అనంతపురం రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | ysrcp chief ys jagan Responds On Anantapuram Road Accident | Sakshi
Sakshi News home page

అనంతపురం రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Nov 23 2024 8:21 PM | Updated on Nov 23 2024 8:46 PM

ysrcp chief ys jagan Responds On Anantapuram Road Accident

సాక్షి,తాడేపల్లి: అనంతపురం జిల్లాలో శనివారం(నవంబర్‌ 23) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని,వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement