
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బి.విజయలక్ష్మి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు.
రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. హస్తకళలు భారత దేశానికి వెన్నెముక లాంటిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, రవీంద్రనాథ్, వ్యవసాయశాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.