బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు | Sidiri Appalaraju Taken Charge As Minister | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన మంత్రి సీదిరి అప్పలరాజు

Jul 26 2020 12:11 PM | Updated on Jul 26 2020 12:19 PM

Sidiri Appalaraju Taken Charge As Minister - Sakshi

సాక్షి, అమరావతి : మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు తులిపారు. ఆయన ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఆక్వా కల్చర్‌ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో.. ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.  (వైఎస్‌ జగన్‌ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు)



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement