మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు

Published Wed, Mar 5 2025 12:24 AM | Last Updated on Wed, Mar 5 2025 12:23 AM

-

సింగరేణి(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జీఎం పర్సనల్‌(ఐఆర్‌పీఎం) కవితానాయుడు ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించగా విజేతలకు ఈనెల 8న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు పి.కిరణ్మయి, బి.సుమలత, డి.శారద, కె.రమ, ఎ.విజయకుమారి, జీ.బీ.అరుణకుమారి, కె.శైలజ, ఎన్‌.గౌతమి, బి.మౌనిక తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement