నేడు పౌర్ణమి గరుడసేవ రద్దు | Sakshi
Sakshi News home page

నేడు పౌర్ణమి గరుడసేవ రద్దు

Published Tue, Dec 26 2023 7:47 AM

Tirumala Pournami Garuda Seva Cancel - Sakshi

తిరుపతి: తిరుమలలో మంగళవారం నిర్వ­హిం­చాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే శ్రీవారి ఆలయంలో అధ్యయ­­నోత్సవాలు జరుగుతున్న కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవ ఉండదని, ఈ విష­యాన్ని భక్తులు గమనించాలని తెలిపింది. 
 
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమా­వేశం చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో  మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అభివృద్ధి పనుల­తో పాటు మరిన్ని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. ఈ సమావేశా­నికి టీటీడీ బోర్డు సభ్యులు హాజరుకాను­న్నా­రు.   

సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తి
ఈ నెల 23 నుంచి 2024, జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్ల జారీని సోమవారం టీటీడీ పూర్తి చేసింది. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజ­స్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదా­నం, జీవ­కోన హైస్కూల్, బైరాగిపట్టెడ­లోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్‌ పల్లి­లోని జెడ్పీ హైస్కూల్‌లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను నాలుగు లక్షల­కు­పైగా సర్వద­ర్శనం టైంస్లాట్‌ టోకెన్లను భక్తులకు అందించారు. తదుపరి సర్వద­ర్శనం టోకెన్లను జన­వరి 2వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు.

Advertisement
 
Advertisement