
సాక్షి, తాడేపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఈ భూ మండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం. దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఈ భూమండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది.
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై… pic.twitter.com/v1nn0zvnqy— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2025