
సాక్షి, గుంటూరు: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్ కేసులో ఆర్కేకు సీఐడీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి గత నెల.. సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు 126 మందిపై కేసులు నమోదు చేయగా.. ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చారు. కూటమి సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఆర్కేను వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.