బాబు డైరెక్షన్‌లోనే పీకే వ్యాఖ్యలు! | Prashant Kishore comments in direction of Chandrababu | Sakshi

బాబు డైరెక్షన్‌లోనే పీకే వ్యాఖ్యలు!

Mar 5 2024 6:25 AM | Updated on Mar 5 2024 9:11 AM

Prashant Kishore comments in direction of Chandrababu - Sakshi

శనివారం చంద్రబాబుతో మూడుగంటలు సమావేశం

బాబు చెప్పిన మేరకే ఆదివారం పీకే వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు

ఏ సర్వేలు చేయడంలేదంటూనే వైఎస్సార్‌సీపీపై విషం

బాబు మేలు కోరే ఇలా మాట్లాడారంటున్న విశ్లేషకులు

సోమవారమూ బాబుతో పీకే రెండున్నర గంటలపాటు భేటీ

ఆ భేటీ తర్వాతే అనంతపురం జిల్లా సభకు చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) ఆదివారం హైదరాబాద్‌లోని ఓ సదస్సులో ఏపీలో వైఎస్సార్‌సీపీపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రేరేపితమని బయటపడిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుగా సమావేశమై, ఆయన డైరెక్షన్‌లోనే ప్రశాంత్‌ కిషోర్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేటతెల్లమైంది. హైదరాబాద్‌ నగరంలోని ఖరీదైన హోటల్‌లో బస చేసి, గంటల తరబడి చంద్రబాబుతో భేటీలు జరుపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌.. బాబు వ్యూహంలో భాగంగానే వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఓ ఆంగ్ల పత్రిక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం మూడు గంటలపాటు చంద్రబాబుతో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమావేశంలో చంద్రబాబు కోరిన మేరకు ఆదివారం సదస్సులో ఏపీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను సర్వేలు చేయడంలేదని, ఏ రాజకీయ పార్టీకీ సలహాలు ఇవ్వడంలేదంటూనే, పీకే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వీరు వైసీపీపై ఇటువంటి విష ప్రచారాన్ని మరింతగా చేయాలని చంద్రబాబు, పీకే నిర్ణయించినట్లు చెబుతున్నారు.

సోమవారమూ బాబుతో పీకే భేటీ
సోమవారం ఉదయం కూడా ప్రశాంత్‌ కిషోర్‌ రెండున్నర గంటలపాటు చంద్రబాబుతో భేటీ అ­య్యా­రు. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ (ఒకప్పుడు పీకే టీంలో సభ్యుడు), లోకేశ్‌ సన్నిహితుడు కిలారి రాజేష్‌ కూడా ఈ సమావేశంలో పా­ల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశం ముగిసేవరకు సోమవారం ఉదయం చంద్రబాబు మరెవరికి అపాయింట్‌మెంట్‌ కూ­డా ఇవ్వలేదని తెలిసింది. పీకేతో భేటీ తర్వాతే చంద్రబాబు అనంతపురం జిల్లాలో టీడీపీ సమావేశానికి వెళ్లారని సమాచారం. సోమవారం సాయంత్రం ప్రశాంత్‌ కిషోర్‌ పాట్నా వెళ్లినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement