Alla Ramakrishna Reddy
-
ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
-
మంగళగిరి మాదే.. భారీ ర్యాలీతో నామినేషన్
-
బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. జూలై 24కు విచారణను వాయిదా వేసింది. విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా -
మహిళ చేతిలో నారా లోకేష్ చిత్తు చిత్తు..
-
ఆళ్ల రామకృష్ణ రెడ్డి కౌంటర్
-
పింఛన్ ను 2500 నుండి 5000 కు పెంచిన సీఎం జగన్
-
పార్టీలో చేరిక తరువాత మంగళగిరి సీటుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ చేరికపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
కాంగ్రెస్ లోకి వెళ్లి తప్పు చేశా ..!
-
సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు
-
వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత ఆర్కే సంచలన వ్యాఖ్యలు
-
ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, తాడేపల్లి: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ‘‘2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి -
YSRCPలోకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
-
ఒక రైతు గా చెప్తున్నా.. ఎవరు బాధపడకండి..ఎమ్మెల్యే ఆర్కే భరోసా
-
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నాయకులు
-
చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నా..ఎమ్మెల్యే ఆర్కే స్ట్రాంగ్ కౌంటర్
-
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చారు?
మంగళగిరి: ‘ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. దాంతో తనకు సంబంధం ఏమిటి అంటున్న నారా లోకేశ్ ఆ రింగ్ రోడ్డు నిర్మాణానికి షబ్బానా వాళ్లను ఎందుకు కన్సల్టెంట్గా నియమించారు’ అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిలదీశారు. బుధవారం ఎయిమ్స్ ఆస్పత్రి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టెంపుల్ హిల్ ఎకో పార్కు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ముందుగా ఇచ్చినట్టు కాకుండా లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ డైరెక్టర్ లోకేశ్ పేరిట కొన్న భూముల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజాయితీపరుడైన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ వారి మాట వినడం లేదని ఆయనను మార్చేసి సీఆర్డీఏ కమిషనర్గా అర్హత లేని అప్పటి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను అన్ని ఆధారాలు, సాక్ష్యాలతో సహా రికార్డులను సేకరించి సీఐడీ అధికారులకు అప్పగించానని చెప్పారు. చంద్రబాబు రాజధాని పేరుతో ప్రతి అంశాన్ని ఆయన స్వార్థానికి, ఆయన మనుషుల స్వార్థానికి ఎంతలా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ వాళ్లతో పాటు హెరిటేజ్ పేరుతో కొన్న భూములు సుమారు 650 ఎకరాలకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డును మార్చిన వాట వాస్తవం కాదా అని నిలదీశారు. అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారు టీడీపీ అధికారమే పరమావధిగా జనసేనతో అనైతిక పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుల మతాలకు అతీతంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా డీబీటీ ద్వారా రూ.లక్షల కోట్లు పంపిణీ చేసి సంక్షేమాన్ని ఇంటికి చేర్చినట్టు చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు వైనాట్ 175 జరిగి తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. -
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంపై లోకేష్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్
-
ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించడం హర్షణీయం
-
ఒక్క మాటతో పవన్ కళ్యాణ్, లోకేష్ పరువు తీసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి
-
గుంటూరు
చెంతనే ఉన్న కృష్ణమ్మ మురిసేలా.. మంగళాద్రి లక్ష్మీనరసింహుడే ఆనంద గర్జన చేసేలా.. శాసన రాజధాని నడిబొడ్డున ప్రగతిపతాక సగర్వంగా రెపరెపలాడుతోంది. సంక్షేమ సర్కారుకు మంగళహారతి పడుతోంది. మంగళగిరి–తాడేపల్లి జంట నగరం అభివృద్ధి పథాన పరవళ్లు తొక్కుతూ జయజయధ్వానాలు చేస్తోంది. మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్న గత పాలకులకు ఖబడ్దార్ అంటూ సవాల్ విసురుతోంది. మంగళగిరి: వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలులో గణనీయ మార్పు కనిపిస్తోంది. రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019కు ముందు టీడీపీ హయాంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన లోకేష్, ఇదే నియోజకవర్గంలో నివాసం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సేవా కార్యక్రమాలతో జన హృదయాలు గెలిచారు. ఫలితంగా గత ఎన్నికల్లో తనపై లోకేష్ పోటీ చేసినా అలవోకగా జయకేతనం ఎగురవేశారు. రాష్ట్రంలోనూ వైఎస్సార్ సీపీ జయభేరి మోగించడంతో నియోజకవర్గంపై వరాల జల్లు కురిసింది. ఫలితంగా రూ.వందల కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు శరవేగంగా అమలయ్యాయి. ఇప్పటికే చాలా పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 25,254 మంది పేదలకు ఇళ్లస్థల పట్టాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. గౌతమ బుద్ధా రోడ్డు విస్తరణ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆర్కే చొరవతో రూ.24 కోట్లతో మంగళగిరిలో గౌతమ బుద్ధా రోడ్డును విస్తరించారు. అభివృద్ధికి బాటలు వేశారు. క్రీడలకు ప్రాధాన్యం నగరంలోని క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా వసతు ల కల్పనకు ఎమ్మెల్యే ఆర్కే చర్యలు తీసుకున్నారు. తాగునీటి పథకం ఆవరణలో రూ.7 కోట్లతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, పవర్ లిఫ్టింగ్ కోచింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. ఇవి తుదిదశకు చేరాయి. కొత్తగా షటిల్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నియాత్రలు చేసినా లోకేష్ ఎమ్మెల్యే కాలేరు గతంలో మూడు శాఖల మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్, ఇదే నియోజకవర్గంలో నివాసంలో ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. ఎన్ని యాత్రలు చేసినా లోకేష్ ఎమ్మెల్యే కాలేరు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో సంతృప్తస్థాయిలో అభివృద్ధి జరిగింది. దీనిపై చర్చకు నేను సిద్ధం. చేనేతల కోసం మగ్గం షెడ్లు, చేనేత భవనం నిర్మించాం. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాం. – ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి ప్రాంతాల వారీగా సంక్షేమ పథకాల లబ్ధి ఇలా.. మండలం లబ్ధి చేకూరిన మొత్తం (రూ.కోట్లలో) మంగళగిరి అర్బన్ 673.27 మంగళగిరి రూరల్ 23.81 తాడేపల్లి అర్బన్ 125.73 తాడేపల్లి రూరల్ 112.23 దుగ్గిరాల 147.68 -
మహిళా వలంటీర్ పాదాలు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్తులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వలంటీర్ జె.రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళవారం కడిగారు. పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వలంటీర్ల సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: పవన్కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు -
పేదలకు నో ఎంట్రీ అంటున్న బాబుగారి రైతులు
-
రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరిలో 23 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించబోతున్నామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే, కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కోర్టులో పేదలకు న్యాయం జరిగింది.’’ అని ఆర్కే అన్నారు. ‘‘పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం. సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. రాజధానిలో పేదలు ఉండొద్దంటూ టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించింది. రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర. దీపావళి కల్లా మంగళగిరిలో కూడా జగనన్న కాలనీలు పూర్తవుతాయి. ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే సీఎం జగన్ ఆకాంక్ష’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే.. -
వైఎస్సార్సీపీకి నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: ‘‘రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కొనసాగుతా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు’’.. కీలక సమావేశానికి గైర్హాజరు కావడంతో తనపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క స్టేట్మెంట్తో కొట్టిపాడేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. సోమవారం జరిగిన ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఉంది. పంటికి సర్జరీతో పాటు ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల మీటింగ్కి వెళ్లలేకపోయా. దానికి ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చి రాతలు రాసింది. ఒక వర్గం మీడియా పనికట్టుకుని విష ప్రచారం చేసింది. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చులు పెట్టి మనిషి మనిషిని విడదీసి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. అసలు చంద్రబాబు మీటింగ్ పెడితే ఎవరెవరు వచ్చారో.. ఎవరెవరు రాలేదో యెల్లో మీడియా ఎందుకు రాయదు. గత ప్రభుత్వంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్.. ఏనాడైనా మంగళగిరి మున్సిపల్ సమావేశానికి వచ్చాడా?. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చాడా?. మరి లోకేష్ గురించి ఎందుకు ఎల్లో మీడియా ప్రస్తావించిందా? అని నిలదీశారాయన. చంద్రబాబు నాయుడు-ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నుంచి పేదల్ని విడదీయలేరని, మంగళగిరిలో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే అని ఎమ్మెల్యే ఆర్కే ఘంటా పథంగా చెప్పారు. -
నిచ్చెనలాగి.. కూలీలతో కలిసి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి (గుంటూరు): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వ్యవసాయ సీజన్ వస్తే రైతుగా పొలంలో పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే ఆర్కేకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. రాజకీయాలలో, ప్రజాసేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూనే తనకెంతో మక్కువైన వ్యవసాయ పనులను రాజీపడకుండా చేస్తుంటారు. అందులో భాగంగా గురువారం ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేశారు. కలుపు ఏరి పొలంలో నాట్లు వేయడానికి మెరకపల్లాలను చదును చేయడానికి నిచ్చెనలాగారు. అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోనే వారితోపాటు భోజనం చేసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. -
వాడవాడలా వేడుక
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో మంగళవారం ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు మహిళలు ఎంపీటీసీలుగా గెలుపొందారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. మేము ఎక్కడా తప్పు చేయలేదు. గెలిచిన 8 మందితోనే మేము ముందుకు వెళ్తాం. టీడీపీలో మహిళా అభ్యర్థి లేకపోవడంతో పచ్చనేతలు వైఎస్సార్సీపీ నేతలను మభ్యపెడుతున్నారని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే దుగ్గిరాలలో నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా -
బాబూ.. ఇన్ని చీప్ ట్రిక్సా!
రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా, దానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లింకు పెట్టి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్కు అలవాటైపోయింది. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని.. ఉన్నవి, లేనివి కల్పించి ప్రజల మనసుల్లో విషం నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతననే విషయాన్ని మరచి, చిల్లర గొడవల్లోనూ దూరిపోతున్నారు. పొగలా అనిపిస్తే చాలు.. నిప్పు అంటించి ఆనందం పొందుతున్నారు. తాజాగా తాడేపల్లిలో మూడు సెంట్ల స్థల వివాదం చోటుచేసుకుంటే.. దాంతోనూ సీఎం వైఎస్ జగన్కు ముడిపెడుతూ తండ్రీ కొడుకులు శనివారం ట్వీట్ చేస్తూ సమస్యను పెద్దది చేశారు. వాస్తవానికి ఆ వివాదంలో బాధితుడు సాక్షి విలేకరి కావడమే పాపమైపోయింది. అంతా తెలిసీ.. నిస్సిగ్గుగా.. దుర్మార్గంగా.. అన్యాయంగా.. రాజకీయ పరమపద సోపానంలో అడ్డదారుల్లో నిచ్చెన కోసం వెతుకుతున్నారు. బాబు దయనీయ పరిస్థితిని పాపం అనాలా.. లేక మరేమనాలో ఆ పార్టీ శ్రేణులే నిర్ణయించాలి. ఇంతకూ తాడేపల్లిలో వివాదం వివరాలు ఇలా ఉన్నాయి. – మంగళగిరి బాబూ ఇదీ సంగతి.. తాడేపల్లి పోలకంపాడులో స్థల వివాదంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. స్థానికంగా సుబ్బారావు అనే వ్యక్తి 1994లో ఏడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. 2010లో పెద్దకుమారుడు కోటేశ్వరరావుకు నాలుగు సెంట్లు, చిన్న కుమారుడు శ్రీనివాసరావుకు మూడు సెంట్లు చొప్పున ఇచ్చాడు. ఈ క్రమంలో కోటేశ్వరరావు తన స్థలంలో ఇల్లు నిర్మించుకోగా, శ్రీనివాసరావు ఆర్థిక సమస్యలతో ఇంటిని నిర్మించుకోలేదు. ఈ స్థలాన్ని ఈనెల 16వ తేదీన శ్రీనివాసరావు వద్ద నుంచి సాక్షి విలేకరి నాగిరెడ్డి పెద్ద మనుషుల సమక్షంలో కొనుగోలు చేశాడు. ఇది గిట్టని కోటేశ్వరరావు గొడవకు దిగాడు. అతనికి ఆపద కలిగి ఉంటే పోలీసులనో, స్థానికులనో పిలవకుండా ‘అయ్యా.. చంద్రబాబూ.. నన్ను కాపాడండి... టీడీపీ నేతలూ.. నన్ను కాపాడండి’ అని కేకలు వేశాడు. దీన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందనేది అందరికీ అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకోకుండా చంద్రబాబు.. సీఎంను, ప్రభుత్వాన్ని, సాక్షి యాజమాన్యాన్ని తిట్టిపోయడం ఎంత వరకు సమంజసం? – ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోవాలి పోలకంపాడులో మా నాన్న సుబ్బారావు మా ఇద్దరి అన్నదమ్ములకు స్థలాన్ని విభజించి ఇచ్చారు. నేను నా స్థలాన్ని అమ్ముకున్నాను. మా అన్న అట్లా కోటేశ్వరరావు మాట్లాడేవన్నీ అవాస్తవాలు. యాదవ సంఘం నాయకులు, ఇతర పెద్దలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇది కుల సమస్య కాదు. 150 కుటుంబాల వరకు పోలకంపాడులో నివాసముంటున్నాయి. ఇక్కడి వారందరికీ నిజం ఏమిటో తెలుసు. నేను ఆర్థికంగా చితికిపోవడంతో మా తండ్రికి ఆరోగ్యం బాగుండకపోవడంతో, మా అన్నయ్య, వదినలు పెట్టే వేధింపులు తట్టుకోలేకే నా స్థలాన్ని నాగిరెడ్డికి అమ్ముకున్నాను. నాగిరెడ్డి మాకు సాక్షి విలేకరిగా పరిచయం కాదు. మా అందరిలో ఒకడిగా ఉంటాడు. పోలకంపాడు వచ్చి వాస్తవాలు తెలుసుకోవచ్చు. – అట్లా శ్రీనివాసరావు, స్థలం విక్రేత స్థలం అమ్మిన మాట వాస్తవం అట్లా శ్రీనివాసరావు స్థలం అమ్ముతున్నాడని మా అందరితో చెప్పాడు. మా అందరి సమక్షంలోనే నాగిరెడ్డికి స్థలాన్ని విక్రయించాడు. అట్లా శ్రీను స్థలం నాగిరెడ్డికి అమ్మగానే అందులో గోడను కూల్చివేశారు. అప్పుడు నాగిరెడ్డి మాకు తెలియజేశాడు. కేసు పెడతామంటే వద్దులే అని చెప్పాం. మళ్లీ గోడ కట్టుకున్నాడని పదేపదే అతడిని దూషించడం, నాగిరెడ్డి స్థలంలో ఉన్నపుడు గొడవ పెట్టుకోవడం.. నన్న చంపొద్దు అంటూ ప్రాధేయ పడడం చూస్తుంటే పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేసినట్లుంది. – ప్రభాకర్, మధ్యవర్తి స్థలాన్ని కొనుక్కున్నాను అట్లా శ్రీనివాసరావు నుంచి నేను స్థలం కొనుగోలు చేసేటప్పుడు సాక్షులను, యాదవ సంఘం పెద్దలను విచారించి కొనుగోలు చేశాను. ఎన్నోసార్లు నాపై దాడిచేసినా నేను ఎప్పుడూ వారిని ఏమీ అనలేదు. అట్లా కోటేశ్వరరావు భార్య నా కుటుంబ సభ్యుల్ని, నన్ను అనేకమార్లు నోటికి వచ్చిన బూతులు తిడుతూ అవమాన పరిచింది. చివరకు వారు పెట్టిన వీడియోలో నా చొక్కా పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. నేను విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా నాపై దాడి చేశారు. ఇది పూర్తిగా మా వ్యక్తిగత వివాదం. అయినా దీనికి రాజకీయ రంగు పులమడం బాధాకరం. – నాగిరెడ్డి, స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి -
మంత్రి పదవి కంటే జగన్ మనసులో స్థానమే ముఖ్యం
మంగళగిరి: మంత్రి పదవి కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో స్థానమే తనకు ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 6 నెలల క్రితమే సీఎం జగన్ను కలిసి సామాజికవర్గ పరంగా మంత్రి పదవి ఇవ్వడంలో ఇబ్బందులుంటే తనకు పదవి అవసరం లేదని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరానన్నారు. తాను రాజకీయాల్లో ఉంటే సీఎం జగన్ వెంటే ఉంటానని.. లేదంటే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా గతంలోనే స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. -
‘ఆ బిడ్డల’కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండ
నిర్మల్: సేవకు కావలసింది మాటలు కాదని.. చేతలని నిరూపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈనెల 6న ‘గడ్డాల నాడూ మా బిడ్డలే..’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్పేజీలో ప్రచురించిన ఫొటో కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 5న తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ నిర్మల్లో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మి, గంగన్న దివ్యాంగులైన తమ కుమారులు శ్రీనివాస్ (22), గంగన్న (18)లను భుజాలపై ఒకరిని, చంకలో ఒకరిని ఎత్తుకుని శిబిరానికి వచ్చారు. యుక్తవ యసులో ఉన్న కొడుకులను మోసుకొస్తున్న తల్లిదం డ్రుల ఫొటోలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృ ష్ణారెడ్డి ఆ కుటుంబానికి రూ.50 వేలు అందించాలని ‘సాక్షి’ సిబ్బందికి పంపించారు. త్వరలోనే ఈ డబ్బులు గంగన్న కుటుంబానికి అందనున్నాయి. -
చంద్రబాబు డైరెక్షన్లోనే అంతా జరుగుతోంది
-
నిజాలు తెలుసుకుని మాట్లాడాలి..
మంగళగిరి: రాంకీ సంస్థలో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సూచించారు. పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాంకీ సంస్థలో తాను 2006 నుంచి ఉద్యోగిగా ఉన్నానని, ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే షేర్లలో భాగంగా రెండు వేల షేర్లు తనకు ఇచ్చిందని, అలాగే 2007లో బోనస్ కింద పదివేల షేర్లు ఇచ్చిందని.. ఈ 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదన్నారు. 2010లో సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లిందన్నారు. 2009లో రాంకీ సంస్థ నుంచి తాను బయటికొచ్చానని అప్పటి నుంచి 2021 వరకూ తనకు రాంకీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు తన నివాసంలో జరిపిన దాడుల్లో రూ.4,23,400 నగదు మాత్రమే దొరికిందని, మరెలాంటి బంగారం, డాక్యుమెంట్లు లభించలేదన్నారు. దొరికిన నగదు సైతం తనకు వ్యవసాయం వలన వచ్చిన ఆదాయం అని తెలుసుకున్న అధికారులు తనకు రాతపూర్వకంగా పంచనామా రాసి ఇచ్చి వెళ్లారని నగదు కూడా సీజ్ చేయలేదని వెల్లడించారు. రాంకీ సంస్థ ఎన్నడూ పన్ను ఎగ్గొట్టలేదని ఐటీ దాడుల్లో పన్ను బకాయి ఉంటే చట్ట ప్రకారం సంస్థ చెల్లింపు చేస్తుందన్నారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తన కుటుంబానికి లేదని ఆర్కే స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తనపై బురద జల్లేందుకు ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో 2014లో 12 ఓట్లతో గెలిచిన తాను.. 2019లో సీఎం కుమారుడు లోకేశ్ పోటీ చేసినా 6 వేల ఓట్లతో ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. కంపెనీ, షేర్, మూలధనం, ఐటీ, పబ్లిక్ ఇష్యూ అంటే తెలియని స్థానిక టీడీపీ నేతలను నమ్ముకుంటే చంద్రబాబు, లోకేశ్లు కోటి జన్మలెత్తినా మంగళగిరిలో టీడీపీ గెలవలేదన్నారు. -
దమ్ముంటే నిరూపించండి.. టీడీపీ నేతలకు ఆర్కే సవాల్
సాక్షి, గుంటూరు: తన రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2006లో రాంకీ సంస్థలో తాను ఉద్యోగం చేశానని.. 2006-21 వరకు రాంకీ గ్రూప్లో తనకు ఏ విధమైన షేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ షేర్లు, మూలధనం ఏమిటో టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో దమ్ముంటే నిరూపించాలని టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. మంగళగిరిలో లోకేష్ పై తాను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచానన్నారు. పుష్కరాల పేరుతో తాడేపల్లిలో రెండువేల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. -
దళితులను బెదిరించి భూములు లాక్కున్నారు: ఆర్కే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొందరు ఐఏఎస్ల పాత్ర ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీడియో ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. దళితుల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నాకే గత సర్కారు ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ... నిజాలు నిగ్గు తేల్చిన వీడియో.. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మంగళగిరికి చెందిన రియల్టర్ కొమ్మారెడ్డి (భూమిపుత్ర) బ్రహ్మానందరెడ్డి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు కొందరు రియల్టర్లను పిలిచి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో దళితులు భూములు అమ్మకపోతే నష్టపోతారని ప్రచారం చేయించాడు. ఈ హెచ్చరికలతో ఆందోళనకు గురైన దళితులు భూములను తెగనమ్ముకున్నారు. డబ్బులు ముట్టినట్లు బాండ్ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టలు కట్టలు డబ్బులు తీసుకుని వెళ్లి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. రాజధాని ఎక్కడనేది ముందే తెలుసుకాబట్టి చంద్రబాబు ఈ పని చేయించారు. ఆయన బినామీలకు భూములు బదిలీ అయ్యాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఇందులో కీలక పాత్రధారి. రాజధాని గ్రామాల రెవెన్యూ రికార్డులన్నింటినీ దొంగతనంగా తరలించారు. అప్పటి గుంటూరు జిల్లా ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, కాంతీలాల్ దండేల సహకారంతో ఈ భూములన్నింటినీ తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. నాలుగైదు వేల ఎకరాల భూములను కొట్టేసి దళితుల నోట్లో మట్టికొట్టారు. ముందుగానే వారితో బాండు పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం ఓ కుట్ర. ప్రభుత్వ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి అనుయాయులకు ప్యాకేజీ వచ్చేలా రూ.కోట్లు కొల్లగొట్టారు. రికార్డుల ట్యాంపరింగ్.. దళితులకు 1940 కన్నా ముందే ఇచ్చిన భూముల పట్టాలు వారి వద్దే ఉన్నాయి. ఆ రోజు నుంచీ వారు ఆ భూములను అనుభవిస్తున్నారు. బెదిరించి లాక్కున్న భూములన్నీ వారికి తిరిగి ఇప్పించాలి. మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు భూములకు హద్దులు లేకుండా చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేయించారు. దీంతో దళిత సోదరులు మోసానికి గురయ్యారు. చంద్రబాబు చెప్పిన తప్పుడు పనులను చేయలేదని అప్పట్లో ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ను తప్పించారు. క్యాట్లో కేసులు ఉన్న చెరుకూరి శ్రీధర్ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. దోషులను శిక్షించాలి. దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరుతున్నా. -
ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే అడుగు జాడలలో నడవాలి : ఆళ్ల రామకృష్ణరెడ్డి
-
గుంటూరు జిల్లాలో టీడీపీకి ఝలక్
మంగళగిరి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మరో షాక్ తగిలింది. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల ముందు అక్కడ ఎంపీటీసీ–1, ఎంపీటీసీ–03 స్థానాలకు టీడీపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సమక్షంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీటీసీ–01 స్థానానికి పోటీచేస్తున్న దరివేముల హనీరాయ్, ఎంపీటీసీ–03 అభ్యర్థిగా పోటీచేస్తున్న బాణావత్ ఉమాదేవి, దుగ్గిరాల సర్పంచ్ బాణావత్ కుషీబాయ్తో పాటు పలువురు నాయకులు టీడీపీకి గుడ్బై చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసినప్పటికీ అక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారుడు 1,100 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో డీలాపడ్డ ఆ పార్టీ నేతలకు ఎంపీటీసీ అభ్యర్థులు మరో షాక్ ఇవ్వడంతో ఎంపీటీసీ ఎన్నికల్లోగా ఇంకెంతమంది జంప్ అవుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. సీఎం సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయి కాగా, వైఎస్సార్సీపీలో చేరిన హనీరాయ్, ఉమాదేవి మాట్లాడుతూ.. తమకు తొలి నుంచి వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి అంటే ఇష్టమని.. కానీ, స్థానిక టీడీపీ నేతల మాటలు నమ్మి ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేశామన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడిలేదని వారు స్పష్టంచేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. సంక్షేమ పథకాలే తమ పార్టీని విజయపథంలో నడిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. -
‘అసైన్డ్’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారంటూ సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ను సీఐడీ అధికారుల బృందం ప్రశ్నించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు హయాంలో రాజధానికోసం భూ సమీకరణ(ల్యాండ్ ఫూలింగ్) జరిగినప్పుడు ఆ ప్రాంతమున్న గుంటూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్గాను, రాజధానిలో రైతుల భూముల సేకరణ, ప్లాట్లు కేటాయింపు తదితర చర్యలు చేపట్టినప్పుడు సీఆర్డీఏ కమిషనర్గాను కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్ను శుక్రవారం విజయవాడలోని సత్యనారాయణపురం సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు. అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా చేతులు మారుతున్నప్పుడు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న మీరు ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్పై సీఐడీ అధికారులు ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండానే జీవోలు జారీ చేస్తున్నా, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అడ్డగోలుగా జరిగినా ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారిగా తన పరిధి మేరకు ఏది చట్టబద్ధమో? ఏది చట్టబద్ధం కాదో? ప్రభుత్వానికి చెప్పడం వరకే తన బాధ్యత అని, ఆచరించడం, ఆచరించకపోవడం అనేది వారిష్టమని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇంకా అనేక కీలక ఆధారాలను శ్రీధర్ నుంచి సీఐడీ సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల నుంచి తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐడీ పోలీసులు శుక్రవారం పలు వివరాలు సేకరించారు. చంద్రబాబు హయాంలో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. -
చంద్రబాబుకు శిక్ష తప్పదు..
సాక్షి, అమరావతి: అమరావతిలో దళితులను దగా చేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు అసైన్డ్ భూ కుంభకోణం కేసులో శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఎమ్మెల్యే ఆర్కే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే నిమిత్తం సీఐడీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని ఆర్కేకు నోటీసులు పంపించగా.. గురువారం ఆయన విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సీఐడీ అధికారులు అడిగిన సమాచారం ఇచ్చి, ఆధారాలు సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్కే మాట్లాడుతూ.. రాజధాని పేరుతో తమకు అన్యాయం జరిగిందని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన చెందడంతో వారికి న్యాయం చేసే నిమిత్తం తాను సీఐడీకి ఫిర్యాదు చేశానన్నారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా దళితుల భూములను టీడీపీ పెద్దల బినామీలు లాక్కున్నారని, తాడికొండ నియోజకవర్గంలో మరో 3,500 ఎకరాల అసైన్డ్ భూములు గుంజుకున్నారని తెలిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు, అసైన్డ్ భూ కుంభకోణానికి సంబంధం లేదని, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని, కోర్టుల పరిధిలో ఉన్న దాని గురించి తాను మాట్లాడబోనని చెప్పారు. అసైన్డ్ భూ కుంభకోణానికి పాల్పడేలా చంద్రబాబు తెచి్చన జీవో 41 వల్ల రెవెన్యూ చట్టాలు దెబ్బతింటాయని అప్పట్లో కొందరు ఐఏఎస్లు అభ్యంతరాలు తెలిపారని, వారు రాసిన నోట్ ఫైల్స్ (అభ్యంతరాలు)ను సీఐడీ అధికారులకు అందజేసినట్టు ఆర్కే చెప్పారు. ఈ కేసులో తన వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాధారాలు సీఐడీకి సమరి్పంచానని, ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని చెప్పానన్నారు. -
నేడు విచారణకు వచ్చి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసులో గురువారం విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ బుధవారం నోటీసు అందజేసింది. అమరావతిలో ఎస్సీ, ఎస్టీల భూములను టీడీపీ నేతలు బలవంతంగా తక్కువ ధరకు గుంజుకున్నారని, అసైన్డ్ భూముల వ్యవహారంలో దళితులకు తీవ్ర అన్యాయం, నష్టం జరిగిందని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నమోదైన కేసులో ఏ1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి పి.నారాయణ ఉన్నారు. చంద్రబాబు ఈ నెల 23న, నారాయణ 22న విచారణకు రావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఆర్కే వాగ్మూలం నమోదు చేసేందుకు విచారణాధికారిగా ఉన్న సీఐడీ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు సీఆర్పీసీ 160 నోటీసు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజినల్ కార్యాలయానికొచ్చి కేసుకు సంబంధించి.. మీకు తెలిసిన వివరాలు చెప్పాలని సీఐడీ నోటీసులో పేర్కొన్నారు. -
బాబు, నారాయణలకు శిక్ష తప్పదు
మంగళగిరి: దళితులను భయపెట్టి, బెదిరించి వారి భూములను కాజేసిన చంద్రబాబు, నారాయణ అండ్కో, వారి బినామీలకు శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడారు. అన్ని ఆధారాలతోనే తాను ఫిర్యాదు చేసిన మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తు చేసిన అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. చంద్రబాబు రాజధానిని ప్రకటించకుండా నూజివీడు, అక్కడ.. ఇక్కడ అంటూ లీకులు ఇస్తూ తమ బినామీలతో మాత్రం ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేయించారన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలోని రాజధాని ప్రాంతంలో సుమారు 3,500 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. విచారణలో నిజాలన్నీ బయటకొస్తాయన్నారు. దళితుల భూములను విక్రయించరాదని, బదలాయించరాదని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. చట్టాలను అతిక్రమించి.. కేబినేట్లో ఆమోదం పొందకుండా అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం, తన అనుంగులకు కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చేలా వాటిని కట్టబెట్టారని విమర్శించారు. దీంతో అమాయకులైన దళిత సోదరులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దళితులకు న్యాయం చేయాలంటూ దళితులే ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేదని, వారి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. -
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ అభ్యర్థించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇవ్వజూపారని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ త్వరితగతిన విచారణ చేయాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ను గురువారం జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్లు వాదనలు వినిపించారు. ‘2017 మార్చిలో పిటిషన్ దాఖలు చేయగా 2018 నవంబరులో పిటిషన్ ధర్మాసనం ముందుకొచ్చింది. నాడు జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం ముందుకు రాగా 2019 ఫిబ్రవరిలో విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 2019లో విచారణ చేయాల్సిన కేసు నెలలు గడుస్తున్నా బెంచ్మీదకు రాకపోవడంతో నవంబర్ 23, 2019న మరొక ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేశాం. అయినప్పటికీ విచారణ జాబితాలోకి రాకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరో డైరెక్షన్ అప్లికేషన్ దాఖలు చేశాం’ అని ధర్మాసనానికి వివరించారు. పిటిషన్ వచ్చే ఏడాది వేసవి సెలవులు అనంతరం జులైలో విచారణ చేస్తామని జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులైలో విచారణకు ఏమీ అభ్యంతరం లేదని కానీ విచారణ తేదీని ఖరారు చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులు వీలైనంత త్వరగా విచారణచేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన అంశాన్ని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రస్తావించారు. ఈ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని, కానీ తెలంగాణ ఏసీబీ ఆ పేరు చేర్చడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రశాంత్ భూషణ్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రధాన కేసు జూలైలో విచాస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ‘ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ పై విచారణ ముగిస్తున్నాం. ప్రధాన కేసు జూలై 14, 2021న తగిన ధర్మాసనం విచారిస్తుంది’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
అక్రమ కార్యాలయంపై టీడీపీకి ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా ఆత్మకూరులో గత సర్కారు చేసిన భూ కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీచేసింది. సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మొత్తం 12 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 23వతేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్పై వీడియో కాన్ఫరెన్స్లో విచారణ.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన« ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ అల్లంకి వాదనలు వినిపించారు. గత సర్కారు టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం అక్రమంగా భూ కేటాయింపులు చేసిందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన కేటాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణం కోణంలో చూడాలి.. ‘మంగళగిరి మండలం ఆత్మకూరులో సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/10 పరిధిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి గత సర్కారు 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. అవి పోరంబోకు భూములు. వాటిని ఎవరికీ కేటాయించడానికి వీల్లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతించారు. ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధం. నీటి వనరులు, వాటితో సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉందని హైకోర్టు చెప్పినప్పటికీ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వలేదు. లీజు, నిర్మాణాలు నిషేధమని నాటి ప్రభుత్వం అంగీకరించినా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు’ అని తెలిపారు. ఈ తరహా కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టే హైకోర్టు కేసును ముగించి ఉండవచ్చు కదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే పెండింగ్లో ఉన్న కేసు వ్యక్తిగతమైందని, ఈ కేసును మాత్రం పర్యావరణానికి సంబంధించిన పెద్ద అంశంగా చూడాలని ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి నివేదించారు. కేవియెట్లు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించిన ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
అది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో పనే
మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటుకొందరు విలేకరులపై సోషల్ మీడియాలో దు్రష్పచారానికి పాల్పడింది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో చైతన్య, ఎమ్మెల్సీ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. 2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్కు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్కుమార్ కీలకపాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్ పేరు బయటకు రావడంతో పీఆర్వో చైతన్య దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, సాక్షి విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో లారెన్స్, కొప్పూరి వేణును అరెస్ట్ చేసినట్టు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం
సాక్షి, పెదకాకాని/పేరేచర్ల: రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి దశరథరామిరెడ్డి(86)కి కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, అభిమానులు శుక్రవారం కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. పెదకాకాని సర్పంచిగానే కాక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం పాలకవర్గం చైర్మన్గా పనిచేసిన దశరథరామిరెడ్డి గ్రామ, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న దశరథ రామిరెడ్డి గుంటూరు సాయిభాస్కర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన సంగతి విదితమే. పెదకాకానిలోని ఆయన నివాసానికి గురువారం రాత్రి స్థానిక నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు చేరు కుని ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, పారిశ్రామికవేత్త పేరిరెడ్డిని పరామర్శించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబులెన్స్లో దశరథరామిరెడ్డి భౌతికకాయం ఆయన నివాసానికి చేరుకుంది. దశరధరామిరెడ్డి సతీమణి వీరరాఘవమ్మ పెద్ద కుమారుడు అయోధ్యరామిరెడ్డి చేయి పట్టుకోగా భర్త భౌతికకాయంచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ‘అయ్యా వెళ్లిపోతున్నావా’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పెదకాకానిలో ప్రజల సందర్శనానంతరం భౌతికకాయాన్ని ఫిరంగిపురం మండలం, వేమవరంలోని ఆళ్ల వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అయోధ్యరామిరెడ్డి శాస్త్రోక్తంగా పూజా క్రతువు నిర్వహించి తండ్రి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, మహమ్మద్ ముస్తాఫా, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్, లింగంశెట్టి ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్గాంధీ, కళ్లం హరనాథరెడ్డి, మేరుగ విజయలక్ష్మి, డైమండ్ బాబు తదితరులు దశరథరామిరెడ్డి పార్ది్థవదేహానికి నివాళులర్పించారు. -
వైఎస్సార్ సున్నా వడ్డి పథకం చెక్కుల పంపిణీ
సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజమైన మహిళల పక్షపాతి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో వైఎస్సార్ సున్నా వడ్డి పథకం చెక్కులను డ్వాక్రా మహిళలకు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబులా మాయమాటలు చెప్పకుండా పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నేత సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జేట్ ఉన్నప్పటికీ ప్రజలను ఆదుకోవాలనే మంచి మనసు ఉంది కాబట్టే ఇవ్వాళ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. (కర్నూలులో సున్నా వడ్డి పథకాన్ని ప్రారంభించిన మంత్రి) గుంటూరు: సీఎం జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి అన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా స్వయం సహాయక సంఘాలకు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అనంతపురం: సంక్షోభ కాలంలోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 11 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. కష్టకాలంలో డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. -
మంగళగిరిలో సున్నా వడ్డీ ప్రారంభం
-
‘పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కూడా లేరు’
-
బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికలు జరగకుండా ఉండటమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాబు ఎన్నికలను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చిన్న సంఘటనలను కూడా భూతద్దంలో చూపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లేరని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలని నూతన సంస్కరణలు తెచ్చారన్నారు. ఇక 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి సంస్కరణలు తెచ్చారా విమర్శించారు. రాజకీయ నాయకులు, బంధువులు ఎన్నికల్లో పోటీ చేయకుడదనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. సీఎం జగన్ పాలనను అన్ని రాష్ట్రాల వారు అభినందిస్తుంటే ఎల్లో మీడియాకు అవి కనబడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో భారీ ఎత్తున చేరికలు 8 నెలల కాలంలో సీఎం జగన్ చేసిన పాలనను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెప్పారు. అవి...ఎల్లో మీడియాకు కునబడం లేదా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తెస్తున్న నూతన సంస్కరణలు నచ్చక చంద్రబాబు ఎల్లో మీడియాల్లో రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లుగా కల్పితాలు రాపిస్తున్నారన్నారు. ఆయన అమలులోకి తెచ్చిన ఇంగ్లీషు మీడియం, వికేంద్రీకరణ, దిశ చట్టాన్ని ఇతర రాష్టాలు కూడా మెచ్చుకుని వాటిని అనుసరిస్తున్నాయి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. గతంలో తమ నాయకులైన అంబటి రాంబాబు, ముస్తఫాలు సత్తెనపల్లిలో ఎంపీటీసీగా గెలిచిన వారిని బస్సులో తీసుకువెళుతుంటే జరిగిన దాడిపై బాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పల్నాడులో టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలు అందరికీ తెలుసని, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం, గురజాలలో యరపతినేని, చిలకలూరిపేటలో పుల్లారావ్ చేసిన అరాచకాలు ప్రజలు గమనించారని తెలిపారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని..? అని ప్రశ్నించారు. విజయవాడ నుండి గూండాలను మాచర్ల తెచ్చారా అని ఎద్దేవా చేశారు. పల్నాడు పౌరుషాల గడ్డ ప్రజలు మీ అరాచకాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’ టీడీపీ నుంచి రోజుకు ఇద్దరూ చొప్పున పార్టీ మారుతుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలువేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో సీబీఐ, ఈడీలను ఎందుకు రాష్ట్రంలోకి రానివ్వలేదని, చంద్రబాబు ఎల్లో మీడియాతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాది పాటు ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులతో పాలన చేసిన నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. సీఎం జగన్ ఆర్డినెన్స్ తో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని, డబ్బులు లేకుండా ఎన్నికల జరగాలన్నదే ఆయన ఉద్దేశం అన్నారు. పులివెందుల పంచాయతీ అని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఓసారి పులివెందుల వెళదాం రండి... అక్కడి ప్రజల మమకారం మీకు తెలియదు అని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యoలో హింసకు తావు లేదని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు కట్టుబడి పని చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ: చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆరాచకాలు ఎలా చేయాలో బాబు తన మనుషులకు చెప్పి పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేమనే జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా బాబు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
మానవత్వం చాటుకున్న ఆర్కే
సాక్షి, గుంటూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను ఆస్పత్రికి తరలించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన మానవత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లి శివారులో సోమవారం రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ధనలక్ష్మీ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అటుగా వెళ్తున్న ఆర్కే.. ప్రమాద విషయాన్ని గమనించి తన కారులోఆమెను ఆస్పత్రికి తరలించారు. దగ్గర ఉండి మహిళకు చికిత్సను అందించారు. -
ఎమ్మెల్యే ఆర్కేకి గాయం
సాక్షి, గుంటూరు/మంగళగిరి: గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గాయపడ్డారు. వధూవరులను ఆశీర్వదించేందుకు స్టేజీపైకి వెళ్లిన ఆర్కేతో కరచాలనం కోసం స్థానికులు కూడా వేదికపైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఘటనలో ఎమ్మెల్యే కాలికి గాయమైంది. వెంటనే గుంటూరు అరండల్పేటలోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్కేను కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పరామర్శించారు. (జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా: పవన్ కళ్యాణ్) -
పచ్చమీడియా చంద్రబాబుకు దాసోహమైంది
-
చంద్రబాబు ట్రాప్లో పడొద్దు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: అవినీతి, అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిట్ వేయడంతో చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి రైతులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని రాజధాని రైతులకు ఎమ్మెల్యే ఆర్కే సూచించారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్ రాజధాని పర్యటన
-
ఐటీ దాడులపై వారు నోరు మెదపరేం..!
సాక్షి, విజయవాడ: పచ్చమీడియా రోజురోజుకు దిగజారిపోతుందని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్కల్యాణ్ రాజధానిలో పర్యటించారని విమర్శించారు. రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్ నోట్లో చెప్పారని తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అడ్డంగా దొరికిపోయారన్నారు. సీబీడీటీ ప్రాథమిక విచారణ లోనే రెండు వేల కోట్ల అక్రమ వ్యవహారం జరిగితే ఇక పూర్తిస్థాయిలో విచారణ జరిగితే చంద్రబాబుకు సంబంధించిన వేల కోట్ల అక్రమ సంపాదన బయట పడుతుందన్నారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') ‘తన మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. లోకేష్ బినామీ రాకేష్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు.తన కొడుకు కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే మాజీ మంత్రి పుల్లారావు ఎందుకు నోరు విప్పడం లేదు. ఇప్పటికీ పవన్కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, నారాయణలు ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీ నేతలు, పచ్చమీడియా ఎందుకు గొంతులు చించుకుంటుందని’ ఆర్కే ప్రశ్నించారు. -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను ఆళ్ల తప్పుపట్టారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్కు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన వేషం మార్చి నటుడయ్యారు..!’ గత ఐదేళ్లు పవన్ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించలేదు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్ చంద్రబాబును ప్రశ్నించలేదు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి.. ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం. మేం రాజధాని ప్రాంత రైతులం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి రిజర్వ్ జోన్లను తొలగించాలని కోరాం. సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అసలు రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదు. ఇక్కడే శాసన సభ ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కావాలి. ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేయబోతున్నాం. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టడం సరికాదు. చంద్రబాబు ఏం చెబితే.. అదే పవన్ మాట్లాడుతున్నారు. పవన్కు లోక పరిజ్ఞానం లేదు. ఇది తప్పు అయితే చంద్రబాబు, లోకేష్ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం వైఎస్ జగన్ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేష్లు చెప్పినట్లు పవన్ మాట్లాడటం సరికాదు. చదవండి: నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్కార్డు దారులతో కొనుగోలు చేయించారు. ఇవాళ కేసులు కూడా నమోదు అయ్యాయి. వీటిపై పవన్ నోరు మెదపడం లేదు. దళితుల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి దళితులకు సీఎం వైఎస్ జగన్ ఇప్పించారు. ఈ విషయాలపై పవన్ మాట్లాడటం లేదు. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలు వళ్లెవేయడంలో పవన్ ఉన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీలతో వేల కోట్లు డబ్బులు దోచేశాడు. దీనిపై పవన్ మాట్లాడటం లేదు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నా మాట్లాడటం లేదు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకపోయినా పవన్ ప్రశ్నించడం లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని ప్రశ్నిస్తానని పవన్ అంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. పవన్ ఎందుకు ఈ విషయాలపై మాట్లాడటం లేదు. పవన్ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చదవండి: రేణుదేశాయ్ ఇబ్బందులు అందరికీ తెలుసు -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
-
పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి
-
చంద్రబాబు రైతు ద్రోహి
-
మీరు కూడా రండి.. సీఎం దగ్గరకు వెళ్దాం..
-
బాబు, లోకేశ్.. సీఎం దగ్గరకు వెళ్దాం రండి: ఆర్కే
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజధాని రైతులు కలిశారని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని.. అడగకుండానే సీఎం జగన్ కౌలు పరిహారాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారని పేర్కొన్నారు. రైతు కూలీల పెన్షన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా.. పూలింగ్ పేరిట చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేశారని.. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 8648 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.(రాజధానితో చంద్రబాబు వ్యాపారం) మీరు కూడా రండి.. సీఎం దగ్గరకు వెళ్దాం.. ‘‘నేషనల్ హైవే దగ్గర జయభేరి వాళ్లు అపార్టుమెంట్లు కట్టారు. అక్కడికి సమీపంలోనే ఈస్ట్ ఫేస్తో రైతులకు సంబంధించిన భవనాలు కడుతుంటే.. వాటి కారణంగా జయభేరి అపార్టుమెంట్లు అమ్ముడుపోవనే కారణంతో వాటిని రిజర్వు జోన్లో పెట్టారు. దానిని ఎత్తివేయాలని సీఎం జగన్ను కోరాం. రైతుల సమస్యల గురించి చెప్పడానికి వెళ్తే నన్ను రైతు ద్రోహి అంటారా. రైతులను, రైతు కూలీలను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా’’ అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.(భావి తరాల బాగుకే వికేంద్రీకరణ) అదే విధంగా... ‘‘అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. తన ఇంటి దగ్గర బల్బుల కోసమని... ఉండవల్లి పంచాయతీ నుంచి రూ. 50 లక్షలు డ్రా చేయించారు. పేదల ఇళ్లకు కనీస విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదు. రెఫరెండం పెట్టాలని ఇప్పుడు అడుగుతున్నారు. అసలు ఏయే అంశాలపై రెఫరెండం పెట్టాలో బాబుకు తెలియడం లేదు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మీరు రైతు మిత్రలు అయితే... చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి ఎమ్మెల్యే వద్దకు, మంగళగిరి ఎమ్మెల్యే అయిన నా వద్దకు రండి.. మనందరం కలిసి సంబంధిత మంత్రితో మాట్లాడదాం. ఈ పరిస్థితికి మీరే కారణం అయినా.. రైతుల కోసం నేను కూడా మీతో పాటు ముఖ్యమంత్రిని కలుస్తా. సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయాలు చేస్తూ గ్రామస్థాయి నేతలా చంద్రబాబు మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు తీరును ఆర్కే ఎండగట్టారు. -
సీఎం జగన్ మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు
-
రిజర్వ్ జోన్లను కూడా ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారు
-
పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే..
సాక్షి, అమరావతి: పేద, బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలంటూ ఈ బిల్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి.. శాసనమండలికి పంపించిందని, మండలిలోని పెద్దలు ఈ బిల్లును మరింత కూలకశంగా చర్చించి.. సూచనలు, సలహాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా బిల్లు మీద నాలుగు సవరణలు ప్రతిపాదిస్తూ మండలి తిరిగి శాసనసభకు పంపిందని తెలిపారు. ఇంగ్లిష్ మీడియాన్ని ఎత్తివేయాలని, లేదా తెలుగు మీడియం తీసుకోవాలా? ఇంగ్లిష్ మీడియమా? అన్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని సవరణలు పంపారని, శాసనమండలిలో తనకు మెజారిటీ ఉండటంతో చంద్రబాబు ఈ విధంగా దురుద్దేశంతో ఈ బిల్లును తిప్పి పంపారని ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలందరికీ కచ్చితంగా విద్యను ఉచితంగా అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందని గుర్తు చేశారు. శ్రీచైతన్య, నారాయణ వంటి ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంలో అసలు బోధన జరగడం లేదని, నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలోనే వాళ్లు బోధిస్తున్నారని తెలిపారు. తన బినామీలు, తన మనుషులు చేసే ఇలాంటి చర్యలు సమర్థించే చంద్రబాబు.. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద పిల్లలు, అగ్రకులాల పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పేదలెవరూ ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదన్న దుర్బుద్ధితో చంద్రబాబు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారని, మండలిలో బలముందని ఇలా బిల్లులను చంద్రబాబు దురుద్దేశంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తన కుట్రల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆర్కే ధ్వజమెత్తారు. -
ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్బుక్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. పోడియం వద్దకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీ సభ్యులకే అర్థం కావటం లేదని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక సోనియా, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అయితే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొన్నారు. ప్రజలు 151 స్థానాలు ఇచ్చి వైఎస్ జగన్కు పట్టం కట్టారని తెలిపారు. కాగా గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్ ఇవ్వలేదని విమర్శించారు. కానీ నేడు ప్రతిపక్ష నేతలకు ఎంత అవకాశం కల్పిస్తున్నారో గమనించాలని ఆర్కే సూచించారు. చదవండి: నిరూపిస్తే రాజీనామా చేసి.. క్షమాపణ కోరుతా : ఆర్కే పోలీసులపై టీడీపీ నేతల రౌడీయిజం -
శాసనాలు చేసే రాజధానిగా అమరావతి
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సమర్థిస్తున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేసిందని ఆరోపించారు. అమరావతి రాజధాని అనగానే మొదటగా సంతోషపడిన వాళ్లలో తానూ ఒకడినని, కానీ తర్వాత మోసపోయామని తెలుసుకున్నానని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని పర్యావరణవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతు వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. రాజధానిని కొంతమందికే పరిమితం చేసేలా చంద్రబాబు వ్యవహరించారని, దళిత సోదరులు అనుమతి తీసుకోకుండా భూములు లాక్కున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల నుంచి భూములు గుంజుకున్నారని తెలిపారు. కానీ సీఎం జగన్ ఇలా వ్యవహరించలేదని.. కమిటీ నివేదికలు, ప్రజల అభీష్టం మేరకే ముందుకు వెళ్తుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో పదేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దౌర్భగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీడీపీ బినామిలతో ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే శాసనసభ శాసనాలు చేసే రాజధానిగా అమరావతి మారినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని తరలింపుపై అనుమానాలు పటాపంచలయ్యాయని తెలిపారు. శాసనసభ ఇక్కడే ఉంటుందని, కింగ్ మేకర్లను తామేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని స్పష్టం చేశారు. అమరావతిని అగ్రికల్చరర్ జోన్గా ప్రకటించాలని కోరారు. శాసనసభ, సచివాలయంతో సామాన్యులకు పనేం ఉండదన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు బలవంతంగా ప్రయోగించిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
ఆస్తులు కాపాడుకోవడానికే బాబు జోలె
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన ఆస్తులు, తన బినామీల భూములు కాపాడుకోవడానికే జనం ముందుకు జోలె పట్టుకుని వస్తున్నారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హెరిటేజ్ ఆస్తులను కాపాడుకోవడానికి తన భార్యతో ఓ ప్లాటినం గాజును వేయించి.. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, రైతుల వద్ద విరాళాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వారి జీతాలను గానీ, ఇంటి అద్దె అలవెన్సును గానీ రైతుల ఉద్యమానికి విరాళంగా ఇవ్వలేదన్నారు. -
అవినీతి రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు ఈప్రాంతాన్ని ఎంచుకున్నారు
-
చంద్రబాబు రైతులను నిలువునా ముంచారు
-
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్
-
అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే
సాక్షి, గుంటూరు: రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే సోమవారం పెనుమాక నుంచి ర్యాలీకి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాజధాని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, భూములు ఇచ్చిన వారికి కూడా ప్లాట్లు ఇవ్వలేదన్నారు. గతంలో తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని ముసుగులో 25 రోజులు విషప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులను, దళితులకు చేసిన అన్యాయాన్ని బయటకు రానీవకుండా చూసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి రాజధాని గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో గతంలో జరిగిన ఘటన వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేసి రాజధానిలో ఏదో జరిగిపోతోందన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ తమ నిర్ణయాన్ని ఇంకా వెలువరించలేదన్నారు. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ అధికార ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా గత 25 రోజులుగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని దూషిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. లక్షల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. రాజధాని రైతుల సాక్షిగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సిందేనని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సంబంధిత వార్తలు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్ వికేంద్రీకరణతో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి వరదొస్తే అమరావతికి ముప్పే ఇదీ భ్రమరావతి కథ -
బాబు బినామీ..ప్యాకేజి పవన్..ఏమయ్యావు తల్లీ!
-
రాజధానికి చంద్రబాబే పెద్దశాపం
-
నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే
సాక్షి, తాడేపల్లి : అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ను ఆధారాలతో చూపించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అమరాతిలో తన పేరిట భూములు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. నీరుకొండలో తనకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని ఆర్కే సవాలు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో తనపేరు మీద గానీ, తన భార్య పేరు మీద గానీ భూములు లేవని స్పష్టం చేశారు. తన భార్య పేరు మీద ఐదెకరాల భూమి ఉందని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారని తెలిపారు. తమకు భూమి ఉందని చూపిస్తే ఆ ఐదెకరాలు వారికే రాసిస్తానని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తానని అన్నారు. రామోజీ, రాధాకృష్ణ తెగ తాపత్రాయపడుతున్నారు.. తనను వివరణ అడగకుండానే పేపర్లలో తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. అవాస్తవాలు రాయవద్దని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కోరారు. చంద్రబాబును కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందనే కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో అవినీతి జరగలేదని చంద్రబాబు గుండెల మీద చేయ్యి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజధానికి చంద్రబాబు శాపం అని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరం అని అన్నారు. చంద్రబాబు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేకపోయారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని నేతలు రాజధాని ప్రాంతంలో కి.మీ రోడ్డు కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ బెదిరించారని తెలిపారు. అక్రమంగా రైతులపై కేసులు పెట్టించారని విమర్శించారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కొత్త బినామీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి ప్యాకేజీ తెచ్చుకోలేదా అని పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. మంగళగిరిలో జనసేన కూటమి అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం ఎందుకు చేయలేదని నిలదీశారు. భువనేశ్వరి అప్పుడేందుకు రోడ్లపైకి రాలేదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ప్రజలు ఓడించారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్కు మంగళగిరి హద్దులు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు, వారిని పోలీసు స్టేషన్లలో పెట్టి కొట్టినప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదో చెప్పాలన్నారు. రైతుల నుంచి భూములు తీసుకుని ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదో భువనేశ్వరి చంద్రబాబును అడగాలని సూచించారు. రాజధాని కట్టాలంటే రూ. లక్ష 25వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాలన్ని మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. -
చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు
-
చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు: ఆర్కే
సాక్షి, గుంటూరు : రాజధానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు దోపిడీనే అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘చంద్రబాబు చేసిన పాపం ఇప్పుడు రాజధాని రైతులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. భూములు ఇచ్చిన రైతులకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దోపిడీయే లక్ష్యంగా చంద్రబాబు పనిచేశారు. అన్నివిధాలుగా రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఇవాళ రైతుల గురించి ఆయన మాట్లాడటం దారుణం. రాజధాని లో జరిగిన కుంభకోణాలు ప్రభుత్వం బయట పెడుతుంటే చంద్రబాబు కంగారు పడుతున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది రియల్టర్లు ఆయన బినామీల రాజధానిలో హంగామా చేస్తున్నారు. దీక్షలు చేయడానికి రైతులు రాకపోతే చంద్రబాబు కార్యకర్తలు పంపించి చేయిస్తున్నారు. రాజధాని పేరుతో తమను ఎందుకు మోసం చేశారని దీక్షలు చేసే రైతులు చంద్రబాబును నిలదీయాలి. రాజధానిపై సీఎం ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. కుటిల రాజకీయాలు చేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేయలేని పనులను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు ఇస్తోంది. రైతు కూలీలకు ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్నాం. ప్రభుత్వం రైతులందరికి న్యాయం చేస్తుంది.’ అని అన్నారు. -
వివరాలన్నీ సాయంత్రం వెల్లడిస్తాం
-
టీడీపీ నూతన కార్యాలయం కూడా అక్రమ నిర్మాణమే
సాక్షి, గుంటూరు: మంగళగిరి మండలం ఆత్మకూరులో నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయాన్ని నిర్మించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన టీడీపీ పార్టీ కార్యాలయ స్థలాన్ని వాగు, పోరంబోకు భూములకు కేటాయించినట్లు తెలిపారు. ‘వాగు, చెరువు, పోరంబోకు భూములను ఆఫీసులకు, పార్టీ కార్యాలయాలకు కేటాయించ కూడదని చట్టం చెబుతుంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించింది’ అని అన్నారు. ఈ విషయంపై తాను కోర్టును ఆశ్రయించానని, దీనిపై కోర్టు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు ఉండే ఇల్లు అక్రమమేనని, ఇప్పుడు ఆయన కట్టుకున్న పార్టీ కార్యాలయం కూడా అక్రమంగానే నిర్మించారని విమర్శించారు. అయితే ఈ పార్టీ కార్యాలయాన్ని లింగమనేని రమేష్ కట్టించారని, దీని కోసం మొదట 3.65 సెంట్ల భూమిని టీడీపీ ప్రభుత్వమే కేటాయించుకుందని తెలిపారు. అది కాకుండా పార్టీ కార్యాలయం కోసం ఉమా మహేశ్వర్రెడ్డి అనే రైతు భూమిని కబ్జా చేశారని అన్నారు. దీనిపై ఆ రైతు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను కూడా చంద్రబాబు పాటించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. -
వచ్చే నెలలో మెగా డీఎస్సీ: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి : వచ్చే నెలలో మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 7,900 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వంలోని అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నలకు మంత్రి సురేష్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సురేష్ మాట్లాడుతూ... ప్రతీ ఏడాది జనవరిలో అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా పేదలందరికీ ఇంగ్లీషు మీడియంలో విద్య అందించేలా తమ ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టిందని సభకు తెలిపారు. గొప్ప నిర్ణయం.. ‘పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్యను అందించడమే లక్ష్యం. టీడీపీ హయాంలో భాషా పండితులను విస్మరించారు. అయితే మా ప్రభుత్వం విద్యాశాఖలో భాషా పండితులకు పదోన్నతులు కల్పించింది. మొత్తం 12 వేల మంది భాషా పండితులకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే పరిష్కరించారు. సీఎం నిర్ణయంతో భాషా పండితులంతా సంతోషంగా ఉన్నారు అని సురేష్ వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన సంతోషకరం అని హర్షం వ్యక్తం చేశారు. ఇదొక గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచే ఇంగ్లీషు మీడియం బోధన ప్రారంభించడం శుభ సూచకమని ఆర్కే అన్నారు.