ఈ ప్రయోగానికి ప్రణాళికలను పఠిష్టంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్–3 ఇతర దేశాల దృష్టిని ఆకర్షిస్తుందని ఆ రోజే పేర్కొన్నారు. తాను ఈ ప్రయోగంలో అడ్వయిజరీ మెంబర్గా కొనసాగుతున్నట్లు చెప్పారు. చంద్రయాన్లో మన ప్రాతినిధ్యం శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్–3లో హైదరాబాద్ నగరం కూడా కీలక పాత్ర పోషించింది. నగరంలోని మిధాని, బీహెచ్ఈఎల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వంటి పలు కంపెనీలు, పరిశోధనా సంస్థలు చంద్రయాన్ ప్రయోగంలో వివిధ దశల్లో సేవలందించాయి. చంద్రయాన్–3కి కూకట్పల్లిలో తయారు చేసిన పరికరాలను అమర్చటం మరోసారి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటివరకు 50 సార్లు నాగసాయి ప్రెసీషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఉపగ్రహాల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థ చంద్రయాన్–3కు కూడా సంబంధించిన వస్తువుల తయారీకోసం రక్షణ శాఖ ఎంపిక చేయటం విశేషం. ఈ సంస్థ వారు బ్యాటరీలు, ల్యాండర్, రోవర్, ప్రొఫెల్షన్ మాడ్యూల్ వంటి మాన్యుఫాక్చర్స్, మెకానికల్ బ్యాటరీ స్లీవ్స్ వంటి పరికరాలను అందజేశారు. ► చంద్రయాన్తో పాటు ఇస్రో చేస్తున్న పరిశోధనల్లో నాగసాయి కంపెనీ అధినేత బీఎన్ రెడ్డి పరికరాలను అందజేస్తున్నారు. చంద్రయాన్ మిషన్కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలను, ఉక్కు తదితర ప్రత్యేక శాసీ్త్రయ పదార్థాలను ‘మిధాని’ సంస్థ అభివృద్ధి చేసి సరఫరా చేసింది. ఇస్రో చేపట్టే పలు పరిశోధనల్లో ఈ సంస్థ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ ప్రయోగంలో వినియోగించిన బ్యాటరీలను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ తయారు చేసింది. వీటితో పాటు బై–మెటాలిక్ అడాప్టర్లను, క్రయోనిక్ దశలో ఉపయోగించిన పలు భాగాలను కూడా ఈ సంస్థే రూపొందించింది. గగన్యాన్కూ నాగసాయి సేవలు కూకట్పల్లి ప్రశాంత్నగర్లోని నాగసాయి ప్రెసీషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 25 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల్లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లకు సంబంధించిన కీలకమైన పరికరాలను తయారు చేసింది. అత్యంత నాణ్యమైన నాసిల్స్తో పాటు గతంలో నాసిల్స్ను తయారు చేసేందుకు ఇజ్రాయల్ నుంచి అల్యూమినియం తీసుకొచ్చి బాలానగర్లో తయారు చేసి విమానాల తయారీకి సంబంధించిన విడి పరికరాలను ఇక్కడి నుంచే సప్లై చేయటం విశేషం. నాగసాయి కంపెనీ ఈసారి చంద్రయాన్–3తో పాటు ఆదిత్య–ఎల్ 1, గగన్యాన్లకూ పరికరాలు అందజేసి రికార్డు సృష్టించింది. 50సార్లు అంతరిక్ష ప్రయోగాలు.. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన బీఎన్ రెడ్డి.. తాను కూడా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 1994లో నాగసాయి కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రయోగాత్మక వస్తువులు తయారు చేస్తూ రక్షణ శాఖ దృష్టిలో పడటం ఆయనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది. నాసా, ఇస్రోలకు తన కంపెనీ పరికరాలను అందజేయాలనే సంకల్పంతో కొన్ని వ్యయ ప్రయాసలకు గురైనా కార్యాచరణ మొదలు పెట్టారు. బీఎన్ రెడ్డి కార్యాచరణ నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించిన జాతీయ సంస్థలు ఆయనకు అవకాశమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 సార్లు అంతరిక్ష ప్రయోగాల్లో పరికరాలు అందజేసిన ఘనత ఆయనకే సాధ్యమైంది. దేశ, విదేశాలతో పాటు అంతరిక్షంలో కూడా కూకట్పల్లి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లిన బీఎన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్–3 విజయవంతం కావడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు గ్రేట్ ఇస్రో ద్వారా చంద్రయాన్–3 విజయవంతం కావడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 నిలవడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఖ్యాతి ఇనుమడించిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషితో దేశం గర్విస్తోందని అభిప్రాయపడ్డారు. – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి -
విద్యార్థుల్లో చంద్రయాన్ విజయోత్సాహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : అంతరిక్షంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించి, ప్రపంచంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్న చంద్రయాన్–3 ప్రయాణాన్ని ఆద్యంతం వీక్షించిన వి ద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సాహంలో ము నిగితేలారు. ఈ ఘనతను పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో బుధవారం సాయంత్రం అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లోను అందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. ఇటీవల ఉన్నత పాఠశాలలకు ప్రభు త్వం అందించిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లపై చంద్రయాన్ మిషన్లో భాగమైన ల్యాండర్ మాడ్యుల్ ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు పలుచోట్ల సాధారణ ప్రజలు సైతం సమీప పాఠశాలల్లో బిగ్ స్క్రీన్స్పై ఆద్యంతం వీక్షించారు. చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ మాడ్యూల్ దిగిన వెంటనే సంబరాలు జరుపుకున్నారు. జయహో భారత్ అంటూ నినాదా లు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రసార ఏర్పా ట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విద్యా ర్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపా రు. చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశం మనదైనందుకు గర్విస్తూ, ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు వారంతా అభినందనలు తెలిపారు. అలాగే.. ♦ చంద్రయాన్–3 విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఏలూరు జిల్లా గణపవరానికి చెందిన స్వర్ణకారుడు పేరూరి కృష్ణ కేవలం 700 మిల్లీగ్రాముల బంగారంతో చంద్రయాన్–3 విక్రమ్ రోవర్ను తయారుచేసి జాతికి అంకితమిచ్చారు. ♦ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు. దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరు గర్వించదగిన రోజని కీర్తించారు. ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ♦ తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్పై చంద్రయాన్–3 ల్యాండింగ్ ప్రక్రియను నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తితో తిలకించారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనూ ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించిన విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎస్వీ యూనివర్సిటీ, కేంద్రీయ సంస్కృత విద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, అగ్రికల్చరల్ కళాశాలల్లోనూ విద్యార్థులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సలామ్ అంటూ పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ♦ ఇస్రోకి శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘కంగ్రాట్యులేషన్స్ ఇస్రో’ ఆకారంలో చేసిన విద్యార్థుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చంద్రుడిపై చంద్రయాన్–3 దిగిన దృశ్యాలను 860 మందికి పైగా విద్యార్థులు వీక్షించారు. ♦మరోవైపు.. భారతదేశ ఖ్యాతిని విశ్వాంతరాలలో సుస్థిరం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభినందించారు. చంద్రయాన్–3 విజయవంతం అవ్వడంపట్ల బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకంతో ఆయన ఆనందం వ్యక్తంచేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుుమడింప చేసిందని కొనియాడారు. ఈ విజయానికి కృషిచేసిన శాస్త్రవేత్తలకు రాష్ట్ర ప్రజలు తరఫున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ♦ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. చంద్రయాన్–3 విజయవంతం కావడం ఖగోళ చరిత్రలో భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ విషయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు జాతిని తలెత్తుకునేలా చేశారని ఆయన కొనియాడారు. ♦ భారతదేశం అంతా ఈ రోజు గర్వించదగ్గ రోజని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభివర్ణించారు. యావత్ ప్రపంచం భారతదేశ వైపు చూస్తోందని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ మంత్రి శుభాభినందనలు తెలిపారు. -
వానతో ముగిసిన ఆట!
డబ్లిన్: భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ ఖాతాలో 2–0తో సిరీస్ చేరింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ‘చంద్రయాన్’ను వీక్షిస్తూ... మ్యాచ్ రోజు డబ్లిన్లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు. -
వెన్నెల రాజ్యంలో ‘విక్రమ్’ అడుగుపెట్టిన వేళ..
సాక్షి, చైన్నె : చూసిన కనులదే భాగ్యం.. అన్నట్లు సంబరం అంబరాన్నంటిది.. నెలరాజైన చంద్రుడిని విక్రమ్ ల్యాండర్ ముద్దాడిన క్షణం రాష్ట్రంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. యువత జయహో భారత్ అంటూ నినదిస్తూ ర్యాలీలు నిర్వహించింది. పలుచోట్ల బాణసంచా పేల్చారు. ఇక కళాశాలలు, పాఠశాలలలో విద్యార్థులు చంద్రయాన్ దృశ్యాలను వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇక, చైన్నెలోని అన్నావర్సిటీతో పాటు పలు విద్యా సంస్థల పరిశోధన కేంద్రాల్లో, బిర్లా టెక్నో సెంటర్, ప్లానిటోరియంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో జనం కిక్కిరిశారు. నిర్ణీత సమయంలో జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన అద్భుత దృశ్యాలను వీక్షించి ఆనంద తాండవం చేశారు. జయహో భారత్ అంటూ నినాదిస్తూ జాతీయ జెండాలతో కేరింతలు కొట్టారు. ర్యాలీలు నిర్వహించారు. చైన్నె, సేలం, కోయంబత్తూరులో ర్యాలీలు హోరెత్తాయి. ఇస్రో నేతృత్వంలో సాగిన ఈ ప్రయోగంలో తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు అధికంగా ఉండటంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు మిన్నంటాయి. ముందుగా ఉత్కంఠగా టీవీలకు అతుక్కు పోవడమే కాదు, ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఆలయాలలో పూజ లు, ప్రార్థనా మందిరాలలో, పాఠశాలలో ప్రార్థనలు జరిగాయి. తిరువళ్లురులోని వెన్మనంపుదుర్ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థనలు చేశారు. శుభాకాంక్షల వెల్లువ చంద్రయాన్ –3 విజయవంతంతో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, పుదుచ్చేరి లెప్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఇస్త్రో శాస్తవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ అయితే, చంద్రుడిపై భారత్ అన్న ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. చంద్రుని ఉపరితలంపై భారత్ పాద ముద్రలు చారిత్రాత్మకం అని వ్యాఖ్యానించారు. ఈ విజయం కోసం అహర్నిషలు శ్రమించిన, కృషి చేసిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఈరోజు అతి పెద్ద పండుగ రోజు అని అభివర్ణించారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్య దర్శి పళణి స్వామితో పాటు పలు పార్టీలకు చెందిన నా యకులు ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పారు. -
ఇస్రో... అభినందనలు
చంద్రయాన్–3 మిషన్ చరిత్రాత్మక విజయం సాధించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ విజయం పట్ల ఎంతో గర్విస్తున్నా. దీంతో మ్రిత్ కాల్ లక్ష్య సాధనలో దేశం మరింత చేరువైంది. ఇస్రో శాస్త్రవేతలు, బృందంతో పాటు ప్రధా ని నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు కూడా అభినందనలు. – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సేఫ్ ల్యాండింగ్ ద్వారా చంద్రయాన్–3 మిషన్ సంపూర్ణ విజయం సాధించడం గొప్ప విజయం. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్ను విజయవంతంగా చేర్చిన మొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించి అరుదైన చరిత్రను సృష్టించింది. ఇ ది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం. ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, భాగస్వాములైన ప్రతి ఒ క్కరికీ అభినందనలు. చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజు. భవిష్యత్లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్–3 విజయం గొప్ప ప్రేరణ ఇస్తుంది. ఇదే స్ఫూర్తిని కొన సాగిస్తూ, దేశ కీర్తిప్రతిష్టలను మరింతగా పెంచే దిశ గా, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజ య పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చంద్రునిపై దక్షిణ ధ్రువానికి చంద్రయాన్–3 విజయవంతంగా చేరుకోవడం ఆనందంగా ఉంది. భారత అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక మైలురాయి, అద్భుత ఘటన. ఈ ఘనతను సాధించేందుకు ఇస్రో చేసిన కృషి, నిబద్ధత ఎనలేనిది. భారతీయ అంతరిక్ష ప్రయాణానికి ఇది అద్భుత సమయం. మనం చంద్రుడిపై ఉన్నాం. – ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ -
వరంగల్: 'భూక్య రమేష్' ఇస్రోలో శాస్త్రవేత్తగా..
వరంగల్: మహబూబాబాద్ మండలం సోమ్లతండా గ్రామానికి చెందిన భూక్య రమేష్ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం సందర్భంగా ఇస్రోలోని ప్రధాన శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ కూడా పాల్గొన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భూక్య భీముడు, లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు అయిన రమేష్ ఇస్రోలో నాలుగేళ్లుగా కమ్యూనికేషన్ విభాగంలో పని చేస్తున్నారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో ఇక్కడే ఉండడం తనకు ఎంతో గర్వంగా ఉందని రమేష్ చెప్పారు. ఈసారి విజయవంతం కావడం భారత దేశ ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు. -
మహోన్నత ఘట్టం
కోట్లాదిమంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఒక అపురూపమైన, మహోన్నతమైన ఘట్టం అంతరిక్షంలో ఆవిష్కృతమైంది. సహస్రాబ్దాలుగా విశ్వ మానవాళికి కనువిందు చేస్తున్న చందమామపై పరిశోధనల కోసం మన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ బుధవారం అఖండ విజయం సాధించింది. ఎవరికీ లొంగిరాని చంద్రుడి తలంపైనున్న దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశోధనల కోసం ఎంచుకుని, విక్రమ్ ల్యాండర్ను అక్కడే దించితీరాలన్న లక్ష్యంతో పనిచేసిన మన శాస్త్రవేత్తల సాహస ప్రయత్నం సాకారం కావడం ప్రపంచ దేశాలను అబ్బురపరి చింది. దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. విక్రమ్ ల్యాండర్ సరిగ్గా అనుకున్నచోటే, అనుకున్న సమయానికే సురక్షితంగా కాలూనడం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పరంపరను కీలక మలుపు తిప్పే ఒక అసాధారణ విన్యాసం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇదొక చారిత్రక ఘట్టం. దీని వెనక వందలాదిమంది శాస్త్రవేత్తల నాలుగేళ్ల నిరంతర కృషి, దృఢసంకల్పమూ పెనవేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గత 41 రోజులుగా అన్ని విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలూ పరస్పర సమన్వయంతో రాత్రింబగళ్లు పనిచేస్తూ చంద్రయాన్ గమనాన్ని కళ్లల్లో వత్తులు వేసుకుని చూశారు. రెప్పవాల్చని నిఘాతో ఎప్పటికప్పుడు దాన్ని నిశితంగా గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో ముడిపడిన శాస్త్ర, సాంకేతిక సిబ్బంది అందరూ చంద్రయాన్నే శ్వాసించారు. మరే వ్యాపకమూ లేదన్నట్టు ఈ ప్రాజెక్టుపైనే తమ సర్వశక్తులూ కేంద్రీకరించారు. మన శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వైఫల్యాల శాతం అతి తక్కువ. చంద్రయాన్–2 ప్రాజెక్టులో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి గురుత్వాకర్షణ వేగాన్ని అధిగమించలేక విఫలమైందన్న మాటేగానీ, దాంతోపాటు పంపిన ఆర్బిటర్ ఇంకా పనిచేస్తూ ప్రస్తుత ప్రాజెక్టుకు అవసరమైన డేటాను అందించింది. గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్–3 వ్యోమనౌక కక్ష్యను శాస్త్రవేత్తలు దశలవారీ పెంచుతూ రాగా, ఈనెల 1న భూ కక్ష్యను దాటుకుని చంద్రుడి కక్ష్య దిశగా అది దూసుకెళ్లింది. మరో నాలుగురోజులకు చంద్రుడి కక్ష్యలో చేరగా, ఆనాటినుంచీ దాని కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చారు. ల్యాండర్ను కిందకు దించే ప్రక్రియను కొనసాగించాలా లేదా అన్నది కేవలం కొన్ని గంటలముందు నిర్ణయించవలసివుంటుంది. అప్పుడు కూడా అంతా సవ్యంగానే సాగుతున్నదని నిర్ధారించుకుని సరిగ్గా ముందనుకున్నట్టే సాయంత్రం 5.45కి ల్యాండర్ను చంద్రుడి ఉపరితలంపైకి మళ్లించే దశకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఏ దశలోనూ చంద్రయాన్ –3కి అవాంతరాలు ఎదురుకాకపోవటం, చివరకు శాస్త్రవేత్తలు సైతం అత్యంత కష్టసాధ్యమైనదని భావించిన చివరి 17 నిమిషాలూ అంచనాలకు అనుగుణంగా ముగియటం అనితర సాధ్యమైన ప్రక్రియ. ల్యాండింగ్ సమయంలో ఏ వ్యవస్థ విఫలమైనా ఆ వెంటనే మరో వ్యవస్థ దాన్ని నెర వేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాలు చంద్రుడిపైకి ఇంతవరకూ మొత్తం 18 వ్యోమనౌకలు పంపగా, అందులో 40 శాతం విఫలమయ్యాయి. 1959 జనవరిలో పూర్వపు సోవియెట్ యూనియన్ తొలి వ్యోమనౌకను పంపింది. 1976 తర్వాత... అంటే 47 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు జరిపిన రెండో లూనా–25 ప్రయోగంఆ దేశాన్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈనెల 19న తమ వ్యోమనౌక విఫలమైందని ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆ మరునాడు ప్రకటించింది. అంతరిక్ష రంగంలో కాకలు తీరిన సంస్థే విఫలమైందంటే ఇలాంటి ప్రాజెక్టుల్లో ఎన్ని సంక్లిష్టతలు ఇమిడివుంటాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మన చంద్రయాన్–2 ప్రాజెక్టుకు సహకరించడానికి అప్పట్లో రష్యా ముందుకొచ్చింది. 2011–12 మధ్య జరగాల్సిన ఆ ప్రయోగానికి రాకెట్, ఆర్బిటర్ మనం సమకూర్చుకోవటానికి, ల్యాండర్, రోవర్లను రష్యా అందించటానికి అవగాహన కుదిరింది. తీరా ఆ రెండూ వేరే ప్రయోగాల్లో విఫలం కావటం, రష్యా రూపొందించిన కొత్త డిజైన్లు మన రాకెట్కు అనువుగాలేని కారణంగా వాటిని సొంతంగానే రూపొందించుకోవాలని ఇస్రో నిర్ణయించింది. అందువల్లే 2019కి గానీ చంద్ర యాన్–2 సాధ్యపడలేదు. అందులో ఎదురైన వైఫల్యాల నుంచి గుణపాఠం తీసుకోబట్టే తాజా విజయం చేతికందింది. చంద్రుడిపై అతి శీతల ప్రాంతమైన దక్షిణ ధ్రువంలో ఇంతవరకూ ఏ దేశమూ తలపెట్టని అరుదైన ప్రయోగాలు ప్రజ్ఞాన్ రోవర్ నిర్వహిస్తుంది. చంద్రుడిపై ఉన్న మట్టిని, అక్కడి శిలలను సేకరించి మౌలిక, రసాయన సమ్మేళనాల డేటాను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంటుంది. ఉపరితలంపై ఉన్న మట్టిలోని అయాన్లనూ, ఎలక్ట్రాన్లనూ, వాటి సాంద్రతనూ మదింపు వేస్తుంది. వాటిల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను పసిగడుతుంది. ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతనూ, అక్కడ వచ్చే కంపనాలనూ అంచనా వేస్తుంది. ఈ ప్రయోగాలన్నీ అది ఒక చాంద్రదినం (మనకు 14 రోజుల కాలం)లో పూర్తిచేయాల్సివుంటుంది. ఆ తర్వాత దాని జీవనయానం ముగుస్తుంది. సాంకేతికంగా ఎన్నో సంక్లిష్టలతో నిండివున్న ఈ ప్రయోగానికి సిద్ధపడటం, వేరే దేశాలతో పోలిస్తే దాన్ని అత్యంత చౌకగా (ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 600 కోట్లు) పూర్తి చేయటం మన శాస్త్రవేత్తల సమర్థతను తెలియజేస్తుంది. అణ్వస్త్ర దేశంగా, అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ప్రతిష్టను చంద్రయాన్–3 ఘన విజయం మరింత పెంచింది. ఇది మరిన్ని ప్రయోగాలకు దోహద పడి మొత్తంగా మానవాళి జ్ఞానాన్ని మరింత సునిశితం చేయగలదని ఆశించాలి. -
Chandrayaan 3 Success Celebrations: చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్పై అంబరాన్నంటిన సంబురాలు (ఫొటోలు)
-
Chandrayaan 3 Success Viral Photos: నెట్టింట చంద్రయాన్-3 సక్సెస్ హల్చల్
-
తొలి చిత్రాన్ని విడుదల చేసిన చంద్రయాన్-3
చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. Chandrayaan-3 Mission: Updates: The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru. Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom — ISRO (@isro) August 23, 2023 చంద్రయాన్-3 సూపర్ సక్సెస్తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మరో మైలురాయి దాటేసింది. చంద్రుడిపై విక్రమ్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. బండరాళ్లు, గుంతలు లేని స్థలం చూసుకుని విక్రమ్ దిగింది. తద్వారా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండైన తొలి దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. మొత్తంగా చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది(అమెరికా, సోవియట్ యూనియన్(USSR), చైనాలు ఉన్నాయి). 1959లో సోవియట్ యూనియన్ ‘లూనా’ ప్రయోగం తర్వాత.. మానవ సహిత చంద్రయాత్రలు కూడా సాగాయి. అయితే ఇవన్నీ భూమి వైపు కనిపించే చంద్రుడి మధ్య రేఖ వద్ద జరిగాయి. అవతల ఎలా ఉంటుందన్న అన్వేషణలో ఎవరూ ముందడుగు వేయలేకపోయారు. పైగా అక్కడంతా బిలాలు, లోయలు, గడ్డ కట్టిన మంచే ఉంటుందని అంచనా వేస్తూ వచ్చారు. ఇప్పుడో అప్పుడో ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై అది రెండువారాల పాటు పరిశోధనలు చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మట్టిని అన్వేషించనున్న రోవర్.. మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులపైనా అన్వేషణ కొనసాగిస్తుంది. మిగతా దేశాలు మన విక్రమ్ తర్వాతే.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి జాడల పరిశోధనల కోసం ఏకంగా వ్యోమగాముల్ని పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు 2025లో పట్టాలెక్కనుంది. మరోవైపు చైనా కూడా వ్యోమగామరహిత ప్రయోగాలకు సిద్ధమైంది. -
చంద్రయాన్-3 సక్సెస్.. ప్రకాశ్ రాజ్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తల అహర్నిషలు కృషి చేసిన కష్టానికి ఫలితం దక్కింది. ఆగస్టు 23, 2023 భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా లిఖించబడింది. ఇంతటి ఘనత సాధించిన మన శాస్త్రవేత్తలను ఘనతను ప్రపంచ మొత్తం అభినందిస్తోంది. ఈ విజయం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (ఇది చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్ ) అయితే ఇంతకుముందు విక్రమ్ ల్యాండర్ గురించి నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఫోటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతినేలా ఇస్రో ఛైర్మన్ ఛాయ్ పోస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అంతే కాకుండా ప్రకాశ్ రాజ్పై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. చంద్రయాన్ తీసిన ప్రకాశ్ రాజ్ ఫోటో ఇదేనంటూ.. అతను బురదలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లోని ప్రకాశ్ రాజ్ క్లిప్స్ను షేర్ చేస్తూ నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. చంద్రయాన్-3 నుంచి రోవర్ ప్రగ్యాన్ తీసిన మొదటి చిత్రం ఇదేనంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇస్రో విజయం పట్ల కంగ్రాట్స్ చెబుతూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!) Early Pictures coming in from Moon after landing of #Chandrayaan3. 🌕#justasking #PrakashRaj 😂😂 pic.twitter.com/c1pqizkNbC — Keshav Soni (@ImKeshavSoni) August 23, 2023 For Prakash Raj ji, 1 Like = 1 Slap 1 Retweet = 100 Slap#justasking pic.twitter.com/zRJkdib1bm — WTF (@WeTheFukrey) August 23, 2023 BREAKING NEWS:- First picture coming from the Moon by #VikramLander Wowww Prakash Raj #justasking pic.twitter.com/UsinHfbzlx — Kadak (@kadak_chai_) August 21, 2023 PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking — Prakash Raj (@prakashraaj) August 23, 2023 -
ల్యాండర్ కాలుమోపగానే.. చంద్రయాన్ 3 ఫస్ట్ మెసేజ్..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టగానే మొదటి మెసేజ్ ఇస్రో పంపించింది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 'ఇండియా అంటే నేను లక్ష్యాన్ని చేరాను. మీరు కూడా. చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం. శుభాకాంక్షలు.' చంద్రయాన్ 3 అంటూ పోస్టులో పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బ్రాడ్కాస్ట్ సౌకర్యం 5:20 నుంచే ప్రారంభమైంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్పై పీఎం మోదీ.. -
సరికొత్త చరిత్రను లిఖించాం.: పీఎం మోదీ..
జోహెన్నస్బర్గ్: చంద్రుని దక్షిణ ధృవంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ సమిష్టిగా చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలుమోపిన క్షణాన్ని వీక్షించారు. భారత్ గౌరవించదగిన విషయమని ప్రధాని మోదీ అన్నారు. "ఈ విజయంపై ఇస్రోను, శాస్త్రవేత్తలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను దక్షిణాఫ్రికాలో ఉండవచ్చు కానీ నా హృదయం ఎల్లప్పుడూ చంద్రయాన్ మిషన్తో ఉంటుంది. చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపాం. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఈ ఘనత సాధించలేదు. సరికొత్త చరిత్రకు అధ్యాయం ప్రారంభమైంది." అని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. చంద్రునిపై ల్యాండింగ్ చేసిన ఘటన ఇప్పటివరకు ఈ మూడు దేశాలకే ఉండేది. తాజాగా చంద్రయాన్ 3తో భారత్ కూడా చేరింది. Congratulations @isro #Chandrayaan3 #IndiaOnTheMoon #PMModi #NarendraModi #PMOIndia #Congratulations #isrochandrayaan3mission @narendramodi pic.twitter.com/mVfQZAIF1V — Aryan S Prince (@aryansprince49) August 23, 2023 చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. 2019లో చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఈ మిషన్ను ఛాలెంజ్గా తీసుకోవడం, అటు.. రష్యా లూనా 25 ఇటీవల ఫెయిలవడంతో యావత్ ప్రపంచం చంద్రయాన్ 3వైపు ఆసక్తిగా చూసింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే -
చంద్రయాన్-3 సక్సెస్.. సాహో భారత్ అంటున్న క్రికెట్ ప్రపంచం
ఖగోళంతో భారత శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై "ఇస్రో" విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో ప్రపంచం మొత్తం సాహో భారత్ అంటుంది. యావత్ క్రీడా ప్రపంచం ఇస్రోకు సెల్యూట్ చేస్తుంది. క్రికెట్ దునియాకి సంబంధించి బీసీసీఐ, పలువురు భారత క్రికెట్ సెలెబ్రిటీలు మేరా భారత్ మహాన్ అంటున్నారు. History Created! 👏 👏 Mission Successful 🌖 Congratulations 🇮🇳#Chandrayaan3 | @isro pic.twitter.com/Gr7MxooHo1 — BCCI (@BCCI) August 23, 2023 Celebration by Team India...!!! Chandrayaan 3 on Moon.pic.twitter.com/cMXgT1U8AC — Johns. (@CricCrazyJohns) August 23, 2023 చరిత్ర సృష్టించాం.. మిషన్ సక్సెస్ఫుల్ అంటూ బీసీసీఐ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపింది. ఐర్లాండ్లో ఉన్న భారత క్రికెటర్లు చంద్రయాన్-3 ల్యాండింగ్ను ఆసక్తిగా వీక్షిస్తున్న ఫోటోను బీసీసీఐ ఈ పోస్ట్కు జత చేసింది. A historic moment that will resonate for generations to come! 🇮🇳 Heartfelt congratulations to @isro on the triumphant landing of #Chandrayaan3. A remarkable feat that fills us all with inspiration through their steadfast commitment and exceptional accomplishment. pic.twitter.com/234LXEGuRw — Jay Shah (@JayShah) August 23, 2023 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ కావడంపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. ఇదో చారిత్రక ఘట్టం. ఇస్రోకు హృదయపూర్వక అభినందనలు. ఇస్రో శాస్త్రవేత్తల నిబద్ధత మనందరికీ స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. షాతో పాటు చాలా మంది భారత క్రికెటర్లు చంద్రయాన్-3 సక్సెస్పై స్పందించారు. Yaaaaayyy , We have done it. Soft landing on the Moon.#Chandrayaan3 . Congratulations @isro and all those who dedicated themselves to this historic mission. We are on the Moon 🌙 pic.twitter.com/VZLLgeSLEk — Virender Sehwag (@virendersehwag) August 23, 2023 Hello Moon! 👋🌕 Sooo proud of everyone at @isro for making this possible and giving every Indian a moment to cherish for a lifetime. Many congratulations! 🎉#Chandrayaan3 pic.twitter.com/cJ3bNYX2Px — DK (@DineshKarthik) August 23, 2023 🇮🇳 - The 𝐟𝐢𝐫𝐬𝐭 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 to reach the lunar south pole. That's got a nice ring to it 👏 A proud moment for each one of us & a big congratulations to @isro for all their efforts. — Rohit Sharma (@ImRo45) August 23, 2023 विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊँचा रहे हमारा @ISRO represents the best of India. Humble, hardworking women & men, coming together, overcoming challenges, and making our tricolour fly high. India must celebrate and congratulate the Chandrayaan-2 team, which was led by Shri K… pic.twitter.com/WpQn14F1Mh — Sachin Tendulkar (@sachin_rt) August 23, 2023 𝗕𝗘𝗟𝗜𝗘𝗩𝗘 🇮🇳#OneFamily #Chandrayaan_3 #Ch3 #Chandrayaan3 #VikramLander pic.twitter.com/kU9InzTlD4 — Mumbai Indians (@mipaltan) August 23, 2023 Many congratulations to the #Chandrayaan3 team. You have made the nation proud 🇮🇳 Jai Hind! — Virat Kohli (@imVkohli) August 23, 2023 A victorious and historic moment for India with the successful landing of #Chandrayaan3 !Congratulations to all at ISRO and each person who worked hard for this success. India's shining victory in Amrit Kaal and a stepping stone to greater achievements to come! https://t.co/KRMCAfaWQx — P.T. USHA (@PTUshaOfficial) August 23, 2023 🇮🇳चाँद पर हिंदुस्तान🇮🇳 चन्द्रयान की सफलता का ऐतिहासिक पल। भारत माता की जय🇮🇳 pic.twitter.com/0awSIHCCxh — Yogeshwar Dutt (@DuttYogi) August 23, 2023 MS Dhoni daughter Ziva's reaction when Chandrayaan 3 landed on the moon. pic.twitter.com/PIrk9B8Mv9 — Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023 A historic achievement & a moment of pride for our Nation 🇮🇳 Congratulations @ISRO & to everyone who played their part in making this mission a success! 🙏🏼#Chandrayaan3 pic.twitter.com/4irADFuVdH — Mohammed Siraj (@mdsirajofficial) August 23, 2023 కాగా, భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ను పూర్తి చేసుకుంది. -
ఇస్రోకు అభినందనల వెల్లువ
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్తో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపాక.. ఆ ఉద్విగ్న క్షణాల మధ్య సంతోషాన్ని పంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో సైంటిస్టులు మాత్రమే కాదు.. యావత్ దేశం ఆ క్షణాల్ని గర్వంగా భావించింది. ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడ్డ కృషిని ప్రజలు, ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాన మోదీ అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్గా చంద్రయాన్-3 ల్యాండింగ్కు వీక్షించారాయన. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్రిక్స్ సమావేశంలో ఉన్నా నా మనసంతా చంద్రయాన్-3 మీదే ఉంది. చంద్రయాన్-3 ప్రయోగంతో విజయవంతంతో నా జీవితం ధన్యమైంది. చ్రందయాన్-3 విజయం నవభారత జయధ్వానం. ఈ రోజును భారత్ ఎప్పుడూ మర్చిపోదు అని తెలిపారాయన. India is now on the Moon. ये क्षण, जीत के चंद्रपथ पर चलने का है। pic.twitter.com/0hyTUvVL9E — PMO India (@PMOIndia) August 23, 2023 ఇక.. మీతో పాటు నేను కూడా నా గమ్యనాన్ని చేరుకున్నానంటూ చంద్రయాన్-3 ఇచ్చిన సందేశాన్ని ట్విటర్లో షేర్ చేసింది ఇస్రో. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాదించినందుకు గర్వంగా ఉందంటూ చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్పై ఇస్రో చైర్మన్ సోమనాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రయాన్ సక్సెస్ కావాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. తన తోటి సైంటిస్టులకు అభినందనలు తెలిపారాయన. అలాగే.. చంద్రయాన్-3 ప్రయోగంలో ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు మోపాలనే శాస్త్రీయ పరిశోధనల వెనుక దశాబ్దాల కృషి ఉంది. ఇవాళ సాధించిన ఘనతకు గానూ ఇస్రో బృందానికి అభినందనలు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Congratulations to Team ISRO for today's pioneering feat.#Chandrayaan3’s soft landing on the uncharted lunar South Pole is the result of decades of tremendous ingenuity and hard work by our scientific community. Since 1962, India’s space program has continued to scale new… — Rahul Gandhi (@RahulGandhi) August 23, 2023 చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన సమయంలో ఇస్రోను యావత్ దేశం వెన్నంటి నిలిచింది. ఆ సమయంలో ఇస్రో చైర్మన్ శివన్ కంటతడి పెట్టగా.. ప్రధాని మోదీ స్వయంగా ఓదార్చారు. ఆ ఓటమి నుంచి ఇస్రో పాఠాలు నేర్చింది. చంద్రయాన్-3లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పడింది. దానికి తోడు అత్యాధునిక సాంకేతికత తోడు కావడంతో చంద్రయాన్-3 ప్రయోగంపై మొదటి నుంచి ఇస్రో కాన్ఫిడెన్స్గా ఉంటూ వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలకు తగ్గట్లుగానే విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపడమే కాదు.. సౌత్ పోల్పై అడుగుమోపిన తొలి దేశంగా అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. The moment when India reached on the Moon.#Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan_3 pic.twitter.com/Pq4oI1OGTw — MyGovIndia (@mygovindia) August 23, 2023 Show me a better come back video than this I will wait 🇮🇳 #Chandrayaan3#IndiaOnTheMoon pic.twitter.com/OAMPspFDhr — BALA (@erbmjha) August 23, 2023 நம் பாரத திருநாட்டின் பெருமையை உலக அரங்கில் நிலைநாட்டிக்கொண்டிருக்கும் மாண்புமிகு பாரதப்பிரதமர் திரு.நரேந்திர மோடி அவர்கள் தலைமையிலான மத்திய அரசின் மாபெரும் வரலாற்று சாதனையான சந்திராயன்-3 விண்கலம் மூலம் நிலவில் தடம் பதித்தது விக்ரம் லேண்டர்,நிலவின் தென் துருவத்தில் தரையிறங்கிய… pic.twitter.com/0rDWxP9xjS — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 23, 2023 ఇక.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ అభినందనలు తెలియజేశారు. భారత్ చరిత్ర సృష్టించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారాయన. A Proud Moment for Every Indian! Heartiest congratulations to @isro for accomplishing such a monumental achievement. Our best wishes to Team Chandrayaan-3 for their endless contributions towards creating history! pic.twitter.com/g4WwoCzLa8 — All India Trinamool Congress (@AITCofficial) August 23, 2023 India becomes the first nation to touch the south pole of the moon with the success of the #Chandrayaan3 Mission. The new space odyssey flies India's celestial ambitions to newer heights, setting it apart as the world's launchpad for space projects. Unlocking a gateway to space… — Amit Shah (@AmitShah) August 23, 2023 With the soft landing of Vikram Lander on Moon’s South Pole, India has added a golden chapter in the history of space exploration. It is a landmark achievement and momentous occasion for 1.4 billion people as India becomes the first country in the world to land on Moon’s South… — Rajnath Singh (@rajnathsingh) August 23, 2023 -
చంద్రయాన్-3 విజయంపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఇది భారత్కు అపురూపమైన విజయం. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, నాతో సహా దేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా ఫీలవుతున్నారు. ఇస్రో బృందానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ అపురూపమైన ఫీట్ని శ్రీహరికోట నుంచే సాధించాం. ఇది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జయహో భారత్. ఇస్రో అంచనాలు తప్పలేదు. యావత్ భారతం ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. ఎవరూ చూడని.. అడుగు మోపని చంద్రుడి భూభాగంలో భారత్ తొలి అడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. చదవండి: చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్ An incredible achievement for India! On the Chandrayaan-3’s successful soft landing on the moon, I, along with every citizen of India is filled with pride! My wishes and congratulations to everyone @isro. That this incredible feat was achieved from Sriharikota in our very own… https://t.co/PYQXe8pwj7 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023 -
ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 అఖండ విజయంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ అద్బుత,చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 మానవజాతి ప్రారంభమైనప్పటి నుండి మనం చంద్రుని వైపు చూశాం. మన మనస్సులో జాబిల్లి మాయాజాలం, స్వప్నాలు ఇక నిజం కాబోతున్నాయి. చంద్రుడిపై కలలు నేడు, మేజిక్ &సైన్స్ సమ్మిళిత కృషితో జాబిల్లి మన చేతికి చిక్కింది. ఇక 1.4 బిలియన్ల భారతీయుల మనస్సుల్లో జాబిల్లిపై సరికొత్త డ్రీమ్స్. జై హింద్! అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్చేశారు. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) ఈ మిషన్ తప్పక విజయం సాధిస్తుందని ముందే బల్లగుద్ది మరీ చెప్పిన నటుడు మాధవన్ చంద్రయాన్3 సక్సెస్తో ఆయన సంతోషానికి అవధుల్లేవు అంటూ మరో ట్వీట్ చేశారు. ఐఆర్సీటీసీ కూడా చంద్రయాన్-3 విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన దైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంత మైం. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కావడంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. From the dawn of humankind we have gazed at the moon and let it work its magic on our minds. The moon turned us into dreamers. Today, magic & science merge and having the moon in our grasp will spark new dreams in the minds of 1.4 billion Indians. Jai Hind. 🇮🇳… pic.twitter.com/I4I9vJD4WE — anand mahindra (@anandmahindra) August 23, 2023 Words are not enough to describe this achievement Jai Hind, my heart swells with pride. I hope I can stay sane.🤗🤗🙏🚀🚀🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/2rTFpHzEWn — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 Congratulations to the entire @ISRO team for making history by successfully reaching the moon, and to continuously aiming higher and farther! 🚀🌕 #ISRO #Chandrayaan3Mission #IndiaOnTheMoon #VikramLander pic.twitter.com/bQZX02sGDz — IRCTC (@IRCTCofficial) August 23, 2023 -
జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్
ఇస్రో రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 (Chandrayaan-3) విక్రమ్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ ఉత్కంఠంగా ఎదురు చూశారు. ల్యాండింగ్ సక్సెస్ కావడంతో మేరా భారత్ మహాన్ అంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు.. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంపై కాలు మోపడంతో.. చంద్రయాన్3 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటివరకు ఏ దేశం.. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు ల్యాండ్ కాలేదు. భారత్ ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టిచింది. ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా వరస ట్వీట్స్ పెడుతున్నారు. An absolutely Momentous achievement for India !! #Chandrayaan3 🚀 registers an unprecedented and spectacular success!!! 👏👏👏 History is Made today!! 👏👏👏 I join over a Billion proud Indians in celebrating and congratulating our Indian scientific community !! This clearly… pic.twitter.com/tALCJWM0HU — Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2023 A triumphant journey to the Moon's south pole! #Chandrayaan3's graceful landing is a testament to India's scientific excellence and a giant leap in space exploration! Sky is no longer the limit!! Congratulations team @isro!! 🇮🇳 #IndiaOnTheMoon — Mahesh Babu (@urstrulyMahesh) August 23, 2023 My heartiest congratulations to @ISRO on a successful soft landing of #Chandrayaan3 mission on the surface of the moon. As always, you are the pride of India. — Jr NTR (@tarak9999) August 23, 2023 Wohooo!!! History Created 🥳 A Billion hearts at joy & serene. A Historical & Monumental moment as our #Chandrayaan3 lands successfully. This embarks of our emergence as the next space power & will be a boon to all our ambitious future generations to dream to the skies. Thank… pic.twitter.com/wnsgQbn6Iw — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2023 Landed! Congrats to the entire team behind #Chandrayaan3 You make us proud.🇮🇳👍🏽#ISRO pic.twitter.com/5M4IunE74Y — Varun Tej Konidela (@IAmVarunTej) August 23, 2023 What a proud moment. #Hindustanzindabad tha hai or rahega Congratulations to @ISRO on the successful soft landing of #Chandrayaan3 on the moon. A momentous feat in the history of India's space exploration. Proud!!!#Chandrayaan3Landing #chandrayaan_3 #ISRO #MoonMission pic.twitter.com/vzalkeJAOY — Sunny Deol (@iamsunnydeol) August 23, 2023 A remarkable milestone for India's space journey 🔥 #Chandrayaan3 successfully lands on the moon, showcasing our nation's scientific prowess and determination. A proud moment for every Indian 🇮🇳🙇🏻 pic.twitter.com/30yONvViQn — Sree Vishnu (@sreevishnuoffl) August 23, 2023 What a brilliant display of Indian Space technology and genius! Congratulations to our brightest minds for adding yet another notch to our belt! @isro #Chandrayaan3 #Chandrayaan3Landing pic.twitter.com/gjgIuUEP3p — Anil Kapoor (@AnilKapoor) August 23, 2023 INDIA is on MOON! ISRO makes HISTORY like never before and makes every Indian proud! 🇮🇳#Chandrayaan3 achieves the unthinkable! Proud proud Indian Jai Hindi 🤩 @isro pic.twitter.com/79rMNdnlbW — Naga Vamsi (@vamsi84) August 23, 2023 🚀Congratulations to @ISRO for their remarkable achievement with Chandrayaan-3's Successful Moon🌔 landing!💐👏 The dedication & brilliance of the #ISRO team continue to inspire us all. 🇮🇳🛰️ Another giant leap for India's space exploration! 🌍🔭 #Chandrayaan3… pic.twitter.com/phLOZfhcLj — Mohan Babu M (@themohanbabu) August 23, 2023 Words are not enough to describe this achievement Jai Hind, my heart swells with pride. I hope I can stay sane.🤗🤗🙏🚀🚀🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/2rTFpHzEWn — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 Those smilesss :) That joy & pride across the country.. Kushiiiiiiiiiiiiiii 🌙❤️🇮🇳 — Vijay Deverakonda (@TheDeverakonda) August 23, 2023 India 🇮🇳 has conquered the uncharted! #Chandrayaan3 successfully lands on the moon’s South Pole, marking an unprecedented triumph in space history! 🛰️🌍 Congratulations to everyone at @isro who all worked hard to achieve this interstellar milestone 🚀 Mission Accomplished ✅ pic.twitter.com/onJ7VGiTyM — Geetha Arts (@GeethaArts) August 23, 2023 Congratulations to @ISRO for scripting another glorious chapter in India's space journey with the successful soft landing of #Chandrayaan3 🌕 Your brilliance and tireless efforts shine as a beacon of hope and pride for our nation 🇮🇳🚀 pic.twitter.com/PI79Rh5Stk — Ravi Teja (@RaviTeja_offl) August 23, 2023 OUR INDIA IS NOW ON THE MOON 🇮🇳 #Chandrayaan3 HISTORIC MOMENT !! Thank you @isro 🤍 pic.twitter.com/c98QcUjDVd — Kartik Aaryan (@TheAaryanKartik) August 23, 2023 History created !! What a moment to live.. Soo Proud !!! 🇮🇳 🫡 #Chandrayaan3 @isro pic.twitter.com/gJ3oANLPv6 — Atharvaa (@Atharvaamurali) August 23, 2023 History created !! What a moment to live.. Soo Proud !!! 🇮🇳 🫡 #Chandrayaan3 @isro pic.twitter.com/gJ3oANLPv6 — Atharvaa (@Atharvaamurali) August 23, 2023 #HISTORICALMOMENT #Chandrayaan3Landing #Chandrayaan3 🚀 @isro Proud Of Our Nation ✨🇮🇳 #JaiHind #IndiaOnTheMoon #India 🇮🇳 ✊ Thanks & Respect ✊ to all the Scientists involved and Made this Possible for Our Country and at the same time making Us Proud 🇮🇳 pic.twitter.com/ozn0998vVB — thaman S (@MusicThaman) August 23, 2023 Viral Aipotham 😜 Congratulations ISRO . What a proud achievement #Chandrayaan3 #India #Chandrayaan3Landing #MissShettyMrPolishetty pic.twitter.com/YbJwsxabdI — Naveen Polishetty (@NaveenPolishety) August 23, 2023 Proud moment for every Indian 🇮🇳💪 Hats off to #isroindia#Chandrayaan3 #IndiaOnMoon pic.twitter.com/lrnjY8uVjk — Director Maruthi (@DirectorMaruthi) August 23, 2023 And finally, the South Pole opens up for humankind! Congratulations to every scientist, technician and staff member of @isro on getting #Chandrayaan3 to touch history at the Moon's South Pole! Here's to curiosity, persistence and innovation that have made a whole nation proud!… pic.twitter.com/PXx0vFvzGt — Mohanlal (@Mohanlal) August 23, 2023 Touchdown MOON! 🛰️ Big congratulations to @isro on the successful soft landing of #Chandrayaan3 on the moon. This day is historic for every Indian, a moment of pride and belief that we can reach for the stars, the moon and beyond. Proud! 🇮🇳 #ISRO pic.twitter.com/lvff9EESIb — manoj bajpayee (@BajpayeeManoj) August 23, 2023 Historic day for @ISRO 🙏🏽#Chandrayaan3 JAI HIND 🇮🇳 pic.twitter.com/XgfVFxtmBq — Sandeep Reddy Vanga (@imvangasandeep) August 23, 2023 -
ఖండాంతరాలకు భారత్ ఖ్యాతి.. చంద్రయాన్ 3 ప్రాజెక్టు సాగిందిలా..
హైదరాబాద్: చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయా న్–3 మిషన్ ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం దశలవారీగా చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే ఆపరేషన్ను విజయవంతంగా చేపట్టారు. చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు ఐసారు, లూనార్ ఆర్బిట్లోకి చేరుకున్న తర్వాత మరో ఐసా ర్లు ఆర్బిట్ రైజింగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమేట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) భూనియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ల్యాండర్, రోవర్ మాడ్యూల్ను తీసుకెళుతున్న ప్రపొల్షన్ మాడ్యూల్ మొత్తం బరువు 2,145 కిలోలు. ప్రపొల్షన్ మాడ్యూల్ను భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 1,696 కేజీల ఇంధనాన్ని నింపారు. మిగిలిన 449 కేజీలు పేలోడ్ ఇనుస్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ ప్రపొల్షన్ మాడ్యూల్కు అనుసంధానం చేసిన ల్యాండర్, అందులో ఉన్న రోవర్ను చంద్రుడి మీదకు విజయవంతంగా తీసుకెళ్లి వదిలిపెట్టింది. అప్పటికి రెండు ఘట్టాలను పూర్తిచేశారు. ప్రస్తుతం మిగిలిన మూడో ఘట్టం కూడా పూర్తి అయింది. బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభించి 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడి ఉపరితలంపైన దించారు. దశలవారీగా చూస్తే.. ► జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ► మొదటిగా చంద్రయాన్–3 మిషన్ భూమికి దగ్గరగా అంటే పెరిజీ 175 కిలోమీటర్లు, భూమికి దూరంగా అపోజి 36,500 కిలోమీటర్లు దూరంలోని భూ మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. ► చంద్రయాన్–3 మిషన్ కక్ష్యలోకి ప్రవేశించగానే బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం (ఉపగ్రహాల నియంత్రిత భూకేంద్రం) శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు. ► గత నెల 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూ రంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 17న రెండోసారి భూమికి దగ్గరగా 173 కిలోమీ టర్ల ఎత్తును 223 కిలోమీటర్లుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తును 42,000 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ► 18న మూడో విడతలో 224 కిలోమీటర్లు, దూ రంగా 51,568 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► 22న నాలుగో విడతలో భూమికి దగ్గరగా 233, దూరంగా 71,351 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు. ► 25న ఐదోసారి భూమికి దగ్గరగా 236, భూమికి దూరంగా 1,27,609 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. 25 నుంచి ఆగస్టు 1 అర్ధరాత్రి దాకా చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈనెల 1న అర్ధరాత్రి చంద్రయాన్–3 మిషన్నుపెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపునకు మళ్లించారు. ►5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 18074 ఎత్తుకు చేరింది. ► 6న ప్రపొల్షన్ మాడ్యూల్ లూనార్ ఆర్బిట్లో మొదటి సారిగా కక్ష్య దూరాన్ని తగించే ప్రక్రియను ప్రారంభించి 4,313 కిలోమీటర్లకు తగ్గించారు. ►9న రెండో సారి కక్ష్య దూరాన్ని తగ్గించి 1437 కిలోమీటర్లు చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. ► 14ప మూడోసారి 179 కిలోమీటర్లకు తగ్గించారు. ► 16న నాలుగోసారి 163 కిలోమీటర్లకు తగ్గించారు. ► 17న చంద్రయాన్–3ని 127 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ను విజయవంతంగా విడిచిపెట్టింది. ► 18న ల్యాండర్ మాడ్యూల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► 20న అంటే ఆదివారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా 134 కిలోమీటర్లకు చేరుకుంది. ► 23 బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ల్యాండర్ మాడ్యూల్లో ఇంధనాన్ని 37 నిమిషాలపాటు మండించారు. ► షెడ్యూల్ ప్రకారం కంటే ముందే 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ► ఉత్కంఠభరితమై 17 నిమిషాల టెర్రర్ టైంలో ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా ల్యాండర్ని కిందికి దించారు. ► 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్.. విజయవంతగా చంద్రుని దక్షిణ ధృవంపై కిందికి దిగింది. అంతరిక్ష రంగంలో భారత్ చరిత్రను సృష్టించింది. ఇదీ చదవండి: శెభాష్ విక్రమ్.. చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత్ -
చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్
బెంగళూరు: జయహో భారత్. ఇస్రో అంచనాలు తప్పలేదు. యావత్ భారతం ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. ఎవరూ చూడని.. అడుగు మోపని చంద్రుడి భూభాగంలో భారత్ తొలి అడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. ఓటమి గెలుపునకు నాంది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్-2 వైఫల్యంతో మంచి పాఠాలే నేర్చింది. అందుకే చంద్రయాన్-3లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీర్చిదిద్దింది. జులై 15వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఏపీలోని శ్రీహారి కోట నుంచి చేపట్టింది. ఎల్వీఎం3-ఎం4 భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఆపై 18 రోజుల వ్యవధిలో ఐదుసార్లు కక్ష్యను పెంచుకుంటూ పోసాగారు. ఆగస్టు 1వ తేదీన ట్రాన్స్ లునార్ కక్ష్య.. 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. ఆగస్టు 17వ తేదీన వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవత్లో కూడిన ల్యాండర్ మాడ్యూల్.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించడం ప్రారంభించింది. ఆ తర్వాత రెంసార్లు డీ ఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి జాబిల్లి ఉపరితలానికి చేరువ చేశారు. శెభాష్ విక్రమ్ 41 రోజుల ప్రయాణంలో అలిసిపోని విక్రమ్ ల్యాండర్.. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలను వమ్ము చేయలేదు. ఊహించినట్లుగా సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా ప్రయాణించి చంద్రుడిపై అడుగు మోపింది. సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్.. నిర్దేశించిన ప్రాంతానికి చేరింది. ఇస్రో సైంటిస్టులు పంపించిన ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ను అనుసరించి.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. నాలుగు థ్రాటబుల్ఇంజిన్లను ప్రజ్వలించి వేగాన్ని తగ్గించుకుని.. రఫ్ బ్రేకింగ్ దశను ముగించుకుని చంద్రుడి ఉపరితం చేరుకుంది. చంద్రుడికి ఏడున్నర కిలోమీట్ల ఎత్తు నుంచి ల్యాండర్ తన దిశను మార్చుకుంది. దశల వారీగా ఎత్తు దగ్గించుకుని.. ల్యాండింగ్కు అనువైన ప్రదేశంలో కాలుమోపింది. తద్వారా అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. నెక్ట్స్ ఏంటంటే.. దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగగా.. చంద్రుడిపై ఆ ప్రాంతంలో మట్టిని రోవర్ పరిశోధిస్తుంది. అలాగే.. రెండువారాలపాటు మట్టిలో గడ్డ కట్టిన మంచు అణువులైనా అన్వేషణ కొనసాగనుంది. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 The moment when India reached on the Moon.#Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan_3 pic.twitter.com/Pq4oI1OGTw — MyGovIndia (@mygovindia) August 23, 2023 ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు
చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్ సక్సెస్ కావడంపై అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రక క్షణాల తరువాత చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ అద్భుతమైన క్షణాల కోసం యావత్ ప్రపంచంగా ఉత్కంఠగా ఎదురు చూసింది. భారత్ ప్రయత్నాన్ని, కృషిని కొనియాడింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. నీటిని కనుగొనే అవకాశం ఉన్నందున దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా జెఫ్ బెజోస్, ట్విటర్ అధినేత ఎలాన్మస్క్ తోపాటు, నటుడు, ఆర్ మాధవన్ సహా ప్రముఖులు చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ ముందే సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. "రూట్ ఫర్ ఇండియా! గుడ్ లక్, చంద్రయాన్-3," బెజోస్ ఇస్రోపోస్ట్ను రీషేర్ చేస్తూ థ్రెడ్స్ యాప్లో పేర్కొన్నారు. అలాగే ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ బయోపిక్ 'రాకెట్రీ: దినంబి ఎఫెక్ట్' లో కీలక పాత్ర పోషించిన మాధవన్ "చంద్రయాన్-3 సంపూర్ణ విజయం సాధిస్తుంది.. మార్క్ మై వర్డ్స్ అంటూ ట్విటర్ ద్వారా ముందుగానే అభినందలు తెలిపారు. Chandrayaan-3 WILL BE ABSOLUTE SUCCESS —- MARK MY WORDS . Congratulations @isro .. IN ADVANCE .. on this spectacular success .. I AM SO SO HAPPY AND PROUD … congratulations to @NambiNOfficial too .. Vikas engine delivers yet once again during the launch.… — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, "చంద్రయాన్ ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది" అని పేర్కొన్నారు. టెస్లా , స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్-3 మూన్ మిషన్పై స్పందించారు. 'ఇంటర్స్టెల్లార్' సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్-3 ఖర్చు తక్కువగా ఉందని ఎక్స్లో చేసిన పోస్ట్పై మస్క్ స్పందిస్తూ, మిషన్ "భారతదేశానికి మంచిది" అని వ్యాఖ్యానించారు. #WATCH | On Chandrayaan 3 landing, actor Kareena Kapoor Khan says, "It's a great moment for India and a proud moment for every Indian. All of us are waiting to watch it. I'm going to do that with my boys." pic.twitter.com/MLJKJjoPsS — ANI (@ANI) August 21, 2023 ఇంకా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తదితరులు ఈ మిషన్ను అభినందించిన వారిలో ఉన్నారు.కాగా ఇస్రో వెబ్సైట్తోపాటు, పలు చానెళ్లు ఈ ల్యాండింగ్ ఈవెంట్ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ అద్భుత విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
చంద్రయాన్-3పై ఎలన్ మస్క్ రియాక్షన్
చంద్రయాన్-3పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవేళ.. ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. చంద్రయాన్-3 బడ్జెట్.. హాలీవుడ్ ఇంటర్స్టెల్లార్ చిత్రం బడ్జెట్ కంటే తక్కువనే ఓ నెటిజన్ ట్వీట్కు ఎక్స్(ట్విటర్)లో మస్క్ బదులిచ్చారు. ఎలన్ మస్క్ సైతం స్పేస్ఎక్స్ అనే స్పేస్ సంస్థకు యాజమాని అనే సంగతి తెలిసిందే. Good for India 🇮🇳! — Elon Musk (@elonmusk) August 22, 2023 దాదాపు ఏడు వందల కోట్ల ఖర్చుతో(75 మిలియన్ల డాలర్ల) చంద్రయాన్-3 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మిషన్ కోసం ఖర్చు చేసిన బడ్జెట్ను ఓ నెటిజెన్ హాలీవుడ్ సినిమాతో పోల్చాడు. ఇంటర్స్టెల్లార్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్ను చేపట్టినట్లు ఓ నెటిజన్ అన్నాడు. ఇదే చంద్రయాన్ ప్రయోగాన్ని ఆమధ్య ఓ నెటిజెన్ ప్రభాస్ ఆదిపురుష్ బడ్జెట్తో పోల్చిన సంగతి తెలిసిందే. ఇంటర్స్టెల్లార్ చిత్ర నిర్మాణం కోసం దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఆదిపురుష్ కోసం 700 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా. అయితే లోబడ్జెట్ చంద్రయాన్పై మస్క్ మాత్రం ఇది మంచి పరిణామమే అన్నట్లుగా ఆయన రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ జోడించారు. ఇక స్పేస్ఎక్స్ ద్వారా అంతరిక్ష టూరిజంలో క్రియాశీలకంగా ఉన్న ఎలన్ మస్క్.. అంగారకుడితో పాటు చంద్రుడిపైకి మనిషిని పంపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. -
చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమయింది. భారత అంతరిక్ష యానంలో ఎన్నో ఎళ్ల కళ సాకారం అయింది. అయితే.. ఈ మహత్తర కార్యం వెనుక దాదాపు 1000 మంది ఇంజినీర్ల కృషి ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. వీళ్లనే మూన్ స్టార్లుగా పిలుస్తున్నారు. ఇందులో ప్రధానమైనవారు.. ఎస్. సోమనాథ్, (ఇస్రో ఛైర్మన్) ఎస్. సోమనాథ్ ఎయిరో స్పేస్ ఇంజినీర్. చంద్రయాన్ 3ని జాబిల్లి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిన బాహుబలి రాకెట్ని రూపొందించడంలో సహకరించారు. రాకెట్లోకి చేర్చే ముందు చంద్రయాన్ 3ని పూర్తిగా పరీక్షించే బాధ్యతలను ఆయన చూసుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పూర్వ విద్యార్థి. సంస్కృత భాషను అనర్గళంగా మాట్లాడగలరు. ఈయన పేరులోని సోమనాథ్(చంద్రునికి ప్రభువు) అర్థం ఉంది. ఇస్రోలో ఎంతో సమర్థవంతమైన నాయకునిగా పనిచేస్తున్నారు. ఉన్నికృష్ణన్ నాయర్,(విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్) రాకెట్ పరిశోధనల్లో మరో కీలక శాస్త్రవేత్త . అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు మొదటి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం అనేక క్లిష్టమైన మిషన్లకు నాయకత్వం వహించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈయన నాయకత్వంలోనే విజయవంతమైంది. వీరముత్తువేల్:(చంద్రయాన్ 3 డైరెక్టర్) ప్రముఖ శాస్త్రవేత్త వీరముత్తువేల్.. చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తన మేధస్సును అందిస్తున్నారు. ఈయన చెన్నై నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీలో పట్టా పొందారు. చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు. కే. కల్పన(చంద్రయాన్ 3 డిప్యూటీ డైరెక్టర్) మరో ప్రముఖ ఇంజినీర్ కే. కల్పన. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం దీక్షగా తన బృందంతో కలిసి పనిచేశారు. మన దేశానికి ఉపగ్రహాల తయారీలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు. ఎం. వనిత(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్)బెంగళూరు ప్రముఖ ఇంజినీర్ ఎం. వనిత చంద్రయాన్-2 మిషన్కు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన ఆమె.. జాబిల్లిపై చేసిన ప్రయోగానికి నాయకత్వం వహించిన భారత మొదటి మహిళ. చంద్రయాన్-2పై ఆమెకున్న జ్ఞానాన్ని చంద్రయాన్ 3 కోసం శాస్త్రవేత్తల బృందం సరిగా వినియోగించుకుంది. ఆమెకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎమ్ శంకరన్:(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డైరెక్టర్) బెంగళూరు ఎమ్ శంకరన్ ISRO పవర్హౌస్గా ఖ్యాతిగాంచారు. ఎందుకంటే కొత్త పవర్ సిస్టమ్లు, పవర్ శాటిలైట్లకు సౌర శ్రేణులను తయారు చేయడంలో ఈయనకి మంచి నైపుణ్యం ఉంది. ఉపగ్రహాల తయారీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2ల్లో కూడా పనిచేశారు. చంద్రయాన్-3లో ఉపగ్రహం తగినంత వేడి, చల్లగా ఉండేలా చూసుకోవడం ఈయన పని. ల్యాండర్ బలాన్ని రూపొందించడంలో ఆయన సహాయం చేశారు. ఈయన భౌతికశాస్త్రంలో మాస్టర్ పట్టా పొందారు. వీ నారాయణన్.. (లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ డైరెక్టర్, తిరువనంతపురం) లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను తయారు చేయడంలో నిపుణుడు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి అవసరమైన థ్రస్టర్లను ఈయన నాయకత్వంలో అభివృద్ధి చేశారు. ఖరగ్పూర్ IIT పూర్వ విద్యార్థి. క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేయడంలో కూడా ఆయన నిపుణుడు. చంద్రయాన్-3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లలో ఈయన మేధస్సు ఉపయోగపడింది. ఇదీ చదవండి: Chandrayaan-3 Moon Landing Updates:షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ -
చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ నెల 17న చంద్రయాన్ -3 ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. చంద్రయాన్ 3లో ఇప్పటి వరకు ప్రతి ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఇక ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్నినేడు చేరుకోనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం జరగనుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్య ఘట్టాన్ని సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. ల్యాండర్ మాడ్యుల్ చంద్రుని వీక్షించే క్షణం కోసం దేశంలోని ప్రజలు తోపాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. దాయాది దేశం పాక్తో సహా ప్రపంచ దేశాలు భారత్ ఉక్కు సంకల్పానికి నివ్వెరపోయాయి. ప్రపంచ అగ్ర దేశాలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను భారత్ సాధిస్తుండటంతో అందరీ దృష్టి ఇండియాలోని ఈ మిషన్ ఘట్టంపైనే ఉండటం విశేషం. సర్వత్రా ఈ విషయం ఓ హాట్టాపిక్గా మారింది. ప్రజలైతే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలంటూ పూజలు చేస్తున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న దేశంగా చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాలైన యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన ఇండియా నిలుస్తుంది. భారత్ వెలుపల ఉన్న ప్రజలే గాక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం "జయహో భారత్ జయహో ఇస్రో" అంటూ ఈ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలంటూ పూజలు, హోమాలు చేస్తున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా భారత ఇస్రోకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుల మత పర భేదాలు పక్కన పెట్టి అందరూ ఒకేతాటిపై భారత ఇస్రో దిగ్విజయంగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రకరకాలుగా వీడియోలు ట్వీట్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. @chandrayaan_3 #AllTheBestChandrayaan3 ♥️♥️♥️All the very best Chandrayaan 3♥️♥️♥️ 🚀🇮🇳Jai Hind🇮🇳🚀🌛 pic.twitter.com/YXM76uHOoo — Aakash (@Aakash13294124) August 22, 2023 Let's join in prayer for the safe landing of chandrayaan-3. 🙏 Jai Shree Ram ❤️🔥#chandrayaan3 pic.twitter.com/ubq4iKZdLw — Bhagavad Gita 🪷 (@Geetashloks) August 23, 2023 #AllTheBestChandrayaan3 We love you, @isro All the best @chandrayaan_3 Nived, Svara, Punit, Vinee#NarendraModi @mygovindia @PMOIndia pic.twitter.com/6CKtXUnAsf — Vineetha Punit (@vineepun) August 21, 2023 Here's another set of greetings from people across India. We appreciate and extend our thanks to them. #AllTheBestChandrayaan3 #Chandrayaan_3 #Sivoham pic.twitter.com/CwRAWNaCUi — Chandan Yadav (@Chandan_YadavSP) August 22, 2023 #WATCH | Uttar Pradesh | People offer namaz at the Islamic Center of India in Lucknow for the successful landing of Chandrayaan-3, on August 23. pic.twitter.com/xpm98iQM9O — ANI (@ANI) August 22, 2023 (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్ప్లేస్లో చేతులకు వచ్చే సమస్యలు!) -
చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3 ) మిషన్ ఘన విజయం సాధించింది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండయి చరిత్ర తిరగరాసింది. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను ప్రపంచమంతా కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో లార్సెన్ & టూబ్రో (L&T), మిశ్ర ధాతు నిగమ్ (MIDHANI), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) తో సహా పలు కంపెనీలు ‘చంద్రయాన్-3’ మిషన్లో కీలక పాత్ర పోషించాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో మిషన్కు సహకరించాయి. ఎల్అండ్టీ పాత్ర ఎల్వీఎం3 ఎం4 చంద్రయాన్ మిషన్ ప్రయోగంలో ఎల్అండ్టీ కీలక పాత్ర పోషించింది. 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెడ్ ఎండ్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్, నాజిల్ బకెట్ ఫ్లాంజ్ అనే క్లిష్టమైన బూస్టర్ భాగాలు పోవైలోని ఎల్అండ్టీ కర్మాగారంలో తయారయ్యాయి. ఇక్కడే వీటిని పరీక్షించారు. అలాగే కోయంబత్తూరులోని ఎల్అండ్టీ హై-టెక్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంలో గ్రౌండ్, ఫ్లైట్ అంబిలికల్ ప్లేట్లు తయ్యారయ్యాయి. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్లో కూడా ఎల్అండ్టీ పాత్ర ఉంది. మిదాని నుంచి లోహ మిశ్రమాలు మిశ్ర ధాతు నిగమ్ విషయానికొస్తే కోబాల్ట్ చంద్రయాన్-3 మిషన్కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలు, ప్రత్యేకమైన ఉక్కు, ఇతర క్లిష్టమైన పదార్థాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడంలో కంపెనీ పాత్ర పోషించింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఇస్రో జరిపే ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్తోపాటు ఇతర మార్గదర్శక కార్యక్రమాలకు కూడా కీలక సహకారం అందించనుంది. బ్యాటరీలు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ చంద్రయాన్-3కి సంబంధించిన బ్యాటరీలను బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. బీహెచ్ఈఎల్కు చెందిన వెల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (WRI) చంద్రయాన్-3 కోసం బై-మెటాలిక్ అడాప్టర్లు తయారీ చేసింది. మీడియా నివేదిక ప్రకారం.. ఎల్వీఎం3 ఎం4 ఫ్లైట్ చంద్రయాన్-3 క్రయోజెనిక్ దశలో ఉపయోగించిన భాగాలను తయారు చేసింది ఈ సంస్థే. చంద్రయాన్-3 మిషన్ విజయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా పాత్ర పోషించింది. గతేడాది హిందుస్థాన్ ఏరోనాటిక్స్- ఎల్అండ్టీ కన్సార్టియం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుంచి ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్లను తయారు చేయడానికి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL)కి అనేక భాగాలు అందించడం ద్వారా చంద్రయాన్-3 మిషన్కు కీలకమైన సహాయాన్ని అందించినట్లు ఒక మీడియా రిపోర్ట్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో ఉపయోగించిన క్లిష్టమైన S200 బూస్టర్ విభాగాలను వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ చిరాగ్ దోష్ను ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ ట్యాంకేజీలు, S200 ఫ్లెక్స్ నాజిల్ వంటి ఇతర సబ్సిస్టమ్లు కూడా ఈ సంస్థ ఉత్పత్తేనని వివరించింది. ఇక బాలానగర్లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ చంద్రయాన్-3కి సంబంధించిన కీలక భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది. -
Chandrayaan -3: ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాక్ మాజీ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే దృశ్యాలను పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని అక్కడి మీడియాను కోరారు. శభాష్ ఇండియా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ శాస్త్రవేత్తలను, అంతరిక్ష సంఘాన్ని అభినందించి చంద్రయాన్-3 మనుష్యజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఫవాద్ చౌదరి తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో అరుదైన ఘనతను సాధించనున్న భారతదేశాన్ని, భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే అద్భుత దృశ్యాలను పాకిస్తాన్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోరారు. Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations — Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 నాడు విమర్శించిన వారే.. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత భారత దేశాన్ని, భారత శాస్త్రవేత్తలను ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాలని హితవు కూడా పలికారు. కానీ నేడు ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని అరుదైన ఘనతను భారతదేశం సాధిస్తుండతమ్.. విమర్శకులకు కూడా కళ్ళు తెరిపించింది. విమర్శకుల ప్రశంస కంటే గొప్ప గెలుపు మరొకటుండదు అనడానికి ఇదే నిదర్శనం. Dear Endia; instead of wasting money on insane missions as of Chandrayyan or sending idiots like #abhinandan for tea to across LoC concentrate on poverty within, your approach on #Kashmir ll be another Chandrayyan just price tag ll be far bigger. — Ch Fawad Hussain (@fawadchaudhry) September 7, 2019 Surprised on Indian trolls reaction, they are abusing me as I was the one who failed their moon mission, bhai hum ne kaha tha 900 crore lagao in nalaiqoon per? Ab sabr kero aur sonah ki koshish kero #IndiaFailed — Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019 ప్రపంచ దేశాలు సైతం.. చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత ఉక్కుసంకల్పానికి చంద్రయాన్-3 ఒక తార్కాణం. చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత భారత దేశం పట్టువిడవకుండా వెనువెంటనే చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టింది. మధ్యలో కోవిడ్ -19 కారణంగా కొంత కాలయాపన జరిగినా చివరకు ఈరోజు ఆ అపురూప ఘట్టాన్ని సాక్షాత్కరించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చంద్రయాన్-3 ఘనవిజయాన్ని చూడాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్పోర్టులు మూసివేత -
Chandrayaan -3: ఇదంతా నెహ్రూ ఘనతే: చత్తీస్గఢ్ సీఎం
రాయ్పూర్: మరికొద్ది గంటల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపనున్న నేపధ్యంలో చత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయమని ఈ ఘనత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూదేనని వ్యాఖ్యానించారు. భారతదేశం చంద్రయాన్-3 విజయవంతమవుతున్న వేళ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఇది గొప్ప విజయమని చెబుతూ ఈ ఘనత మొత్తం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుందని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1962లో నెహ్రూ హయాంలోనే స్థాపించబడిందని అప్పట్లో దీనిని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)గా పిలిచేవారని అన్నారు. ఆయన ముందుచూపుతో వ్యవహరించబట్టే ఈరోజు ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. మరికొద్ది గంటల్లో యావత్ భారతదేశం గర్వించదగ్గ క్షణాలు ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోనుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిని చేరుకోగా భారతదేశం ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలవనుంది. #WATCH | On Chandrayaan-3, Chhattisgarh CM Bhupesh Baghel says, "It's a big achievement for the country and the hard work of our scientists. 'Jo Aadharshila (foundation stone) Nehru Ji ne rakha, aaj world mein danka baja raha hai'. Best wishes to our scientists." (22.08) pic.twitter.com/KrGMuAJ29U — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 22, 2023 ఇది కూడా చదవండి: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చంద్రయాన్–3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడే -
Chandrayaan 3: చంద్రయాన్ -3 ల్యాండింగ్.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ (ఫొటోలు)
-
చంద్రయాన్-3 ల్యాండింగ్: ఏపీ ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు
సాక్షి, విజయవాడ: నేడు చంద్రయాన్-3 ల్యాండింగ్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు పాఠశాలల్లో వీక్షించే ఏర్పాట్లు చేయాలని జిల్లాల డీఈవోలకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్యాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాటు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ నేడు(బుధవారం) చంద్రుడిపై అడుగుపెట్టనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ పాదమోపనుంది. 11 నిమిషాల పాటు రఫ్ బ్రేకింగ్ దశ కొనసాగనుంది. ల్యాండింగ్ కోసం ల్యాండర్ స్వయంగా అన్వేషించనుంది. అన్నీ అనుకూలిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండింగ్ కానుంది. సాయంత్రం 5.20 గంటల నుంచి ఇస్రో లైవ్ ఇవ్వనుంది. ల్యాండర్ సేఫ్గా దిగితే.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని గడించనుంది. ఈ కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే ఉండటంతో భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చదవండి: చంద్రయాన్–3 ల్యాండింగ్ లైవ్ అప్డేట్స్ -
చంద్రయాన్–3: షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
LIVE UPDATES: ►చంద్రయాన్-2 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. ►సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ►సాయంత్రం 6.04 గంటలకే ల్యాండర్ చంద్రుడిని తాకనుంది. ►విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం: ఇస్రో చైర్మన్ సోమనాథ్ ► ఆ 19 నిమిషాలు మాకు టెర్రరే. ►సాయంత్రం 5.47 గంటల తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుపోతుంది. ►అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్ అయ్యేలా ప్రొపల్షన్ సిస్టమ్ను రూపొందించాం: ఇస్రో చీఫ్ సోమనాథ్ ►ఆ దశలో ల్యాండర్ ఎవరి మాట వినదు. ►2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్ అయ్యేలా ప్లాన్. ►అల్గోరిథమ్స్ బాగా పనిచేస్తే చాలు ►వర్టికల్ ల్యాండింగ్ అత్యంత కీలకం ►గంటకు 7.2 కిమీ. మీ-10.8 కి,మీ స్పీడుతో నేడు ల్యాండిగ్ ►ల్యాండర్ 12 డిగ్రీల ఒరిగినా సేఫ్ ల్యాండింగ్కు ప్లాన్ ►నేటి ల్యాండింగ్లో పూర్తిగా కంప్యూర్లదే పాత్ర ►చంద్రయాన్- నేటి ల్యాండింగ్లో ఇస్రో శాస్త్రవేత్తలది కేవలం పరిశీలక పాత్రే ►నేడు చివరి 15న నిమిషాలు పూర్తిగా కంప్యూటర్ గైడెడ్ ►2019లో చంద్రయాన్-2 ల్యాండర్ నిలువుగా దిగకపోవడం వల్లే కూలింది ►నేడు అది జరగకూడదని సర్వ జాగ్రత్తలు ►చంద్రుడిపై ఐస్ ఉన్నట్లుందని 2009లో చెప్పిన చంద్రయాన్1 నాసా పరికరం ►చంద్రుడిపై సముద్రాలు ఉన్నట్లయితే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే వీలు ►చంద్రుడిపై ఇప్పటి దాకా ల్యాండ్ అయిన రోవర్లు: అమెరికా, చైనా, రష్యా ►చంద్రయాన్-3 పరిశోధనల వైపు ప్రపంచం మొత్తం చూపు ►చంద్రయాన్-3 ల్యాండింగ్ సౌతాఫ్రికా నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా వీక్షించనున్నారు. ►మరొకన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ►ఇవాళ జిబిల్లాపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ►సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగుపెట్టనున్న విక్రమ్ ల్యాండర్ ►సాఫ్ట్ ల్యాండింగ్పై ఇస్రోశాస్త్రవేత్తల ధీమా ►ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలు ►విజయవంతం కావాలని పూజలు, హోమాలు ►చంద్రయాన్ 3 రూపకల్పనలో గద్వాల జిల్లా యువకుడు కృష్ణా ►చంద్రయాన్-3 మిషన్లో 2 పేలోడ్స్(AHVC). (ILSA)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాసిన ఉండవల్లికి చెందిన కృష్ణ ►ప్రపంచ దేశాల చూపు చంద్రయాన్వైపే ►రష్యా లూనా-25 విఫలం కావడంతో చంద్రయాన్పై ఇతర దేశాల ఆసక్తి ►ప్రయోగం సక్సెస్ అయితే దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ►గత నెల 14న చంద్రయాన్ 3 ప్రయోగం ►41 రోజుల పాటు ప్రయాణం చేసిన చంద్రయాన్ ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సురక్షితంగా దించడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని బుధవారం సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ల్యాండర్ మాడ్యూల్ చందమామను చేరుకొనే అద్భుత దృశ్యాల కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘జయహో భారత్.. జయహో ఇస్రో’ అంటూ సోషల్ మీడియాలో యువత నినాదాల హోరు ఇప్పటికే మొదలయ్యింది. ప్రపంచ దేశాలు చంద్రయాన్–3 ప్రయోగంపై ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. –సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) ►70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోల చిత్రీకరణ ల్యాండర్ మాడ్యూల్లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్పీడీసీ) కేవలం 70 కిలోమీటర్ల ఎత్తునుంచి చంద్రుడి ఉపరితలాన్ని ఈ నెల 19న చిత్రీకరించింది.ఈ ఫొటోలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. ►ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. ►చంద్రయాన్–3లో ఇప్పటిదాకా చేపట్టిన ప్రతి ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పటిదాకా ప్రతి ఆపరేషన్ విజయవంతం ►భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి గత నెల 14న చంద్రయాన్–3 మిషన్ను ప్రయోగించింది. ►41 రోజుల ప్రయాణంలో ఐదుసార్లు భూమధ్యంతర కక్ష్యలో, మరో ఐదుసార్లు లూనార్ ఆర్బిట్(చంద్రుడి కక్ష్య)లో చంద్రయాన్–3 మిషన్ కక్ష్య దూరాన్ని పెంచుతూ వచ్చారు. ...ఇక మిగిలింది ల్యాండర్ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడమే. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ ఇలా.. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం నుంచి 25గీ134 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ మాడ్యూల్ను సెకన్కు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా దించనున్నారు. ఇందులో ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. దీన్ని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని అభివర్ణిస్తున్నారంతే ఇదెంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ 17 నిమిషాల్లోనే ల్యాండర్ తనలోని ఇంజిన్లను తానే మండించుకుంటుంది. సరైన సమయంలో ఇంజిన్లను మండించడం, సరైన పరిమాణంలో ఇంధనాన్ని వాడుకోవడం చాలా కీలకం. ల్యాండర్ మాడ్యూల్లో నాలుగు థ్రస్టర్ ఇంజిన్లు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీటిని మండించడం ప్రారంభమవుతుంది. దాంతో ల్యాండర్ వేగం క్రమంగా తగ్గిపోతుంది. తనలోని సైంటిఫిక్ పరికరాలతో ల్యాండింగ్ సైట్ను ల్యాండర్ మాడ్యూల్ గుర్తిస్తుంది. అడ్డంకులు ఏవైనా ఉంటే గుర్తిస్తుంది. ల్యాండింగ్ సైట్ చదునుగా ఉంటే బుధవారం ల్యాండింగ్ అవుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం లేకపోలేదు. వాయిదా పడితే ఈ నెల 27న సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ చెప్పారు. పరిస్థితులన్నీ అనూకూలించి, సాంకేతికపరంగా సహకారం అందితే సురక్షితంగా ల్యాండింగ్ అవుతుంది. ల్యాండర్ మాడ్యూల్ను నిరంతరం క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని ఇస్రో మంగళవారం వెల్లడించింది. ల్యాండింగ్కు రెండు గంటల ముందు అవసరమైన కమాండ్లను ల్యాండర్లో ఇస్రో అప్లోడ్ చేస్తుంది. -
చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనున్న విక్రమ్ ల్యాండర్
చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. కోటిపూలు తేవే.. అని పాడుతూ.. ఆకాశంలోని చందమామను చూపిస్తూ.. ప్రతి అమ్మా తన బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది. జాబిలితో చెప్పనా.. అంటూ ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఉద్దేశిస్తూ డ్యూయెట్ పాడతాడు.. మామా.. చందమామా.. వినరావా నా కథ.. అంటూ ఒంటరిగా తన గుండెను చందమామ ముందు ఆవిష్కరిస్తూంటాడు ఓ భావుకుడు.. (డెస్క్–రాజమహేంద్రవరం): ఎవరెన్ని విధాలుగా చెప్పినా అందరికీ చందమామ ప్రియమైనదే. జాబిల్లిని చూడగానే గుండె నిండా తెలియని ఆనందం, అనుభూతి కలుగుతాయి. ఆకాశంలో ఉంటూ.. వెన్నెల కురిపిస్తూ.. అందరి మనసుల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ చందమామ ఎవరు.. ఏమా కథ.. అక్కడెవరున్నారు.. గ్రహాంతవాసులున్నారా.. అక్కడ కూడా ఆకాశం ఉంటుందా.. గాలి.. నీరు ఉంటాయా.. ఉంటే మనం ఇల్లు కట్టుకోవచ్చా.. ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. సామాన్యులనే కాదు మన ఇస్రో శాస్త్రవేత్తల మదిని కూడా ఇలాంటి ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అందుకే చందమామ విశేషాల గుట్టును విప్పేందుకు వారందరూ అహరహం శ్రమించారు. దాని ఫలితమే చంద్రయాన్–3. అన్నీ సజావుగా సాగితే బుధవారం సాయంత్రం ఈ వ్యోమనౌక ఓ ఖగోళ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. అంతరిక్ష రంగంలో మన దేశాన్ని ముందు వరుసలో నిలపనుంది. ఆ క్షణాల కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజానీకం ఒళ్లంతా కళ్లు చేసుకుని కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. చంద్రుడి విశేషాలు ► మన కాలమానం ప్రకారం చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 రోజులు పడుతుంది. చంద్రుడిపై ఒక్క రోజు భూమిపై దాదాపు ఒక నెలకు సమానం. ► చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి – చంద్రుడు – సూర్యుడి మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చాంద్రమాసం అంటారు. ► చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికీ ఒకే సమయం పడుతుంది. దీనివల్ల భూమిపై ఉన్న వారికి చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. చంద్రుడి ఆవలి వైపు ఎప్పటికీ కనబడదు. దీనిని టైడల్ లాకింగ్ అంటారు. ► చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాదముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ► చంద్రుడి సాంద్రత భూమి సాంద్రతలో 1/6వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు. ► చంద్రుడి గరిష్ట ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత –173 డిగ్రీల సెల్సియస్. ► 1959 సెప్టెంబర్ 14న రష్యా పంపిన లూనా – 2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది. ► ఇప్పటి దాకా వ్యోమగాములు 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు. అందరూ ఆసక్తిగా.. చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపాలనే మన దేశం కలలు నెరవేరే క్షణాలు సమీపిస్తున్నాయి. చంద్రుని విశేషాలను ఆవిష్కరించే అరుదైన ఘట్టం చేరువవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత నెల 14న శ్రీహరికోటలో చేపట్టిన చంద్రయాన్–3 రాకెట్ ప్రయోగంలో రెండు దశలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. మూడో దశలో భాగంగా చంద్రయాన్–3 లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా ల్యాండ్ అయ్యే ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు జిల్లా యావత్తూ ఉత్కంఠతో నిరీక్షిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుడిపై రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినా దక్షిణ ధ్రువానికి చేరుకోలేదు. రష్యాకు చెందిన లూనార్–25ను ప్రయోగించినా చివరి దశలో విఫలమైంది. అన్నీ అనుకూలిస్తే నేటి సాయంత్రం 6.04 గంటలకు చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇదే కనుక జరిగితే ప్రపంచంలోనే దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోనుంది. -
TS: ‘చంద్రయాన్’పై విద్యాశాఖ ఆదేశాలు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో బుధవారం పాఠశాలల టైమింగ్ విషయంలో జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. రేపు చంద్రయాన్ టెలికాస్ట్ కోసమని పాఠశాల ని 6.30 గం. ల వరకు నడపవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే.. రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రొజెక్టర్/కె యాన్/టీవీ ల ద్వారా చూపెట్టాలని.. మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీ లో గాని మొబైల్ లో గాని చూడమని అవగాహన కల్పించాలని తెలిపింది. ఒకవేళ రేపు సాయంత్రం చూడని పక్షంలో తర్వాతి రోజు పాఠశాల సమయంలో విద్యార్థుల కు పాఠశాల లో చూపించాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం కోసమని విద్యార్థులను బడి బయటకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసిన విద్యాశాఖ.. చంద్రయాన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 3 లాండింగ్ నేపథ్యంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు టీ సాట్, టీ సాట్ నిపుణ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించేందుకు ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. -
చంద్రుడిపై అడుగు.. నమ్మరేంట్రా బాబూ!
అదొక అత్యంత అద్భుతమైన ఘట్టం. 1969 జులై 20వ తేదీన.. ‘ఈగిల్’ లునార్ మాడ్యుల్ నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొట్టమొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ రెండో వ్యక్తిగా అడుగుపెట్టగా.. ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను పాతి చరిత్రకెక్కారు. చందమామ కలను మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. అయితే ఆ ఘనత నిజమేనా అనుమానాలు తరచూ వ్యక్తం అవుతుంటాయి.. అందుకు కారణాలు లేకపోలేదు. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. లునార్ మాడ్యుల్ ‘ఈగిల్’ కమాండర్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ ‘కొలంబియా’ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. అంతరిక్షంలో సుమారు రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. జులై 19వ తేదీ.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా! ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. చుక్కలు కనపడాలి కదా! బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్ష్యాలు.. అన్నింటికి మించి సుమారు 24 బిలియన్ల డాలర్ల ఖర్చుతో రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. చంద్రయాన్-3 నేపథ్యంలో సాక్షి వెబ్డెస్క్ ప్రత్యేకం -
చంద్రయాన్ 3.. 'టెర్రర్ టైం' గురించి తెలుసా?
చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై ఇస్రో ల్యాండర్ అడుగుపెట్టే క్షణం కోసం భారత్తో పాటు యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3 అడుగు దూరంలోనే ల్యాండింగ్ కోసం వేచి ఉంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపురూప ఘట్టం ఆవిషృతమౌతుందని ఇస్రో వర్గాలు ఇప్పటికే తెలిపారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో సఫలమైతే భారత్ అజేయంగా నిలుస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం మాడ్యూల్లోని సాంకేతికతను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో దిగడానికి సూర్యదయం కాగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 5.45 తర్వాత అసలైన ప్రక్రియ ప్రారంభమైతుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి '20 మినెట్ టెర్రర్'గా అభివర్ణించారు. Chandrayaan-3 Mission: The mission is on schedule. Systems are undergoing regular checks. Smooth sailing is continuing. The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement! The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY — ISRO (@isro) August 22, 2023 చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నిమిషాలు కీలకం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత 11 నిమిషాల పాటు రన్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా ఉంటుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. అక్కడ ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. ఈ దశలోనే గతంలో చంద్రయాన్ 2 కూలిపోయింది. ఈ దశల అనంతరం చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం సున్నాకు చేరుతుంది. చివరకు 150 మీటర్లకు చేరుకోగానే సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. సరైన స్థలంలో సెకనుకు 3 మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల టెర్రర్ టైంకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత చంద్రునిపై ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఇదీ చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
నటుడు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్రాజ్పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ..
మన దేశమంతా ఆగస్టు 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేరోజు చంద్రయాన్-3 చంద్రుని ఉపరితంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 ఆర్థిక బడ్జెట్ 615 కోట్ల రూపాయలు(75 మిలియన్ డాలర్లు) 2023, జూలై 14న చంద్రయాన్-3 లాంచ్ బటన్ను నొక్కారు. అప్పటి నుండి చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపైకి ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని భారతదేశమంతా ఎదురుచూస్తోంది. పలువురు నెటిజన్లు చంద్రయాన్-3 బడ్జెట్ను కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్తో పోలుస్తున్నారు. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్ దాదాపు రూ.1970 కోట్లు. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లర్కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చుకాగా, చంద్రయాన్ 75 మిలియన్ డాలర్లతోనే విజయం సాధించిందని అంటున్నారు. రూ. 615 కోట్లు అంటే భారత్కు భారీ మొత్తమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం అని కొందరు, వారి నాలుగేళ్ల శ్రమ వృథాగా పోలేదని మరికొందరు అంటున్నారు. శాస్త్రవేత్తల కృషికి సెల్యూట్ అని, శాస్త్రపరిశోధనలకు భారతదేశం మరింతగా ఖర్చు చేయాలని యూజర్లు సలహా ఇస్తున్నారు. కొందరు యూజర్లు చంద్రయాన్-3 ప్రాజెక్టును సినిమాల నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని అన్నారు. భారతీయులు వ్యయ నియంత్రణతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, చంద్రయాన్ ప్రయోగం ప్రతీ భారతీయునికి గర్వకారణమని మరికొందరు అంటున్నారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. Kinda crazy when you realize India's budget for Chandrayaan-3 ($75M) is less than the film Interstellar ($165M)😯🚀 #Chandrayaan3 #moonlanding pic.twitter.com/r2ejJWbKwJ — Newsthink (@Newsthink) August 21, 2023 -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్పుట్స్గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్వాలా గురించి అనుకున్నారో? -
మీరు ఏ చాయ్వాలా గురించి అనుకున్నారో?
న్యూఢిల్లీ: భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3పై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోలేదు సరికదా దానిని సమర్ధించుకున్నాడు. ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. జులై 14న భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్)లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోకపోగా తాను పోస్ట్ చేసిన దానిని సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. చంద్రయాన్-3 పార్టీలకతీతంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన ప్రయోగమని.. ఎవ్వరైనా ఆ వ్యత్యాసాన్ని గ్రహించి ప్రవర్తించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
రేపే చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ల్యాండర్ కీలక ఘట్టానికి సమయం సమీపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బుధవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ ‘విక్రమ్’ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. సాయంత్రం 5.20 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ల్యాండర్ క్షేమంగా చంద్రుడిపై దిగితే కేవలం భారతీయులకే కాదు, ప్రపంచానికి కూడా అదొక చిరస్మరణీయ ఘట్టమే అవుతుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. అంతేకాదు చంద్రుడిపై భద్రంగా దిగిన నాలుగో దేశంగా రికార్డు సృష్టిస్తుంది. చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ ఇప్పటికే అక్కడ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్–2 ఆర్బిటార్తో కమ్యూనికేషన్ ఏర్పర్చుకుందని ఇస్రో సైంటిస్టులు సోమవారం వెల్లడించారు. రెండూ పరస్పరం సంభాíÙంచుకుంటున్నాయని తెలిపారు. ‘వెల్కమ్, బడ్డీ!’ అంటూ ల్యాండర్ మాడ్యూల్కు ఆర్బిటార్ స్వాగతం పలకిందని చెప్పారు. ఆర్బిటార్తో అనుసంధానం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని, ఇప్పటికైతే ఎలాంటి అవరోధాలు కనిపించడంలేదని వెల్లడించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఢిల్లీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్తో సమావేశమయ్యారు. ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులను ఆయనకు వివరించారు. ఈ మొత్తం ప్రయోగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలూ బాగా పని చేస్తున్నాయని తెలిపారు. లేదంటే 27వ తేదీన ల్యాండింగ్? సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ల్యాండింగ్ విషయంలో ఇస్రో కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చందమామకు అత్యంత సమీపానికి చేరుకుంది. ఇక ల్యాండింగే తరువాయి. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ల్యాండింగ్కు రెండు గంటల ముందు ల్యాండర్లో ఉన్న సైంటిఫిక్ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని మరోమారు క్షుణ్నంగా సమీక్షిస్తామని ఇస్రో ప్రకటించింది. పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటేనే ల్యాండ్ చేస్తామని వెల్లడించింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ఇస్రో అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. చంద్రయాన్–2, రష్యా లూనా–25 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్–3 విషయంలో సైంటిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దక్షిణ ధ్రువం చిత్రాలు విడుదల ల్యాండర్ మాడ్యూల్లోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా(ఎల్హెచ్డీఏసీ) చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ క్షేమంగా కాలు మోపడానికి ఈ కెమెరా తోడ్పడనుంది. రాళ్లు, గుంతలను ఫొటో తీసి, అవి లేని చోట ల్యాండర్ దిగడానికి అనువైన ప్రదేశాన్ని ఈ కెమెరా గుర్తిస్తుంది. ప్రకాశ్రాజ్ పోస్టుపై రగడ ముంబై: చంద్రయాన్–3 ప్రయోగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సినీ నటుడు ప్రకాశ్రాజ్ ‘ఎక్స్’లో ఆదివారం చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. చొక్కా లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ వడబోస్తున్న కార్టూన్ చిత్రాన్ని ప్రకాశ్రాజ్ పోస్టు చేశారు. కన్నడ భాషలో దీనికి వ్యాఖ్యను కూడా జతచేశారు. ‘‘ఇప్పుడే అందినవార్త. చంద్రయాన్ నుంచి మొదటి చిత్రం ఇప్పుడే వచి్చంది’’ అని పేర్కొన్నారు. అయితే, అందులో టీ వడబోస్తున్న చాయ్వాలా ఎవరన్నది ప్రకాశ్రాజ్ బయటపెట్టలేదు. ఇస్రో మాజీ చైర్మన్ కె.శివన్ను ఎద్దేవా చేస్తూ ఈ పోస్టు పెట్టారని ప్రకాశ్రాజ్పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని పోస్టు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రుడికి అవతల.. అరుదైన ఫొటోలు
బెంగళూరు: చంద్రుడిపైకి ఇస్రోవారి విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టే క్షణాల కోసం యావత్ భారత్ మాత్రమే కాదు.. రష్యా 47 ఏళ్ల తర్వాతి ప్రయోగం విఫలం కావడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చంద్రయాన్-3 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సున్నితంగా ల్యాండ్ అయ్యేందుకు అనువైన ప్రదేశం కోసం ల్యాండర్ అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. చంద్రుడిపై దక్షిణ ధ్రువ ప్రాంతం.. అదీ భూమికి మునుపెన్నడూ కనిపించని ప్రాంతాలను తన కెమెరాతో బంధిస్తోంది. సాధారణంగా.. చంద్రుడు మనకు ఒకవైపే కనిపిస్తాడు. అయితే.. అవతలివైపు విక్రమ్ ల్యాండర్ తీస్తున్న ఫొటోల్లో.. ఉపరితంపై అనేక బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 19వ తేదీనే ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం.. 23వ తేదీ సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కావాల్సి ఉంది. ఒకవేళ చంద్రయాన్-3 గనుక సక్సెస్ అయితే.. సోవియట్ యూనియన్(పూర్వపు రష్యా), అమెరికా, చైనా సరసన భారత్ నిలవనుంది. Chandrayaan-3 Mission: Here are the images of Lunar far side area captured by the Lander Hazard Detection and Avoidance Camera (LHDAC). This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB — ISRO (@isro) August 21, 2023