వర్షాల బాధితులను ఉదారంగా ఆదుకోండి: వైఎస్‌ జగన్‌ | Provide Generous Aid To Rain Affected Families Says Jagan: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వర్షాల బాధితులను ఉదారంగా ఆదుకోండి: వైఎస్‌ జగన్‌

Published Sun, Sep 1 2024 5:04 AM | Last Updated on Sun, Sep 1 2024 5:08 AM

Provide Generous Aid To Rain Affected Families Says Jagan: Andhra pradesh

రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

భారీ వర్షాల వల్ల జరిగిన ప్రమాద ఘటనలపై దిగ్భ్రాంతి     

మృతుల కుటుంబాలకు సంతాపం 

బాధితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జరిగిన ఘట­నల్లో పలువురు మరణించడంపై వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ­వాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మర­ణించడంతో పాటు గుంటూరు జిల్లా ఉప్పల­పాడులో వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకు­పోయిన ఘటనలో టీచర్‌ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందడంపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియ­జేశారు. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపో­యిందని, విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులకు అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement