బెంగాల్‌ వైపు మళ్లిన అల్పపీడనం | Moderate rains Costal Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ వైపు మళ్లిన అల్పపీడనం

Published Wed, Sep 21 2022 4:24 AM | Last Updated on Wed, Sep 21 2022 4:24 AM

Moderate rains Costal Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు మళ్లింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా పయనించనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌ వైపు మళ్లడంతో మంగళవారం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement