
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ.. ఎంతోమంది దృష్టిని ఆకర్శిస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇందులో లోపాలు ఉన్నాయని 'డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్' (Deutsche Bank Research) ఓ నివేదికలో వెల్లడించింది.
ఏఐ టెక్నాలజీ అన్ని విషయాల్లోనూ రాణిస్తోంది, కానీ లెక్కల (గణితం) విషయానికి వస్తే.. గణనలు చేయడంలో అంత ఆశాజనకంగా లేదని లోపభూయిష్టంగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ పేర్కొంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయిందని తెలిపింది.

ఏఐలో ఫైనాన్స్, హెల్త్ కేర్ కూసే నెమ్మదిగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ తెలిపింది. కాబట్టి ఈ రంగాలలో ఏఐ ఫలితాలు తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని పేర్కొంది. కాబట్టి ఈ రంగంలో ఆశాజనక ఫలితాలు అందించడానికి ఏఐ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతనై ఉంది.
ఇదీ చదవండి: భారత్కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే..
కొన్ని రంగాల్లో మాత్రం.. ఏఐ ఉత్పాదక ఊహాతీతంగా, ఆశ్చర్యపడిచే విధంగా ఉంది. అపరిశోధనలను సంబంధించిన విషయాలను అందించడం, వస్తావా ప్రపంచం అనుసరించే అనేక గేమ్ ఇంజిన్లను సృష్టించడంలో కూడా ఏఐ చాలా అద్భుతంగా ఉందని వెల్లడించింది.