సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్‌ | Krishna district police have arrested four accused | Sakshi
Sakshi News home page

సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్‌

Published Sun, Mar 23 2025 5:47 AM | Last Updated on Sun, Mar 23 2025 5:47 AM

Krishna district police have arrested four accused

ఇప్పటికే నలుగురి అరెస్ట్‌ 

ఇటీవల కృష్ణా జిల్లాలో మైనర్‌పై అకృత్యం

గన్నవరం : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏఎస్పీ వీవీ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక(14) సన్నిహితులతో కలిసి ఇటీవల కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెం జాతరకు వచ్చి.. సామూహిక అత్యాచారానికి గురైంది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను స్వగ్రామం తీసుకెళతామని నమ్మబలికిన వీరపనేనిగూడేనికి చెందిన ఇద్దరు మైనర్లు ముందుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మైనర్లు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామానికి చెందిన బాణావత్‌ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్‌ అక్కడికి వెళ్లి బాలికపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆ బాలికను కేసరపల్లిలోని కొండేటి అనిల్‌ సహకారంతో అతని ఇంట్లో నిర్బంధించారు. 

అక్కడ జితేంద్ర, హర్షవర్ధన్‌లతో పాటు వారి స్నేహితులైన పర­సా సంజయ్, ఉయ్యూరు నవీన్‌కుమార్, పరసా రాజేష్ ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే జితేంద్ర, హర్షవర్ధన్‌తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా అరెస్ట్‌ చేసిన అనిల్, సంజయ్, నవీన్‌కుమార్, రాజేష్ లను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement