దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం | YS Jagan invited to South India all party leaders meeting | Sakshi
Sakshi News home page

దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం

Published Thu, Mar 13 2025 5:48 AM | Last Updated on Thu, Mar 13 2025 7:28 AM

YS Jagan invited to South India all party leaders meeting

వైఎస్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్‌.. 22న చెన్నైలో సమావేశం

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను తమిళనాడు పీ­డ­బ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్‌ కలిశారు. ఈనెల 22న చెన్నైలో నిర్వహించే దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానిస్తూ తమిళ­నాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ రాసిన లేఖను వైఎస్‌ జగన్‌కు అందజేసి, దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి ఆహ్వానించా­రు. 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. దీన్లోభాగంగా తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్‌ జగన్‌ను కలిశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement