Amul Dairy
-
‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!
ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్ కంపెనీ ఎల్అండ్టీ (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ, ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.అమూల్ ఏమంది?ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్ను షేర్ చేసింది! డూడుల్లోని టెక్స్ట్ బోల్డ్లో L & T లెటర్స్తో ((Labour & Toil) "శ్రమ అండ్ కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.#Amul Topical: Controversy about the 90 hour work week! pic.twitter.com/VQlwoLoTx8— Amul.coop (@Amul_Coop) January 14, 2025కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్ కంపెనీబాగా ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు, అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై కూడా స్పందించడం విశేషం. గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట సందడి చేశాయి కూడా. Dedicated to the L&T Chairman who wants a 90 hour work week pic.twitter.com/QtPtLjh2ej— Prashant Bhushan (@pbhushan1) January 13, 2025బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్పీసీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.బండ చాకిరీ : మన దేశంమరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది. అదనపు పని విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం. -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష
సాక్షి, అమరావతి: పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర పొందుతున్న రైతుల పొట్టకొడుతోంది. పాలు సేకరించే క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉపసంహరించడంతో పాటు అమూల్కు సహాయ నిరాకరణ చేస్తూ ప్రైవేటు డెయిరీల దోపిడికీ తెర తీస్తోంది. ముఖ్యంగా సొంత డెయిరీకి మేలు చేయడమే లక్ష్యంగా రాయలసీమ జిల్లాల్లో అమూల్కు మోకాలడ్డుతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అమూల్ కూడా పాల సేకరణ నిలిపివేస్తోంది. తిరుపతిలో ఈ నెల 21 నుంచి, అనంతపురం జిల్లాలో 11వ తేదీ నుంచి పాల సేకరణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ సెప్టెంబర్ 1 నుంచి పాల సేకరణ నిలిపివేసేందుక చర్యలు చేపడుతోంది. బాబు చర్యలు రాష్ట్రంలోని లక్షలాది పాడి రైతులకు శరాఘాతంగా మారాయి. రాష్ట్రంలో పాడి రైతుల్లో అధిక శాతం మహిళలే. వారే ఇప్పుడు అమూల్ పాల సేకరణ కేంద్రాలు కొనసాగించాలంటూ ఆందోళన బాట పట్టారు. తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద వందలాది మహిళలు, రైతులు నిరసన వ్యక్తంచేశారు. అమూల్ రాకతో గడిచిన మూడేళ్లుగా లీటర్కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి పొందుతున్నామని, బ్యాంకుల నుంచి రకు రుణాలు తీసుకుని కొత్త పశువులను కొన్నామని రైతులు చెబుతున్నారు. అమూల్ కేంద్రాలు మూసివేస్తే, ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలు తగ్గించేస్తాయని, అప్పుడు తమ బతుకులు అంధకారంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పొమ్మనకుండా పొగబాబు కూటమి అధికార పగ్గాలు చేపట్టింది మొదలు అమూల్ విషయంలో పొమ్మనకండా పొగపెట్టాలా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కోసం జిల్లాకో డెయిరీ డెవలప్మెంట్ అధికారిని నియమించారు. గ్రామ సచివాలయాల్లోని డిజిటల్, వెల్ఫేర్, యానిమల్ అసిస్టెంట్స్ పర్యవేక్షణలో పాలసేకరణ జరిగే ప్రతి 15–20 గ్రామాలకో మెంటార్నూ, ప్రతి 3–4 సచివాలయాల పరిధిలో ఒక రూట్ ఇన్చార్జిని నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జేడీ, డీఆర్డీఎ పీడీ, జిల్లా సహకార శాఖాధికారులు పర్యవేక్షించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 4వ రోజూనే వీరందర్ని వెనక్కి పంపేసింది. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా బాధ్యతల నుంచి అమూల్ను తప్పించింది. అమూల్ ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని 8.3 శాతానికి పెంచడం, పాలసేకరణ ధరను రూ.4 వరకు తగ్గించడం ప్రభుత్వ ఒత్తిళ్ల ఫలితమేనని చెబుతున్నారు. 4,798 గ్రామాల్లో జరగాల్సిన పాల సేకరణ ఇప్పుడు 2 వేల గ్రామాలకు పరిమితమైంది. పాలుపోసే వారి సంఖ్య 1.20 లక్షల నుంచి 30వేల మందికి తగ్గిపోయింది. ఇప్పటికే పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు లీటర్కు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించేశాయి. అమూల్ పాలసేకరణ నిలిపివేస్తే, ఇక ప్రైవేటు డెయిరీలదే రాజ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రైవేటు డెయిరీల దోపిడికీ వైఎస్ జగన్ కళ్లెంప్రైవేటు డెయిరీల దోపిడికీ కళ్లెం వేసి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా సహకార డెయిరీలకు పూర్వ వైభవం తేవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహకార డెయిరీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న అమూల్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. ప్రతి పాడి రైతుకు లీటర్పై రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యమంలా విస్తరణ3 జిల్లలు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం)తో మొదలై 19 జిల్లాలకు జగనన్న పాల వెల్లువ విస్తరణ 401 గ్రామాలు, 24,277 మంది రైతులతో మొదలై నేడు 4,798 గ్రామాలు 4.50 లక్షల మంది రైతుల భాగస్వామ్యం రోజూ పాలు పోసే వారి సంఖ్య 800తో మొదలై 1.25 లక్షలకు చేరిక పాల సేకరణ రోజుకు సగటున 1,800 లీటర్ల నుంచి 3.75 లక్షల లీటర్లకు చేరిక అమూల్ ద్వారా 3.5 ఏళ్లలో 20 కోట్ల లీటర్ల పాలసేకరణ రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బు రూ.925 కోట్లు అందించిన ప్రయోజనాలు– 180 రోజులు పాలు పోసే వారికి లీటర్కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి– లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ– వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేలు సాయం– కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు సాయం– 9,899 గ్రామాల పరిధిలో ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనాతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఎఎంసీయూ) ఏర్పాటు– ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి శ్రీకారం– ఎఎంసీయూల్లో రూ.1.50 లక్షల, బీఎంసీయూల్లో రూ.15 లక్షల విలువైన పరికరాల ఏర్పాటు– అమూల్ ద్వారా మూతపడిన మదనపల్లి డెయిరీ పునరుద్ధరణ– చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్కు లీజుకు. ఇప్పటికే రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభంరైతులకు మరింత లబ్ధిఅమూల్ డెయిరీ 7 సార్లు పాలసేకరణ ధరలు పెంచడంతో 3.5 ఏళ్లలో లీటర్కు గేదెపాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్కు రూ.89.76, ఆవు పాలకు లీటర్కు రూ.43.69 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్తో పోటీపడి ప్రైవేటు డెయిరీలు కూడా పాల సేకరణ ధరలు పెంచాల్సివచ్చింది. దీంతో వాటికి పాలు పోసే రైతులకు రూ.5 వేల కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. అమూల్ సంస్త ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పక్కాగా లెక్క గట్టి అణాపైసలతో సహా చెల్లిస్తుండడంతో గరిష్టంగా గేదె పాలకు లీటర్కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పొందగలిగారు. పాలుపోసిన 10 రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ చేయడంతో పాడి రైతుల్లో అమూల్ పట్ల నమ్మకం పెరిగింది. పక్కాగా లెక్కగట్టి ఇచ్చేవారుప్రైవేటు డెయిరీలు 15 రోజులకోసారి పాల డబ్బులు చెల్లిస్తే అమూల్ 10 రోజులకే మా ఖాతాల్లో వేస్తోంది. పైగా ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి లీటర్కు రూ.32 నుంచి రూ.42 వరకు వరకు చెల్లిస్తున్నారు. ఇతర డెయిరీలు పాల శాతాన్ని కచ్చితంగా లెక్కించడంలేదు. రూ.25 నుంచి రూ.30 వరకు మాత్రమే ఇస్తున్నారు. 10 రోజుల్లో 35 లీటర్ల వరకు పాలు పోస్తాం. రూ.1500 వరకు జమవుతోంది. అమూల్ కేంద్రాలను కొనసాగించాల్సిందే..– వెంకటశివారెడ్డి, రంగన్నగారిగడ్డ, తిరుపతి జిల్లామూతపడితే మా బతుకులు అగమ్యగోచరంప్రైవేటు డెయిరీలు 15 రోజుల సరాసరి పాల శాతాన్ని గణించి రేటు నిర్ణయిస్తాయి. అమూల్ ఏ రోజుకారోజే పాల శాతాన్ని లెక్కిస్తుంది. దీంతో గిట్టుబాటు ధర వస్తోంది. పాడి కొనుగోలుకు అమూల్ రుణాలు కూడా ఇప్పించింది. ఇతర డెయిరీల్లో ఈ సౌకర్యం లేదు. 10 రోజుల్లో 30 లీటర్లు పాలు పోస్తా. రూ.1,400 వరకు జమవుతుంది. అమూల్ కేంద్రాలు మూతపడితే మా బతుకులు అగమ్య గోచరంగా మారతాయి.– స్వామిదాస్, తిరుపట్టం, తిరుపతి జిల్లాకలెక్టరేట్ల వద్ద రైతుల ఆందోళనఅనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్: అమూల్ పాల సేకరణ రద్దు చేస్తే పాడి రైతులు నష్టపోతారని, పాల వెల్లువ పథకాన్ని కొనసాగించాల్సిందేనంటూ మహిళా పాడి రైతులు అనంతపురం, తిరుపతి కలెక్టరేట్ల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారలకు వినతిపత్రాలు అందజేశారు. తిరుపతిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అమూల్ పాల సేకరణ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరికరాలతో పాల తూకం, వెన్న శాతం, ఎన్ఎన్ఎఫ్ శాతం ఆటోమేటిక్గా నమోదవుతూ ప్రతి రైతుకూ వారి ఖాతాల్లోకి పది రోజుల్లో కచ్చితంగా డబ్బు జమయ్యేదని రైతు సంఘం నేతలు చెప్పారు. అమూల్ ద్వారానే రైతులకు మేలు జరిగేదన్నారు. ఎంతో పారదర్శకంగా సాగుతున్న ఈ మొత్తం ప్రక్రియను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని మండిపడ్డారు. -
అమూల్ బేబీనే టాప్..!
క్యూట్గా ఉన్న చిన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నారు అంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి వెళ్లింది. గుజరాత్కు చెందిన కంపెనీయే అయినా తెలుగు రాష్ట్రాల్లోను దీని పాల ఉత్పత్తులకు మంచి పేరే ఉంది. ఈ కంపెనీని పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నంబర్వన్ కంపెనీగా మార్చాలని ప్రధాని మోదీ కంపెనీ వాటాదారులను విజ్ఞప్తి చేశారు. 'అమూల్' బ్రాండ్ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)ని ప్రస్తుతం ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రైతులు, సహకార సంఘాలకు సంబంధించిన ఇతర వాటాదారులకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్లోని మోతెరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సహకార సంఘాలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పదేళ్లలో భారతదేశ తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచ పాడి పరిశ్రమ 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. భారత డెయిరీ రంగం మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లుగా ఉందన్నారు. వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి ఉమ్మడి టర్నోవర్ కంటే చాలా అది చాలా ఎక్కువ అన్నారు. డెయిరీ రంగంలో సేవలందిస్తున్న మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. -
దేన్నీ వదలని ‘డీప్ఫేక్’ ముఠా..! ఫొటోలు వైరల్
ఓ ప్రముఖ నటి స్టెప్పులు వేసిన పాటకు మరో నటి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో మార్ఫ్ చేసి చూపిస్తే వావ్ అని అబ్బురపడతాం. ఓ 30-40 ఏళ్ల తర్వాత మనం ఎలా కనిపిస్తామో ముందే తెలుసుకోగలిగితే సూపర్ టెక్నాలజీ అని సంబరపడుతాం. అదే టెక్నాలజీ మన ముఖంతో మోసాలకు తెగబడితే.. పరువును బజారులో నిలబెడితే..! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రష్మిక విషయంలో జరిగిందిదే. డీప్నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వేరే అమ్మాయి వీడియోను మార్ఫింగ్ చేసి రష్మికలా రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా అమూల్ బ్రాండ్ పై కూడా డీప్ ఫేక్ మరక పడింది. అమూల్ సంస్థ జున్నును శరం పేరుతో మార్కెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఏఐ ద్వారా సృష్టించినవని.. అటువంటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది. శరం పేరుతో అమూల్ కొత్త రకం చీజ్ విడుదల చేసినట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానికి కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని అమూల్ సంస్థ తేల్చి చెప్పింది. వినియోగదారులు ఫేక్ న్యూస్, ఫేక్ ఫొటోలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు తెలిసింది. తమ బ్రాండ్ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి డీప్ ఫేక్ చిత్రాలను వైరల్ చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ఈ పోస్టుల ద్వారా తప్పుడు సమాచారం సృష్టించి వినియోగదారులను అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపింది. వైరల్ అవుతున్న ఫొటోలో అమూల్ లోగోతో లైట్ ఎల్లో కలర్ ప్యాకెట్, పెద్ద ఫాంట్లో శరం అనే పదాన్ని చిత్రీకరించారు. ఇదీ చదవండి: టోల్ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు అముల్ బ్రాండ్పై ఇలాంటి వైరల్ న్యూస్, ఫొటోలు వైరల్ కావడం కొత్తేమి కాదు. గతంలో అమూల్ లస్సీ ప్యాకెట్లో ఫంగస్ ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫేక్ అని కేవలం వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని సంస్థ కొట్టిపారేసింది. -
పునరుద్ధరణ దిశగా ప్రకాశం డెయిరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో సహకార డెయిరీ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు జూలై 4న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా ప్రకాశం డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నవంబర్లో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తోంది. అమూల్ రూ.400 కోట్ల పెట్టుబడి ప్రకాశం డెయిరీకి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 95.42 ఎకరాల భూములతోపాటు కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 13న టీడీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండియన్ కంపెనీస్ యాక్టు–1956 కింద పీడీసీఎంపీయూ లిమిటెడ్ పేరిట కంపెనీగా మార్చిన ఈ డెయిరీని ఆ తర్వాత దశల వారీగా నిర్వీర్యం చేశారు. ఈ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. డెయిరీకి చెందిన పాత బకాయిలు రూ.108.32 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా, ఇక్కడ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ సుముఖత వ్యక్తం చేసింది. పాల ఫ్యాక్టరీతో పాటు వెన్న తయారీ యూనిట్, నెయ్యి ప్లాంట్, మిల్క్ పౌడర్ ప్లాంట్, యూహెచ్టీ ప్లాంట్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. అప్పట్లో పథకం ప్రకారం నిర్వీర్యం సహకార డెయిరీ రంగాన్ని పథకం ప్రకారం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ సొసైటీలుగా.. ఆ తర్వాత కంపెనీలుగా మార్చుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద మార్చేశారు. 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కంకిపాడు మినీ డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీ ఇలా వరుసగా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పునరుద్ధరణను వేగవంతం చేసింది. ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 నుంచి దీనిని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చిన ప్రభుత్వం అమూల్ సహకారంతో పూర్వవైభవం తెచ్చేందుకు జూలై 4న సీఎం భూమి పూజ చేశారు. ఇక్కడ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్తో పాటు పాల కర్మాగారం, బటర్, పాల పొడి, చీజ్, పన్నీర్, యాగర్ట్ స్వీట్స్, యూహెచ్టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. 10 నెలల్లో లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది. -
‘పాడి’కి మేలి మలుపు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కరమూడి శైలజకు రెండు పాడి గేదెలున్నాయి. ఇది వరకు ప్రైవేట్ డెయిరీకి రోజూ పాలు పోసేది. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) శాతం ఎంత ఉన్నప్పటికీ లీటర్కు గరిష్టంగా రూ.80కి మించి చెల్లించే వారు కాదు. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజుకు 3 లీటర్ల పాలు పోస్తే ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 13 శాతం రావడంతో లీటర్కు రూ.103 చొప్పున చెల్లించారు. ఏకంగా లీటర్కు రూ.23 అదనంగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రోజుకు రూ.69 చొప్పున నెలకు రూ.2,100 వరకు అదనంగా ఆదాయం వస్తుండడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా వేమవరానికి చెందిన యాదాల వరలక్ష్మికి రెండు ఆవులున్నాయి. ప్రైవేటు కేంద్రానికి ప్రతీ రోజూ పాలు పోసేది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా.. లీటర్కు గరిష్టంగా రూ.35కు మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇటీవలే ప్రారంభించిన జగనన్న పాల కేంద్రంలో ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 6.6 శాతంతో తొలి రోజు 2.58 లీటర్ల పాలు పోస్తే లీటర్కు రూ.53.86 చొప్పున రూ.138.96 వచ్చింది. ఈమె రెండు పూటలా పాలు పోస్తోంది. ఈ లెక్కన రోజుకు 5 లీటర్లు పోస్తే.. రోజుకు అదనంగా రూ.94.30 చొప్పన నెలకు రూ.2,829 అదనపు ఆదాయం వస్తోందని ఆమె ఆనందంతో చెబుతోంది. ‘అన్నా.. ఇది పాల బాటిల్.. నీళ్ల బాటిల్ కంటే తక్కువ ఖరీదు.. నీళ్ల కంటే పాలే చవకగా దొరుకుతున్నాయి. ఇలాగైతే ఎలా బతికేదన్నా.. అని పాడి రైతులు నాతో చెప్పుకుని బాధపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తాం’ అని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆ మాట మేరకు అక్షరాలా పరిస్థితిని మార్చేశారనేందుకు ఇప్పుడు ఊరూరా కళకళలాడుతున్న జేపీవీ కేంద్రాలే నిదర్శనం. పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులు నేడు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం కింద పాలు పోస్తూ కోట్లాది రూపాయలు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు, దళారీలు వారిస్తున్నా, ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. తాము మాత్రం జగనన్న కేంద్రంలోనే పాలు పోస్తామంటూ ముందుకొస్తున్నారు. పాలవెల్లువ పథకం ఇటీవలే ప్రారంభమైన కాకినాడ జిల్లానే తీసుకుంటే.. హెరిటేజ్, వల్లభ, శ్రీ చక్ర, తిరుమల, జెర్సీ, దొడ్ల, విశాఖ డెయిరీలు పాలు సేకరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి గేదె పాలకు లీటర్కు గరిష్టంగా రూ.80, ఆవు పాలకు రూ.35కు మించి ఇస్తున్న దాఖలాలు లేవు. అలాంటిది పాల వెల్లువ పథకం ద్వారా నేడు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గేదె పాలకు లీటర్కు రూ.103, ఆవు పాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లోని పాడి రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కేంద్రాల కంటే కనీసం లీటర్కు రూ.10–30 వరకు అదనంగా వస్తుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల వల్ల ఏళ్ల తరబడి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జేపీవీ కేంద్రానికే పాలు పోస్తామని స్పష్టం చేస్తున్నారు. పక్కాగా వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం పాలల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు) శాతం ఎంత ఉందో లెక్కించేందుకు ప్రైవేట్ డెయిరీలు ఒక శాస్త్రీయ పద్దతి అంటూ పాటించే వారు కాదు. పాడి రైతుల్లో నూటికి 90 శాతం పెద్దగా చదువుకోని వారే. వారు కేంద్రానికి పాలు తీసుకురాగానే, వాటిని పూర్తిగా మిక్స్ చేయకుండా, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ఫ్యాట్ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించి ఖాతా పుస్తకాల్లో రాసుకునే వారు. అడిగితే ఓ కాగితం ముక్క మీద రాసిచ్చేవారు. దాణా, ఇతర అవసరాల కోసం తీసుకున్న అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని 15 రోజులకో, నెలకో ఇచ్చేవారు. పాలు ఎక్కువ పోసే వారికి ఒక ధర, తక్కువ పోసే వారికి మరో ధర, సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర ఉండేది. కొందరు కొలతల్లోనూ మోసానికి పాల్పడే వారు. ‘జగనన్న పాల వెల్లువ’ మొదలైన తర్వాత ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కొంతమేర కళ్లెం పడింది. రైతుకు పాల ధర పెరగడమే కాదు.. పాలల్లో నాణ్యత, చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. ప్రైవేటు కేంద్రాల్లో టెస్టింగ్ మిషన్ ఒకటే ఉంటుంది. అదే జేవీపీ కేంద్రంలో మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిల్క్ ఎనలైజర్ (వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం, ప్రొటీన్, వాటర్ శాతాన్ని లెక్కించేందుకు), ్రస్ట్రిరర్ (పాలు మిక్స్ చేయడానికి) సాప్ట్వేర్ సిస్టమ్ ద్వారా పాల సేకరణ జరిగేందుకు వీలుగా ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ స్కేల్ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి పాలు రాగానే మిక్స్ చేసిన పాలను ్రస్ట్రిరర్పై పెట్టి, ఆ శాంపిల్ను మళ్లీ ఎనలైజర్లో ఉంచి వెన్న, ఘన పదార్థాల శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి.. తూకం వేసి తీసుకొని ధరను నిర్ధారిస్తారు. వెన్న శాతం లెక్కింపు లేదా ధర నిర్ణయంలో ఎలాంటి దళారీ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా సా‹ఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమూల్కు, హెరిటేజ్కు మధ్య ఎంత తేడా! 2020 డిసెంబర్లో 3 జిల్లాలతో ప్రారంభమైన జేపీవీ పథకం నేడు 18 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమం నేడు 3,691 గ్రామాలకు విస్తరించగా, 3.18 లక్షల మంది భాగస్వాములయ్యారు. 31 నెలల్లో 9.58 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. ప్రస్తుతం 85 వేల మంది పాడి రైతులు ప్రతి రోజూ 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. 2020 అక్టోబర్ వరకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్తో లీటర్కు హెరిటేజ్ కంపెనీ గేదె పాలకు రూ.58.43, ఆవు పాలకు రూ.31.58 చెల్లించింది. సంగం డెయిరీ గేదె పాలకు రూ.58.90, ఆవు పాలకు రూ.32.87 చొప్పున చెల్లించేవారు. అమూల్ ప్రారంభంలోనే లీటర్ గేదె పాలకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్తో రూ.71.47, ఆవు పాలకు 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్తో రూ.34.20 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత గడిచిన 31 నెలల్లో అమూల్ ఎనిమిదిసార్లు పాల సేకరణ ధరలు పెంచగా, ప్రైవేటు డెయిరీలు కేవలం మూడు సార్లు మాత్రమే పెంచాయి. హెరిటేజ్ ప్రస్తుతం గేదె పాలకు లీటర్ రూ.77కు పెంచామని చెబుతున్నప్పటికీ, రైతులకు వివిధ కారణాలు చెబుతూ వాస్తవంగా చెల్లిస్తున్నది రూ.66.50 మాత్రమే. అదే సంగం డెయిరీ లీటర్కు రూ.80.30కు పెంచామని చెబుతున్నా, వాస్తవంగా రైతులకు చెల్లిస్తున్నది మాత్రం రూ.69.35 మాత్రమే. అమూల్ మాత్రం ఖచ్చితంగా 11 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎ¯Œన్ఎఫ్తో గేదె పాలకు లీటర్కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేటు డెయిరీలు గరిష్టంగా గేదె పాలకు 11 శాతం, ఆవు పాలకు 5 శాతం ఫ్యాట్కు లాక్ చేసి ఆ తర్వాత ఎంత ఫ్యాట్ ఉన్నా సరే 11 శాతం కిందే పరిగణించి సొమ్ములు చెల్లిస్తున్నాయి. అమూల్ మాత్రం ఎలాంటి లాక్ సిస్టమ్ లేకుండా పాలల్లో ఉండే ఫ్యాట్ శాతం లెక్కగట్టి అణాపైసలతో సహా చెల్లిస్తోంది. ఫలితంగా గేదె పాలకు గరిష్ట ధర 103, ఆవు పాలకు రూ.53.86 ధర రైతులకు లభిస్తోంది. పాడి రైతులకు అన్ని విధాలా భరోసా గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం ఎనిమిది నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. అమూల్ మాత్రం 20–22 శాతం ప్రోటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. పైగా ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వార్షిక ఆదాయాన్ని బట్టి ఏటా లీటర్కు 5 శాతం చొప్పున బోనస్ చెల్లిస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు కమిషన్ ఇస్తాయే తప్ప పాలుపోసే రైతులకు ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వవు. మరొక పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 321 పాడి రైతులకు గేదెల కొనుగోలుకు రూ.3.69 కోట్ల రుణాలిచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ కింద 7,517 మందికి రూ.36.61 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే వారికీ రూ.4,283 కోట్ల లబ్ధి కల్తీకి అడ్డుకట్ట వేసి, నాణ్యత పెంచేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టాయి. ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీవి అమలు కాని ప్రాంతాల్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఆదాయం పెరిగింది. ఫలితంగా రూ.4,283 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు లబ్ధి పొందారు. అదనపు ఆదాయం నిజం మా ఊళ్లో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ కేంద్రంలో శుక్రవారం 1.32 లీటర్ల పాలు పోశాను. వెన్న 14 శాతం, ఎస్ఎన్ఎఫ్ 10.1 శాతం ఉందని లెక్కించారు. ఆ మేరకు లీటర్కు రూ.97.92 చొప్పున రూ.129.25 చెల్లించారు. అదే ప్రైవేటు డెయిరీకి పోస్తే రూ.80కి మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ పాలు పోయడం వల్ల రూ.30కి పైగా అదనంగా ఆదాయం వచ్చింది. – కాళ్ల మంగ, చిత్రాడ–2, కాకినాడ జిల్లా నెలకు రూ.3,600 అదనపు ఆదాయం మాకు మూడు గేదెలున్నాయి. ప్రైవేటు కేంద్రానికి రోజుకు 6–8 లీటర్ల పాలు పోసేవాళ్లం.ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా లీటర్కు రూ.70–80 మధ్య వచ్చేది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన జేపీవి కేంద్రంలో ఎస్ఎన్ఏఫ్ 9.2 శాతం, ఫ్యాట్ 12.3 శాతంతో పాలు పోస్తే లీటర్కు ఏకంగా రూ.97.92 వచ్చింది. లీటర్పై సగటున రూ.20కి పైగా అదనంగా వచ్చింది. ఈ లెక్కన ఐదు లీటర్లకు రూ.120 చొప్పున నెలకు రూ.3,600కు పైగా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ప్రైవేటు డెయిరీల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో ధర రాలేదు. – పరసా వెంకటసుధ, విరవాడ, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా గతంలో రూ.30కి మించి వచ్చేది కాదు మాకు రెండు ఆవులున్నాయి. ప్రతి రోజూ 8 లీటర్ల పాలు కేంద్రానికి పోసేవాళ్లం. లీటర్కు రూ.30 రావడం గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అమూల్ కేంద్రంలో పోస్తే ఎస్ఎన్ఏఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.1 శాతంతో లీటర్కు 39.33 వచ్చింది. ఈ లెక్కన లీటర్కు అదనంగా రూ.9.33 చొప్పున నెలకు రూ.2,239కు పైగా ఆదనపు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఈ కేంద్రానికే పాలు పోస్తాం. – చిట్నీడి వెంకటలక్ష్మి, విరవాడ, పిఠాపురం మండలం కాకినాడ జిల్లా రైతుల నుంచి మంచి స్పందన జగనన్న పాల వెల్లువ పథకాన్ని కాకినాడ జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభించాం. పాడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయినా సరే 96 గ్రామాల్లో ప్రతి రోజూ 200 మందికి పైగా రైతులు 4,500 లీటర్ల పాలు పోస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక మంది పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.95, ఆవు పాలకు రూ.53 వరకు ఆదాయం లభిస్తోంది. – డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు, జాయింట్ డైరెక్టర్, పశు సంవర్థక శాఖ -
ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?
గత ఏడాది రిలయన్స్ రీటైల్ డైరక్టర్గా బాధ్యతల్ని చేపట్టిన ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి ఆర్ఎస్ సోధి (రూపిందర్ సింగ్ సోధి) రూపంలో సరికొత్త వెపన్ దొరికిందా? రిలయన్స్ రీటైల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈషా అంబానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. కలిసి పనిచేయాలి. కలిసి సంబరాలు చేసుకోవాలి. రియలన్స్ కంపెనీ ఓ సందర్భంలో ఇచ్చిన స్లోగన్ ఇది. ఈ మాట రిలయన్స్ అధినేత కుటుంబానికి అతికినట్లు సరిపోతుంది. ధీరూబాయ్ సృష్టించిన వ్యాపారానికి వారసుడిగా వచ్చి సామ్రాజ్యంలా విస్తరించారు ముఖేష్. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ రిలయన్స్ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వ్యూహాలు రచిస్తుంది ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా రిలయన్స్ రీటైల్ విభాగానికి రారాణిగా కొనసాగుతున్న ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా ఏ రంగంలోకి అడుగు పెట్టినా తన దైన మార్క్ను చూపిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (జీసీఎంఎంఎఫ్నే అమూల్ (AMUL)గా పిలుస్తుంటారు) మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆర్ఎస్ సోధికి ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, ఎఫ్ఎంసీజీ విభాగానికి అడ్వైజర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే జరిగితే టెలికాం రంగాన్ని జియో శాసించినట్లే.. రీటైల్ విభాగంలో రిలయన్స్ టార్చ్ బేరర్గా ఎదుగుతుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఆర్ఎస్ సోధి ఎవరు? ఆర్ఎస్ సోధి ఢిల్లీలో జన్మించారు. మున్సిపల్ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (IIRMA) నుండి ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమూల్లో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా చేరారు. 2010 జూన్లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. సోధీ హయాంలో అమూల్ ప్రపంచంలోని అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. 1982లో అమూల్ ఆదాయం రూ.121 కోట్లు ఉన్నప్పుడు కంపెనీలో చేరగా.. 2022-23 నాటికి ఆ సంస్థ ఆదాయం రూ.72,000 కోట్లు దాటింది. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన అమూల్ సామ్రజ్యంలో సోధీ బాధ్యతలు కీలకమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'వరల్డ్స్ ఒరిజినల్ ఎనర్జీ డ్రింక్', అమూల్ ధూద్ పీతా హై ఇండియా వంటి ప్రకటనలతో కంపెనీని లాభాల బాట పట్టించడంలో సిద్ధహస్తులయ్యారు. కొరకరాని కొయ్యగా ‘కాంపా కోలా’ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సికోకు చెక్ పెట్టేలా యాభై ఏళ్ల క్రితం అనతి కాలంలోనే మార్కెట్ అగ్రగామి బ్రాండ్గా ఎదిగిన ‘కాంపా కోలా’ హక్కులను రిలయన్స్ దక్కించుకుంది. ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా తయారైంది. అదే బాటలో ఇండియన్ డైరీ మార్కెట్ను శాంసించేలా రిలయన్స్ రీటైల్ విభాగానికి డైరక్టర్గా వ్యవహరిస్తున్న ఈషా అంబానీ ఆర్ఎస్ సోధీని నియమించుకోనున్నారు. కాగా, ప్రస్తుతం ఇండియన్ డైరీ మార్కెట్ వ్యాల్యూ రూ.13లక్షల కోట్లుగా ఉంది. 2027 నాటికి రూ.30 లక్షల కోట్లకు వృద్ది సాధించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా,ఇషాకు రీటైల్ బాధ్యతలు! -
కర్ణాటకలో నందిని Vs అమూల్
-
కన్నడనాట పాల గోల.. ఇప్పుడు నందినీపై పడ్డారని బీజేపీపై విమర్శలు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాలపై వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బెంగళూరులో ఆన్లైన్ ద్వారా అమూల్ పాలు, పెరుగు విక్రయించనున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమూల్కు వ్యతిరేకంగా పలు కన్నడ సంస్థలు సోమవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. గో బ్యాక్ అమూల్, సేవ్ నందిని అంటూ హాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలోనూ నిరసనలు జోరందుకుంటున్నాయి. అమూల్ను రాష్ట్రంలోకి తీసుకొచ్చి స్థానిక నందినీ డెయిరీని దెబ్బ తీసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘గుజరాత్కు చెందిన బరోడా బ్యాంక్ మా విజయ బ్యాంక్ను కబళించింది. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నింటినీ గుజరాతీ అయిన అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు నందినీ డెయిరీపై పడ్డారు’’ అంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య దుయ్యబట్టారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి కూడా అమూల్పై విమర్శలతో ట్వీట్లు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అమూల్ కర్ణాటకలోకి ప్రవేశించడం లేదని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ చెప్పారు. నందినీ డెయిరీని అమూల్లో విలీనం చేస్తారన్నది కూడా కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ హయాంలోనే నందినీ డెయిరీ భారీగా విస్తరించిందని చెప్పుకొచ్చారు. -
లెజెండరి సింగర్ వాణీ జయరాంకు అమూల్ ఘన నివాళి
లెజెండరి సింగర్ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: వచ్చే వారమే ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్లో డిజైన్ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్. దీనిని తన అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఆమె డూడుల్ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత #Amul Topical: Tribute to legendary playback singer of South Indian cinema pic.twitter.com/jSuzQfndkz — Amul.coop (@Amul_Coop) February 5, 2023 -
అమూల్పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
పాడి రైతులకు పండుగ
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా ఐదోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.37, ఆవు పాలపై రూ.1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన పదార్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురువారం నుంచి వర్తించనుంది. దీనిద్వారా 40 వేల మంది రైతులకు అదనంగాలబ్ధి చేకూరనుంది. గత రెండేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేకరణ ధరలను పెంచగా తాజా పెంపుతో ఐదోసారికి చేరుకుంది. మూడు నెలల్లోనే మళ్లీ.. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.84.15, ఆవు పాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది. అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలను సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ సెప్టెంబర్లో పాల సేకరణ ధరలు పెంచగా 3 నెలలు తిరగకుండానే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్కు గరిష్టంగా గేదె పాలు రూ.87.52, ఆవు పాలు రూ.42.46 చొప్పున పెరిగాయి. అమూల్ గత రెండేళ్లలో గేదె పాలపై రూ.16.05, ఆవు పాలపై రూ.8.26 మేర పెంచింది. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాలవెల్లువ ద్వారా 2020 డిసెంబర్లో 3 జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా 2 నెలల్లోనే 17 జిల్లాలకు విస్తరించారు. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,958 మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో ప్రారంభమై 2,856 గ్రామాలకు విస్తరించింది. రోజూ సగటున లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. 1,587 ఆర్బీకేల పరిధిలో 2,49,998 మంది పాడి రైతులు నిత్యం పాలు పోస్తున్నారు. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.232.26 కోట్లు చెల్లించారు. లీటర్పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.15 –రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 – రూ.12 వరకు అదనపు లాభం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు అదనంగా రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. సంక్రాంతికి మిగతా జిల్లాల్లోనూ.. జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ ఐదోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను కూడా పెంచింది. ఇప్పటికే 17 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. సంక్రాంతి కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నాం. – అహ్మద్బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ పాలసేకరణ ధర పెంపు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు. హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి. అమూల్ రాకతో అదనపు లబ్ధి జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు. -
‘అమూల్’ రైతులకు అదనపు లాభం
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలసేకరణ ధరను అమూల్ సంస్థ తాజాగా మరోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.3.30, ఆవు పాలపై రూ.1.58 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. నాలుగోసారి పెంపు వర్తింపు ‘జగనన్న పాల వెల్లువ’ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా ప్రస్తుతం 16 జిల్లాలకు విస్తరించారు. గత 23 నెలల్లో మూడుసార్లు సేకరణ ధరలను పెంచారు. ఉత్తరాంధ్ర పరిధిలో గత నెలలో పెంచగా, తాజాగా కోస్తాంధ్రలో 10 జిల్లాల పరిధిలో పాలసేకరణ ధరలను నాలుగోసారి పెంచారు. 1.12 లక్షల మందికి అదనపు లబ్ధి కోస్తాంధ్ర పరిధిలో ఇప్పటికే లీటర్ గేదె పాలకు రూ.79.20, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా లీటర్కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.1.58 పెంచారు. దీంతో గరిష్టంగా గేదె పాలు రూ.82.50, ఆవు పాలు రూ.39.48 చొప్పున సేకరణ ధరలు చేరాయి. వెన్నపై కిలోకు రూ.30, ఎస్ఎన్ఎఫ్పై కిలోకు రూ.11 చొప్పున పెంచడంతో వెన్న ధర రూ.750, ఘన పదార్థాల ధర రూ.280కి చేరుకుంది. గత నెలలో అమలులోకి వచ్చిన పెంపు వల్ల ఉత్తరాంధ్రలో 233 గ్రామాల పరిధిలోని 33,327 మంది రైతులు లబ్ధి పొందగా తాజా పెంపుతో కోస్తాంధ్రలోని బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 890 గ్రామాలకు చెందిన 1,12,313 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. రూ.208.23 కోట్లు చెల్లింపు రాష్ట్రంలో ప్రస్తుతం 16 జిల్లాల పరిధిలో 2,833 గ్రామాలకు చెందిన 2,44,069 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల మంది పాల ఉత్పత్తిదారులు ప్రతిరోజూ సగటున లక్ష లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. ఇప్పటివరకు 4.86 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.208.23 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.25 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా ప్రతి పది రోజులకోసారి పాలుపోసే రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. డిసెంబర్ లోగా రాష్ట్రమంతా విస్తరణ జగనన్న పాల వెల్లువ కింద పాలసేకరణ ధరను అమూల్ నాలుగోసారి పెంచింది. ఇప్పటికే 16 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రమంతా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
ఫ్యామిలీ డాక్టర్లా క్యాటిల్ డాక్టర్
గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్ డాక్టర్ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్గా కార్యాచరణ రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. సేంద్రీయ పాల ఉత్పత్తులు పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి. భావి తరాల కోసం.. పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి. ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. అక్టోబర్లో పశువుల బీమా పథకం పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి అక్టోబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి. బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ‘లంపీ స్కిన్’పై జాగ్రత్త తాజాగా పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి. అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి. -
పొంగిన పాల సేకరణ ధర
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచింది. ఇటీవలే ఆవుపాలపై లీటర్కు గరిష్టంగా రూ. 4.12 చొప్పున పెంచగా, తాజాగా గేదె పాలపై రూ.3.93 పెంచింది. అంతేకాక.. పాలుపోసే రైతులతోపాటు సొసైటీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెలకు 200 లీటర్లకు పైబడి పాలుపోసే రైతులకు రూ.2.50 వరకు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళా పాడిరైతు సంఘాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు ప్రత్యేక ప్రోత్సాహం కింద లీటర్కు పావలా చొప్పున ఇవ్వనున్నారు. ఆదివారం నుంచి ఈ పెంపు, ప్రోత్సాహకాలు అమలులోకి రానున్నాయి. 20 నెలల్లో రూ.181.90 కోట్ల చెల్లింపు ‘జగనన్న పాలవెల్లువ’ కింద 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా, 20 నెలల్లో 15 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించారు. 2,344 గ్రామాల్లో 2,34,548 మంది నమోదు కాగా, రోజుకు 1.06 లక్షల మంది పాలుపోస్తున్నారు. ఇప్పటివరకు 4.20 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.181.90 కోట్లు చెల్లించారు. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా.. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సర్వే జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ జిల్లాల్లో డిసెంబర్లోగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగోసారి పాలసేకరణ ధర పెంపు పథకం ప్రారంభించినప్పుడు లీటర్కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో మూడుసార్లు పాలసేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతంు లీటర్ గేదె పాలకు గరిష్టంగా రూ.80.22, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరఫున ఉత్తరాంధ్రాలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ నాలుగోసారి పాల సేకరణ ధర పెంచింది. ఇటీవలే ఆవు పాలకు లీటర్పై గరిష్టంగా రూ.4.12ల చొప్పున పెంచిన యూనియన్, తాజాగా గేదె పాలపై లీటర్కు రూ.3.93 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా ఆవుపాల ధర లీటర్ రూ.40.73లకు చేరగా, తాజాగా గేదె పాలు ధర లీటర్కు రూ.84.15కు చేరనుంది. అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో గేదె పాలపై రూ.12.68, ఆవు పాలపై రూ.6.53ల మేర పెంచింది. పాడి రైతులకు ప్రోత్సాహకాలు పాల సేకరణ ధర, రాయల్టీ బోనస్ కాకుండా పాలుపోసే రైతులతో పాటు సొసైటీ నిర్వాహకులకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను ప్రతీనెలా 7వ తేదీన చెల్లించనుంది. పాలుపోసే సామర్థ్యాన్ని బట్టి లీటర్కు రూ.0.75 నుంచి రూ.2.25ల వరకు రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక సొసైటీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు సైతం లీటర్పై పావలా రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతీ సొసైటీ పరిధిలో ఒక రూపాయి నుంచి రూ.2.50 వరకు అదనపు ప్రోత్సాహం అందుకోనున్నారు. ప్రైవేటు డెయిరీల పరిధిలో.. ఇక అమూల్ రాకతో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం పాలసేకరణ ధరను విధిగా పెంచాల్సి వచి్చంది. ఫలితంగా వాటికి పాలుపోసే పాడి రైతులకు అదనపు మేలు చేకూరింది. గతంలో ఎన్నడూలేని రీతిలో లీటర్పై రూ.12 నుంచి రూ.15ల వరకు ఆయా డెయిరీలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా 20 నెలల్లో ఏకంగా రూ.2,020.46 కోట్ల మేర రైతులకు అదనపు లబ్ధిచేకూరినట్లుగా అంచనా వేశారు. 20 నెలల్లో నాలుగోసారి పెంపు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచడంతోపాటు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజా పెంపుతో సుమారు 40వేల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. – అహ్మద్బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
రాష్ట్రమంతటా ‘జగనన్న పాలవెల్లువ’
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ రాష్ట్రమంతా విస్తరించనుంది. మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహకార రంగంలో పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా పేరొందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత రెండు ఉమ్మడి జిల్లాలతో ప్రారంభమై దశలవారీగా ఏడు జిల్లాలకు విస్తరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం 16 జిల్లాల్లో అమలవుతోంది. మిగిలిన పది జిల్లాలకుగానూ కాకినాడ, కోనసీమలో జూలై నాలుగో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిత్యం లక్ష లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 2,651 గ్రామాల్లో పాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2.27 లక్షల మంది పాడిరైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 45,456 మంది రోజూ పాలు పోస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. అమూల్ తరపున రాయలసీమ జిల్లాల్లో కేరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకు అమూల్ కేంద్రాల ద్వారా 1,53,92,363 లీటర్ల ఆవుపాలు, 1,93,74,139 లీటర్ల గేదె పాలు సేకరించారు. పాడి రైతులకు రూ.149.29 కోట్లు చెల్లించారు. ఇటీవలే పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్కు గేదె పాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 మేర రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. 11 శాతం కొవ్వు, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన గేదె పాలకు గరిష్టంగా లీటర్కు రూ.79.20 చెల్లిస్తున్నారు. 5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన ఆవుపాలకు గరిష్టంగా లీటర్కు రూ.35.78 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్ రాకముందు లీటర్కు రూ.30–31కి మించి లభించేది కాదు. ప్రస్తుతం సగటున లీటర్కు గేదె పాలకు రూ.53.50, ఆవుపాలకు రూ.30.24 వరకు ధర లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే లీటర్కు రూ.5 నుంచి రూ.20 వరకు రైతులకు అదనంగా లబ్ధి చేకూరుతోంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు గత్యంతరం లేక పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లలో లీటర్కు పాలసేకరణ ధరలను రూ.10–12 వరకు పెంచాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, అవుట్లెట్స్ రెండు జిల్లాల్లో 100 గ్రామాల్లో మొదలైన పాల సేకరణ దశలవారీగా ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 2,651 గ్రామాలకు విస్తరించింది. పునర్విభజన తర్వాత రాజమహేంద్రవరం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలకు విస్తరించింది. కర్నూలు, నంద్యాలతో పాటు కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభించాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలకు విస్తరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి సేకరించే పాలను ప్రాసెస్ చేసేందుకు మదనపల్లి, విజయవాడ, విశాఖలో అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో కంటైనర్ తరహాలో అమూల్ అవుట్లెట్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే 3 నెలల్లో విస్తరణ జగనన్న పాల వెల్లువ పథకాన్ని మరో మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జూలై నెలాఖరులోగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చేపడతాం. మిగిలిన జిల్లాల్లో కూడా సెప్టెంబర్ కల్లా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దశలవారీగా పాల సేకరణ గ్రామాలను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
Amul India: సైమండ్స్కు వినూత్న నివాళి
గత శనివారం (మే 14) రాత్రి క్వీన్స్లాండ్లోని టౌన్స్విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46)కు ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళి తెలిపింది. గతంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్కు కూడా ప్రత్యేకంగా నివాళులర్పించిన డెయిరీ దిగ్గజం.. తాజాగా సైమండ్స్ మృతికి సంతాపంగా ఓ స్పెషల్ డూడుల్ను డిజైన్ చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) సైమండ్స్ ఆన్ ఫీల్డ్ చిత్రాలతో డిజైన్ చేసిన ఈ డూడుల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుటుంది. ఈ డూడుల్లో సైమండ్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. He Symmolised the game అంటూ హెడ్డింగ్ను జోడించారు. ఈ డూడుల్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అభిమానులు ఈ డూడుల్ను షేర్ చేస్తూ రాయ్ (సైమండ్స్ ముద్దు పేరు)కు నివాళి అర్పిస్తున్నారు. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సైమండ్స్.. తన మొత్తం కెరీర్లో 198 వన్డేలు, 26 టెస్ట్లు, 14 టీ20లు, 39 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్లు గెలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. 2011లో క్రికెట్కు వీడ్కోలు పలికిన రాయ్ చనిపోక ముందు వరకు వ్యాఖ్యాతగా కొనసాగాడు. చదవండి: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
పాడి రైతుకు లాభాల పంట
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా పాలసేకరణ ధరను మూడోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.4.42, ఆవు పాలపై రూ.2.12 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన సేకరణ ధరలు అమూల్ ప్రస్తుతం పాలను సేకరిస్తున్న పది జిల్లాల్లో ఆదివారం నుంచే అమలులోకి రాగా మరో నాలుగు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో వర్తించనున్నాయి. ప్రైవేట్ డెయిరీల ఇష్టారాజ్యంతో ఇన్నేళ్లూ తీవ్రంగా నష్టపోయిన పాడి రైతులకు ‘అమూల్’ రాకతో సాంత్వన లభిస్తోంది. 14 జిల్లాల్లో అమూల్.. ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి 2020 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ఏడు జిల్లాలకు (పునర్విభజన అనంతరం 14 జిల్లాలు) విస్తరించింది. దీని ద్వారా అమూల్ సంస్థ ప్రారంభంలో పాల సేకరణకు లీటర్కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ కలిగిన ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతులకు చెల్లించింది. అయితే గత 17 నెలల్లో రెండుసార్లు సేకరణ ధరలను అమూల్ పెంచడంతో రైతులకు లాభం చేకూరింది. తాజాగా మూడోసారి సేకరణ ధరలను పెంచింది. తాజాగా మరోసారి.. ఇప్పటివరకు లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవుపాలకు రూ.35.78 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరపున జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తోన్న సబర్కంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్కు గరిష్టంగా గేదెపాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా గేదె పాలకు రూ.79.20, ఆవు పాలపై రూ.37.90 చొప్పున పాడి రైతులకు సేకరణ ధర లభిస్తోంది. వెన్నపై కిలోకు రూ.40, ఎస్ఎన్ఎఫ్పై కిలోకు రూ.15 చొప్పున పెంచడంతో వెన్న రూ.720, ఘన పదార్థాలపై రూ.269 చొప్పున పాడిరైతులకు చెల్లిస్తున్నారు. దళారులు లేకుండా నేరుగా డబ్బులు.. తాజాగా సేకరణ ధరల పెంపుతో 1,94,377 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 28,763 మంది పాల ఉత్పత్తిదారులు రోజూ 96 వేల లీటర్ల చొప్పున అమూల్’కు పాలు పోస్తున్నారు. ఇప్పటి వరకు 2.91 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.124.48 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.21.13 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడమే కాకుండా పది రోజులకోసారి వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు పాలు పోసిన పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటర్ పాలకు అర్ధ రూపాయి చొప్పున లాయల్టీ ఇన్సెంటివ్ చెల్లిస్తుండటంతో పాల వెల్లువపై ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ఎంతో లాభం.. నాకు మూడు పాడి గేదెలున్నాయి. రోజూ ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నా. గతంలో లీటర్కు రూ.40–50కి మించి ఇచ్చేవారు కాదు. ఈ రోజు 8.8 శాతం వెన్న, 9.2 శాతం ఎస్ఎన్ఎఫ్తో 10.7 లీటర్లు పాలు పోస్తే లీటర్కు రూ.63.36 చొప్పున ఏకంగా రూ.677.95 ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కుసుం నాగమల్లేశ్వరి, నంబూరు, గుంటూరు పాల వెల్లువతో మంచి రోజులు నాకు రెండు పాడిగేదెలున్నాయి. ఈరోజు (ఆదివారం) ఉదయం 6.50 లీటర్లు, సాయంత్రం 5.38 లీటర్లు పాలు పోశా. 8.8 వెన్న శాతం, 8.7 ఎస్ఎన్ఎఫ్ ఆధారంగా లీటర్కు రూ.59.86 చొప్పున ఇచ్చారు. నిన్నటితో పోలిస్తే లీటర్కు రూ.3.53 చొప్పున అదనంగా లాభం వచ్చింది. జగనన్న పాల వెల్లువతో మంచి రోజులు వచ్చాయి. – బొంతు వరలక్ష్మి, కోటపాడు, ఏలూరు జిల్లా త్వరలో మరో ఐదు జిల్లాల్లో.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ సంస్థ సేకరణ ధరను మూడోసారి పెంచింది. తాజా పెంపుతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతోంది. త్వరలో విశాఖ, తూర్పు గోదావరిలో (పునర్విభజన అనంతరం ఐదు జిల్లాలు) కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ కంటైనర్లకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: విజయవాడలో అమూల్ సంస్థ పాల ఉత్పత్తుల విక్రయానికి కంటైనర్ బూత్ల ఏర్పాటుకు హైకోర్టు అనుమతించింది. అయితే వాటి కార్యకలాపాలను ప్రారంభించవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమూల్ కంటైనర్ల ఏర్పాటుకు విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ కౌన్సిలర్ నెలిబండ్ల బాలస్వామి దాఖలు చేసిన పిల్పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నామినేషన్ పద్ధతిలో బూత్ల ఏర్పాటుకు అనుమతిచ్చారని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తెలిపారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్వో) ప్రకారమే నడుచుకున్నామని చెప్పారు. ఉచితంగా ఇవ్వలేదని, ఆ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువలో 10 శాతానికి ఇచ్చామన్నారు. ఎలాంటి రాయితీలు, అదనపు ప్రయోజనాలు లేవన్నారు. దీని వెనుక మహిళా సాధికారిత ఉందన్నారు. మహిళా సంఘాల నుంచి పాలు, ఇతర ఉత్పత్తులు కొని, వాటిని బూత్ల ద్వారా విక్రయిస్తుందని తెలిపారు. ఇవి తాత్కాలిక షెడ్లు మాత్రమేనన్నారు. వీటిని రోడ్ల మార్జిన్లలో ఏర్పాటు చేస్తున్నారని, ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని ఆదినారాయణరావు చెప్పారు. రాష్ట్రంలో పాల సొసైటీలను ప్రోత్సహించకుండా ప్రభుత్వం అమూల్ను ప్రోత్సహిస్తోందన్నారు. దీనికి సుమన్ స్పందిస్తూ, ఇలాంటి వ్యాజ్యాల ద్వారా మహిళా సాధికారితను అడ్డుకుంటున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కంటైనర్ల ఏర్పాటుకు అనుమతించింది. పాడి రైతుల సంక్షేమం కోసం అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర
3 లీటర్లకే రూ.200 వస్తోంది గతంలో పూటకు 8 లీటర్లు పోసేవాళ్లం. రూ.200 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అమూల్ కేంద్రంలో 3 లీటర్లు పోస్తే రూ.200కు పైగా వస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటైన తర్వాతే మిగిలిన కేంద్రాల్లో కూడా రేటు పెంచారు. పాడి గేదెల కొనుగోలు కోసం లోన్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాం. – ఎస్కే.అసాబి, పెదకాకాని, గుంటూరు జిల్లా రైతులకు ఒక్క వ్యవసాయం ద్వారా మాత్రమే కాకుండా, ఇతరత్రా అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా సహకార డెయిరీ దిగ్గజం అమూల్ను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రైవేట్ డెయిరీల దోపిడీకి ముకుతాడు వేస్తోంది. తద్వారా పాల సేకరణలో స్పష్టమైన మార్పు కళ్లెదుటే కనిపిస్తోంది. పాల ధర పెరిగింది. చెల్లింపుల్లో పారదర్శకత వచ్చింది. పాడి ఇక బరువు కానేకాదని, నాలుగు డబ్బులు కళ్లజూడొచ్చనే భరోసా కలిగింది. సాక్షి, అమరావతి : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుకు భద్రత, ఆర్థిక భరోసా లభిస్తోంది. ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కళ్లెం పడింది. ఇదివరకు పాలల్లో వెన్న శాతమెంతో.. ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్ – ఘన పదార్థాలు) శాతమెంతో రైతులకు తెలిసేది కాదు. కేంద్రంలో ఎంత చెబితే అంతే. ఆ లెక్కలే పుస్తకాల్లో రాసుకొని 15 రోజులకో నెలకో డబ్బులు ఇచ్చేవారు. ఎక్కువ పాలు పోసే వారికి ఒక ధర.. తక్కువ పాలు పోసే వారికి మరో ధర.. సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర చెల్లిస్తూ అందినకాడికి దోచుకునే వారు. వెన్న శాతాన్ని పరిగణనలోకి తీసుకొని పాలు సేకరించే ప్రైవేట్ డెయిరీలు నాణ్యతను గాలికొదిలేసేవి. దీంతో వెన్న శాతం పెంచి చూపేందుకు రైతుల నుంచి సేకరించే పాలల్లో నాసిరకం నూనెలు, హానికరమైన కొవ్వు పదార్థాలు కలిపి కృత్రిమంగా కల్తీ చేసిన పాలనమ్మి సొమ్ము చేసుకునే వారు. కొలతల్లో మోసాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో సహకార రంగంలోని డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్తో ఒప్పందం చేసుకుంది. అనంతరం 2020 డిసెంబర్లో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. ప్రతి రోజు సగటున లక్ష లీటర్ల చొప్పున ఇప్పటి వరకు 2.46 కోట్ల లీటర్ల పాలు సేకరించింది. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.104.89 కోట్లు జమ అయింది. ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్పు ఇలా.. ► 2020 అక్టోబర్ వరకు పది శాతం వెన్న కలిగిన లీటరు గేదె పాలకు సంగం డెయిరీ కేవలం రూ.56 ఇచ్చేది. ప్రారంభంలోనే అమూల్ లీటరుకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్తో సేకరించే గేదె పాలకు రూ.71.47.. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసింది. ► అమూల్.. సీజన్తో సంబంధం లేకుండా ఎస్ఎన్ఎఫ్, వెన్న శాతం ప్రామాణికంగా అన్ని సీజన్లలోనూ ఒకే రీతిలో చెల్లిస్తోంది. గతంలో ఏటా లీటరుపై రూ.2 – రూ.5కు మించి పెంచేవారు కాదు. అలాంటిది జగనన్న పాల వెల్లువ మొదలైన 15 నెలల్లోనే లీటరుపై రూ.12 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అమూల్ వరుసగా రెండుసార్లు ధర పెంచింది. ► ప్రస్తుతం గరిష్టంగా లీటరు ఆవు పాలకు రూ.35.78, గేదె పాలకు రూ.74.78 చొప్పున చెల్లిస్తుంటే ఆ స్థాయిలో ప్రైవేట్ డెయిరీలు చెల్లించలేకపోతున్నాయి. గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం 8 నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. కానీ అమూల్ మాత్రం 20 – 22 శాతం ప్రొటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1,100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. ► ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. ► ఎలాంటి ఇన్సెంటివ్లు చెల్లించని హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేట్ డెయిరీలు సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్కు 50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాయి. మరో పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. కొలతల్లో మోసాలకు అడ్డుకట్ట ► కొలతల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు తూనికలు – కొలతల శాఖకున్న అధికారాలతో పశు వైద్యులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో ప్రైవేటు డెయిరీలకు చెందిన పాల కేంద్రాల్లో జరిగే మోసాలు వెలుగు చూస్తున్నాయి. ► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో రోజుకు 1,200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. అయితే, కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ చొప్పున రోజుకు 48 లీటర్ల పాలు అధికంగా కాజేస్తున్నట్టుగా గుర్తించారు. పలు కేంద్రాల్లో లైసెన్సుల్లేని వేయింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ బలోపేతం ► వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాల లభ్యతపై భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో సహకార పాల డెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ► రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలను ప్రభుత్వం బలోపేతం చేసింది. వీటి ద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఎస్ఎన్ఏఎఫ్ వంటి వాటితో పాటు 24 పారా మీటర్స్లో కల్తీ పదార్థాలను గుర్తించి సరిచేస్తుంది. ఆకస్మిక తనిఖీల్లో సేకరించిన మిల్క్ను ఎనలైజర్స్ ద్వారా పరిశీలించి, కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ► జగనన్న పాల కేంద్రాలు లేని చోట మాత్రం కొన్ని ప్రైవేటు డెయిరీలు పాల సేకరణలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను బట్టి జరిగే చెల్లింపులను పరిశీలిస్తే అమూల్ చెల్లిస్తున్న పాల ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నట్లు అనంతపురం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసింది. ► అమూల్ కేంద్రాల కంటే ప్రైవేట్ కేంద్రాల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ 0.2 నుంచి 0.5 శాతం తక్కువగా చూపి, అంటే లీటర్కు రూ.4 చొప్పున తక్కువ చెల్లించేందుకు యత్నిస్తుండగా, నిరంతర తనిఖీలతో అడ్డుకట్ట వేస్తున్నారు. కల్తీకి అడ్డుకట్ట వేసిన అమూల్ ► కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాలు సేకరిస్తున్నాయి. ► నాణ్యతకు పెద్ద పీట వేసేందుకు ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు తమ కేంద్రాల్లో కొద్దిపాటి యంత్ర పరికరాలైనా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట పడింది. జగనన్న పాలవెల్లువతో ఎంతో మేలు 15 ఏళ్లుగా పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో లీటరుకు రూ.43 ఇచ్చేవారు. పాలలో వెన్న శాతాన్ని తక్కువ చేసి చూపించి, మాకు రావాల్సిన ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకునే వారు. జగనన్న పాల వెల్లువ ప్రారంభమైన తర్వాత లీటరు పాలకు రూ.66కు పైగా చెల్లిస్తున్నారు. కచ్చితమైన కొలత, వెన్న శాతం ఉంటోంది. పాలు పోసిన వెంటనే మా మొబైల్కు ఆ వివరాలతో కూడిన మెసేజ్ వస్తోంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి 10 రోజులకొకసారి పాల బిల్లు చెల్లిస్తోంది. – కుడుముల సుజాత, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల, వైఎస్సార్ జిల్లా -
మార్కెట్లోకి అమూల్ తాజా పాలు, పెరుగు ఉత్పత్తులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విస్తృత శ్రేణిలో పాలు, పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్తో విక్రయిస్తున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్ లిమిటెడ్) గురువారం అమూల్ తాజా పాలు, పెరుగును ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు.ఎ ఉత్పత్తులను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాల సహకార సంఘాలు ఏర్పాటైనట్లు చెప్పారు. అమూల్ పాల కర్మాగారాన్ని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేశారని, అక్కడ అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపారు. అమూల్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ మనోరంజన్ పాణి మాట్లాడుతూ.. దేశంలో అతి పెద్ద ఆహార సంస్థ అయిన అమూల్ రైతు సహకార ఉద్యమ శక్తికి మహోన్నతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సీనియర్ జనరల్ మేనేజర్ రాజన్ జంబునాథన్ మాట్లాడుతూ అమూల్ పాలు, పెరుగు ఉత్పత్తులు విజయవాడ మార్కెట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. -
పాడి రైతులకు అమూల్య్ సహకారం
సాక్షి, అమరావతి: దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికిన ‘అమూల్’(ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) ఏపీలో పాడి పరిశ్రమాభివృద్ధికి సహకారం అందిస్తోంది. 75 ఏళ్ల క్రితం గుజరాత్లో ఎలాంటి పరిస్థితుల్లో అమూల్ ఆవిర్భవించిందో ఇప్పుడు ఏపీలోనూ అదే వాతావరణంలో తాము అడుగు పెట్టినట్లు చెబుతోంది. ‘అమూల్ సహకార సంస్థ కావడంతో రైతులే దాని యజమానులు. లాభాల్లో వాటాలు పంచడం సహకార సంస్థల లక్ష్యం. గ్రామీణ మహిళలు ఆత్మ గౌరవంతో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.వేలల్లో ఆదాయాన్ని ఆర్జించే మార్గం చూపడం ద్వారా సాధికారత దిశగా అమూల్ కృషి చేస్తోంది. ‘డైనమిక్ సీఎం’ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని, గుజరాత్ కంటే వేగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తామని అమూల్ మేనేజింగ్ డెరెక్టర్ ఆర్ఎస్ సోథి చెప్పారు. రాష్ట్రంలో అమూల్ కార్యకలాపాలపై ‘సాక్షి’ ప్రతినిధికి ఆయన ప్రత్యేకంగా ఇంటరŠూయ్వ ఇచ్చారు. + రాష్ట్రంలోకి అమూల్ అడుగుపెట్టి ఏడాది కావస్తోంది. ఏపీలో అమూల్ అనుభవాలను వివరిస్తారా? – గుజరాత్లో 75 ఏళ్ల క్రితం ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారి సంక్షేమం కోసం అమూల్ సహకార సంస్థ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో పాడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్న విషయాన్ని గమనించారు. పాలకు కనీసం మంచినీటి బాటిల్ ధర కూడా దక్కడం లేదన్న విషయాన్ని గుర్తించి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఆయన ఆహ్వానం మేరకు రాష్ట్రంలో అమూల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 250 గ్రామాల్లో కార్యకలాపాలు ప్రారంభించాం. ఏడాదిలో ఏడు జిల్లాల్లో 859 గ్రామాలకు విస్తరించాం. చిత్తూరు కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. + పాడి పరిశ్రమ విషయంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏవైనా తేడాలను గమనించారా? – పాల ఉత్పత్తిలో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రోజుకు నాలుగు కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 2.5 కోట్లు మిగులు పాలు ఉంటున్నాయి. 20 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉండగా 80 శాతం అసంఘటిత రంగంగా ఉంది. ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయి. గుజరాత్లా ఆంధ్రప్రదేశ్లో వెన్న శాతం అధికంగా ఉండే పాలనిచ్చే గేదెలు అత్యధికంగా ఉన్నాయి. ఇది డెయిరీ రంగంలో వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తుంది. + అమూల్ రాకతో ఏపీలో పాడి రైతులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరింది? – అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు. పూర్తిగా రైతులకు చెందినది. అమూల్ 36 లక్షల మంది రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,000 మంది పాడి రైతులు భాగస్వాములు అయ్యారు. దేశంలో రైతులంతా కష్టపడే తత్వం కలిగినవారే. కానీ ప్రైవేట్ డెయిరీల చేతుల్లో మోసపోతున్నారు. మేం పాలను సేకరించి విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలను వారికే ఇస్తాం. మేం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకముందు పాడి రైతులకు లీటరుకు రూ.30–31 మాత్రమే లభించేది. మా రాకతో సేకరణ ధర ఏడాదిలో లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పెరిగింది. ఇప్పుడు రైతులు లీటరుకు రూ.39 నుంచి రూ.40 వరకు పొందుతున్నారు. అమూల్ వెన్న శాతం ఆధారంగా రైతులకు చెల్లిస్తుంది. దీనివల్ల కొన్ని చోట్ల లీటరుకు రూ.70 వరకు పొందే అవకాశం లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలు చాలావరకు లీటరుకు ఒక ధరను నిర్ధారించి కొనుగోలు చేస్తాయి. + మహిళా సాధికారికత విషయంలో అమూల్ ఎలా భాగస్వామి అవుతోంది? – మహిళా సాధికారతకు డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలన్నది ఆయన లక్ష్యం. అందుకే పాడి రైతుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటివద్దే ఉంటూ ఒక గేదె, ఆవును పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. మూడు ఆవులు లేదా గేదెలను కొనుగోలు చేసి పాలు విక్రయించడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు నెలకు రూ.12,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనివల్ల మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో పలు ప్రయోజనాలు చేకూరతాయి. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ మహిళల నెలవారీ సంపాదన రూ.20,000కి పెంచడమే అమూల్ లక్ష్యం. గుజరాత్లో నిరక్ష్యరాస్య మహిళలు కేవలం పాలు అమ్మడం ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. + రాష్ట్రంలో అమూల్ విస్తరణ కార్యక్రమాలు ఏమిటి? – రెండు జిల్లాలతో ప్రారంభించి ఏడు జిల్లాలకు విస్తరించాం. త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించనున్నాం. రాష్ట్రంలో 50 నుంచి 60 శాతం గ్రామాలకు అమూల్ చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం ఏడు జిలాల్ల నుంచి రోజూ లక్ష లీటర్ల పాలను సేకరిస్తున్నాం. దీన్ని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల లీటర్లకు చేర్చాలన్నది లక్ష్యం. ఏపీలో సేకరించిన పాలను పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాం. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చుకుంటున్నాం. + రాష్ట్రంలో పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లాంటి ఆలోచనలు ఉన్నాయా? – ఇంకా వేగంగా పాల సేకరణను విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో నెమ్మదిగా విస్తరిస్తున్నాం. నెల రోజుల్లో రాష్ట్రంలో మూడు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. మదనపల్లి, విజయవాడ, విశాఖపట్నంలో ఇవి ఏర్పాటవుతాయి. దీంతో లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం అమూల్కు ఈ నెలాఖరులోగా లభిస్తుంది. రానున్న కాలంలో దీన్ని మూడు నుంచి ఐదు లక్షల లీటర్లకు పెంచుతాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మదనపల్లిలో ప్రభుత్వ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ను లీజుకు తీసుకుంటుండగా విజయవాడ, విశాఖలో థర్డ్ పార్టీ ప్లాంట్లు నెలకొల్పుతున్నాం. విద్యార్థులకు ఫ్లేవర్డ్ మిల్క్, అంగన్వాడీలకు బాలామృతం సరఫరా కాంట్రాక్టు అమూల్కు లభించింది. ఇందుకోసం రూ.100 కోట్లతో త్వరలోనే సొంతంగా తయారీ యూనిట్ నెలకొల్పుతాం. కొద్ది నెలల్లోనే పశుదాణా తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్నది అమూల్ లక్ష్యం. -
పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్
కనీసం ఒక లీటర్ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్తో పోటీ వల్లే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అక్క చెల్లెమ్మలే యజమానులు ► అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్ యాజమానులు. అందుకే మార్కెట్లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్లో అమూల్కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. ► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్ చూపించింది. అందుకే అమూల్కు అంత ప్రాధాన్యత. అమూల్ రాకతో పోటీతో పాటు మార్పు ►నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించే వారు. మార్కెట్లో వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ► అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి. ► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్)లను ఏర్పాటు చేస్తోంది. ► అమూల్ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది. మోసాల నివారణకు చర్యలు ► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో బాలమృతం, అంగన్వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథీ, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్కాంత మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాతీలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. -
ఇక పాలు, బాలామృతం మనవే
సాక్షి, అమరావతి: సహకార డెయిరీ రంగంలో అంతర్జాతీయ కీర్తినార్జించిన ‘అమూల్’ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేడు (శుక్రవారం) అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది. అనంతపురం జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకానికీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిద్వారా ఆర్నెల్ల నుంచి మూడేళ్ల్లలోపు ఉన్న చిన్నారులు 22.50 లక్షల మంది.. గర్భిణీ స్త్రీలు 7.50 లక్షల మంది ఉన్నారు. వీరికి పౌష్టికాహారం రూపంలో గర్భిణీలకు 200 గ్రా. పాలతో పాటు పిల్లలకు రోజూ 100 గ్రా. పాలు, నెలకు 2.5 కేజీల చొప్పున బాలామృతం కిట్ను రాష్ట్ర ప్రభుత్వం అందజే స్తోంది. ఇప్పటివరకు వీటిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ«ధ్వర్యంలో బెంగళూరు నుంచి నెలకోసారి టెట్రా ప్యాకింగ్ రూపంలో 1.07 కోట్ల లీటర్ల చొప్పున ఏటా 12.84 కోట్ల లీటర్ల పాలు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సొసైటీ నుంచి ఏటా 48,692 మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు. పాలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. రాష్ట్రంలో మన పాడి నుంచి ఉత్పత్తి అయ్యే తాజా పాలతో పాటు రాష్ట్ర పరిధిలోనే ప్రొసెస్ చేసిన బాలామృతాన్ని అంగన్వాడీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల మన పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోనుంది. -
ఇది మామూలు వాడకం కాదు.. అమూల్ పోస్టర్ చూశారా?
Amul Pushpak The Slice Poster: ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. తెలుగులో వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్న సమయంలో పుష్ప దేశవ్యాప్తంగా రిలీజై భారీ హిట్ అందుకుంది. పాన్ ఇండియా సినిమా విజయాన్ని అందుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు బన్నీ. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అంతటా ఈ సినిమా మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో ఈ క్రేజ్ను తనకు అనుకూలంగా మలుచుకుంది అమూల్. అదెలాగంటారా? సాధారణంగా అమూల్ వ్యాపార వాణిజ్య ప్రకటనలో చిన్నపిల్లలు ఉంటారు. అయితే తాజాగా అమూల్ రిలీజ్ చేసిన పోస్టర్లో పుష్పరాజ్, శ్రీవల్లి ఉన్నారు. 'పుష్పక్ ది స్లైస్.. అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్..' అంటూ కార్టూన్ను షేర్ చేసింది. దీనికి బన్నీ రిప్లై ఇస్తూ 'అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్' అని కామెంట్ చేశాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం పుష్ప క్యారెక్టర్లను బాగానే వాడుకుంటున్నారంటూ అమూల్ను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. దీనికి సీక్వెల్గా పుష్ప: ద రూల్ తెరకెక్కనుండగా ఇది ఈ ఏడాది చివరికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) -
Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం
అమ్మే వారు అనేక మంది ఉన్నప్పుడు.. కొనేవాడు ఒక్కడే ఉంటే అతడు ఎంత ధర చెబితే అంతే. దాన్నే బయ్యర్స్ మోనోపలీ అంటారు. కొనేవాళ్లు ఇద్దరు ముగ్గురున్నా గ్రూపుగా ఏర్పడతారు. అప్పుడు అమ్మే వారంతా కట్టకట్టుకుని అదే రేటుకు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇలాగైతే అమ్మే వారికి అన్యాయమే జరుగుతుంది. మన రాష్ట్రంలో పాడి రైతుల విషయంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. దీన్ని మార్చడానికి మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని ‘ఏపీ పాల వెల్లువ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తద్వారా పోటీ వాతావరణం కల్పించి పాలు విక్రయించే అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాడి రైతులకు ముఖ్యంగా పాలు పోసే అక్క చెల్లెమ్మలకు అదనపు ఆదాయం కల్పించడానికే అమూల్ను తీసుకువచ్చామని, వారి ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ కార్యక్రమం కింద పాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అమూల్ను ఎదుర్కోవడానికి మిగిలిన డెయిరీలు కూడా రేట్లు పెంచుతుండటం మంచి పరిణామం అని, కారణం ఏదైనా పాడి రైతులకు మేలు జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ కృష్ణా జిల్లాలో శ్రీకారం చుడుతున్న పాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సబర్ కాంత మిల్క్ యూనియన్ ఎండీ డాక్టర్ బీఎం పటేల్కు అభినందనలు తెలుపుతున్నానని, నేటి నుంచి కృష్ణా జిల్లా రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ పాలవెల్లువ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పక్కన మంత్రులు సీదిరి అప్పలరాజు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబన ► మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్ పాల వెల్లువ పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబనకు, ప్రత్యేకంగా మహిళా సాధికారతకు ఇది ఊతమిస్తుంది. కృష్ణా జిల్లాలో పాల సేకరణకు 264 గ్రామాలను ఈ దశలో ఎంపిక చేయగా, ఆయా గ్రామాల్లో 37,474 మంది పాడి రైతులను గుర్తించాం. ► కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా 51 కేంద్రాల్లో పాల సేకరణను ప్రారంభిస్తే.. వారం రోజుల్లోనే 18,414 లీటర్ల పాలు సేకరించాం. 941 మంది పాడి రైతులకు రూ.8.15 లక్షల బిల్లు కూడా చెల్లించాం. రైతులకు ప్రతి లీటరుకు అదనంగా రూ.20కి పైగా లాభం వచ్చింది. ► ఉదాహరణకు చాట్రాయి మండలం సోమవరానికి చెందిన పి.వెంకటనర్మమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్ యూనియన్కు పాలు పోయగా, లీటరుకు రూ.44.80 వచ్చింది. ఇప్పుడు అమూల్ పాల వెల్లువ కేంద్రంలో పాలు పోయగా, లీటరుకు రూ.74.78 వచ్చింది. అంటే లీటరు పాలపై ఆమె దాదాపు రూ.30 అదనంగా సంపాదించింది. సెప్టెంబర్కు 17,629 గ్రామాలు లక్ష్యం ► ప్రకాశం జిల్లాలో 245 గ్రామాల్లో, చిత్తూరులో 275 గ్రామాల్లో, వైఎస్సార్లో 149 గ్రామాల్లో, గుంటూరులో 203 గ్రామాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి.. మొత్తంగా 1,046 గ్రామాల నుంచి అమూల్ ఇప్పటికే పాల సేకరణ చేస్తోంది. 2022 సెప్టెంబర్ నాటికి 17,629 గ్రామాల నుంచి పాల సేకరణకు ప్రణాళికలు రచించాం. ► ఏడాది కాలంలో ఐదు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ ప్రారంభమవ్వగా, ఇవాళ ఆరవ జిల్లాలో మొదలైంది. మిగిలిన ఏడు జిల్లాలకూ విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ► గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి అమూల్ 168.50 లక్షల లీటర్లు పాల సేకరణ చేసింది. దాదాపు రూ.71 కోట్లు చెల్లించాం. ఇది పెద్ద విషయం కాదు. ఇతర డెయిరీలకు పాల సరఫరా చేస్తే వచ్చే దానికంటే దాదాపు రూ.10 కోట్లు అదనంగా వచ్చిందన్నది మనం గమనించాలి. ఇదే అక్కచెల్లెమ్మలు గతంలో వాళ్లకే పాలు పోసి ఉంటే రూ.61 కోట్లే వచ్చేవి. పాలు పోసేవారే యజమానులు ► రైతులకు అత్యధిక రేటు ఇస్తారు. వాళ్ల దగ్గరున్న ప్రాసెసింగ్ మరెవ్వరి దగ్గరా లేదు. పాల నుంచి చాక్లెట్స్, ఇతర ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి ఎదిగిన సంస్థ అమూల్. ► మిల్క్ ప్రాసెసింగ్లో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. పాలు పోసే రైతులే అమూల్ యజమానులు. ► ఈ కంపెనీలో వాటాదారులు అంతా మీరే. లాభాపేక్ష అనేది అమూల్కు లేదు. సంస్థ గడించే లాభాలను ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది. ► పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మేలు జరుగుతుంది. అమూల్తో ఇబ్బంది పడే పరిస్థితి రాదు, ఉండదు. సంస్థ బాగే రైతుల బాగు ► ఇదొక సహకార రంగ సంస్థ. సంస్థ బాగుంటే రైతులు బాగుంటారు. సంవత్సరంలో కనీసం 182 రోజులు అంటే ఆరు నెలలు సొసైటీకి పాలు పోసిన మహిళా పాడి రైతులకు అమూల్ ద్వారా ఏడాది చివరిలో ప్రతి లీటరుపై 50 పైసలు బోనస్గా కూడా చెల్లిస్తున్నారు. ► ఈ సంస్థ నాణ్యమైన పశుదాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. ఎంసీయూ, ఏఎంసీయూలలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో డెయిరీలు ► సహకార రంగ డెయిరీలలో బాగున్న వాటిలో కొన్నింటిని.. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. అవి వాళ్ల ప్రైవేటు ఆస్తుల కింద మారిపోయాయి. ► ప్రభుత్వానికి ఇది ఒక సమస్య అయితే.. రెండోది ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల, పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి ధర ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాదు. ఈ పరిస్థితి ఎందుకు? ► మన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అమూల్ వస్తే తప్ప మన రైతులకు, మన అక్కచెల్లెమ్మలకు మెరుగైన రేటు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపై అందరూ ఆలోచించాలి. ► నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో పాలుపోసే రైతులు, అక్కచెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి కలిసేవారు. ‘ఒక లీటరు మినరల్ వాటర్ ధర రూ.23 అయితే, ఒక లీటరు పాలు ధర కూడా రూ.23. ఇలాగైతే ఏ రకంగా బతకగలుగుతాం?’ అని ప్రతి జిల్లాలో బాధపడేవాళ్లు. నేను కూడా ఇదే ప్రస్తావించేవాడిని. ► అందుకే అధికారంలోకి రాగానే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, పాల సేకరణ చేపట్టాం. అమూల్కు, మిగిలిన సంస్థలకు ఉన్న తేడా ఏంటన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. అమూల్ అనేది కంపెనీ కాదు.. మనలాంటి వాళ్లు కలిసికట్టుగా ఒక్కటైతే అమూల్ అవుతుంది. ఈ పరిస్థితిని మారుస్తున్నాం ► ఈ పరిస్థితిని మార్చాలని మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా కట్టుబడి రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ► ప్రతి మహిళా డెయిరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణ చేయడానికి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.979 కోట్లతో బీఎంసీయూలు, 12,883 ఏఎంసీయూల నిర్మాణం కోసం మరో రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది. మోసం ఉండదు. ఎంత ఎస్ఎన్ఎఫ్ ఉందని వాళ్లే మీటర్ పెట్టి చూసుకోగలుగుతారు. ఎవరి ప్రమేయం లేకుండా బిల్లు వస్తుంది. ఇంత ధర వస్తుందనేది తెలుస్తుంది. ► ప్రభుత్వ చర్యలతో అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారికి దిక్కుతోచడం లేదు. అమూల్ రావడంతో వాళ్లు కూడా రేట్లు పెంచుతున్నారు. మనకు కావల్సింది అదే. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అమూల్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీ ఎం పటేల్ హాజరయ్యారు. రైతులకు అండగా ప్రభుత్వం ► మన రైతులు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.. అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టే.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ప్రభుత్వమే మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ.. రైతులకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే దళారులను సవాల్ చేసింది. ► ఈ రేటు కంటే తక్కువకు అమ్మాల్సిన పనిలేదని, ఆ ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో.. దళారులు అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండున్నరేళ్లుగా అనేక ఉత్పత్తులను ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడగలిగాం. ► ధాన్యం, కూరగాయలు, పండ్లతో పాటు పాడి రైతులకు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా అడుగులు వేశాం. -
పాలు పోసే రైతులే అమూల్ సంస్థ యజమానులు: సీఎం జగన్
-
కృష్ణా జిల్లాలో 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాలో 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. 'కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది చారిత్రాత్మక ఘట్టం. జిల్లాలో రైతులు, అక్కాచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభిస్తుంది. ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. అమూల్ సంస్థ ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైఎస్సార్ జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చింది. అమూల్ దేశంలోనే నెంబర్ వన్ పాదయాత్రలో అనేక చోట్ల పాడి రైతులు వచ్చి కలిశారు. మినరల్ వాటర్ ధరకన్నా పాల ధర తక్కువ ఉందని ఆవేదన చెందారు. అధికారంలోకి రాగానే అమూల్తో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేపట్టాం. పాల ప్రాసెసింగ్లో దేశంలోనే అమూల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అమూల్ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ. ప్రపంచంలో అమూల్ ఎనిమిదో స్థానంలో ఉంది. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప ప్రక్రియ కూడా అమూల్లో ఉంది. పాల బిల్లును కూడా పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. మహిళా సాధికారతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నాం. అమూల్లో పాలు పోసే రైతులే యజమానులు. ఏడాదిలో 182 రోజులు సొసైటీకి పాలు పోసిన రైతులకు బోనస్ కూడా లభిస్తుంది. లీటర్కు 50 పైసలు చొప్పున బోనస్ ఇస్తారు' అని సీఎం జగన్ అన్నారు. కాగా, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కుదేలైన ప్రభుత్వ సహకార డెయిరీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. గతేడాది నవంబర్లో అమూల్తో కలిసి ప్రారంభించిన ఈ పథకం దశల వారీగా రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. జనవరిలో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రోజుకు సగటున 75 వేల లీటర్ల పాలు సేకరణ గతేడాది నవంబర్లో జగనన్న పాలవెల్లువ కింద వైఎస్సార్, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిధిలో 71,373 లీటర్ల పాలు సేకరించగా, ఈ ఏడాది నవంబర్లో ఐదు జిల్లాల పరిధిలో ఏకంగా 21,57,330 లీటర్ల పాలు సేకరించారు. ఇప్పటివరకు 1,093 ఆర్బీకేల పరిధిలో 1,906 గ్రామాలకు చెందిన 1,79,248 మంది రైతుల నుంచి 93,73,673 లీటర్ల గేదె పాలు, 73,96,857 లీటర్ల ఆవు పాలు కలిపి 1.67 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. రోజూ 30,640 మంది రైతుల నుంచి సగటున 75 వేల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తున్నారు. రూ.10.50 కోట్ల అదనపు లబ్ధి పాలు పోసిన రైతులకు ఇప్పటివరకు రూ.71.20 కోట్లు చెల్లించగా.. గతంతో పోలిస్తే వీరు రూ.10.50 కోట్లకు పైగా అదనపు లబ్ధి పొందారు. ప్రైవేటు డెయిరీలు కొవ్వు, వెన్న శాతాలను తగ్గిస్తూ ధరలో కోత పెడుతుంటే జగనన్న పాలవెల్లువలో మాత్రం గరిష్టంగా లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవు పాలకు రూ.35.36 చొప్పున చెల్లిస్తున్నారు. ట్రయిల్ రన్ విజయవంతం అనంతపురం జిల్లాలో 310 గ్రామాల్లో 20,422 మంది, విశాఖపట్నం జిల్లాలో 236 గ్రామాల్లో 30,464 మంది, కృష్ణా జిల్లాలో 314 గ్రామాల పరిధిలో 37,474 మంది అమూల్కు పాలు పోసేందుకు ముందుకొచ్చారు. ట్రయిల్ రన్లో 100 గ్రామాల్లో 1,057 మంది మహిళా పాడి రైతులు రోజూ 6,700 లీటర్ల పాలు పోస్తున్నారు. -
‘పాల వెల్లువ’కు సర్కారు చేయూత
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు చెందిన మహిళా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద రుణాలిస్తూ ఉపాధి కల్పన, సాంఘిక భద్రత కల్పిస్తోంది. సహకార పాడి రంగానికి జవసత్వాలు కల్పించేందుకు అమూల్ సంస్థతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా గుర్తించిన పాల ఉత్పత్తిదారుల సంఘాలకు ఆప్కాబ్, ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ఎలాంటి హామీ లేకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్తోపాటు మేలు జాతి పశువుల కొనుగోలుకు సైతం రుణాలు ఇస్తున్నారు. ఇప్పటికే 8,064 మంది మహిళా పాడి రైతులకు రూ.45.74 కోట్ల రుణాలు అందించారు. వీరిలో 5,010 మంది 5,283 పాడి పశువులను కొనుగోలు చేశారు. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుల స్వీకరణ గేదె కొనుగోలుకు రూ.93 వేలు, ఆవు కొనుగోలుకు రూ.76 వేల వరకు ప్రభుత్వం రుణం ఇప్పిస్తోంది. అంతేకాకుండా మహిళా రైతులు ప్రస్తుతం పెంచుతున్న పాడి పశువులపై వర్కింగ్ క్యాపిటల్ కింద గేదెల కోసం రూ.30 వేలు, ఆవుల కోసం రూ.25 వేల చొప్పున అందిస్తున్నారు. దీర్ఘకాలిక రుణాన్ని 60 నెలల్లో తీర్చాల్సి ఉండగా, వర్కింగ్ క్యాపిటల్ అప్పును 12 నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ను అర్హతను బట్టి రెన్యువల్ కూడా చేస్తారు. ఎస్టీలకు మాత్రం వడ్డీ అగ్రి ఇన్ఫ్రా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద వడ్డీ మినహాయింపు కూడా లభిస్తుంది. రుణాలు పొందగోరే మహిళలు ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో గేదె కొనుక్కున్నాం మాకు రెండు గేదెలున్నాయి. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ కేంద్రానికి పాలు పోస్తున్నాం. వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.50 నుంచి రూ.60 చెల్లిస్తున్నారు. రూ.81 వేలు రుణం రావడంతో మరో గేదె కొనుక్కున్నాం. – ఎం.మంజుల, పార్నపల్లి, పులివెందుల జగనన్న పాల వెల్లువ పథకంలో రిజిస్టర్ అయ్యా అమూల్ కేంద్రానికి పాలు పోసేలా జగనన్న పాల వెల్లువ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పాడి ద్వారా వచ్చే పాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా పోస్తున్నాం. ఇప్పుడు రూ.81 వేల రుణం రావడంతో మరో పాడి గేదె కొనుక్కున్నా. – మొక్కపాటి వెంకాయమ్మ, ఇక్కూరు, గుంటూరు జిల్లా సద్వినియోగం చేసుకోవాలి జగనన్న పాల వెల్లువ కింద అమూల్ కేంద్రాలకు పాలు పోసే మహిళా సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్, దీర్ఘకాలిక రుణ పథకం కింద డీసీసీబీల ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – ఎ.బాబు, ఎండీ, ఏపీడీడీసీఎఫ్ -
జగనన్న పాల వెల్లువ ద్వారా ‘క్షీర’ సిరులు
పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతలో 120 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 14 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాల వెల్లువ సృష్టించనున్నారు. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లాలో క్షీర విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడి రైతుకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సహకార డెయిరీగా పేరొందిన అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాది నవంబర్ నెలాఖరు నుంచి జిల్లాలో కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, చక్రాయపేట మండలాల్లో పాల శీతలీకరణ కేంద్రాలను ప్రారంభించింది. వివిధ మండలాల్లోని 120 గ్రామాల నుంచి రోజుకు 14,000 లీటర్ల పాలను సేకరించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలో మరో 27 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు కçసరత్తు చేస్తున్నారు. పాలలో వెన్న శాతం ఆధారంగా రైతులకు ధర చెల్లిస్తున్నారు. పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం.. పాలు పోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీఆర్డీఏ, ఏపీజీబీ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతోపాటు ఇతర మేలు రకం జాతి గేదెలను కొనుగోలుకు ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున రుణాలను మంజూరు చేసింది. పులివెందుల నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో 1290 మంది మహిళలకు రుణాలు ఇచ్చారు. అన్ని గ్రామాల్లో ఏర్పాటుకు.. జగనన్న పాల వెల్లువ కేంద్రాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 88 టన్నుల పశుగ్రాస విత్తనాలు, 400 టన్నుల దాణామృతం(టీఎంఆర్) అందించారు. దీంతోపాటు ఉపాధిహామీ కింద బహు వార్షిక పశుగ్రాస సాగుకు 280 ఎకరాల మంజూరు చేశారు. దీపావళి బోనాంజా.. గత ఏడాదిలో పాలు పోసిన రైతులకు దీపావళి పండుగ కానుకగా అమూల్ డెయిరీ ప్రతి లీటర్కు 50 పైసలు చొప్పున బోనస్ను ప్రకటించింది. గత సంవత్సరం నవంబర్ నెలలో పాలసేకరణ ప్రారంభించిన రోజు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు కనీసం 157 రోజులు పాలు పోసిన 2012 మంది పాడి రైతులను బోన‹స్కు అర్హులుగా గుర్తించారు. వీరి నుంచి సేకరించిన 19,96,775 లీటర్లకు గాను లీటర్కు రూ. 50 పైసలు చొప్పున రూ.9,96,346 బోనస్ను రైతులు బ్యాంకు అకౌంట్లో జమ చేశారు. వచ్చే ఏడాది నుంచి జిల్లావ్యాప్తంగా వచ్చే ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమూల్ పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో 120 గ్రామాలలో 2768 మంది రైతుల నుంచి రోజుకు 14000 లీటర్లను సేకరిస్తున్నాము. త్వరలో అన్ని గ్రామాల నుంచి పాల సేకరణ చేపడతాం. – వింజమూరి ఉదయకిరణ్, అమూల్ డెయిరీ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్. వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు ఎంత చిక్కనిపాలు పోసినా.. గతంలో ప్రైవేటు వ్యక్తులకు పాలు పోసేవాళ్లం. వాళ్లకు ఎంత చిక్కటిపాలు పోసినా లీటరుకు రూ. 35 ఇచ్చేవారు. దీంతో మేము బాగా నష్టపోయాం. ఇప్పుడు అలా కాదు. మేము పోసిన పాలకు వచ్చిన వెన్న శాతం బట్టి రేటు ఉంటుంది. లీటర్కు 48 నుంచి 65 రూపాయల వరకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. – మేకల లక్ష్మిదేవి, చక్రాయపేట, మండలం బోనస్ కింద రూ.3366 వచ్చింది మేము అమూల్కు పోసిన పాలకు నెలనెల డబ్బులు రావడంతోపాటు బోనస్ కింద గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ. 3366 డబ్బు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పాల డబ్బులతోపాటు బోనస్ డబ్బులు కూడా రావడం మాకు ఆర్థికంగా వెసులుబాటు లభించింది. మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. – పుష్పవతి, మల్లప్పగారిపల్లె మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. దీంతోపాటు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. పాల సేకరణలో కూడా దళారీ వ్యవస్థ లేకుండా మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. గతంలో లీటరు పాలు తక్కువ రేటుకు పోసేవారు. అమూల్ ద్వారా లీటరుకు రూ.45 నుంచి రూ.65 దాకా వస్తుంది. మహిళలంతా సంతోషంగా ఉన్నారు. – డాక్టర్ వీఎల్ సత్యప్రకాష్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ, కడప -
‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో పుంజుకున్న పాడి పరిశ్రమ
ప్రకాశం జిల్లాలో గత పాలకుల నిర్లక్ష్యంతో ఒట్టిపోయిన పాలధారలు ‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో మళ్లీ పుంజుకున్నాయి. పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతగా 242 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 10 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. తద్వారా పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాలవెల్లువ సృష్టించనున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. టీడీపీ హయాంలో నిలువునా మోసపోయిన పాడి రైతుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఉనికి కోల్పోయిన ఒంగోలు డెయిరీకి అమూల్ భాగస్వామ్యం కల్పించి డెయిరీ రంగానికి జవసత్వాలు అందిస్తోంది. టీడీపీ హయాంలోని డెయిరీ పాలక మండలి సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ యాక్ట్లోకి మార్చింది. ఒక పథకం ప్రకారం అప్పుల ఊబిలోకి నెట్టి ఒట్టిపోయిన గేదెలా తయారు చేసింది. ఇదే అదునుగా హెరిటేజ్ డెయిరీతో పాటు ఇతర ప్రైవేట్ డెయిరీలు జిల్లా పాడి రైతులకు సరైన ధర ఇవ్వకుండా నిలువు దోపిడీ చేశాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు డెయిరీ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్ను రంగంలోకి దించి పాడి రైతులకు పూర్వ వైభవాన్ని సంతరించిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్థిక పురోభివృద్ధి దిశగా.. జగనన్న పాల వెల్లువతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. 2020 నవంబరులో ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలి విడతగా 201 గ్రామాల్లో పాలకేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మరో 41 కేంద్రాలను విస్తరింపజేశారు. 242 గ్రామాల్లోని పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 10 వేల లీటర్ల పాలు సేకరించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 37.12 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అందుకుగాను రూ.19.18 కోట్లు మహిళా పాడి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం పాలుపోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా చేయూతనిస్తున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతో పాటు ఇతర మేలు రకం జాతి గేదెల కొనుగోలు చేపట్టారు. వర్కింగ్ కాపిటల్ కింద ఒక్కొక్క గేదెకు ప్రధాన మంత్రి పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.30 వేలు చొప్పున, మరో రూ.70 వేలు బ్యాంకు ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 178 మంది మహిళా రైతులకు రూ.1.52 కోట్లు రుణాల రూపంలో ఇచ్చారు. సహకార బ్యాంకుతో పాటు కమర్షియల్ బ్యాంకుల ద్వారా 194 మంది మహిళా పాడి రైతులకు రూ.2.02 కోట్లు, అదేవిధంగా సెర్ప్ ద్వారా 792 మందికి రూ.7.33 కోట్లు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తంగా జిల్లాలో మహిళా పాడి రైతులు 1,164 మందికి రూ.10.53 కోట్లు ఇచ్చారు. వలంటీర్లతో సర్వే జగనన్న పాల వెల్లువ కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 210 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 201 మెట్రిక్ టన్నుల దాణామృతం (టీఎంఆర్) అందించనున్నారు. అలాగే 40 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసే ఛాప్ కట్టర్స్ను రైతులకు ఇస్తున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం 2020–21 సంవత్సరంలో 110 శాతం లక్ష్య సాధనతో జిల్లాలో 4.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో కనీసం 10 దేశీయ పశువులు కలిగి కృత్రిమ గర్భధారణ సౌకర్యంలేని రైతులకు జిల్లాలో 55 ఆబోతు దూడలను ఉచితంగా అందజేయనున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. ఎలాంటి షూరిటీలు లేకుండా మహిళా పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం. గ్రామాల్లో పాడి పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి రోజు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అమూల్ సంస్థ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రతి ఇంటిలో పాడి పరిశ్రమ ఉండేలా చూస్తున్నాం. – డాక్టర్ కొప్పరపు బేబీరాణి, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ -
‘అమూల్’పై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా పాల సేకరణ, మార్కెటింగ్ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో తమ వాదనలు వినాలంటూ పాల రైతులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కేసులో అమూల్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు దాఖలు చేసిన కౌంటర్లకు తిరుగు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ గడువు కోరారు. ఇందుకూ అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు, అమూల్, ఏపీడీడీసీఎఫ్ల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం తాలూకు జీవో 25ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
గోడమీది పిల్లులు... లెక్కల్లో కాకులు
చంద్రబాబునాయుడును చూస్తే అన్ని జంతువులూ ఈర్ష్య పడేట్టున్నాయి. ఈయనే కాకి లెక్కలు వేస్తాడు, ఈయనే నక్క జిత్తులు ప్రదర్శిస్తాడు, ఈయనే గోడమీది పిల్లి అవుతాడు. ఆయనకూ, ఆయన నడుపుతున్న టీడీపీకి ఒక విధానం అంటూ ఉన్నట్టు లేదు. తమకు ఏది అవసరమో అక్కడ ఆ వాదనను తెరపైకి తెస్తారు. అనుకూలం కాకపోతే దానికి పూర్తి విరుద్ధమైనది మాట్లాడుతారు. దాన్ని సమర్థించుకోవడానికి అడ్డగోలు లెక్కలు వేయడానికి కూడా వెనుకాడరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం అమూల్తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల వారి వ్యవహారంలో ఎంతమాత్రమూ హేతుబద్ధత కనిపించదు. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్లకు నిర్మాణం ఇష్టం లేదు. వీరు విధ్వంస ప్రేమికులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతున్న సైంధవులు.కాకి లెక్కలు చెప్పడంలో కానీ, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని మించిన పార్టీ బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు. ఒక వైపు సొంత పార్టీ వారు ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థిస్తారు. మరో వైపు ప్రభుత్వం ప్రజా ఉపయోగార్థం ఏదైనా కొత్త ప్రతిపాదనతో ముందుకు వెళుతుంటే మాత్రం ఏదో రకంగా అడ్డం పడటానికి విశ్వయత్నం చేస్తుంటారు. అదే రాజకీయం అని వారు గట్టిగా నమ్ముతున్నారు. వారికి ఒక ఎంపీ తోడయ్యారు. ఆయన వారికి ఉపయోగపడుతున్నారు. అమూల్తో ఒప్పందానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దానిపై హైకోర్టు వారు ఇచ్చిన తాత్కాలిక తీర్పు వారికే కొంతవరకు అనుకూలంగా ఉండవచ్చు. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్లో మూతపడిపోయిన సహకార డెయిరీలను పునరుద్ధరించడానికీ, వాటి ద్వారా రైతులకు మరింత మేలు కలిగేలా చేయడానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రైతుల సంస్థ అయిన అమూల్తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. అందులో భాగంగా కొన్ని ప్లాంట్లను, ఇతర సదుపాయాలను అమూల్కు లీజ్ ప్రాతిపదికన కేటాయించారు. దీనిని తెలుగుదేశం తప్పుపడుతోంది. గోడమీది పిల్లి వాటం ఇదే తరుణంలో తమ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చి దానిని తన సొంత కంపెనీ మాదిరిగా నడుపుకుంటున్నారన్న అభియోగాన్ని సమర్థిస్తుంటారు. ఆయన వేరే ప్రైవేటు కంపెనీని నడుపుతూ సహకార డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చుకున్నా, తన తండ్రి పేరుమీద ఒక ట్రస్టు పెట్టి, ఆ ట్రస్టులో తన కుటుంబ సభ్యులనే యాజమాన్య బాధ్యతలలో పెట్టి, సంగం డెయిరీకి చెందిన పదెకరాల భూమిని బదలాయించినా తెలుగుదేశం వారు సమర్థిస్తారు. ఇదే వారి గొప్పదనం. వీరు ఏదో ఒక విధానానికి కట్టుబడి ఉండరు. తమకు ఎక్కడ ఏది అవసరమో ఆ వాదనను తెరపైకి తీసుకువస్తుంటారు. తద్వారా వారు తమ డొల్లతనాన్ని బయట పెట్టుకుంటారు. అయినా ప్రజలు వాటిని గమనించలేరని వారి నమ్మకం. ప్రజల విజ్ఞత పట్ల వారికి అంత గౌరవం. బాగుపడితే ఓర్వరా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ మూతపడిన సహకార డెయిరీలను ఇప్పుడు అమూల్కు అప్పగించడంలో కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడం మొదలు పెట్టారు. టీడీపీ మీడియా దానికి ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇస్తుంటుంది. నిజంగానే స్కామ్ ఉందని అనుకుంటే ఆ మీడియానే పరిశోధించి వార్తలు ఇవ్వవచ్చు కదా? కేవలం టీడీపీ వారి ఆరోపణలనే ప్రముఖంగా ఇచ్చారంటేనే వాటిలో ఎంత నిజం ఉందన్న ప్రశ్న వస్తుంది. మూత పడ్డ సహకార డెయిరీలలోని యంత్రాల విలువ 550 కోట్ల రూపాయలుగా వీరు లెక్కవేశారు. అలాగే భవనాలు, భూముల విలువ 750 కోట్ల రూపాయలుగా గణించారు. రాష్ట్రంలోని 9,800 గ్రామాలలో బల్క్ కూలర్లు ఖర్చు చేయడాన్ని వీరు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కూలర్ల కోసం ఖర్చు పెడితే అది ఆస్తి అవుతుందా, లేదా? మూతపడ్డ డెయిరీ ప్లాంట్లను తెరచి పనిచేయించేందుకు అమూల్కు తక్కువ మొత్తానికే లీజుకు ఇచ్చారని తెలుగుదేశం ప్రచారం ఆరంభించింది. అంటే తెలుగుదేశం పార్టీ వారికి ఈ సహకార డెయిరీలు మూతపడి, యంత్ర పరికరాలన్ని తుప్పుపట్టినా, భవనాలు శి«థిలావస్థకు చేరినా ఫర్వాలేదు కానీ, అమూల్ వంటి రైతుల సంస్థలకు అప్పగించి బాగు చేయించడం ఇష్టం లేదన్నమాట. చేయరు... చేయనివ్వరా? నిజానికి పాలపరిశ్రమ రంగంలో అనుభవం ఉన్న చంద్రబాబు పాలనాకాలం లోనే వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం జరిగి ఉండాల్సింది. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. మరి దీనికి చంద్రబాబుకు సొంతంగా హెరిటేజ్ పాల సంస్థ ఉండడమే కారణమని ఎవరైనా ఆరోపిస్తే తెలుగుదేశం పార్టీ వారు అంగీకరిస్తారా? ఇప్పుడు ప్రభుత్వం వీటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడితే తప్పు పడతారా? మరి వీరే ఇప్పుడు ధూళిపాళ్ల నిర్వాకాన్ని ఎలా అంగీకరిస్తారు? ఆయన అరెస్టును రాజకీయ కక్షగా ఎలా ప్రచారం చేస్తారు? ఆయన రైతుల శ్రేయస్సే ప్రధానంగా పనిచేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అలా జరగడం లేదన్నది విమర్శ. సహకార రంగంలోని డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చి సొంత సంస్థలా ధూళిపాళ్ల నడపడం సరైనదా, కాదా? అన్న విషయం వీరు ఎందుకు చెప్పడం లేదు. పైగా ఆయనే మరో ప్రైవేటు డెయిరీని నడుపుకోవచ్చా? అది తప్పా? కాదా? అన్నదానిపై తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడరు. అధినేత లాభాల కోసమేనా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా... విశాఖ సహకార డెయిరీ కూడా ఒక వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. మరో వైపు అమూల్ ఏడాదికి వంద కోట్ల రూపాయలు అయినా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో హేతుబద్ధత ఎంత ఉందన్నది వారికి అనవసరం. నిజంగానే ప్రభుత్వానికి అమూల్ ఇంకాస్త చెల్లించాలని అడిగితే అడగవచ్చు. కానీ అసాధారణ డిమాండ్ చేయడమే ఆక్షేపణీయం. అందుకే టీడీపీ వారివి కాకి లెక్కలు అనేది. అమూల్ సంస్థ రైతుల సహకార సంస్థ కాదని తెలుగుదేశం చెప్పగలదా? దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరొందిన అమూల్ సేవలను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడితే టీడీపీ నేతలకు ఉలికిపాటు దేనికి? తమ అధినేత కంపెనీకి లాభాలు తగ్గుతాయని వీరు ఆందోళన చెందుతున్నారా? అమూల్ కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లిస్తామని మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదట. టీడీపీ మాటల్లోని మతలబు గుర్తించడం కష్టం కాదు. మూతపడ్డవి తెరవొద్దా? చంద్రబాబు హయాంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. వాటిలో నిజాం షుగర్స్ ఒకటి. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ఈ సంస్థను, ప్రత్యేకించి బోధన్లో ఉన్న ఆస్తులను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. అది కొన్నాళ్లు నడిపి చేతులెత్తేసింది. అంతే, ఆ తర్వాత అది మూతపడింది. మళ్లీ ఇంతవరకు తెరుచుకోలేదు. ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీ సంతోషిస్తుందా? అమూల్ రంగంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులకు మేలు జరిగిందా? లేదా? హెరిటేజ్తో సహా ఆయా ప్రైవేటు డెయిరీలు రైతులు సరఫరా చేసే పాలకు ఇస్తున్న ధరను పెంచాయా? లేదా? వీటిని పరిగణనలోకి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ పెద్ద నేతలు చెబితే, చోటా మోటా నేతలు వారి అనుకూల టీవీలలో కూర్చుని ఆరోపణలు చేస్తుంటే ప్రజలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే టీడీపీ వారు విధ్వంసం కోరుకుంటున్నారన్న సంగతి అర్థం అయిపోతుంది. ఒక పక్క పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తూ, మరో పక్క వచ్చిన ఒక భారీ పరిశ్రమను అడ్డుకోవడానికి టీడీపీతో సహా కొన్ని శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయన్న విమర్శ వస్తోంది. తెలుగుదేశం పార్టీ వారు గుడ్డి ద్వేషంతో ప్రతిదానిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వారు మూల్యం చెల్లించుకున్నారు. ఎన్నికలలో ఎన్నిసార్లు ఓడినా వారి వారి ఆలోచనలలో మార్పు రావడం లేదు. ముందుగా టీడీపీ వారు ఇలాంటి విషయాలలో ఒక విధానం తయారు చేసుకుని మాట్లాడాలి. లేకుంటే పోయేది వారి పరువే. ధైర్యం ఉంటే మూతపడ్డ సహకార డెయిరీ ప్లాంట్లను తెరవవద్దని వీరు చెప్పగలరా? కానీ ఆరోపణలు మాత్రం చేస్తుంటారు. ఇదే దిక్కుమాలిన రాజకీయం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అమూల్తో ఒప్పందం అమలుకు ఎలాంటి ఖర్చు చేయొద్దు
సాక్షి, అమరావతి: అమూల్తో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా పాలసేకరణ, మార్కెటింగ్ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాడి రైతుల లబ్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం–అమూల్ కుదుర్చుకున్న ఒప్పందంపై నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, అమూల్, ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్లకు నోటీసులు జారీచేసింది. వీరికి వ్యక్తిగతంగా నోటీసులు పంపే వెసులుబాటును రఘురామకృష్ణరాజుకు ఇచ్చింది. వీరికి నోటీసులు పంపిన రుజువులను కోర్టు ముందుంచాలని రఘురామను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రిమండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతోపాటు, అమూల్, ఏపీడీడీసీఎఫ్ల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం తాలుకు జీవో 25ను రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కొంగర విజయలక్ష్మి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం సవివరంగా దాఖలు చేసిన కౌంటర్ హైకోర్టు రికార్డుల్లో కనిపించలేదు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేస్తామని, అప్పటివర కు పిటిషనర్ కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రతిపాదించింది. దీనిని ప్రభుత్వ ప్రత్యేక న్యా యవాది (ఎస్జీపీ) చింతల సుమన్ తీవ్రంగా వ్యతి రేకించారు. రాష్ట్రంలో పలు ప్రైవేటు డెయిరీలకు లబ్ధిచేకూర్చడం కోసమే అమూల్తో ప్రభుత్వ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు పిల్ వేశారని కోర్టుకు వివరించారు. పాడిరైతుకు లీటరు కు అదనంగా రూ.4 వస్తుంటే చూసి తట్టుకోలేక ఈ వ్యాజ్యం వేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతను తేల్చాలని కోరారు. అయినా.. ధర్మాసనం రఘురామకృష్ణరాజు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇది ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల అదృష్టం
సాక్షి, అమరావతి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని సరిగ్గా గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో సీఎంగా ఉండటం అక్కడి పాడి రైతుల అదృష్టమని అమూల్ ఎండి ఆర్ఎస్ సోధి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏపీ– అమూల్ పాలసేకరణను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ పాడి రైతుల కష్టాలను స్వయంగా గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా అమూల్ను ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో గుజరాత్ ఉందని వివరించారు. ఏపిలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి విలువ ఏడాదికి రూ.7 వేల కోట్లు అని చెప్పారు. గుజరాత్లో ఏ విధంగా అమూల్ వల్ల పాడి రైతులకు మేలు జరిగిందో, ఏపీలో అలాగే మేలు జరుగుతోందని అన్నారు. అమూల్కు లాభాలు ముఖ్యం కాదు అమూల్ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, ఇతర కార్పొరేట్, మల్టీనేషన్ కంపెనీల మాదిరిగా లాభాలను మాత్రమే ఆర్జించడం అమూల్ లక్ష్యం కాదని సోధి అన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో అన్ని జిల్లాల్లోనూ మహిళా రైతుల భాగస్వామ్యంతో సహకార వ్యవస్థ ద్వారా పాల సేకరణ జరుగుతుందని వివరించారు. నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను మార్కెట్లో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమూల్ ఈ రంగంలో ఉన్న నైపుణ్యాలను రైతులకు పంచుతుందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాణ్యమైన పాలు ఉత్పత్తి అవుతాయని, మార్కెట్లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే యాబై శాతం మార్కెట్ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పాడి రైతుల కళ్లలో ఆనందం మహిళా రైతులు మాట్లాడిన భాష నాకు తెలియకపోయినా, వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ ప్రారంభించాం. దేశంలోనే అమూల్కు ప్రజల్లో మంచి గుర్తింపు రావడానికి కారణం అమూల్ కొనసాగిస్తున్న నాణ్యతా ప్రమాణాలు. అలాగే పాడి రైతులకు మరింత మేలు చేయాలన్న లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాడిరైతులతో కలిసి అమూల్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తుంది. అమూల్ తో కలిసి పని చేసే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూర్చడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. – పటేల్, సబర్ డెయిరీ ఎండీ -
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్
సాక్షి, అమరావతి: ‘వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగెత్తగలుగుతుందని నమ్మాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోకి అమూల్ని తీసుకు వచ్చాం. పాల సేకరణ ద్వారా అక్కచెల్లెమ్మలందరికీ మరింత ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. తద్వారా వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జగనన్న పాల వెల్లువలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్ పాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆమూల్ పాల సేకరణను విస్తరించనున్నామని చెప్పారు. తద్వారా పాడి రైతులైన అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలోపేతం కానున్నారని పేర్కొన్నారు. ‘పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఒక లీటరు పాలు తీసుకుని వచ్చి నాకు చూపించేవారు. ఒక లీటరు పాల రేటు రూ.23 ఉంది. ఒక లీటరు మినరల్ వాటర్ రేటు ఇంత కన్నా ఎక్కువుంది.. ఇదీ మా పరిస్థితి అని అక్కచెల్లెమ్మలు, పాడి రైతులు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలని, వ్యవసాయ ఆధారిత రంగాల ద్వారా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలని వెంటనే రాష్ట్రంలోకి అమూల్ని తీసుకొచ్చాం’ అన్నారు. అమూల్కు లాభాపేక్ష లేదని, లాభాలన్నీ ఏడాదికి ఒకసారి తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తూ గొప్ప పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అమూల్ దేశంలో నంబర్ వన్ సహకార సంస్థ ► అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరంలేదు. దేశంలోనే నంబర్ వన్ సహకార రంగ సంస్థ. దాదాపుగా రూ.50 వేల కోట్లు టర్నోవర్ చేస్తున్న ఈ సంస్థలో వాటాదారులు ప్రైవేటు వ్యక్తులు కాదు. వాటాదారులు అందరూ కూడా పాలుపోసే అక్కచెల్లమ్మలే. మిగిలిన వాళ్లతో పోలిస్తే పాల సేకరణ ధరను అక్కచెల్లెమ్మలకు అమూల్ అధికంగా ఇస్తోంది. ► అమూల్ సంస్థ ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్కు మిగతా సంస్థలకు తేడాను కూడా గమనించాలి. అమూల్ సంస్థలో పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారే చేసే విధంగా వారి ప్రాసెసింగ్ ఉంది. ► సహకార సంస్థను బాగా నడిపితే, ప్రైవేటు వ్యక్తులు ఆ సంస్థను ఆక్రమించకపోతే, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి అమూల్ సజీవ ఉదాహరణ. ఇలాంటి అమూల్ సంస్థతో 2020 జూలై 21న ఒప్పందం కుదుర్చుకున్నాం. అదే సంవత్సరం డిసెంబర్ 2న అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పాల సేకరణ ► చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాల్లో విజయవంతంగా పాలసేకరణ జరుగుతోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ అడుగు పెడుతోంది. 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 2,600 గ్రామాల్లో, రెండేళ్లు పూర్తయ్యేలోగా మొత్తంగా 9,899 గ్రామాల్లో అమూల్ను విస్తరించి, అక్క చెల్లెమ్మలకు ప్రతి లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 వరకు ఎక్కువ రేటు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాం. ► మిగతా డెయిరీలతో పోల్చితే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ‘ప్రైవేట్’ స్వార్థంతో సహకార డెయిరీలు మూత ► సహకార రంగంలోని డెయిరీలు నష్టాలలో కూరుకుపోయాయి. ప్రైవేటు డెయిరీలు అటు పాడి రైతులను, ఇటు వినియోగదారులను దోపిడీ చేయగలిగే పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరిగిందంటే సహకార రంగంలో ఉన్న డెయిరీలకు అమూల్ మాదిరిగా పూర్తి స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాల్సిన పరిస్ధితిలో లేకపోవడమే. ► మార్కెట్ను పెంచుకోవడంలో సహకార డెయిరీలు ఆ స్థాయికి ఎదగలేదు. కొన్ని మంచి డెయిరీలను ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా ఆక్రమించేసుకుని, వాటిని ప్రైవేట్ ఆస్తుల కింద మార్చుకున్నారు. ► ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో ప్రయోజనాలు ఉన్నందు వల్ల వాళ్ల ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్రంలో సహకార వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిన పరిస్ధితులు మన కళ్లెదుటే కనిపించాయి. ఈ పరిస్థితిని మార్చి.. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్న అన్న తపన, తాపత్రయం, ఆరాటంతో ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. కళ్లెదుటే పాలల్లో నాణ్యత పరీక్ష ► 2,600 గ్రామాల్లో మనం బీఎంసీలు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్(ఏఎంసీ) తీసుకొస్తున్నాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. గతంలో పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటన్నది అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ తెలిసేది కాదు. ► ఇప్పుడు బీఎంసీలు, ఏఎంసీల వల్ల మన కళ్ల ఎదుటే మనం పోసే పాల నాణ్యత తెలిసిపోతుంది. అలా తెలిసిన వెంటనే ఒక స్లిప్ కూడా ఇస్తారు. దీనివల్ల అక్కచెల్లెమ్మలు ఏ ఒక్కరూ కూడా దోపిడీకి గురికారు. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్కచెల్లెమ్మలకు అమూల్ మంచి రేటు ఇవ్వగలుగుతుంది. ► ఇంతకు ముందు కూడా అక్కచెల్లెమ్మలు అదే నాణ్యత పాలు పోసినా, మోసపోయేవాళ్లు. మంచి రేటు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు అమూల్ మోసం చేయడం లేదు కాబట్టి, నాణ్యత అక్కడికక్కడే బయటపడుతోంది. ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు ప్రతి అక్కచెల్లెమ్మకు అదనంగా లబ్ధి కలుగుతోంది. అక్కచెల్లెమ్మల మేలు కోసం రూ.4 వేల కోట్ల పెట్టుబడి ► అక్కచెల్లెమ్మలకు ఈ మేలు ప్రతి గ్రామంలో జరగాలన్న తపన, తాపత్రయంతో దాదాపుగా 9,899 గ్రామాలను గుర్తించాం. ఈ గ్రామాల్లో రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. బీఎంసీ, ఏఎంసీల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. ► అక్కచెల్లెమ్మల మహిళా సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు మీకందరికీ తెలిసినవే. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, వడ్డీలేని రుణాలు, సంపూర్ణ పోషణ.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కాకుండా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లతో పాటు మద్య నియంత్రణ దిశగా మనమంతా అడుగులు వేస్తున్నాం. పనులు, పోస్టుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే ► వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగ నియామకాల్లో 50 శాతం పై చిలుకు అక్కచెల్లెమ్మలను తీసుకొచ్చాం. నామినేటెడ్ పోస్టులతో పాటు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం వారికే కేటాయించాం. ► కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, బీసీ కార్పొరేషన్లు.. ఇలా ఎక్కడ చూసినా కచ్చితంగా సగం అక్కచెల్లెమ్మలకు వచ్చే విధంగా చట్టాలు తీసుకొచ్చినందువల్ల ఈ రోజు మహిళా సాధికారత అనేది ఏ స్థాయిలో ఉందనేది కనిపిస్తోంది. మనందరి ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధికి ‘చేయూత’ ► చేయూత పథకం కింద అక్కచెల్లెమ్మలకు ఇచ్చే డబ్బులు మరింత మెరుగ్గా ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలను వాళ్ల ఇంటి ముందుకే తీసుకొస్తున్నాం. వారు పెట్టిన పెట్టుబడి నష్టపోకూడదనే ఉద్దేశంతో పెద్ద, పెద్ద సంస్థలతో టై అప్ చేశాం. ► ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రొక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ లీవర్ వంటి పెద్ద పెద్ద సంస్థలతో టై అప్ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాం. లక్షా 12 వేల యూనిట్ల ఆవులు, గేదెలు కొనుగోలు చేయించి, రూ.75 వేల మొత్తాన్ని ‘చేయూత’కు టై అప్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ అందరికీ మరింతగా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమూల్ ఎండీ ఆర్ ఎస్ సోధి, సబర్ డెయిరీ ఎండీ డాక్టర్ బీఎం పటేల్ హాజరయ్యారు. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్ల పాలు సేకరించింది. అందుకు రూ.24 కోట్ల 54 లక్షల చెల్లింపు జరిగింది. తద్వారా ఇంతకు ముందు ఆ అక్కచెల్లెమ్మలు అమ్ముతున్న ధర కంటే ప్రతి లీటరు మీద రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అమూల్ సంస్థ చెల్లించింది. ఈ లెక్కన రూ.4 కోట్ల 6 లక్షలు ఆ అక్కచెల్లెమ్మలకు అదనంగా ఆదాయం వచ్చిందని ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు గతంలో పాల కేంద్రం నిర్వహణ మహిళల వల్ల కాదు అన్నారు. మీ వల్ల నేడు మా గ్రామంలో మేమే దానిని నిర్వహించగలుగుతున్నాం. మీరు ఉన్నారనే ధైర్యం ఇప్పుడు మాకు వచ్చింది. అమూల్ పాల వెల్లువను ఇంకా ముందుకు తీసుకుపోతాం. అమూల్కు పాలు పోయడం వల్ల మా సభ్యుల్లో ఒకరికి లీటర్కు 75 రూపాయలు వచ్చాయి. గతంలో ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు. – సుజాత, కొమ్ముగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా -
పాడిరైతుల కోసం అమూల్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చాం: సీఎం జగన్
-
పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి/పశ్చిమగోదావరి: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టామన్నారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశానని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ‘‘ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చాం. అమూల్ సంస్థలో వాటాదారులంతా పాలు పోసే అక్కాచెల్లెమ్మలు. పాలసేకరణలో చెల్లించే ధరలు.. మిగిలిన సంస్థల కంటే అమూల్ సంస్థలో ఎక్కువ. అమూల్ ద్వారా పాడిరైతులకు మంచి లాభాలు వస్తున్నాయి’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘‘ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పాల సేకరణ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ప.గో.జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలసేకరణ చేస్తుంది. రాష్ట్రంలో 9,899 గ్రామాలకు అమూల్ను విస్తరిస్తాం. లీటర్కు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు వచ్చేలా చేస్తాం. 13,739 మంది అక్కాచెల్లెమ్మలకు ఇప్పటివరకు అదనంగా రూ.4 కోట్ల 6 లక్షలు వచ్చింది. పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు. ఏఎంసీ, బీఎంసీ వద్ద పాలు పోసిన వెంటనే నాణ్యత తెలిపి స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఆధారంగా ప్రతి లీటర్కు రూ.5 నుంచి రూ.15 అదనంగా వస్తుందని’’ సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు: అమూల్ ఎండీ గ్రామాల అభివృద్ధికి సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అమూల్ ఎండీ సోథీ అన్నారు. అమూల్ సంస్థ రైతుల భాగస్వామ్యంతోనే నడుస్తోందన్నారు. అమూల్ సంస్థకు వచ్చే లాభాలను పాడిరైతులకే అందిస్తున్నామని అమూల్ ఎండీ తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్ జగన్ -
నేడు పశ్చిమ గోదావరిలో అమూల్ పాల సేకరణ
సాక్షి, అమరావతి: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేస్తోంది. శుక్రవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పాల సేకరణ మొదలు పెట్టబోతోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. అమూల్ సంస్థ ఇప్పటికే చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాలు సేకరిస్తోంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి విడతగా 142 గ్రామాల్లో పాలు సేకరించనుంది. పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా లీటర్కు రూ.5 నుంచి రూ.7 వరకు పాడి రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణకు సంబంధించి దాదాపు 15 వేల మంది రైతులను గుర్తించి.. రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అమూల్ సంస్థ 10 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లు చెల్లిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేస్తోంది. చదవండి: వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్ జగన్ -
పశ్చిమ గోదావరికి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ విస్తరణ
సాక్షి, అమరావతి: ఏపీ అమూల్ ప్రాజెక్ట్ను శుక్రవారం మరో జిల్లాకు విస్తరించనున్నారు. పశ్చిమ గోదావారి జిల్లాలో పాల సేకరణ నిర్వహించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ నిర్వహించారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 142 గ్రామాల్లో పాల సేకరణ జరగనుంది. పాల సేకరణకు సంబంధించి 15 వేల మంది రైతులను అమూల్ సంస్థ గుర్తించింది. అమూల్ సంస్థ నుంచి పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా అమూల్ సంస్థ నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తుంది -
కాకినాడ ఫిషింగ్ హార్బర్పై దృష్టి పెట్టండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్, ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్), మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, పశు సంవర్థక విభాగాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలి. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్పై దృష్టి పెట్టండి: సీఎం జగన్ ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్భర్ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు. కాగా, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులకు సంబంధించి ఆయా రంగాలు, విభాగాలలో వివిధ ప్రాజెక్టుల, పనుల పురోగతిని సమావేశంలో అధికారులు వివరించారు. ఆ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.15,743 కోట్లు అని తెలిపారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎంపీఎఫ్సీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. డ్రై స్టోరేజీ–డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గోదాములు, ఎస్సేయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు మొదలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రా, పశు సంవర్థక మౌలిక సదుపాయాల వరకు దాదాపు 16 రకాల ప్రాజెక్టులు తీసుకురానున్నారు. ఆ మేరకు 4,277 డ్రై స్టోరేజీ , డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయనున్నారు. పీడీఎస్ కోసం 60 గోదాములు, 1,483 సేకరణ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్, టర్మరిక్ బాయిలర్లు, టర్మరిక్ పాలిషర్లు. ఇంకా 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, 10,678 ఎస్సేయింగ్ ఎక్విప్మెంట్, అలాగే 10,678 సేకరణ కేంద్రాల ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీడీడీసీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా 9,899 బల్క్ మిల్లింగ్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), 8,051 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాల (ఏఎంసీయూ) నిర్మాణం చేపట్టనున్నారు. బీఎంసీయూల నిర్మాణానికి రూ.1,885.76 కోట్లు, ఏఎంసీయూల నిర్మాణానికి రూ.942.77 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9,051 చోట్ల బీఎంసీయూల కోసం భూమి గుర్తించగా, 6,252 యూనిట్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది.ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి మొత్తం బీఎంసీయూల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమూల్ పాల సేకరణ గత ఏడాది నవంబరు 20వ తేదీన ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలలో పాల సేకరణ మొదలు పెట్టగా, ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలోనే మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు. ఈనెల 4వ తేదీ (శుక్రవారం) నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ పాల సేకరణ మొదలు పెడుతోంది. నాలుగు జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్, వారికి రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. ఆ విధంగా రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం లభించింది. మత్స్యశాఖ–మత్స్యకారులు మత్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రిప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, 100 ఆక్వా హబ్లు ఏర్పాటు చేయనున్నారు. 100 ఆక్వా హబ్లలో ఇప్పటికే 25 హబ్లు మంజూరు కాగా, ఈనెలలోనే వాటి పనులు మొదలు పెట్టనున్నారు. మొత్తం 133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వాహబ్లకు దాదాపు రూ.646.90 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్లు తొలి దశలో 4 ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అవి ఉప్పాడ (తూ.గో), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు) హార్బర్లను వచ్చే ఏడాది (2022) డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం -
ఆ లీజుల వెనుక దురుద్దేశాలేవీ లేవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ డీడీసీఎఫ్) ఆస్తులను గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్)కు లీజుకిస్తూ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళల సాధికారత, పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది. పాల ఉత్పత్తిదారులకు సాధ్యమైనంత మంచి ధర రావాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామంది. దీనివల్ల దాదాపు 30 లక్షల మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతారని వివరించింది. ఈ విధాన నిర్ణయం వెనుక సామాజిక, సంక్షేమ కారణాలున్నాయని తెలిపింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తులను అమూల్ సంస్థకు వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వడం లేదని, పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను అమూల్ వాటాదారులకు పంచే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఆ లాభాలను మహిళా పాల సహకార సంఘాల (ఎండీఎస్ఎస్) సభ్యుల మధ్య పంపిణీ చేయడం జరుగుతుందని వివరించింది. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు ఏపీ డీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అమూల్, ఏపీ డీడీసీఎఫ్ మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందానికి సంబంధించిన జీవో 25ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కౌంటర్ దాఖలు చేస్తూ.. అమూల్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న పిటిషనర్ రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ఈ పిల్ దాఖలు చేశానని చెబుతున్న రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో ఎక్కడా ఏపీ డీడీసీఎఫ్ ఆస్తులను అమూల్కు లీజుకిస్తే పాల రైతులు ఎలా ప్రభావితం అవుతారో చెప్పలేదని కౌంటర్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు సంగం డెయిరీ అక్రమాలు బహిర్గతమైన సమయంలోనే రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం చేశారని.. ఇది వ్యక్తిగత ప్రయోజన, రాజకీయ ప్రయోజన వ్యాజ్యమే తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎంత మాత్రం కాదని పూనం మాలకొండయ్య తన కౌంటర్లో పేర్కొన్నారు. అమూల్తో ఒప్పందం తరువాత మహిళా పాడి రైతులకు లీటరుకు రూ.4 నుంచి రూ.14 వరకు అదనంగా లభిస్తోందని తెలిపారు. ప్రైవేటు పాల కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ఈ పిల్ దాఖలు వెనుక ప్రధాన ఉద్దేశమని, ఈ ఒక్క కారణంతో ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. రఘురామ వాస్తవాలను తొక్కిపెట్టారు రూ.వెయ్యి కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణరాజుపై సీబీఐ తీవ్ర అభియోగాలతో ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిందని, వరా>్గల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు అతనిపై రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయని మాలకొండయ్య కోర్టుకు నివేదించారు. వీటి గురించి పిటిషనర్ ఎక్కడా కూడా వ్యాజ్యంలో ప్రస్తావించకుండా వాస్తవాలను తొక్కిపెట్టారని, ఇది హైకోర్టు పిల్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. -
మూతపడ్డ డెయిరీల పునరుద్ధరణకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడ్డ సహకార రంగంలోని పాల డెయిరీలను సాధ్యమైంత త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. మూతపడ్డ డెయిరీల్లోని యంత్రాలను అమూల్ సంస్థకు లీజుకివ్వడం ద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు రూపకల్పన చేసే బాధ్యతను ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్)కు అప్పగించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్య హక్కులు ఏపీడీడీసీఎఫ్కే.. ఏపీడీడీసీఎఫ్ పరిధిలో జి.కొత్తపల్లి సహకార పాలడెయిరీ మినహా మిగిలిన అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లె, పులివెందుల డెయిరీలు మూతపడ్డాయి. వీటిలో 60 వేల మంది పాల ఉత్పత్తిదారులుండగా, రోజుకు 2.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తయ్యేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా అమూల్ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో పాల సేకరణ చేస్తున్న ఈ సంస్థకు.. ఏపీలో ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు లేవు. రాష్ట్రంలో సేకరిస్తున్న పాలను కర్ణాటకలోని కూలింగ్ యూనిట్లకు తీసుకెళ్లి అక్కడ ప్రాసెసింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మూత పడిన డెయిరీల్లోని యంత్ర పరికరాలను లీజుకు ఇవ్వడం ద్వారా అమూల్కు సహకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీడీడీసీఎఫ్ పంపిన లీజు ప్రతిపాదనలకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మూతపడిన డెయిరీల్లో రూ.12 కోట్ల విలువైన 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మదనపల్లెలోని యూహెచ్టీ ప్లాంట్, ఒంగోలులోని ఫాడర్ ప్లాంట్ ఉన్నాయి. రోజుకు 10.40 లక్షల లీటర్ల పాలను సేకరించి ప్రాసెస్ చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ యంత్ర పరికరాలను లీజుకు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏ డెయిరీల్లో ఎలాంటి యంత్ర పరికరాలున్నాయి? వాటిలో ఎన్ని వినియోగంలో ఉన్నాయో పరిశీలిస్తారు. ఉత్పత్తి ఆధారంగా లీజు మొత్తాన్ని నిర్ధారించి అమూల్కు అప్పగిస్తారు. వాటిపై యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ఏపీడీడీసీఎఫ్కే ఉంటాయి. -
డెయిరీలకు ఊతమివ్వడమే సర్కారు 'పాల'సీ
సహకార రంగంలోని మిల్క్ డెయిరీలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి. గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడిన సహకార డెయిరీలను తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాడి రైతులకు మంచి రోజులొస్తున్నాయి. పాడి రైతులకు గిట్టుబాటు ధర పెరిగేలా ఇప్పటికే చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలను సైతం తిరిగి తెరిపించడం ద్వారా రానున్న రోజుల్లో పాడి పరిశ్రమ సమర్థవంతంగా నిలదొక్కుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 27 లక్షల రైతు కుటుంబాల వద్ద 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు ఉన్నాయి. వాటిద్వారా రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో సహకార డెయిరీలు 21.7 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేట్ డెయిరీలు సేకరిస్తున్నారు. మరో 2.19 కోట్ల లీటర్లు అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్కు చేరుతున్నాయి. ‘అమూల్’ రాకతో.. సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్న ‘అమూల్’ సంస్థతో గత ఏడాది ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆమూల్ సంస్థ రైతుల నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పాలను విక్రయించే రైతులకు లీటర్ ఆవు పాలకు రూ.4, గేదె పాలకు వెన్న శాతాన్ని బట్టి రూ.7 నుంచి రూ.20 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. 2022 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అమూల్ ద్వారా పాల సేకరణ జరిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇందులో భాగంగా గత పాలకుల నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా మూతపడిన సహకార డెయిరీలను లీజు ప్రాతిపదికన అప్పగించి.. వాటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీ డీడీసీఎఫ్) పరిధిలో అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల, జి.కొత్తపల్లి సహకార పాల డెయిరీలుండగా వాటిలో జి.కొత్తపల్లి డెయిరీ మినహా మిగిలిన డెయిరీలన్నీ గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడ్డాయి. ఈ ఆరు డెయిరీలకు పూర్వ వైభవం అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల డెయిరీలను లీజు ప్రాతిపదికన అమూల్ సంస్థకు అప్పగించటం ద్వారా తిరిగి వాటిని తెరిపించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. గతంలో ఈ డెయిరీల పరిధిలో 60 వేల మంది పాల ఉత్పత్తిదారులు ఉండేవారు. వీరినుంచి రోజుకు 2.5 లక్షల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.851.5 కోట్ల టర్నోవర్ జరిగేది. వీటికి రూ.1,655 కోట్ల విలువైన 688.36 ఎకరాల భూములున్నాయి. తెలంగాణా రాజధాని హైదరాబాద్లో రూ.343.55 కోట్ల విలువైన 25.22 ఎకరాల భూములు ఉన్నాయి. గత పాలకులు సొంత డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలకు మేలు చేకూర్చే లక్ష్యంతో సహకార డెయిరీల ద్వారా సేకరించిన పాలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకుండా చేశారు. ఫలితంగా ఒక్కొక్కటిగా అవి మూతపడ్డాయి. వీటిలో ప్రస్తుతం రూ.12 కోట్ల విలువైన 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 మిల్క్ ప్రోసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మదనపల్లిలో యూహెచ్టీ ప్లాంట్, ఒంగోలులో పౌడర్ ప్లాంట్ ఉన్నాయి. రోజుకు 10.40 లక్షల లీటర్ల పాలను సేకరించి ప్రోసెస్ చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఏళ్ల తరబడి ఉపయోగించని మౌలిక సదుపాయాలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మూతపడిన డెయిరీలకు పూర్వవైభవం కల్పించనున్నారు. తద్వారా ఈ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు అధిక పాల ధర లభించనుంది. ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం దశాబ్దాల క్రితం మూతపడిన సహకార డెయిరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఇప్పటికే అమూల్ సంస్థకు పాలు పోసేందుకు పాడి రైతులు పోటీ పడుతున్నారు. సహకార పాడి రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. – ఎ.బాబు, ఎండీ, ఏపీ డీడీసీఎఫ్ పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా.. రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న డెయిరీలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూతపడిన డెయిరీల నిర్వహణ బాధ్యతలను అమూల్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడం చాలా మంచి ఆలోచన. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన డెయిరీలకు పూర్వ వైభవం వస్తే పాడి రైతులకు మంచి జరుగుతుంది. – వైవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ అగ్రి మిషన్ చాలా సంతోషంగా ఉంది మాకు రెండు గేదెలున్నాయి. ఒక్కో గేదె 5 లీటర్ల చొప్పున పాలిస్తుంది. గతంలో లీటర్కు రూ.40 నుంచి రూ.45 ఇచ్చేవారు. ప్రస్తుతం అమూల్ డెయిరీకి పాలు పోస్తున్నాం. ఇప్పుడు లీటర్కు రూ.65 నుంచి రూ.70 వరకు ఇస్తున్నారు. మా ఊళ్లో పాడి రైతులంతా అమూల్ డెయిరీకే పాలు పోస్తున్నారు. పులివెందుల డెయిరీని అమూల్కు అప్పగిస్తున్నారని తెలిసింది. సంతోషంగా ఉంది. – కొత్తపల్లి విమల, మహిళా రైతు, పులివెందుల -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్
అమ్మఒడి, 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాల పట్టాలు, దిశ చట్టం, సున్నా వడ్డీ రుణాలు, ఆసరా, చేయూత పథకాలతో పాటు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో మహిళలకు సగం ఇస్తున్నాం. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అందుకే ప్రతి పథకంలో వారికి ప్రాధాన్యం. ప్రతి అడుగులో ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని ప్రభుత్వం భావిస్తూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు అమూల్ వల్ల అక్క చెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పాడి మహిళా రైతుల సంక్షేమం కోసమే అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణను చేపట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల అక్కచెల్లెమ్మలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతీ లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా చెల్లిస్తారని తెలిపారు. రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం విప్లవాత్మక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. అమూల్లో మహిళలే భాగస్వాములని, వారికే లాభాల పంపకం జరుగుతుందని, అందుకే ఆ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలు సేకరిస్తుండగా, కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతోపాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య(జీసీఎంఎంఎఫ్–అమూల్) ఎండీ ఆర్ఎస్ సోధి, సబర్కాంత సహకార సంఘం ఎండీ డాక్టర్ బీఎం పటేల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మల మేలు కోసమే.. ► ఈరోజు గుంటూరు జిల్లాలో అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. గతేడాది జూలై 21న అమూల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పాడి రైతులైన అక్కచెల్లెమ్మలకు మేలు చేయడానికి ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ మేరకు గతేడాది డిసెంబర్ 2న రాష్ట్రంలో అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైంది. 400 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతుండగా.. వాటిలో ప్రకాశం జిల్లాలో 200 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 100, వైఎస్సార్ జిల్లాలో 100 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో 129 గ్రామాలు, చిత్తూరులో మరో 174 గ్రామాల నుంచి పాల సేకరణ మొదలవుతోంది. అమూల్ రాకతో 400 గ్రామాల్లో అక్క చెల్లెమ్మల జీవితాలు మారాయన్నది సుస్పష్టం. సీఎం వైఎస్ జగన్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న మహిళలు లీటరుపై రూ.7 వరకు.. అమూల్ రాకతో ప్రతి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా వస్తోందని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. పులివెందులలోనూ పాలు సేకరిస్తున్నారు. అమూల్ సంస్థ అక్కచెల్లెమ్మలకు అదనంగా రేటు ఇవ్వగలుగుతోంది అంటే.. అందుకు కారణం ఆ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అది ప్రైవేటు సంస్థ కాదు, ఓ సహకార సంస్థ. అందులో వాటాదారులు అక్కచెల్లెమ్మలే. ఆ సంస్థ అధిక ధరలకు పాలు కొనుగోలు చేయడమేగాక.. సంస్థకొచ్చే లాభాలను తిరిగి అక్కచెల్లెమ్మలకే ఇస్తుంది. అదీ నిజమైన సహకార సంస్థ స్పూర్తి.. ప్రత్యేకత. ► అమూల్ చేసే ప్రాసెసింగ్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ సంస్థ పాలనుంచి ఐస్క్రీమ్లు, చాక్లెట్లు కూడా తయారు చేస్తోంది. అందుకే పాలకు మంచి ధర ఇస్తోంది. అమూల్ ఉత్పత్తులు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అందుకే లాభాలు వస్తున్నాయి. అమూల్ మన రాష్ట్రానికి రావడం విప్లవాత్మక పరిణామమని చెప్పుకోవాలి. అదనంగా రూ.3.52 కోట్లు ఇచ్చింది.. గతేడాది డిసెంబర్ నుంచి ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఇప్పటివరకు 10,871 మంది మహిళా పాడి రైతుల నుంచి 41.44 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్ సంస్థ ఆ రైతులకు రూ.18.46 కోట్లు చెల్లించింది. ఇతర డెయిరీలు చెల్లించిన మొత్తం కంటే రూ.3.52 కోట్లు అదనంగా అమూల్ రైతులకు ఇచ్చింది. సహకార డెయిరీలకు పూర్తి ప్రోత్సాహం.. అమూల్ను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చడానికి... మహిళా డెయిరీ సహకార సంఘాల(ఎండీఎస్ఎస్)కు పూర్తి ప్రోత్సాహం అందించేలా ఇప్పటికే 9,899 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లో పాల సేకరణ కేంద్ర భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అందుకు దాదాపు రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఆ మేరకు పెద్ద ఎత్తున ‘ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు’(ఏఎంసీయూ), ‘బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల’(బీఎంసీయూ) నిర్మాణం మొదలుపెట్టింది. పదిరోజులకోసారి నగదు జమ.. గతంలో ఏనాడూ పాల నాణ్యత అనేది పాడి రైతుల సమక్షంలో జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఏఎంసీయూ, బీఎంసీయూల ఏర్పాటు ద్వారా ఆ ప్రక్రియ పాడి రైతుల సమక్షంలోనే జరుగుతుంది. అదేవిధంగా పాల సేకరణ తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి అమూల్ సంస్థ రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది. ► అమూల్ వల్ల రెండు మంచి పనులు. ఒకటి లీటరుకు రూ.7 వరకు ఎక్కువ ధర. రెండోది మోసం లేదు. ఏఎంసీయూ, బీఎంసీయూల ద్వారా రైతుల సమక్షంలోనే పాల నాణ్యత పరిశీలన. తద్వారా కూడా ఆ పాలకు మంచి ధర వస్తోంది. గతంలో రైతుల ముందు పాల నాణ్యత పరిశీలన ఉండేది కాదు కానీ ఇప్పుడు అంతా పారదర్శకం. ఆర్బీకేల ద్వారా దాణా: పాడి గేదెలు కావాలని మహిళా పాడి రైతులు కోరుతున్నారు. అయితే చేయూత పథకంలో దీన్ని చేర్చడం జరిగింది. ఆ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు పాడి గేదెలు తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల రాకతో పాల సేకరణ చాలా బాగుంటుంది. అంతేగాక రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను అందిస్తాం. ► ఈ కార్యక్రమంలో మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జిల్లా నుంచి హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజని, ఇంకా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా పాడి రైతులు పాల్గొన్నారు. వారే మా సంస్థ యజమానులు రాష్ట్రంలో పాడి రైతులకు ప్రయోజనం కల్పించడంలో అమూల్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని తెలిసింది. ఇది చాలా ఎక్కువ ఉత్పత్తి అని చెప్పొచ్చు. 36 లక్షల మహిళా పాడి రైతులు అమూల్లో భాగస్వాములే. వారే ఆ సంస్థ యజమానులు. ఇప్పుడు ఏపీలోనూ పాడి మహిళా రైతులకు మేలు చేసేలా అమూల్ పనిచేస్తుంది. వారికి అండగా నిలుస్తుంది. పాలసేకరణ కేంద్రాల్లో ఆటోమేటిక్ యంత్రాలుంటాయి. అవి పాడి రైతుల ముందే పాల నాణ్యతను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఆ పాలకు ఎంత ధర గిట్టుబాటు అవుతుందన్నదీ తెలుస్తుంది. ఇవన్నీ రాష్ట్రంలో మహిళా పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. –ఆర్ఎస్ సోధి(అమూల్ ఎండీ) -
ఇష్టార్జితం లాభాలు పొంగాయి
పాడి ఉన్న ఇళ్లను రెండు గంటల ముందే సూర్యభగవానుడు నిద్రలేపేస్తాడు. తర్వాత తను తీరిగ్గా మేల్కొంటాడు. ఈలోపే నావల్బెన్ దల్సంగ్ భాయ్ తన పనుల్నీ కానిచ్చేస్తారు. 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి ఆమెకు. పనివాళ్లూ పదిహేను మంది వరకు ఉన్నారు. ఎంతమంది ఉన్నా, అరవై రెండేళ్ల నావల్బెన్ వీలైంతవరకు స్వయంగా తనే పాలు పితుకుతారు. అది మాత్రం పని కాదు ఆమెకు. మనసుకు స్థిమితాన్ని ఇచ్చే ప్రాతఃకాల పూజా వందనం! నావల్బెన్ ఇప్పుడు పాల వ్యాపారి మాత్రమే కాదు. గుజరాత్, బనస్కాంత జిల్లా మహిళలకే ఆదర్శవంతురాలు. అసలైతే ఆమెను సంపాదనపరురాలు అనాలి. మహిళలు సంపాదనపరులు అవడానికి ఆదర్శంగా నిలిచారు నావల్బెన్. అందుకే ఆదర్శ మహిళ. గత ఏడాది నావల్బెన్ రెక్కల కష్టం విలువ కోటీ పదిలక్షల రూపాయలు. అందులో ఆమె లాభం నెలకు 3 లక్షల 50 వేల రూపాయలు. ఎంతమంది పెద్ద ఉద్యోగులకు వస్తుంది ఇంత జీతం! అమ్మపాలైనా, అమ్ముకునే పాలైనా నమ్మకంగా ప్రాణాన్ని నిలబెడతాయి. బతికే సత్తువనిస్తాయి. నావల్బెన్ తన జిల్లాలోని మహిళల ఆలోచనలకు.. (నాలుగు రాళ్లు సంపాదించాలన్న ఆలోచన) ఇలాంటి సత్తువనే ఎక్కించారు. గుజరాత్లోని ‘అమూల్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీ’ కూడా తెల్లారితే నావల్బెన్ పంపించే పాల కోసం ఎదురు చూస్తుంటుంది. 2019–20లో అమూల్ కు, మిగతా డెయిరీలకు నావల్బెన్ క్యాన్ల నుంచి వెళ్లిన పాలు 2 లక్షల 21 వేల 595 కిలోలు. విలువ కోటీ పదిలక్షలు. చేతికొచ్చింది 87 లక్షల 95 వేల 900 రూపాయలు. ఖర్చులన్నీ పోగా సగటున నెలకు మూడున్నర లక్షల ఆదాయం. పాలను మనం లీటర్లలో కొలుస్తాం. డెయిరీలు కిలోల్లో కొలుస్తాయి. ఒక లీటరు పాలు కిలో కంటే కాస్త ఎక్కువ బరువు తూగుతాయి. కచ్చితంగా చెప్పాలంటే ఒక లీటరు పాలు 1 కిలో 32 గ్రాములకు సమానం. ∙∙ అమూల్ డెయిరీ గత ఆగస్టులో ‘10 మిలియనీర్ రూరల్ ఉమన్ ఆంట్రప్రెన్యూర్స్’ జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి స్థానం నావల్బెన్దే. అందుకు ఆమె సంతోషించినప్పటికీ.. ఉద్యోగాలు చేస్తున్న తన నలుగురు కొడుకుల జీతం మొత్తం కలిపినా కూడా నెలకు తను సంపాదించిన దాని కంటే తక్కువేనని కాస్త ఎక్కువ సంతోషంగా చెబుతారు. నావల్బెన్ పూజ గదిలో ఆమె సంపాదించిన మరికొన్ని గుర్తింపుల ప్రతిమలు, పత్రాలు ఉన్నాయి. రెండు ‘లక్ష్మీ అవార్డు’లు, మూడు ‘బెస్ట్ పుష్పక్ అవార్డు’లు వాటిల్లో ఉన్నాయి. బనస్కాంత జిల్లాకు, గుజరాత్ రాష్ట్రానికే కాదు, మొత్తం దేశంలో బిజినెస్ ఉమన్ అందరికీ నావల్బెన్ ఒక దిక్సూచి అని చెప్పాలి. ఆ దిక్కున తెలవారుజామునే లేచి. పాడితో కలిసి, సూర్య భగవానుని మేల్కొలిపితే ధనం, ఆరోగ్యం పొంగి పొరలుతాయి. -
స్పందన ‘అమూల్’యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్ సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. అదనపు ఆదాయంతో పాడి రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. పైలట్ జిల్లాల్లో రోజుకు సగటున 25 వేల లీటర్లను సేకరిస్తుండగా, లీటర్పై రూ.5 నుంచి రూ.20ల వరకు అదనంగా లబ్ధి చేకూరుతుండడంతో పాల ఉత్పత్తిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దీంతో రెండో విడతగా ఈ ప్రాజెక్టును గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.. జాతీయ స్థాయిలో 15.04 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ.. మార్కెటింగ్లో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 27లక్షల రైతు కుటుంబాల వద్ద 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలున్నాయి. వాటిలో 21.47 లక్షల గేదెలు, 13.56 లక్షల ఆవుల ద్వారా రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గృహావసరాలకు 1.24 కోట్ల లీటర్ల వినియోగమవుతుంటే, మార్కెట్లోకి 2.88 కోట్ల లీటర్ల పాలొస్తున్నాయి. ‘అమూల్’ ప్రాజెక్టుతో ఏపీలో పాల విప్లవం వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గ్రామీణ మహిళల్లో ఆర్థిక సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా గత నెల 2న వైఎస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు పైలెట్ జిల్లాల్లో 12,430 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో నాలుగు వేల మందికి పైగా రోజూ సగటున సుమారు 25వేల లీటర్ల చొప్పున రోజుకు 10లక్షల లీటర్ల పాలను అందిస్తున్నారు. వాటి నిమిత్తం రూ.4.68 కోట్లు చెల్లించారు. ఆవు పాలకు రూ.5–7, గేదె పాలకు రూ.7–20 వరకు అదనంగా లబ్ధిచేకూరడమే కాక పది రోజుల్లోనే డబ్బులు జమవుతుండడంతో అమూల్ ప్రాజెక్టులో చేరేందుకు రైతుల్లో ఆసక్తి పెరిగింది. అంతేకాక.. ఈ ప్రాజెక్టులో భాగంగా 9,899 రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రూ.1,250 కోట్లతో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల (బీఎంసీయూ) కోసం రూ.1,672 కోట్లతో సర్కారు భవనాలు నిర్మిస్తోంది. వీటికి అనుసంధానంగా 17,950 గ్రామాల్లో ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను (ఎఎంసీయూ) ఏర్పాటుచేస్తున్నారు. లీటర్కు అదనంగా రూ.20 వస్తోంది రోజుకు ఏడు లీటర్ల పాలను సాయిరాం డెయిరీకి పోసేవాళ్లం. లీటర్కు రూ.30–35మధ్య వచ్చేది. ప్రస్తుతం అమూల్ కేంద్రంలో పోస్తున్నాం. పాలలో 7 శాతం వెన్న ఉండడంతో బోనస్తో కలిపి సగటున ప్రస్తుతం లీటర్కు రూ.50ల నుంచి 55లు వస్తోంది. – పి. మాధురి, వేముల, వేంపల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా చాలా సంతోషంగా ఉంది నాకు మూడు జెర్సీ ఆవులున్నాయి. రోజుకు 18 లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలకు పోసేవాళ్లం. లీటరుకు రూ.25–26 వచ్చేది. ఇప్పుడు అమూల్ పాల కేంద్రానికి ఇస్తున్నాం. ప్రస్తుతం లీటర్కు రూ.30–31 వస్తోంది. గతంతో పోల్చుకుంటే మంచి రేటొస్తోంది. – ఎస్. కలవతమ్మ, వేంపల్లి, మదనపల్లి, చిత్తూరు జిల్లా రెండో విడతలో గుంటూరు, పశ్చిమగోదావరి ఏపీ–అమూల్ ప్రాజెక్టుకు పాల ఉత్పత్తిదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మూడు జిల్లాల్లో స్పందన బాగుంది. రెండో విడతలో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ నెలాఖరు నుంచి పాల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం. – ఎ. బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆర్థిక స్వావలంబనకు పునాది రాష్ట్రంలో పాల విప్లవం తీసుకురావడమే లక్ష్యం. పాల ఉత్పత్తిదారులకు మంచి ధర కల్పించడం, మార్కెట్లో పోటీని సృష్టించడం.. పాల సేకరణ, ఖర్చు, సరఫరా వ్యయం మధ్య అంతరాన్ని తగ్గించడం అమూల్ ప్రాజెక్టు లక్ష్యం. రానున్న 20–30 ఏళ్లలో గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆర్థిక స్వావలంబనకు ఇది పునాది కానుంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్ ఏపీ అగ్రి మిషన్ -
‘బాబులో వణుకు మొదలైంది’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్లో విమర్శనాస్త్రాలు సంధించారు. 'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీచేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రీకొడుకులు, మద్ధతుదారులైన సినీనటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతుందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: (సోషల్ మీడియా కార్యకర్తలను విస్మరించం..) 'అమూల్ రాకతో వేల కోట్ల హెరిటేజ్ డెయిరీ సామ్రాజ్యం కుప్పకూలుతుందని వణికిపోతున్నాడు బాబు. దేశంలో అతిపెద్ద సహకార డెయిరీ అమూల్పై పార్టీ నేతలతో విషం చిమ్మిస్తున్నాడు. కిందపడి ఎంతలా కొట్టుకున్నా.. పాల ఉత్పత్తిలో రాష్ట్రం రెండేళ్లలో అగ్రస్థానానికి దూసుకుపోతుంది' అంటూ వరుస ట్వీట్లు చేశారు. చదవండి: ('ఇద్దరూ తలుపులు బిగించుకొని ఇంట్లో దాక్కున్నారు') -
అక్కచెల్లెమ్మల ప్రగతే మా లక్ష్యం
‘అమూల్ వల్ల హెరిటేజ్ చావదు. వేరే రాష్ట్రాలకు వెళ్లి పాలు సేకరిస్తుంద’ని నిన్న లోకేశ్ ఏదో టీవీలో అన్నారట. అంటే అర్థం వారు ఇంత కాలం తక్కువ ధర ఇస్తున్నారనే కదా? చంద్రబాబు మీద కోపంతోనో, హెరిటేజ్ టార్గెట్గానో అమూల్ను తేలేదు. మా రాడార్ లో చంద్రబాబు లేరు. మా లక్ష్యం చంద్రబాబు కాదు. మా మైండ్ సెట్ కూడా అది కాదు. అమూల్ అనేది సహకార దిగ్గజం. లక్షలాది మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేయాలి.. చేయూత ఇవ్వాలనే తపన, ఆరాటంతోనే అమూల్తో ఒప్పందం చేసుకున్నాం. బాబు, హెరిటేజ్ అనేవి చాలా చిన్న విషయాలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 27 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆర్థిక, వ్యాపార ప్రగతి.. ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా లక్ష్యంగా దేశంలోనే అతి పెద్ద సహకార డెయిరీ ‘అమూల్’తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 50 దేశాల్లో పోటీ పడుతున్న అతి పెద్ద సహకార డెయిరీ అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉందని, ఇందులో రైతులే వాటాదారులని పేర్కొన్నారు. అధిక ధరకు పాలు కొనుగోలు చేయించడం ద్వారా పాడి రైతులు, అక్క చెల్లెమ్మల ఆదాయం పెంచడమే కాకుండా లాభాల్లో బోనస్ కూడా ఇప్పించడం కోసమే ప్రభుత్వం అమూల్ను తీసుకొచ్చిందని వివరించారు. అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ)పై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా సహకార రంగంలోని డెయిరీలను చంద్రబాబు సర్కారు ఖూనీ చేసిన తీరును సీఎం జగన్ ఆధార సహితంగా ఎండగట్టారు. ‘నా పాదయాత్ర సందర్భంగా కొందరు మినరల్ వాటర్ బాటిల్ చూపించి రూ.21కి కొన్నామన్నారు. లీటరు పాలకు కూడా దాదాపు అదే ధర వస్తోందని చెప్పారు. మినరల్ వాటర్తో సమాన ధరకు వారు పాలు అమ్ముకోవాల్సి రావడం దారుణం. పశువులను అమ్ముకుందామనుకున్నామని, ఇప్పుడు మంచి ధర వస్తుందనే నమ్మకం కలిగిందని మొన్న ఏపీ – అమూల్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు’ అని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి? – రాష్ట్రంలో పాలు పోసే వారికి ఒక పద్ధతి ప్రకారం మంచి ధర రానివ్వకుండా చేశారు. అలా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపేశారు. సహకార డెయిరీలను ఖూనీ చేసి ప్రయివేటు డెయిరీలు ఏకమై స్వార్థంతో ఒకే ధర నిర్ణయిస్తున్నాయి. – దీంతో వాటికి పోలు పోయడం లేదా పాడి పశువులను అమ్ముకోవడం తప్ప రైతులకు, అక్క చెల్లెమ్మలకు గత్యంతరం లేకుండా పోయింది. ఒక వ్యక్తి ప్రైవేటు డెయిరీ స్థాపించి దాన్ని లాభాల్లో ముంచాలనే స్వార్థంతో రాష్ట్రంలోని మొత్తం సహకార రంగాన్ని చంపేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇందుకు ఆ ఒక్క వ్యక్తి స్వార్థమే కారణం. ‘మ్యాక్స్’ చట్టంతో గ్రహణం – 1992లో హెరిటేజ్ డెయిరీ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 1995లో ‘పరస్పర సహాయ సహకార సంఘాల’ (మ్యాక్స్) చట్టం తెచ్చారు. నియమాలన్నింటినీ తుంగలో తొక్కి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల డెయిరీలను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చింది. – విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లో.. గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్ కంపెనీల కింద మార్చేయడం ఇంకా అన్యాయం. ఇవాళ ఎవరైనా సంగం డెయిరీని సహకార రంగంలోని డెయిరీ అని చెబుతారా? ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి దాన్ని ప్రైవేటు సంస్థలా నడుపుతున్నారు. ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖూనీ చేశారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ మూసివేత – చిత్తూరు డెయిరీ ఒకప్పుడు ‘హెరిటేజ్’కి పోటీ పడిందని, 2003లో చంద్రబాబు దానిని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. – దొరబాబు.. (ఈయన్ను బీఎస్ రాజ నర్సింహులు అని కూడా అంటారు)ను చిత్తూరు డెయిరీ చైర్మన్ను చేసి.. ఆయన ద్వారా విజయవంతంగా మూసి వేయించారు. అందుకు రివార్డుగా ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. – 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రూ.100 ఉన్న హెరిటేజ్ షేర్ ధర 2017 డిసెంబర్ నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది. ?ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్ విలువ ఇలా పెరగడాన్ని ఏమనాలి? షేర్ రిగ్గింగ్ చేశారేమో! బాబు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్ షేర్ ధర మళ్లీ రూ.205కు పడిపోయింది. – బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణాలు తీసుకున్న వారు హెరిటేజ్ డెయిరీకే పాలు పోయాలనే దారుణమైన నిబంధన పెట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అమూల్ లాభాల్లోనూ అక్కచెల్లెమ్మలకు వాటా – వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 2020 జూలై 21న అమూల్తో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్ రావడం వల్ల పాడి రంగంలో ఉన్న 27 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుతుంది. రైతుల నుంచి పాలను అధిక ధరకు కొనుగోలు చేయించడం ఈ ఒప్పందం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ‘అమూల్’ లాభాల్లో కూడా పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలకు ఏటా రెండు సార్లు వాటా ఇప్పిస్తాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదెంతో దోహదపడుతుంది. – రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఆయా గ్రామాల్లో రూ.16.90 లక్షలతో భవనం, రూ.10 లక్షలతో బీఎంసీయూ, రూ.1.40 లక్షలతో ఆటోమేటిక్ పాల సేకరణ యూనిట్.. మొత్తం రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. తొలి దశలో వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలైంది. లంచాలు, దళారుల మాటే ఉండదు. – ఇప్పటికే 7 వేల ఆవులు, గేదెలు పంపిణీ చేశాం. 2021 ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. అమూల్ ఇచ్చే ధర ఎంత ఎక్కువంటే.. – ? లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ.33.60తో, దొడ్ల డెయిరీ రూ.34.20, జెర్సీ సంస్థ రూ.34.80తో కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.39కి కొనుగోలు చేయనుంది. ?– 10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ ఉన్న గేదె పాలను సంగం, హెరిటేజ్ సంస్ధలు రూ.58తో, జెర్సీ సంస్థ రూ.60కి కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.64.97కు కొనుగోలు చేయనుంది. – ఆవు పాలు లీటరు (3.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్ఎన్ఎఫ్)కు హెరిటేజ్ సంస్థ రూ.23.12 ఇస్తుంటే, అమూల్ రూ.28 చెల్లించనుంది. చేయూతలో దాదాపు 24.55 లక్షల అక్క చెల్లెమ్మలకు, ఆసరాలో దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు డబ్బు ఇస్తున్నాం. ఈ డబ్బును సరైన పద్దతిలో రిస్క్ లేని చోట పెట్టిస్తే వారికి రెగ్యులర్గా ఆదాయం వస్తుంది. దాని వల్ల వారు లక్షాధికారులు అవుతారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. ఈ సమున్నత ఆశయం, ఆరాటంతోనే అమూల్, ఐటీసీ, రిలయన్స్ లాంటి సంస్థలను తీసుకొచ్చాం. అంతే తప్ప, చంద్రబాబు, హెరిటేజ్లను దెబ్బ తీయాలని కాదు. మాది అంత చౌకబారుగా ఆలోచించే తత్వం కాదు. -
చంద్రబాబు, హెరిటేజ్ కోసం అమూల్ను తేలేదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా అయిదో రోజు అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారులైన రైతులు, మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా అమూల్తో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంపై శుక్రవారం చర్చించారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అమూల్ సంస్థలో రైతులే యజమానులు అని పేర్కొన్నారు. అమూల్ ఒక సహాకార సంస్థ అని ఇది నేడు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పోటిపడుతోందన్నారు. ప్రపంచంలోనే అమూల్ 8వ స్థానంలో ఉందన్నారు. చదవండి: ఎల్లో మీడియాపై సీఎం జగన్ ఆగ్రహం అతి పెద్ద సహకార డెయిరీ అమూల్ అన్ని బహుళ జాతి సంస్థలు. 50 దేశాలలో పోటీ పడుతోందని పేర్కొన్నారు. దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అత్యంత పెద్ద సహకార రంగంలోని సంస్థ అని తెలిపిన సీఎం జగన్ ఆ సంస్థలో వచ్చే లాభాలు, అవి తీసుకునేవారు రైతులేనని పేర్కొన్నారు. ఎందుకంటే రైతులే ఆ సంస్థలో వాటాదారులు. ఇక్కడ సేకరించే పాలకు అమూల్ సంస్థ అక్క చెల్లెమ్మలకు అత్యధిక ధరలు ఇవ్వడమే కాకుండా, సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఏటా రెండుసార్లు తిరిగి ఇస్తారన్నారు. అంత గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోందని ప్రశంసించారు. ఇంకా ఏమన్నారంటే.. మినరల్ వాటర్ కన్నా తక్కువ ధర ‘ప్రభుత్వ పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చూస్తే. నా పాదయాత్రలో కొందరు మినరల్ వాటర్ బాటిల్ తీసుకువచ్చి చూపి, దాన్ని రూ.21కి కొంటున్నామని, లీటరు పాలకు కూడా దాదాపు అదే ధర వస్తోందని చెప్పారు. అంటే మినరల్ వాటర్తో సమాన ధరకు వారు పాలు అమ్ముకోవడం దారుణ పరిస్థితి. మొన్న అమూల్ లాంచ్ సందర్భంగా అక్క చెల్లెమ్మలు చెప్పారు. తాము పశువులను అమ్ముకుందామనుకున్నామని, కాని ఇప్పుడు నమ్మకం కలిగిందని అంతా చెప్పారు. చదవండి: పచ్చి అబద్ధాలకు ఫుల్ స్టాప్ పడాలి రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి? రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం పాలు పోసే వారికి మంచి ధర రానివ్వకుండా చేశారు. ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపేశారు. ఎప్పుడైతే సహకార రంగం అనేది లేకుండా పోతుందో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు ఒక్కటై ఒకే ధర నిర్ణయిస్తున్నారు. అంతకు మించి ఇవ్వబోమంటున్నారు. గత్యంతరం లేక పాలు వారికే పోయాలి, లేదా పాడి పశువులు అమ్ముకోవాలి. ఒక పద్ధతి ప్రకారం సహకార రంగాన్ని చంపేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. త దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే.. కేవలం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రైవేటు డెయిరీ స్థాపించడం, దాన్ని లాభాల్లో ఉంచడం కోసం రాష్ట్రంలో ఉన్న మొత్తం సహకార రంగాన్ని చంపేశాడు. 1974 వరకు డెయిరీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవగా, ఆ ఏడాది డెయిరీ అభివృద్ది సంస్థ పరిధిలోకి తెచ్చారు. ఆ తర్వాత 1981లో డెయిరీ రంగంలో త్రీ టయర్ కోఆపరేటివ్ వ్యవస్థ ఏర్పడింది. దాంతో 9 సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచి ప్రయాణం బాగా జరిగింది. ‘మ్యాక్స్’ చట్టంతో గ్రహణం 1995లో ‘పరస్పర సహాయ సహకార సంఘాల’ (మ్యాక్స్) చట్టం వచ్చింది. దాన్ని చంద్రబాబు తెచ్చారు. అంతకు ముందు 1992లో హెరిటేజ్ ప్రారంభించిన చంద్రబాబు, 1995లో సీఎం కాగానే, ఏపీ మ్యాక్స్ చట్టం తెచ్చారు. అనంతరం విశాఖ డెయిరీని1999లో, కృష్ణా డెయిరీని 2001లో, గుంటూరు డెయిరీని 1997లో, ప్రకాశం డెయిరీని 2002లో, నెల్లూరు డెయిరీని 2002లో, కర్నూలు డెయిరీని 2002లో సహకార రంగంలో ఉన్న ఈ డెయిరీలన్నీ మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ విధంగా చంద్రబాబు హయాంలోనే వాటన్నింటినీ మార్చారు. ఏపీ మ్యాక్స్.. ఏదైనా సొసైటీ లేదా యూనియన్, మ్యాక్స్కు మారాలి అంటే, ఆయా సహకార సంస్థలలో ఉన్న ప్రభుత్వ వాటా, ఆస్తులను వెనక్కు ఇవ్వాలి. లేదా ఆ రీఫండ్కు సంబంధించి ప్రభుత్వంతో ఒక అవగాహన (ఎంఓయూ) చేసుకోవాలి. అయితే ఆ నియమాలన్నింటినీ తుంగలో తొక్కి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల డెయిరీలను మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. అంత కన్నా అన్యాయం అది ఒక రకమైన అన్యాయమైతే విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లోనూ, గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్ కంపెనీల కింద మార్చేశారు. కంపెనీల చట్టంలో అలాంటి అవకాశం లేకపోయినా వాటిని మార్చేశారు. అంతే ఒక పద్ధతి ప్రకారం సహకార సంస్థలను ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోకి తీసుకునే కార్యక్రమం జరిగింది. ఆ స్థాయిలోకి వ్యవస్థను దిగజార్చారు. ఇవాళ ఉభయ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురం డెయిరీలు ఏపీ సహకార సంఘాల పరిధిలో ఉంటే, కృష్ణా, నెల్లూరు, కర్నూలు డెయిరీలు మ్యాక్స్ చట్టం కింద, గుంటూరు, ప్రకాశం, విశాఖ డెయిరీలు కంపెనీల చట్టం పరిధిలో ఉన్నాయి. అంటే ఒక పద్ధతి ప్రకారం డెయిరీలను నిర్వీర్యం చేశారు. ఇవాళ సంగం డెయిరీని ఎవరైనా సహకార రంగం డెయిరీ అని చెబుతారా. ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి దాన్ని ప్రైవేటు సంస్థ కింద నడుపుతున్నాడు.ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖూనీ చేశారు. చంద్రబాబు–చిత్తూరు డెయిరీ చంద్రబాబు దగ్గరుండి డెయిరీలను ఖూనీ చేశారు. అది ఏ స్థాయిలో ఆ పని చేశారంటే.. చిత్తూరు డెయిరీ అయితే ఒకప్పుడు హెరిటేజ్ డెయిరీకి పోటీ పడ్డాయి. దాంతో దాన్ని ఖూనీ చేయడం కోసం, ఈ పెద్దమనిషి సీఎంగా ఉన్నప్పుడు, 2003లో చిత్తూరు డెయిరీని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల క్లిప్ ప్రదర్శించి చదివి వినిపించారు. ఇక చంద్రబాబుకు కావాల్సిన మనిషి దొరబాబు. ఆయనను బీఎస్ రాజా నర్సింహులు అని కూడా అంటారు. ఆయన చిత్తూరు డెయిరీకి ఛైర్మన్గా పని చేశారు. ఆయనను ఛైర్మన్ను చేసి చంద్రబాబు చక్రం తిప్పారు. తర్వాత విజయవంతంగా చిత్తూరు డెయిరీని ఆయన మూసివేయించాడు. దొరబాబు ఆ పని చేశాడు కాబట్టి, ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడు. ఏ రకంగా సహకార రంగాన్ని మూసివేయించారనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.. ఇంకా ఆయన మాటల్లోనే.. అధికారంలో ఉంటే హెరిటేజ్ లాభాలు: ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ లాభాలు, షేర్ విలువ పెరుగుతాయి. ఆయన దిగిపోతే తగ్గిపోతాయి. ► 1999 నుంచి జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ ప్రకారం హెరిటేజ్ షేర్ ధర చూస్తే.. ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999 జనవరి,1న హెరిటేజ్ షేర్ ధర రూ.2.89 ఉండగా, అది డిసెంబరు 12, 2003 నాటికి ఏకంగా రూ.26.90 అయింది. ► ఆ తర్వాత 2009 ఎన్నికల ముందు, చంద్రబాబు అధికారంలో లేనప్పుడు ఏప్రిల్ 9. 2009 నాటికి షేర్ ధర రూ.16.35కు పడిపోయింది. ►మళ్లీ సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం (కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు) సమయంలో రూ.35 నుంచి రూ.100కు పెరిగింది. ► 2014లో ఆ పెద్దమనిషి సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో రూ.100 షేర్ 2017 డిసెంబరు నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది. ► ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్ విలువ ఆ స్థాయిలో పెరిగితే ఏమనాలి? ► బాబు గారు దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్ షేర్ ధర మళ్లీ రూ.205కు తగ్గింది. ► ఒక్కసారి గమనించండి. బాబు అధికారంలో ఉంటే ఆయన డెయిరీ షేర్ విలువ పెరిగింది. ఆయన అధికారంలో లేనప్పుడు ప్రజల ఆదాయం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా–హెరిటేజ్: ► ఇది ఏఎన్ఐ రిపోర్టు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ ఎంఓయూ. 30.12.2016న ఆ ఒప్పందం చేసుకున్నారు. ► రైతులకు సులభంగా రుణాల పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడాతో హెరిటేజ్ ఫుడ్స్ ఒక ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. ► డెయిరీ రంగంలో రైతులకు రుణాలిస్తామని చెప్పి ఆ ఒప్పందం. ►అంటే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, అందుకు బదులుగా వారు హెరిటేజ్కు మాత్రమే పాలు పోయాలన్న నిబంధన పెట్టారు. ► ఇదీ చంద్రబాబు వైఖరి. అంత దారుణ స్థితి. అలాంటి పరిస్థితుల్లో.. ►పాల ఉత్పత్తిదారులకు సరైన ధర రాని పరిస్థితుల్లో.. ఎక్కడైనా సహకార రంగం గట్టిగా ఉంటే, పోటీ ఏర్పడి, రైతులు, పాలు పోసే అక్క చెల్లెమ్మలకు ఆదాయం పెరుగుతుంది. ►దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 27 లక్షలకు పైగా నిమగ్నమై ఉన్న అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలుగుతుంది. ►వారికి మంచి ఆదాయం లభిస్తుంది. వారికి మంచి జరుగుతుంది. ►ఇవాళ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్–ఏపీడీడీసీఎఫ్. ►దీని పని తీరు డెయిరీల పరిస్థితికి అద్దం పడుతోంది. ► అందుకే అమూల్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మనం కష్టపడ్డాం. ఒకవేళ అమూల్ రాకపోతే? ► ఒకవేళ అమూల్ రాకపోయి ఉంటే, ఇవాళ మెజారిటీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు మూతబడ్డాయి. ► కేవలం 800 గ్రామాల్లోనే పాల సేకరణ జరగుతోంది. చాలా డెయిరీలు మూతబడ్డాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ► ప్రైవేటు రంగంలోనే డెయిరీలు నిలబడ్డాయి. దీంతో వాటికి పోటీ లేకుండా పోయింది. ► ప్రైవేటు డెయిరీల అనైతిక పద్ధతులు, పాడి రైతుల్లో లేని అవగాహనతో సహకార సంఘాలు నష్టాల పాలయ్యాయి. దాంతో ఆ రంగం పూర్తిగా ప్రైవేటు రంగంలోకి వెళ్లింది. ► వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 21.07.2020న అమూల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం లక్ష్యాలు: ► మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి. ►వారి (పాల ఉత్పత్తిదారుల) సామాజిక ఆర్థిక ఉన్నతి. ► రైతులకు మంచి పాల ధర అందించడం. ► వినియోగదారులకు కూడా నాణ్యమైన పాలు అందించడం. మార్కెటింగ్ అనుసంధానం: ► మార్కెటింగ్ అనుసంధానం కోసం అమూల్ ఎంపిక చేసుకున్నాం. ►అందుకోసం ఒక వ్యవస్థ అవసరం. మహిళలల్లో సహకార స్ఫూర్తి రావాలి. ► ప్రతి గ్రామంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ)లు, ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు కూడా రావాలి. ► అమూల్ ఇక్కడ ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, అమ్మి లాభాలు గడించి, ఆ మొత్తం తిరిగి బోనస్గా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం. ► ఇది ఒక గొప్ప కార్యక్రమం. దేశ సహకార రంగంలో పని చేస్తున్న అతి ఉత్తమ సహకార సంస్థ అమూల్. ► 50 దేశాల్లో ఆ సంస్థ పని చేస్తోంది. ప్రపంచంలో 8వ స్థానంలోనూ, దేశంలో అతి పెద్ద సంస్థగానూ ఉంది. ► అమూల్ ఏడాదంతా రైతులకు మంచి ధర చెల్లించడమే కాకుండా, వచ్చిన ఆదాయాన్ని రైతులకు బోనస్గా ఇస్తుంది. మహిళా డెయిరీ సహకార సంఘాలు ►రాష్ట్ర వ్యాప్తంగా 9899 గ్రామాలలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ►అందుకే ఆయా గ్రామాలలో బీఎంసీయూలు ఏర్పాటు చేస్తోంది. అవన్నీ ఆర్బీకేల పరిధిలో ఉంటాయి. ►వాటిలో మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తాం. ►రూ.3 వేల కోట్లతో భవనాల నిర్మాణం. ఒక్కో దానికి రూ.16.90 లక్షల వ్యయం. ►బీఎంసీయూలు (ఒక్కోటి దాదాపు రూ.10 లక్షలు), ఆటోమేటిక్ పాల సేకరణ యూనిట్ల ఏర్పాటు (రూ.1.40 లక్షలు చొప్పున). ► ఆర్బీకేల పరిధిలో వాటి పక్కనే 9899 బీఎంసీయూలు, ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, పక్కా భవనాలు వస్తాయి. అవి గ్రామాల రూపురేఖలు మారుస్తాయి. ►సేకరించే పాలకు 10 రోజుల్లోనే పాల ఉత్పత్తిదారుల ఖాతాల్లో నగదు జమ. ఎక్కడా మధ్యవర్తి ఉండరు. లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తొలి దశలో.. ► తొలి దశలో కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో 400 గ్రామాల్లో సేకరణ మొదలైంది. ► ఇప్పటికే 7 వేల ఆవులు, గేదెలు ఇవ్వగా, వచ్చే ఫిబ్రవరి 2021 నాటికి లక్ష యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. ► ఆ తర్వాత 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. ఇక అమూల్ ఇచ్చే పాల ధర: ఇక సేకరించే పాలకు అమూల్ ఏయే ధరలు చెల్లిస్తోందన్నది వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ స్లైడ్ కూడా ప్రదర్శించి చూపారు. ► లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ.33.60 కు, దొడ్ల డెయిరీ రూ.34.20 కి, జెర్సీ సంస్థ రూ.34.80 కి కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.39 కి కొనుగోలు చేయబోతుంది. ► అవే గేదె పాలను లీటరుకు (10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) సంగం, హెరిటేజ్ సంస్ధలు రూ.58 లకు, జెర్సీ సంస్ధ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్ సంస్ధ రూ.64.97లకు కొనుగోలు చేయనుంది. ► ఇక ఆవు పాలు లీటరు (3.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్ఎన్ఎఫ్)కు హెరిటేజ్ సంస్ధ రూ.23.12 ఇస్తుంటే, అమూల్ రూ.28 చెల్లించనుంది. ► అంటే ఎక్కడ చూసినా ఎక్కువ ధరకు అమూల్ పాలు కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత లాభాలు కూడా పంచబోతోంది. ► ఆ విధంగా ఎంతో మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం చేపట్టాము. మా టార్గెట్ హెరిటేజ్ కాదు ► నిన్న లోకేష్ అనే వ్యక్తి ఏదో టీవీలో అన్నాడట. ఆంధ్రజ్యోతిలో రాశారట. ► ‘అమూల్ వల్ల హెరిటేజ్ చావదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాలు సేకరిస్తామని అన్నాడట’. ► అంటే ఇంత కాలం వారు తక్కువ ధర ఇస్తున్నారనే కదా? ► చంద్రబాబు మీద కోపంతోనో, హెరిటేజ్ టార్గెట్గానో అమూల్ను తేలేదు. ► మా రాడార్లో చంద్రబాబు లేడు, మా మైండ్ సెట్ కూడా అది కాదు. అక్క చెల్లెమ్మల కోసమే ► చేయూతలో దాదాపు 24.55 లక్షల అక్క చెల్లెమ్మలకు, ఆసరాలో దాదాపు 87 లక్షల అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇస్తున్నాం. ► అంత డబ్బు ఇస్తున్నందున వారికి సరైన పద్ధతిలో దారి చూపిస్తే రిస్క్ లేకుండా రెగ్యులర్గా ఆదాయం వస్తుంది. ► దాని వల్ల వారు లక్షాధికారులు అవుతారు. మంచి జీవితం గడుపుతారు. ► అందుకే అమూల్తో పాటు, పలు సంస్థలను తీసుకువచ్చాము. అంతే తప్ప, చంద్రబాబు, హెరిటేజ్ కోసం కాదు. ► అంత తక్కువగా ఆలోచించే తత్వం కూడా మాది కాదు. ఆ అక్క చెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగించారు. -
ఆర్థిక ఉన్నతి కోసమే అమూల్
-
అమూల్ ప్రపంచంతో పోటీ పడుతోంది
-
అక్కచెల్లెమ్మలకు రోజూ సుస్థిర ఆదాయం
పాదయాత్రలో నేను ‘పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట..’ అన్నాను. ఆ మాటలను ఇవాళ గుర్తుకు తెచ్చుకుంటే సంతోషంగా ఉంది. కేవలం వ్యవసాయంతోనే బతకడం కష్టం. ఆదాయం పెరగాలంటే పాడి సహకారం అవసరం. అందుకే ఆసరా, చేయూత పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం. వారికి ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అయ్యేలా, జీవిత కాలం.. మరో శతాబ్దం పాటు వారికి మేలు కలిగేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. –సీఎం వైఎస్ జగన్ లీటర్కు రూ.15 అదనంగా వచ్చాయి నేను ప్రైవేటు డెయిరీలో గతంలో పాలు పోసేదాన్ని. అప్పుడు లీటరుకు రూ.33 నుంచి రూ.35 పడింది. అమూల్ కేంద్రంలో ఇప్పుడు అదే పాలకు రూ.50 వచ్చాయి. అంటే రూ.15 అదనం. చాలా సంతోషంగా ఉంది. లీటరుకు రూ.33 ఇస్తుంటే ఏం లాభం అని అందరూ పాడి తీసేయాలనుకుంటుంటే మీరు ఇలా మేలు చేశారు. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి అన్నా. – జట్టి విజిత, అల్లూరు, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా అక్కచెల్లెమ్మలకు పాడి పశువుల ద్వారా ప్రతి రోజూ మెరుగైన సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంతోనే ఏపీ–అమూల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వారికి శాశ్వతంగా జీవిత కాలం ఆదాయం కల్పించడానికి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.7 వరకు ఇస్తారన్నారు. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, కన్నబాబు, బాలినేని, పెద్దిరెడ్డి, అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథి తదితరులు ఇవాళ్టి ప్రాజెక్టుతో ఆ కల సాకారం ► నా పాదయాత్రలో లీటర్ వాటర్ బాటిల్ను రైతులు తీసుకు వచ్చారు. ఒక లీటరు వాటర్ ధర రూ.21 ఉంది. ఈ రోజు పాల ధర కూడా అంతే ఉందని చెప్పి బాధపడ్డారు. నాకు బాగా గుర్తుంది. అప్పుడే పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించుకున్నాను. ► సహకార రంగాన్ని బలపరచాలి. మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచాలి. మనం రూ.4 ఎక్కువగా ఎప్పుడైతే సహకార రంగం నుంచి ఇస్తామో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా రేట్లు పెరుగుతాయి. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఆదాయం పెరిగి మేలు జరుగుతుంది. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టాం. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు ► ఈ ఏడాది జులై 21న మన ప్రభుత్వం అమూల్తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రైతులకు లీటర్ పాలకు దాదాపు రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా దక్కుతుంది. అమూల్ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్ ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు. ► ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత లాభాలను కూడా బోనస్గా సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఇస్తారు. అమూల్ భారతదేశంలోనే కాదు ప్రపంచంతో పోటీపడే కంపెనీ. ఈ మధ్య కాలంలో ఐఎఫ్సీఎన్ (ఇంటర్నేషనల్ ఫార్మ్ కంపేరిజన్ నెట్వర్క్) ఇచ్చిన రిపోర్టు చూస్తే అమూల్కి 8వ స్థానం దక్కింది. అమూల్ స్టాల్లోని ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 9,899 గ్రామాల్లో బీఎంసీలు ► రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో రూ.3 వేల కోట్లతో బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. బీఎంసీలు రెండు వేల లీటర్ల పాలను స్టోర్ చేయగలిగిన సామర్థ్యంతో ఉంటాయి. ► తొలివిడతగా ఈ రోజు చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలు పెడుతున్నాం. త్వరలోనే ఇది ప్రతి నియోజకవర్గం.. 9,899 గ్రామాలకు విస్తరిస్తుంది. పాల సేకరణ తర్వాత 10 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. కమీషన్లు ఇచ్చుకోవడం ఉండదు. 4.69 లక్షల మందికి ఆవులు, గేదెలు ► మహిళలు మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడంలో భాగంగా ఐటీసీ, అలానా గ్రూప్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం. ► ఇందులో భాగంగానే 4.69 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెలు ఇవ్వండని అడిగారు. ఒకేసారి అన్ని యూనిట్లు దొరకవు కాబట్టి (ఒక యూనిట్ అంటే ఒక గేదె లేదా ఆవు) దశల వారీగా ఇస్తాం. ఇవాళ 7 వేల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ► వచ్చే ఏడాది ఫిబ్రవరికి లక్ష యూనిట్లు, ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షలకుపైగా యూనిట్లు పంపిణీ చేస్తాం. ఒక్క రూపాయి కూడా అక్కచెల్లెమ్మలు పెట్టాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు స్వయంగా కూడా పశువులను కొనుగోలు చేయవచ్చు. ► పంజాబ్, హరియాణా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అధిక పాల దిగుబడినిచ్చే ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. 10న గొర్రెలు, మేకలు పంపిణీ ► డిసెంబర్ 10వ తేదీన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఒక్కో యూనిట్లో 15 గొర్రెలు, మేకలు ఉంటాయి. దాదాపుగా 77 వేల రిటైల్ షాపులు హిందుస్థాన్ లీవర్, ఐటీసీ సంస్థల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో ఇప్పటికే ఏర్పాటు చేయించాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలసి నడవడానికి ముందుకు వచ్చిన అమూల్ సంస్థకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ పాల్గొన్నారు. ఏపీలో మహిళలు ఘన విజయం సాధిస్తారు మొదటి సారి ఒక రాష్ట్రం సహకార ఉద్యమాన్ని తన ఉద్యమంగా భావించింది. ఏపీ ఇప్పటికే మత్స్య, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో అగ్ర స్థానాల్లో ఉంది. ఇప్పుడు పాల ఉత్పత్తిలో కూడా ముందడుగు వేస్తోంది. ఏపీలో ప్రజలు అంకిత భావం ఉన్న వారు. ఏపీలో మహిళలు ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. – వీడియో కాన్ఫరెన్స్లో ప్రొఫెసర్ సశ్వత ఎన్.బిస్వాస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (ఇర్మా), డైరెక్టర్ సీఎం కృషి వల్లే ఇదంతా.. 36 లక్షల రైతుల కుటుంబాలు అమూల్కు ఓనర్లుగా ఉన్నాయి. ఇది రైతుల సంస్థ. ఏ కంపెనీ అయినా తక్కువ ఖరీదుకు కొని ఎక్కువ డబ్బుకు అమ్మాలని తన సీఈఓకు చెబుతుంది. కాని అమూల్లోని 18 మంది బోర్డు సభ్యులు.. ఎక్కువ రేటుకు పాలు కొని, వినియోగదారులకు సరసమైన ధరలకే అమ్మాలని చెబుతారు. మీ కళ్లముందే అన్నీ జరుగుతాయి. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు. – డాక్టర్ ఆర్.ఎస్.సోథి, ఎండీ,గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) రెట్టింపు డబ్బులొస్తున్నాయి గతంలో నాకు నాలుగు ఎనుములు (గేదెలు) ఉండేవి. మీ నాన్నగారు ఉన్నప్పుడు లోన్ శాంక్షన్ అయితే కొనుక్కున్నాం. లీటరుకు 4.5 వెన్న శాతం వస్తే.. రూ.25 వచ్చేవి. 4 లీటర్ల పాలు పోస్తే రోజుకు వంద రూపాయలు వచ్చేవి. అదే పనికి పోతే ఎక్కువ డబ్బులు వస్తాయని మూడు ఎనుములు అమ్మేసి, ఒకటి ఉంచుకున్నాం. ఇప్పుడు అదే పాలను అమూల్ డెయిరీకి తీసుకెళ్లి పోశాం. 6.5 వెన్న శాతంతో లీటరుకి రూ.50 డబ్బులు పడింది. నాలుగు లీటర్ల పాలు పోస్తే రోజుకు రూ.200 వచ్చాయి. – అశ్వని, నల్లపురెడ్డి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా. ఇదీ మన గ్రామ స్వరూపం రాబోయే రోజుల్లో గ్రామ స్వరూపం పూర్తిగా మారుతుంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేసే వాళ్లు కనిపిస్తారు. నాలుగు అడుగులు ముందుకేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఇటువైపు అడుగులు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అందులో ఒక ఏఎన్ఎం 24 గంటలు 51 రకాల మందులతో అంటుబాటులో ఉంటారు. ఆ క్లినిక్ ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. ఆర్బీకే, బల్క్ మిల్క్ యూనిట్, మరో నాలుగు అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో జనతా బజార్ కనిపిస్తుంది. రొయ్యలు, చేపలు మన గ్రామంలో పండించే పంటలు అక్కడ దొరుకుతాయి. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు మన గ్రామంలోనే వలంటీర్ చేయి పట్టుకుని సహాయం చేసే పరిస్థితి కళ్ల ఎదుటనే కనిపిస్తుంది. ఒక్క సంవత్సరంలో ల్యాండ్ స్కేప్ పూర్తిగా మారిపోతుంది. -
అన్నదాతలకు ‘అమూల్’ ఫార్ములా భేష్
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మూలం ఎక్కడుందో పాలకులు గ్రహించాలి. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కాదు కదా.. నామమాత్రపు ధర కూడా రావడం లేదు. ఇందుకు టమాటా, బెండ, ఉల్లి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలే ఉదాహరణ. మన కళ్లముందే అత్యద్భుతమైన అమూల్ డైరీ సహకార వ్యవస్థ ఉండగా, సాగు దిగుబడులకు సైతం అలాంటి సహకార వ్యవస్థను ఎందుకు వర్తింప చేయకూడదు? అమూల్ డైరీ సహకార వ్యవస్థలో వినియోగదారులు పాలపై వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 పైసల వరకు రైతుల చేతికి వస్తుంది. భారతదేశం విజయవంతమైన తన సహకార డైరీల బ్రాండ్ నుంచి పాఠం నేర్చుకోకూడదా? వినియోగదారు చెల్లించే ధరల్లో 40 నుంచి 50 శాతం రైతుకి దక్కేలా విధానాలు రూపొందించకూడదా? ఈ వార్త ఇప్పుడు ఎవరికీ షాక్ కలిగించకపోవచ్చు. బెండకాయలను మార్కెట్లో వినియోగదారులు కిలోకు రూ. 40లు వెచ్చిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్లోని బద్వానీలో బెండకాయల హోల్సేల్ ధర కిలోకి ఒక్కరూపాయికు పడిపోయింది. దీంతో కడుపు మండిన రైతు నాలుగు ఎకరాల్లో పండించిన పంటను ట్రాక్టర్ను ఉపయోగించి దున్నించేశాడు. బెండకాయ ధరలు ఇంత తక్కువకు పడిపోవడం చూసిన ఈ జిల్లాలోని మరికొందరు రైతులు తమ భూమిలో పండిం చిన పంటను పశువులకు వదిలేశారు. మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, కూరగాయల అమ్మకాలు ఇలా పతనం కావడం అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతుండటం విషాదకరం. ఇప్పుడు పంజాబ్లో చెరకు రైతుల దుస్థితిని పరిశీలిద్దాం. చెరకు కోత సీజన్ ప్రారంభమవుతున్న సమయానికి కూడా రాష్ట్రంలోని 16 చెరకు మిల్లులలో 14 (సహకార, ప్రైవేట్ రంగాలకు చెందిన వాటిలో) మిల్లులు గత సంవత్సరం చెరకు కోతకుగాను చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయల బకాయిని ఇప్పటికీ చెల్లించలేదన్న విషయం బయట పడింది. ఒక్క పంజాబ్ మాత్రమే మినహాయింపు కాదు. సెప్టెంబర్ 11 నాటికి దేశవ్యాప్తంగా చెల్లించని చెరకు కోత బకాయిలు రూ. 15,683 కోట్లకు చేరుకున్నాయని, దీంట్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పార్లమెంటులో ఇటీవల ఒక సభ్యుడు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. తమ బకాయిలను చెరకు మిల్లులు ఒకటి రెండు సంవత్సరాలు సకాలంలో చెల్లించకపోయినప్పటికీ చెరకు రైతులు ఎలాగోలా జీవించగలిగారు. ఉద్యోగుల వేతనం ఒక్క నెల ఆలస్యం అయిందంటే చాలు ఎంత గగ్గోలు మొదలవుతుందో ఎవరైనా ఊహించుకోవలసిందే. ఈ వార్తల్లో అసాధారణమైన విషయం ఏముందని మీరు ప్రశ్నిం చవచ్చు. ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే కదా. పంటలకు గిట్టుబాటుధరలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు వీధుల్లోనే టమాటాలను, బంగాళదుంపలను, ఉల్లిపాయలను పారబోస్తున్న దృశ్యాలు మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. 2018–19 బడ్జెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వం రూ. 500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి పరిణామాలను దేశం చూసింది. సగటు కుటుంబం తీసుకునే కూరగాయల్లో ఈ మూడింటికి అగ్రభాగం ఉంటుంది. టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపల ధరను స్థిరీకరించడమే ఆపరేషన్ గ్రీన్స్ పథకం లక్ష్యం. అనేక కారణాల వల్ల ఈ పథకం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అయితే మూడింటికి మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని ఈ జూన్ నుంచి ఆరునెలల కాలానికి అన్ని కూరగాయలు, పండ్ల ఉత్పత్తులకు వర్తిస్తూ పొడిగించారు. ఈ ప్రకటనలతో పనిలేకుండానే, ఆయా సీజన్లలో పండే కూరగాయల ధరలు ఎప్పుడూ పతనదిశలోనే ఉంటాయి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా స్థానిక వాల్యూ చైన్కు అంతరాయం కలగక ముందే, కూరగాయలు పండించే రైతులు ధరల విషయంలో పదేపదే దెబ్బతింటూ వచ్చారు. తృణధాన్యాలకు, ఇతర ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ఉన్నట్లుగా కూరగాయలకు మద్దతు ధర అనేది లేకపోవడంతో తమ కూరగాయలకు మార్కెట్లో లభిస్తున్న రేటు నిజమైనదా కాదా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కూరగాయలు పండించడానికి, కోయడానికి, రవాణా చార్జీలకు అయిన ఖర్చులను తీసివేయగా రైతులు ఉత్తిచేతులతో మార్కెట్ నుంచి వెనుదిరగాల్సిన సందర్భాలు అనేకసార్లు వారికి అనుభవంలోకి వచ్చాయి. నిజానికి, రైతులు కూరగాయలను పండిస్తున్నప్పుడు, తాము పంటపై లాభాన్ని కాకుండా నష్టాలను పండిస్తున్నామన్న విషయం వారికి అవగాహనలో ఉండటం లేదు. 2000–2016 కాలానికి ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ సంయుక్త అధ్యయనం ప్రకారం, పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరను తమకు కల్పించనందుకు గానూ భారతీయ రైతులు ప్రతి ఏటా రూ.2.64 లక్షల కోట్లను నష్టపోతున్నారని తేలింది. అయితే ఈ అధ్యయనం పేర్కొన్న నష్టాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే తమ అధ్యయనంలో భాగంగా వీరు చాలా తక్కువ పంటలను మాత్రమే పరిశీలించారు. ఈ స్వల్ప స్థాయి అధ్యయనం సైతం.. ప్రతి ఏటా మన రైతులకు చివరికి ఏం మిగులుతోంది అనే అంశంపై దారుణ సత్యాలను వెల్లడించింది. రైతులు పండించే పంటలకు నిర్ణీత ధర చెల్లిస్తామన్న హామీ లేకుండా, పంటల తీరును వైవిధ్యభరితంగా మార్చాలన్న ఆలోచన అర్థరహితం మాత్రమే. అందుకనే పంజాబ్ రైతులను గోధుమ, వరి పంట నుంచి మళ్లించి పంటల వైవిధ్యత వైపు మళ్లించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటినీ ఆ రైతులు వమ్ము చేస్తూనే వచ్చారు. తృణధాన్యాలు, కాయ ధాన్యాలు, నూనె గింజలు, మొక్క జొన్న వంటి పంటలను పండించడం చాలా అవసరం అనే విషయాన్ని తోసిపుచ్చాల్సిన పని లేదు కానీ, తాము పండించే పంటలకు కచ్చితమైన ధర, సమర్థవంతమైన సేకరణ వ్యవస్థను ఏర్పర్చకుండా, మార్కెట్ శక్తుల ప్రభావానికి తమను బలిచేసే వైవిధ్యపూరితమైన పంటల వైపు రైతులు మారిపోతారని ఎలా భావించాలి? దశాబ్దాలుగా రైతులు న్యాయమైన ధరలకోసం పోరాడాల్సి వస్తున్న పరిస్థితుల్లో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్థిక నమూనా భారాన్ని నిశ్శబ్దంగా మోయాల్సి వస్తోంది. మరోవైపు పారిశ్రామిక అనుకూల దృక్పథాన్ని దాటి రైతుల వైపు చూడటంలో మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు విఫలమవుతున్నారు. దశాబ్దాలుగా వ్యవసాయంలో మార్కెట్ సంస్కరణలు అమల్లో ఉన్న అమెరికాలో సైతం చిన్న సన్నకారు రైతులు కుప్పగూలిపోయారు. అమెరికా వ్యవసాయం శ్రేష్టమైనదని భావిస్తుంటారు. వారి వ్యవసాయం జాతీయ, అంతర్జాతీయ వాల్యూ చైన్లలో భాగంగా ఉంటుంది కాబట్టి రైతులకు అది సంపదలను కొనితెస్తుందని భావి స్తుంటారు. కానీ వాస్తవికత మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. అమెరికా వ్యవసాయ విభాగం చెబుతున్న దానిప్రకారం వినియోగదారులు ఆహార పదార్థాలకోసం పెట్టే ప్రతి డాలర్ వ్యయంలో 8 శాతం మాత్రమే రైతులకు దక్కుతోందని తెలుస్తోంది. పైగా బడా రిటైల్ వ్యాపార సంస్థలు ఉనికిలోకి రావడంతో రైతుల వాటా మరింత క్షీణించిపోయింది. దీన్ని అమూల్ డైరీ సహకార వ్యవస్థతో పోల్చి చూడండి. అమూల్ పాల వినియోగదారులు పాలకోసం వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 శాతం వరకు రైతులకు అందుతోంది. మరి వ్యవసాయ సరకులకు కూడా ఈ దేశీయ డైరీ సహకార సంస్థ నమూనాను విస్తరింపచేస్తే ఉత్తమంగా ఉండదా? అమెరికా వ్యవసాయంలో బడా వ్యాపారులు అడుగు పెట్టడం అనేది అక్కడ చిన్న రైతులకు ఎలాంటి మేలూ కలిగించకపోగా వారిని వ్యవసాయంనుంచే పక్కకు నెట్టేశారు. మరి భారత దేశం తన సొంత విజయవంతమైన సహకార డైరీ వ్యవస్థల నుంచి పాఠం నేర్చుకోకూడదా? ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై వినియోగదారులు వెచ్చించే ప్రతి రూపాయలో (పాల విషయంలో 80 శాతం వాటా రైతులకే దక్కుతోంది) కనీసం 40 నుంచి 50 శాతం వరకైనా రైతు పరమయ్యే విధంగా సరికొత్త ఆర్థిక నమూనాలను తీసుకురావడంపై మన విధాన నిర్ణేతలు ఆలోచించకూడదా? వ్యవసాయ ధరలను క్షీణింప చేయడం ద్వారా వ్యవసాయంపై నిరంతరం భారం మోపుతూ ఆర్థిక సంస్కరణలు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగానే రైతులు న్యూఢిల్లీ వరకు మార్చ్ చేస్తున్నారు. శీతల వాతావరణంలో పోలీసులు తమపై ప్రయోగిస్తున్న వాటర్ కానన్లను సైతం లెక్క చేయని రైతులు తమ జీవితాలపై పేరుకున్న సుదీర్ఘ శీతాకాలానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఆర్థిక సంస్కరణలను చెల్లుబాటయ్యేలా చూడటానికి ఎంతకాలమిలా వ్యవసాయరంగాన్ని దారిద్య్రంలో ముంచెత్తుతూ ఉంటారు? వ్యవసాయదారులకు కూడా కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలను, పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. వేరు మార్గం లేక పండిం చిన పంటలను వీధుల్లోనే పారబోసే గతి పట్టకుండా తమను కాపాడే ఒక సమర్థ యంత్రాం గాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటిది అమలైనప్పుడు దశాబ్దాలుగా వ్యవసాయ వ్యాపారం ద్వారా కలుగుతున్న దుస్థితి నుంచి బయటపడగలమని వీరి నమ్మకం. అందుకనే రైతు అనుకూల విధానాలను రూపొందించడంలో కొనసాగుతున్న కరువుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. చారిత్రకంగా రైతులకు జరుగుతూ వస్తున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఢిల్లీలో రైతు మార్చ్ చెబుతోంది. అప్పుడు మాత్రమే వ్యవసాయం గర్వకారణంగా ఉండే పరిస్థితి మళ్లీ నెలకొంటుంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
26న అమూల్ ప్రాజెక్టు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏర్పాటయ్యే 7,125 పాల సేకరణ కేంద్రాల (బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల)కు సంబంధించి అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈనెల 26న ప్రాజెక్టును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మూడు దశల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 400 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు 1.60 లక్షల లీటర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని, 200 లక్షల లీటర్లకు పైగా పాలు మిగిలిపోతున్నాయన్నారు. ప్రభుత్వమే పాడి రైతుల నుంచి పాలు కొనుగోలు చేయనుందని, ఇందుకోసం మహిళా పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో ఆర్బీకేల పరిధిలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. తొలుత ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వీటి ద్వారా పాల కొనుగోలు ప్రారంభమవుతుందన్నారు. గొడుగు, దుప్పటి, పాదరక్షలతో కిట్లు.. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి లక్షలమంది లబ్దిదారులు ముందుకు రావడం సీఎం జగన్పై నమ్మకానికి నిదర్శనమని మంత్రి చెప్పారు. పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్ల స్థాపనకు రూ.5,386 కోట్లు వెచ్చిస్తున్నామని, హరియాణా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణాతోపాటు రాష్ట్రంలోనూ కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలుకు కమిటీలో లబ్దిదారులతోపాటు సెర్ప్ అధికారి, బ్యాంకు ప్రతినిధి, పశు వైద్యాధికారి ఉంటారన్నారు. లబ్దిదారుల ఇష్టప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. ట్యాగింగ్ కలిగిన పాడి పశువులు, గొర్రెలు, మేకలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, మూడు రోజులపాటు పాల ఉత్పత్తిని పరీక్షించిన తరవాతే కొనుగోలు చేస్తామన్నారు. ఈ నెల 21నుంచి నాలుగు రోజులపాటు బ్యాంకులతో యూనిట్ల అనుసంధాన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు గొడుగు, దుప్పటి, పాదరక్షలతో కూడిన కిట్లు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లో డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు లక్ష పశువులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
పాడి పశువుల ద్వారా ‘చేయూత’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన లక్షలాది మహిళలకు వైఎస్సార్ చేయూత అండతో పాడి పశువుల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే చేయూత మహిళల వద్ద ఉన్న పాడి పశువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను అమూల్ ద్వారా సేకరించి, సరైన ధర కల్పించడంతో పాటు పాడి పశువుల్లేని చేయూత మహిళలకు వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 4.90 లక్షల మంది మహిళలు పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పాడి పశువులు ఉన్న వారు 72,795 మంది మరికొన్నింటి కోసం దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ► పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న 9,899 రైతు భరోసా కేంద్రాలున్న గ్రామాలను గుర్తించి, వీటికి అనుబంధంగా బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను మూడు దశల్లో నిర్మాణం చేయనుంది. మూడు దశల్లో రూ.1,362.22 కోట్ల వ్యయంతో 7,125 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ► ఈ నిధులను జాతీయ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 80 శాతం రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిగతా 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఐదు సెంట్ల విస్తీర్ణంలో ఒక్కో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ను రూ.11 లక్షల వ్యయంతో, ఒక్కో పాల సేకరణ కేంద్రాన్ని రూ.4 లక్షల వ్యయంతో నిరి్మంచనున్నారు. ► తొలి దశలో 2,774 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను, 7,125 పాల సేకరణ కేంద్రాలను రూ.590.11 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో 3,639 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను రూ.327.51 కోట్లతో, మూడో దశలో 3,486 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను రూ.313.78 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. -
పాడి పరిశ్రమ మౌలిక వసతులకు రూ.1,362 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,362.22 కోట్లు వెచ్చించనున్నట్లు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసంకల్ప యాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. సహకార రంగంలోని డెయిరీలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పాడిరైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమూల్తో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈనెల 25న అమూల్ ద్వారా పాలసేకరణకు బిల్లులు చెల్లించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అమూల్ ప్రాథమికంగా ఎనిమిది జిల్లాలను (ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం) ఎంపిక చేసిందని చెప్పారు. ఈనెల 20 నుంచి మొదటగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 70 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతుందని, ఇది పాల ఉత్పత్తిలో 26 శాతమేనని తెలిపారు. అమూల్ భాగస్వామ్యంతో రోజుకు 2 కోట్ల లీటర్ల పాలు సేకరించేందుకు అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో రూ.500 కోట్లతో 9,899 బల్క్ మిల్క్ చిల్లింగ్ (బీఎంసీ) యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తొలిదశలో 2,774, రెండోదశలో 3,639, మూడోదశలో 3,486 బీఎంసీ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా 7,125 పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు ఏ పాల్గొన్నారు. -
25 నుంచి అమూల్ పాలసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలివిడత మూడు జిల్లాల్లో అమూల్ (ఆనంద్ డెయిరీ) పాలసేకరణ ప్రారంభం కానుంది. చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నెల 25 నుంచి ప్రారంభించడానికి ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. పాలసేకరణ, పాల ఉత్పత్తుల అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న అమూల్ తన ప్రతినిధులతో వివిధ జిల్లాల్లో సర్వే చేపట్టింది. పాల దిగుబడి అధికంగా ఉన్న జిల్లాలతోపాటు ఏపీ డెయిరీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ప్లాంట్లలోని యాంత్రిక పరికరాల సామర్థ్యాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా పాలను సేకరించనుంది. లోటుపాట్లను సరిచేసుకుని 25 నుంచి అధికారికంగా 300 పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించనుంది. ప్రైవేట్ డెయిరీల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించడానికి, పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాల ఏర్పాటుకు ఏపీ డెయిరీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తం 9,899 పాలసేకరణ కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమూల్ కార్యక్రమాలు వేగంగా జరగడానికి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలను ఏపీ డెయిరీ ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీ, డీసీవో, సబ్ కలెక్టర్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్లు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, రైతులకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పాడిపశువుల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను కోర్ కమిటీలు పర్యవేక్షిస్తాయి. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) పరిధిలో ఏర్పాటు కానున్న ఈ పాలసేకరణ కేంద్రాల నిర్మాణాలు, పాలలోని వెన్న శాతం గుర్తించడానికి, ఇతర పనులకు అవసరమైన యాంత్రిక పరికరాల సరఫరా, రూట్మ్యాప్ల ఖరారు వంటి ప్రధాన బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అదేవిధంగా ప్రతి 15 ఆర్బీకేలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపగల అధికారులు, రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే గట్టి నిబద్ధత కలిగిన అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. పాల ఉత్పత్తిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రధాన బాధ్యత వీరికి డెయిరీ అప్పగిస్తుంది. గ్రామాల్లో పశుపోషణ పట్ల రైతులందరికీ ఆసక్తి కలిగించడానికి, ఆ పోషణ చేసేందుకు ముందుకు వస్తున్న రైతులకు ప్రభుత్వం కల్పించనున్న సౌకర్యాలను గ్రామ సభల ద్వారా ప్రభుత్వం వివరించనుంది. భవిష్యత్లో పెరగనున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాడిపశువుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. సేకరణ కేంద్రాలకు పాలు పోసిన రైతులకు ప్రతి 10 రోజులకు ఒకసారి నగదు చెల్లింపులు చేస్తాం. పాడి పశువులకు అవసరమైన దాణాను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. పశువులకు సత్వర వైద్యం అందుబాటులోకి తీసుకువస్తాం. రెండు వేల లీటర్ల పాలను సేకరించడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో ముందుగా పాల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. పాలలోని వెన్నశాతం, నగదు చెల్లింపులు, ఇతర సేవలు అందించే విషయంలో పారదర్శకంగా ఉంటాం. పశు సంపదను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాబు అహ్మద్, ఎండీ, ఏపీ డెయిరీ -
వడివడిగా ‘అమూల్’ అడుగులు
సాక్షి, అమరావతి: అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) తన కార్యకలాపాలను మన రాష్ట్రంలోనూ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న ఆ సంస్థ గుజరాత్ నుంచి ఇక్కడి సహకార శాఖ అధికారులకు ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను అధ్యయనం చేసి తొలిగా కంకిపాడు, ఒంగోలులో డెయిరీ ప్లాంట్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులకు మంచి ధర, ఆన్లైన్లో చెల్లింపులు, పశువులకు నాణ్యమైన మేత, చికిత్స అందించేలా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. రైతు పరిస్థితులు గుర్తించి.. అమూల్కు చెందిన సాంకేతిక బృందం సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పాడి పరిశ్రమ స్థితిగతులను అధ్యయనం చేసింది. ఈ బృందంలో అమూల్ జీఎం హిమాన్షు పి.రాథోడ్, పశు వైద్యులు, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ విభాగాలకు చెందిన 22 మంది నిపుణులు ఉన్నారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి.. మొదటి బృందం సాంకేతిక పరిస్థితులు, రెండో బృందం పాల సేకరణ, ధరలు, మూడో బృందం మార్కెటింగ్ పరిస్థితులను అధ్యయనం చేసింది. సహకార డెయిరీ ప్లాంట్లలోని యంత్ర పరికరాలు, వాటి సామర్థ్యం, అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సహకార డెయిరీ, కంకిపాడులోని డెయిరీ ప్లాంట్లను వెంటనే వినియోగించుకునే అవకాశాలు ఉండటంతో తొలిగా వాటిల్లో కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించింది. కృష్ణాజిల్లా కంకిపాడులోని డెయిరీ ప్లాంట్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తించి దీనిని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. పాడి పరిశ్రమకు మంచి రోజులు రాష్ట్రంలోని పాడి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. అమూల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పాలను విక్రయించే మహిళా సభ్యులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగదు చెల్లింపులు, పశువులకు నాణ్యమైన దాణా, వైద్యం అందించడానికి అనువుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – వాణీమోహన్, ఎండీ, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య -
‘అమూల్’ శిక్షణా తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు జవసత్వాలు కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్కు చెందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రాష్ట్రంలో తన కార్యక్రమాలను ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను ఏర్పాటు చేయడానికి సహకార శాఖలోని డెప్యూటి రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులను ఎంపిక చేసింది. వీరికి పాల ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అమూల్ చర్యలు తీసుకుంటోంది. (ఇటు పాల వెల్లువ.. అటు మహిళా సాధికారత) ఎంపికైన అధికారులను రెండు, మూడు బృందాలుగా గుజరాత్లోని అమూల్ కేంద్రానికి శిక్షణకు పంపనుంది. పది నుంచి ఇరవై రోజులపాటు వీరంతా అక్కడ శిక్షణ పొందనున్నారు. అక్కడ శిక్షణ పొందిన అధికారులు ఒక్కో జిల్లాకు 15 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తారు. వీరంతా తమ పరిధిలోని మిగిలిన సభ్యులకు శిక్షణ ఇస్తారు. రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ పూర్తి చేస్తారు. తొలుత శిక్షణ పొందిన 15 మహిళా సంఘాలకు ముఖాముఖి, మిగిలిన సభ్యులకు గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమూల్కు చెందిన ఉన్నతస్థాయి బృందం రాష్ట్రంలో పర్యటించి సహకార డెయిరీలు, ఉద్యోగులు, యాంత్రిక పరికరాలను పరిశీలిస్తుంది. రాష్ట్రంలోని పాడిపరిశ్రమ స్థితిగతులు, పశు సంపద, ప్రైవేట్ డెయిరీల కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంది. భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాలపై వ్యూహరచనకు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని ఏపీ డీడీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వాణీమోహన్ తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి : మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు తులిపారు. ఆయన ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఆక్వా కల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్లో 700 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే అమూల్తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో.. ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. (వైఎస్ జగన్ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు) -
ఇటు పాల వెల్లువ.. అటు మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో ఏర్పాటు చేసుకున్న అవగాహన ఒప్పందం పశు పోషకులు, ముఖ్యంగా మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు, సహకార డెయిరీలకు జవసత్వాలు కలిగించనుంది. పశు పోషణ రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం కీలకమైంది. ► గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం హెరిటేజ్ డెయిరీని ప్రోత్సహిస్తూ సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది. గతంలో 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల పాలను సేకరించిన సహకార డెయిరీలు ఇప్పుడు కేవలం 30 వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నాయి. పశు పోషకులు మరో మార్గం లేక హెరిటేజ్కు అందుబాటులో ఉన్న ప్రైవేట్ డెయిరీలకు పాలను విక్రయించారు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశు పోషణ, ప్రైవేట్, సహకార రంగంలోని డెయిరీలపై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)తో అధ్యయనం చేయించింది. అనంతరం పాల ఉత్పత్తి, అమ్మకాల్లో ప్రఖ్యాతిగాంచిన అమూల్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ► రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ► రాష్ట్ర సహకార శాఖకు చెందిన ఒక అధికారిని ఒక్కో జిల్లాకు బాధ్యునిగా ప్రభుత్వం నియమించనుంది. వీరు ఆయా జిల్లాల్లో మహిళలతో కూడిన పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తారు. ► ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పులివెందులలోని ఏపీకార్ల్లో వాక్సిన్ తయారీకి తెలంగాణాకు చెందిన కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది పశు వాక్సిన్ అందుబాటులోకి రానుంది. మళ్లీ మునుపటి రోజులొస్తున్నాయి పశుక్రాంతి పథకాన్ని దివంగత మహానేత వైఎస్సార్ అమలు చేసి మమ్మల్ని ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పశువులను తెచ్చుకుని బాగా బతికాం. ఆయన తదనంతరం ప్రభుత్వం నుంచి సహకారం లేక దెబ్బతిన్నాం. ఇప్పుడు సీఎం జగన్ వల్ల మళ్లీ మునుపటి రోజులొస్తున్నాయి. – పడమటి వీర్రాజు, కౌతవరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా ఒకప్పుడు బిందెతో తీసుకెళ్లేవాడిని ప్రైవేట్ డెయిరీలు పాలకు మంచి ధర ఇవ్వడం లేదు. కాయకష్టం చేసుకునే మమ్మల్ని దోచుకుంటున్నాయి. ఒకప్పుడు బిందెతో పాలను తీసుకువెళ్లిన నేను ఇప్పుడు చెంబుతో కేంద్రానికి పాలను తీసుకువెళుతున్నాను. అమూల్తో మాకు మంచి రోజులు వస్తాయి. – ఎన్.రంగారెడ్డి, గోవర్ధనగిరి గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా రైతులకు శాశ్వత ఆదాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు శాశ్వతంగా ఆదాయం వచ్చేందుకు అనువుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా అమూల్ను ఎన్నుకోవడం మంచి పరిణామం. కేవలం రైతుల నుంచి పాల సేకరణకే పరిమితం కాకుండా వారితో అమూల్ మంచి సంబంధాలు కొనసాగిస్తుందని భావిస్తున్నాం. – ఆడారి ఆనంద్, విశాఖ డెయిరీ సీఈవో తక్కువ ధరకు పాల ఉత్పత్తులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు మేలు చేకూర్చేందుకు చాలా తపన పడ్డారు. మా అంచనాలకు మించి అమూల్తో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సామర్థ్యం ఆ సంస్థకు ఉంది. మొత్తంగా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు మార్కెట్లో తక్కువ ధరకు లభ్యం అవుతాయి. – బొల్లా బ్రహ్మనాయుడు, వల్లభ డెయిరీ చైర్మన్ అమూల్తో లాభాలెన్నో.. సహకార డెయిరీల్లోని పరికరాల పర్యవేక్షణను అమూల్ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆస్తులకు రక్షణ, ఉద్యోగులకు భద్రత చేకూరనుంది. మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు పాల సేకరణ, పశుపోషణపై శిక్షణ ఇవ్వనుంది. పాలను విక్రయించే సభ్యులకు మంచి ధర.. సకాలంలో చెల్లించనుంది. పశువులకు ఉచిత వైద్యం, పోషక విలువలు కలిగిన మేతను అందించనుంది. వినియోగదారులకు స్వచ్ఛమైన, పాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. స్వయం సమృద్ధి దిశగా మహిళల అడుగులు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కింద మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.11 వేల కోట్ల చొప్పున నాలుగు సంవత్సరాల్లో రూ.44 వేల కోట్లను అందించనుంది. ఈ మొత్తాన్ని మహిళలు పాడి పశువుల కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. తద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చు. సాలీనా రూ.52 వేల కోట్ల టర్నోవర్ కలిగిన అమూల్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం వల్ల రాష్ట్రంలో పాల సేకరణ పెరిగి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడనుంది. జీవన ప్రమాణాలు మెరుగవుతాయి పశు పోషణ ద్వారా మహిళా పాల ఉత్పత్తిదారుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించనున్న ఆర్థిక సాయంతో మహిళలు గేదెలు, ఆవులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పశుపోషణ లాభసాటిగా మారనుంది. మహిళా సాధికారతకు బాటలు వేయనుంది. –వాణీ మోహన్, ఏపీడీడీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ -
అమూల్తో భాగస్వామ్యం ద్వారా మహిళలకు మరింత చేదోడు
-
మహిళాసాధికారతకు మరింత ఊతం
గతంలో అధికారంలో ఉన్న వారు తమ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. గతంలో ప్రభుత్వ సహకార రంగం బలంగా ఉన్నప్పుడు పోటీ వాతావరణం ఉండేది. కాలక్రమంలో ఆ వాతావరణం పోయింది. ప్రభుత్వ సహకార డెయిరీలు రాజీ పడిపోయాయి. సాక్షి, అమరావతి: మహిళల జీవితాలను మార్చే క్రమంలో అమూల్తో ఒప్పందం గొప్ప అడుగు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు, అమూల్కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అమూల్తో బాగస్వామ్యం ద్వారా మహిళలకు మరింత చేదోడు లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో అమూల్, ఏపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రం ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్.సోధి, సబర్కాంత డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ సంబల్ భాయ్ పటేల్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా ద్వారా నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు ► మహిళల కోసం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను ప్రారంభిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏటా రూ.18,750 చొప్పున చేయూత కింద నాలుగేళ్ల పాటు ఇస్తాం. ఆ విధంగా వారికి నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తాం. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత ప్రారంభిస్తున్నాం. దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ధి పొందుతారు. ► స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద ఏటా రూ.6,700 కోట్లు ఇస్తాం. ఈ రెండు పథకాలకే ఏడాదికి రూ.11 వేల కోట్లు.. నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు ఇవ్వనున్నాం. ► ఈ సహాయం వారిలో ఆర్థిక ప్రమాణాల పెరుగుదలకు ఉపయోగపడాలన్నది లక్ష్యం. తద్వారా మహిళల జీవితాలనే మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఈ నేపథ్యంలో అమూల్తో భాగస్వామ్యం ఆ దిశలో మెరుగైన అడుగులు వేయాలి. దక్షిణాది గేట్వేగా ఏపీ ► బెంగళూరు అనంతపురానికి, చెన్నై చిత్తూరుకు, విశాఖపట్నం ఒడిశాకు, హైదరాబాద్ ఏపీ సరిహద్దుకు సమీపంలో ఉంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ గేట్ వే లాంటిది. అలాగే మార్కెటింగ్ హబ్గా కూడా ఉంటుంది. ► రాష్ట్రంలో ఐఆర్ఎంఏ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్) ఏర్పాటు చేయండి. పులివెందులలో ఉన్న ఐజీ కార్ల్ శిక్షణ, పరిశోధనలకు మంచి వేదిక అవుతుంది. ► ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి్డ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ వాణీ మోహన్, అమూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో పాడి పరిశ్రమకు మంచి భవిష్యత్: ఆర్ఎస్ సోధి ► గుజరాత్, ఏపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఏపీలో కూడా గణనీయంగా రోజుకు 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. పాడి రైతులకు మంచి ధర లభించడంతో పాటు, అటు వినియోగదారులకు కూడా సరసమైన ధరకు పాలు లభిస్తాయి. ► గత ఏడాది అమూల్ సంస్థ టర్నోవర్ రూ.52 వేల కోట్లు. ఇప్పుడు ఏపీతో ఎంఓయూ వల్ల ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు అమూల్ కంపెనీకి ఎంతో ప్రయోజనకరం. ► పాడి పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు, టెక్నాలజీకి అవకాశం. పాడి పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణలో పరిజ్ఞానం, సహకార సంఘాల అంశాల్లో మహిళలకు అపార అవకాశాలు. మంచి జరగాలని ఆరాటపడుతున్నాం ► పాల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నాం. కానీ కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్నాయి. పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కష్టానికి తగ్గ ధర లభించడం లేదు. లీటరు పాలు, లీటరు మినరల్ వాటర్ బాటిల్ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో నాకు రైతులు చూపించారు. u సహకార డెయిరీలు కంపెనీల చట్టం కిందకు మారిపోయాయి. కొన్ని రాజకీయ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోటీ వాతావరణం లేదు. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కింద ఉన్న డెయిరీలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. u అమూల్తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నాం. -
అమూల్తో ఒప్పందం మహిళా సాధికారతకు తోడ్పాటు
సాక్షి, అమరావతి: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందం రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని, అలాగే.. వారి సాధికారతకూ తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమూల్తో మంగళవారం జరగనున్న అవగాహన ఒప్పందం నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో ఒప్పందంలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇది రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు. సీఎం ఏమన్నారంటే.. ► ఈ ఒప్పందంవల్ల పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ► ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ► రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది. ► వైఎస్సార్ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. వీరు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడి పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలి. ఆ పరిశ్రమల్లో మహిళలకున్న అవకాశాలను పరిశీలించి వారిని ముందుకు నడిపించాలి. డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుంది. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ వాణీమోహన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అమూల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
సాక్షి, తాడేపల్లి: అమూల్తో అవగాహన ఒప్పందం నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ వాణీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవగాహన ఒప్పందంలోని అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి రంగంలో కీలకపాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పాడి రైతులను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావడంలో ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మహిళల సాధికారతకు తోడ్పాటునందిస్తుందని వెల్లడించారు. మొత్తంగా డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుందన్నారు. పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రంలో పాడిపరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందని సీఎం వైఎస్ జగన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా.. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. మహిళలు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడిపరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఆ పరిశ్రమల్లో వారికున్న అవకాశాలను పరిశీలించి మహిళలను ముందుకు నడిపించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. (కరోనా నివారణకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు) -
పాడి పరిశ్రమకు మహర్దశ
రాష్ట్రంలోని పాడి రైతులకు మేలు జరగాలి. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి రేటు రావాలి. ధర విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలి – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మహర్దశ రానుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా, తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సహకార కంపెనీ ‘అమూల్’తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఆ కంపెనీ అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృతమైన మార్కెటింగ్ను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, పాడి రైతుల సమస్యలు, పాల ఉత్పత్తులకు మంచి ధర కల్పించే అవకాశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. జూలై 15లోగా అవగాహన ఒప్పందం.. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడం, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించేలా, నాణ్యమైన పాల ఉత్పత్తులు జరిగేలా, వాటి ద్వారా రైతులకు సరైన ధర లభించేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుంచారు. ► అమూల్తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలను వారు వివరించారు. పాల ఉత్పత్తుల రంగంలో దేశంలో అత్యుత్తమ సహకార సంస్థగా నిలిచిన అమూల్కు ఉన్న పేరు, సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన మార్కెటింగ్ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని, రైతులకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సమీక్ష.. ‘అమూల్’తో భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని,ఆ తర్వాత ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూలై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు.. సీఎంకు తెలిపారు. ► సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదనలు తయారయ్యాక.. మరోసారి దీనిపై కూర్చొని ఖరారు చేద్దామని ఆయన చెప్పారు. ► ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమ రంగం పటిష్టం కావాలి: సీఎం ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పాడి పరిశ్రమలో అమూల్కు ఉన్న అనుభవం రాష్ట్రంలోని రైతులకు ఉపయోగపడాలని, పాడి పశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు.. ఇలా అన్ని అంశాల్లోనూ పాడి పరిశ్రమ రంగం పటిష్టం కావాలని పేర్కొన్నారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు. అమూల్తో కలసి అడుగులు ముందుకేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
పాడి రైతులకు మేలు జరగాలి : సీఎం జగన్
సాక్షి, తాడేపలి : పాడి రైతులకు మేలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని.. ధరల విషయంలో రైతులకు న్యాయం జరగాలని అన్నారు. శుక్రవారం షుగర్ ఫ్యాక్టరీలు, మిల్క్ డెయిరీల అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖమంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటుగా అమూల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి : రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్) అమూల్తో భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. జూలై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదన్నారు. అంతకు ముందు పాడి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. అలాగే అమూల్తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడి పరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.(చదవండి : సీఎం జగన్ను ప్రశంసించిన యూకే డిప్యూటీ హై కమిషనర్) సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సీఎం సమీక్ష సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రణాళికపై ప్రతిపాదనలు తయారు అయ్యాక.. వాటిపై పూర్తి స్థాయిలో చర్చించి ఖరారు చేద్దామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. -
అమూల్ డైరీ ఖాతాను నిలిపివేసిన ట్విటర్, కారణం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ డైరీ ఖాతను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ తాత్కలికంగా నిలిపివేసింది. ఇండియా - చైనా మధ్య సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ డైరీ ‘ఎగ్జిట్ ది డ్రాగన్’ అంటూ ఒక పోస్టర్ను తన ట్విటర్ ఖాతలో షేర్ చేసింది. ఈ పోస్టర్లో అమూల్ బేబీ చైనా చిహ్నం డ్రాగన్ను చేతితో ఆపుతున్నట్లు ఉంది. అదేవిధంగా ఈ పోస్టర్లో చైనా యాప్ టిక్టాక్ కనిపిస్తుండటం ఉండటం విశేషం. దీంతో ట్విటర్ అమూల్ అకౌంట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమ్యూల్ సంస్థ ధృవీకరించింది. (అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా) #Amul Topical: About the boycott of Chinese products... pic.twitter.com/ZITa0tOb1h — Amul.coop (@Amul_Coop) June 3, 2020 ఎగ్జిట్ డ్రాగన్ పోస్ట్ కారణంగా తమ ఎకౌంట్ను తాత్కలికంగా తొలగించిందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి ట్విటర్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమ్యూల్ సంస్థ పేర్కొంది. తాము అన్ని విషయాల మీద స్పందిస్తామని, పక్షపాత ధోరణితో ఏ విషయంలో వ్యవహరించమని అమ్యూల్ సంస్థ తెలిపింది. అకౌంట్ను తిరిగి పునరుద్దరించాలని ట్విటర్ను కోరినట్లు తెలిపింది. తమ అకౌంట్ను తొలగించిన కారణంగా ఈ పోస్ట్ తమ ఫాలోవర్స్ ఎవరికి కనిపించడం లేదని సంస్థ తెలిపింది. అందరూ అమూల్ సంస్థకు అండగా నిలుస్తున్నారని, ట్విటర్ ఇలా చేయడంతో వారు అందరూ ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ విషయంపై ట్విటర్ను వివరణ కోరామని కూడా అమూల్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించిన ట్విటర్ అమూల్ సంస్థ రక్షణ కోసమే ఇలా చేశామని, ట్విటర్లో పబ్లిష్ చేసిన విషయంతో దీనికి సంబంధం లేదని తెలిపింది. ఇండియా- చైనా సరిహద్దు వివాదం, మహమ్మారి కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని చాలా మంది భావిస్తుండటంతో చైనా ఉత్పత్తులను భారత్లో నిషేధించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. (‘రిమూవ్ చైనా యాప్స్’కు) -
ప్రధానికి అమూల్ డూడుల్ శుభాకాంక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పాల ఉత్పత్తులలో అగ్రస్థానంలో ఉన్న అమూల్ సంస్థ కూడా ప్రధాని మోదీకి ట్వీటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. అయితే అందరిలాగే అమూల్ కూడా ఏదో ‘హ్యాపీ బర్థ్ డే మోదీ జీ’ అంటూ ట్వీటర్లో పోస్ట్ చేసుంటారులే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే!. అవునండి మీరే చూడండి మరి.. మోదీ కార్టూన్ బొమ్మల డుడూల్ వీడియోను ప్రత్యేకంగా తయారు చేసి పోస్ట్ చేసింది. ‘గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అంటూ క్యాపన్తో పోస్ట్ చేసి అందరికన్నా భిన్నంగా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి ‘అమూల్ అంటే బ్రాండ్ కాదు.. భారత్ ఎమోషన్’ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియోలో మోదీ మొదటి సారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకం నుంచి ఆయన పర్యటించిన అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు విదేశి పర్యటించిప ఫోటోలను ఈ వీడియోలో చూపించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో వైట్ హౌజ్ బయట సమావేశం అయిన ఫొటోతో పాటు, ఇటీవల చంద్రయాన్-2 విఫలం నేపథ్యంలో ఇస్రో చీఫ్ కె. శివన్ను ఓదారుస్తూ ఆయనను హత్తుకున్న యానిమేటెట్ ఫోటో ఈ వీడియోలో చివరలో కనిపిస్తాయి. #Amul wishes the Hon. PM Shri Narendra Modi @narendramodi a very happy 69th birthday! #happybirthdaynarendramodi pic.twitter.com/E039hOXwlT — Amul.coop (@Amul_Coop) September 16, 2019 -
ఇక పాలు మరింత ప్రియం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరల బాదుడు షురూ కాగా, తాజాగా నిత్యావసరమైన పాల ధరలు చుక్కలు చూస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు లీటర్కు రూ 2 మేర పెరుగుతాయని డైరీ దిగ్గజం అమూల్ ప్రకటించింది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. మార్చి 2017లో పాల ధరలు పెంచిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను సవరించామని అమూల్ బ్రాండ్పై పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా ధరలు మే 21 నుంచి వర్తిస్తాయని తెలిపింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాల ధరల పెంపు అనివార్యమైందని జీసీఎంఎంఎఫ్ తెలిపింది. -
అభినందన్పై అమూల్ సరికొత్త యాడ్
న్యూఢిల్లీ : శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు యావత్ భారత్ జేజేలు పలుకుతుండగా.. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఆయన సాహసాన్ని కొనియాడుతూ ప్రత్యేక యాడ్ను రూపొందించింది. అమూల్ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్టైజింగ్లో ఎంతో ఉన్నతంగా నిలుస్తాయన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమ్యూనికేషన్స్లో అమూల్ మించిన వారు ఇంకెవ్వరూ ఉండరని చాలా సార్లు నిరూపితమైంది. అయితే తాజాగా అభినందన్ ధీరత్వాన్ని ఆయన మీసంతో పోల్చుతూ.. ఇది అముల్ మీసం అంటూ, మీసం లేనిది ఏం లేదూ అనే క్యాప్షన్తో సృజనాత్మకమైన ప్రకటనను విడుదల చేసింది. (చదవండి: అభి మీసం) యాడ్ మొత్తం భారత హీరో వర్థమాన్ను కొనియాడుతూ ఉండగా.. అతన్ని సాహసాన్ని మెచ్చిన జనాలు అతని మీసం స్టైల్ను ఫాలో అవుతూ గర్వంగా ఫీలవుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వీడియోను అమూల్ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆయన మీసం స్టైల్ ఫొటోలను పోస్ట్ చేస్తూ భారత హీరోపై ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా యాడ్స్ రూపొందించి అమూల్ మార్కెట్ను క్యాచ్ చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. గతంలో కరుణానిధి మరణించినప్పుడు ఆయనకు నివాళులర్పిస్తూ రూపొందించిన యాడ్ కూడా జనాలకు చేరువైంది. (చదవండి: సరిహద్దుకు అటూ.. ఇటూ..) #Amul Mooch: To Abhinandan from Amul! pic.twitter.com/NAG3zNMlIL — Amul.coop (@Amul_Coop) 2 March 2019 భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్గా అభినందన్.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను విడుదల చేయాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. అభినందన్ను శుక్రవారం విడుదల చేసింది. (చదవండి : ఆకాశం ముద్దాడిన వేళ..) -
రాహుల్ కౌగిలింత : అమూల్ కూడా వదిలిపెట్టలేదు..
న్యూఢిల్లీ : కౌగిలింత... కన్ను కొట్టడం.. వంటి సరదా సన్నివేశాలతో సీరియస్గా జరిగే పార్లమెంట్లో సైతం నవ్వులు పూశాయి. లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా...సీరియస్గా అప్పడి వరకు విమర్శలు ఎక్కు పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఒక్కసారిగా ప్రధాని దగ్గరకు వెళ్లి కౌగలించుకోవడం, ఆ తర్వాత వచ్చి కన్ను గీటడం హాట్టాఫిక్గా మారింది. లోక్సభలో నిన్న జరిగిన ఈ డ్రామాటిక్ సీన్లపై ఇప్పటికీ ట్విటర్ మారుమోగిపోతోంది. న్యూస్పేపర్లు సైతం రాహుల్ కౌగిలింత సీన్ను ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. ఇలా అనూహ్యమైన పరిణామాలు జరిగినప్పుడు డయిరీ కో-ఆపరేటివ్ అమూల్ ఏమైనా చూస్తూ ఊరుకుంటోందా? తాను కూడా నాలుగు సెటైర్లు వేసి, నెటిజన్లను మరింత మురిపిస్తూ ఉంటోంది. ఇదే విధంగా నిన్న లోక్సభలో జరిగిన రాహుల్ గాంధీ కౌగిలింత సీన్పై కూడా ఓ సెటైరికల్ ఫీచర్ను వేసింది. రాహుల్, మోదీని కౌగిలించుకోవడాన్ని ఉట్టంకిస్తూ.. ‘ఆలింగనంగా ఉందా లేదా ఇబ్బంది కరంగా ఉందా’ అంటూ ఓ పిక్చర్ను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఆ పిక్చర్లోనే రాహుల్ గాంధీ కన్ను కొట్టడాన్ని కూడా స్కెచ్ చేసింది. నిన్న జరిగిన సెషన్లో ప్రధానిని కౌగలించుకోవడంతో పాటు రాహుల్ కన్ను గీటడం కూడా దేశమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేసింది. కాగ, 126:325 తేడాతో అవిశ్వాసం వీగిన సంగతి తెలిసిందే. కరెంట్ టాఫిక్స్తో అమూల్ విడుదల చేస్తున్న ఈ క్రియేటివ్ పిక్చర్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సెటైరికల్ పిక్చర్ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది. చాలా మంది నెటిజన్లు అమూల్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘కరెంట్ హాట్టాపిక్స్తో వ్యంగ్యమైన పిక్చర్స్ను రూపొందించడంలో అమూల్ నీవు చాలా బెస్ట్’ అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. అందుకే అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా అంటూ మరో యూజర్ పేర్కొంది. ప్రతేడాది భలే ఐడియా వస్తుంది అంటూ అమూల్పై నెటిజన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. #Amul Topical: Hugs in Parliament.... pic.twitter.com/dNurd7XDaX — Amul.coop (@Amul_Coop) July 20, 2018 Wow ! awesome sense of humour you guys have to. — KANISHKA (@Kanishk94486037) July 20, 2018 Amul, the original meme makers since 1967. Super idea every week. 😂😂 — #WhatNext (@ThisNMore) July 21, 2018 And thats why Amul is the Taste of India!!! 😀😀😀👏👏👏👍👍👍 — Renu Bhagwat-Gadgil (@RenuGadgil) July 20, 2018 You amul guys are the best .... Always making something sarcastic memes on current hot topics ...🤣😛😉 — Viswam jr 🇮🇳😎 (@EshwarViswam) July 20, 2018 -
అమూల్ డెయిరీలో భారీ కుంభకోణం
-
కోట్ల రూపాయల స్కాం, ఎండీ రాజీనామా
న్యూఢిల్లీ : పాల ఉత్పత్తిలో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కే. రత్నం తన పదవికి రాజీనామా చేశారు. రూ.450 కోట్ల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి నిష్క్రమించారు. ప్రత్యేక బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అయితే రూ.450 కోట్ల కుంభకోణ నేపథ్యంలో రత్నం తన పదవికి రాజీనామా చేశారనే వార్తలను మాత్రం బోర్డు ఖండించింది. వ్యక్తిగత కారణాలతో ఆయన కంపెనీ నుంచి వైదొలిగారని పేర్కొంది. 2014లో రత్నం అమూల్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు, అమెరికాలో తన కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడం కోసం తాను ఎండీగా తప్పుకుంటున్నట్టు రత్నం కూడా చెప్పారు. ఏదైనా సొంతంగా కొత్తగా ప్రారంభించాలని ఉందని పేర్కొన్నారు. గుజరాత్లోని ఆనంద్ నగరంలో ఉన్న అమూల్ పాల ఉత్పత్తుల సంస్థకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే అమూల్ డెయిరీలో జరిగిన అవినీతి, అవకతవకలకు రత్నమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల కేటాయింపు, రిక్రూట్మెంట్లో సుమారు 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే రత్నం ఎలాంటి కుంభకోణంలో భాగస్వామి కాదని అమూల్ ఉత్పత్తుల కంపెనీ చైర్మన్ రామ్సిన్ పర్మార్ చెబుతున్నారు. ఈ ఆరోపణలు సత్యానికి చాలా దూరంలో ఉన్నాయన్నారు. రాజీనామా చేసిన రత్నం స్థానంలో సీనియర్ జనరల్ మేనేజర్ జయేన్ మెహతాను నూతన ఎండీగా నియమిస్తున్నట్టు అమూల్ డెయిరీ ప్రకటించింది. -
కణేర్లో అమూల్ పాల ఉత్పత్తి కేంద్రం
సాక్షి, ముంబై: తూర్పు విరార్లోని కణేర్లో అమూల్కు చెందిన అత్యాధునిక పాల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. సుమారు రూ.180 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఈ నెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభిస్తారని అమూల్ నిర్వాహక అధికారి సుధీంద్ర కుల్కర్ణి తెలిపారు. కణేర్-వైతర్ణ మార్గంలోని టోకరే ప్రాంతంలో 12 ఎకరాల స్థలంలో 2011 నుంచి ప్రారంభించిన డెయిరీ నిర్మాణ పనులు ఇటీవల పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో అమూల్కు చెందిన రెండో డెయిరీ ఇదని తెలిపారు. ముంబైతో పాటు ఠాణే నగరానికి స్వచ్ఛమైన పాలు సరఫరా చేయడం కోసం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఈ డెయిరీలో పెరుగు, మజ్జిగ, ఐస్క్రీమ్లను తాజా పాలతో తయారు చేస్తారు. ప్రతి రోజు ఆరు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్లో సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్ల వరకు పెంచే అవకాశముంద’న్నారు. 1.5 లక్షల లీటర్ల మజ్జిగ, 20 వేల లీటర్ల పెరుగు, 1.25 లక్షల లీటర్ల ఐస్క్రీమ్ తయారు చేసే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు. ప్రస్తుతం విక్రమ్గడ్, వాడా తాలూకాల్లోని రైతుల నుంచి పాలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే వసయి తాలూకాల్లో ఉన్న రైతుల నుంచి కూడా పాలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు మరింత లాభం... ఠాణే జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసే డెయిరీ లేకపోవడంతో పాల ఉత్పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం విక్రమ్గఢ్ తాలూకాలోని మల్వాడా గ్రామంలో మల్వాడా సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రతి రోజూ సుమారు వెయ్యి లీటర్ల పాలు సేకరిస్తారు.