-
ఉద్యోగంలోనే కాదు.. ఉద్యోగుల ఎంపికలోనూ ఏఐ - ఎలా అంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏఐను ఉద్యోగాలలో ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగులను ఎంపిక చేసే విషయంలో కూడా వినియోగించుకోవడం మొదలుపెట్టారు.సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెస్యూమ్స్ పంపిస్తారు. వీటిని ఆ కంపెనీ రిక్రూట్మెంట్ పరిశీలించి, అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఏఐ వాడకంలోకి వచ్చిన తరువాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు.GenAI బాట్లు మేనేజర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. సరైన క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని ఎంపిక చేయడంలో ఏఐ చాలా అద్భుతంగా ఉపయోగపడుతోంది హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల ఎంపిక కూడా చాలా వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.కొత్త నియామకాలలో దాదాపు 40 శాతం అభ్యర్థులను ఏఐ ద్వారానే ఎంచుకున్నట్లు, దీంతో ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్ఫ్యాక్ట్ గ్లోబల్ హైరింగ్ లీడర్ రీతు భాటియా పేర్కొన్నారు. ఒకేసారి నియమాలకు చేపట్టడానికి 63 రోజులు పట్టేది, అయితే ఏఐ సాయం వల్ల ఇది 43 రోజుల్లోనే ముగిసిందని కూడా భాటియా పేర్కొన్నారు.రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ పీపుల్ఫై చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'రాజేష్ భారతీయ' ప్రకారం.. జెన్ఏఐ ఉద్యోగులను ఇంటర్వ్యూలు చేసే సమయంలో చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాన్యువల్గా రెస్యూమ్ పరిశీలన చేపడితే ఎక్కువ సమయం పడుతుంది. ఆ పనిని ఏఐ చాలా వేగంగా చేస్తుంది. తద్వారా ఇంటర్వ్యూ చాలా వేగంగా ముగుస్తుందని పేర్కొన్నారు. -
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా రంగంలోనూ ప్రవేశించింది. ఏఐని విద్యలో విలీనం చేసే దిశగా గౌహతిలో రాయల్ గ్లోబల్ స్కూల్ తొలి ఏఐ టీచర్ 'ఐరిస్'ను ఆవిష్కరించింది.సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ‘ఐరిస్’ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా, ఉదాహరణలతో చక్కగా సమాధానాలు ఇచ్చింది.విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు.. కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) ప్రాజెక్టు కింద మేకర్ల్యాబ్స్ ఎడ్యు-టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ‘ఐరిస్’ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. -
అదొక.. 'AI పొలిటికల్ అవతార్'!
ఈ సంవత్సరమే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో.. అవినీతి ఆరోపణల కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతని పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) తరఫున అతను పోటీ చేయడానికే కాదు.. ప్రచారం చేయడానికీ వీల్లేదని ఆ దేశపు సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా బరిలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికలుగా ఇమ్రాన్ ప్రచారం చేసిపెట్టాడు. ప్రసంగాలిచ్చాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు తీర్పును ధిక్కరించాడా? అయ్యో అస్సలు కాదు. జైల్లోనే ఉన్నాడు. మరి? ప్రచారం, ప్రసంగాలు చేసింది ఇమ్రాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతార్!ఒక్క పాకిస్తాన్లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తన చిప్ని దూర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! దాదాపు 50కి పైగా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం. సుమారు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) మంది ఓటును వినియోగించుకుంటున్నారు. అమెరికా టు ఆఫ్రికా, ఆసియా టు ఐరోపాలోని దేశాల్లో జరిగే ఈ ఎన్నికల్లో పాలసీ మ్యాటర్స్, ప్రచారం .. పాజిటివ్, నెగటివ్ రెండు కోణాల్లో ఏఐదే ప్రధాన పాత్ర! అందుకే 2024, గ్లోబల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరాన్ని ఏఐ ఎలక్షన్స్ ఇయర్ అంటున్నారు. ఈ సందర్భంగా.. మన దగ్గర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటున్న ఈ క్షణం దాకా ఎన్నికల ప్రచారాల్లో వస్తున్న మార్పుల వెంట సరదాగా నడిచొద్దాం..దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారమంటే అగ్రనేతలు నిర్వహించే బహిరంగ సభలే! ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకి వస్తే.. ఖాదీ వస్త్రధారణ, పవర్ఫుల్ స్లోగన్సే ప్రచారస్త్రాలుగా ఉండేవి. 1965లో లాల్బహదూర్ శాస్త్రి ‘జైజవాన్ జై కిసాన్’తో మొదలైందీ ఎన్నికల నినాద యాత్ర. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్లోని ఉరువా బహిరంగ సభలో ఆ నినాదాన్నిచ్చారు ఆయన. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని.. సరిహద్దు గట్టి రక్షణకు సైనికుల బలాన్ని, వ్యవసాయాధారిత మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులే కాబట్టి వాళ్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆ రెండు వర్గాలకు తమ సర్కారు అండగా ఉంటుందనే భరోసాను కల్పించడానికి శాస్త్రి ఆ స్లోగన్ని అందుకున్నారు. అది వైరలై నేటికీ లైవ్గానే ఉంది.1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హటావో (పేదరిక నిర్మూలన)’ నినాదం కాంగ్రెస్కి ల్యాండ్స్లైడ్ విక్టరీని తెచ్చిపెట్టింది. అయితే ఆ నినాదానికి యాంటీగా ప్రతిపక్షాలు.. ‘గరీబీ కాదు గరీబోంకో హటారహే (పేదరికాన్ని కాదు పేదలను నిర్మూలిస్తోంది)’ అంటూ ఆమెను ట్రోల్ చేశాయి. 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు జనతా పార్టీ ‘ఇందిరా హటావో దేశ్ బచావో’ స్లోగన్తో విజయం సాధించింది. ఇందిరా హత్య తర్వాత 1984 ఎన్నికల్లో ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిరా నీ పేరుంటుంది)’ నినాదంతో కాంగ్రెస్ గెలుపొందింది.1989లో వీపీ సింగ్ ‘రాజా నహీ ఫకీర్ హై.. దేశ్ కీ తక్దీర్ హై (రాజు కాదు పేద.. ఆయనే ఈ దేశపు భాగ్యప్రదాత)’ స్లోగన్తో ఎన్నికలను జయించి ప్రధాని అయ్యాడు.1996 స్లోగన్ ‘బారీ బారీ అబ్ కీ బారీ అటల్ బిహారీ’ ఎంత పాపులరో వేరేగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా ‘ఇండియా ఈజ్ షైనింగ్’, ‘కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్ (కాంగ్రెస్ హస్తం.. సామాన్యుడికి ఆపన్న హస్తం)’ నినాదాలు ఆయా పార్టీల ఐడెంటిటీలుగా మారాయి. అయితే నినాదాల పవర్ సోషల్ మీడియా ఇరాలోనూ కొనసాగుతోంది. ‘అచ్ఛే దిన్ ఆలే వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’, ‘హాత్ బద్లేగా హాలాత్ (హస్తం మార్పును తెస్తుంది), ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘అబ్ కీ బార్ చార్సౌ పార్’ వంటి నినాదాలే అందుకు నిదర్శనం.స్వాతంత్య్రం వచ్చిన ఓ రెండుమూడు దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారంలో రేడియో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దశాబ్దం కిందటి వరకు పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఆ రోల్ని తీసుకున్నాయి. వీటితోపాటు గోడ పత్రికలు, పాంప్లెట్స్, వాల్ రైటింగ్స్ కూడా తమ ఉనికిని చాటాయి. ప్రైవేట్ చానళ్ల పర్వం మొదలయ్యాక అవీ తమ ఇన్ఫ్లుయెన్స్ని చూపించాయి. నేతల ప్రచార యాత్రలూ ఆయా పార్టీల జయాపజయాలను ప్రభావితం చేశాయి. వాటిల్లో ఆడ్వాణీ రథ యాత్ర ఒకటి. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ రైట్ వింగ్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆ తర్వాత ఐదేళ్లలోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేలా చేసింది.రిగ్గింగ్ చేస్తున్నట్టు..స్లొవేకియాలో నిరుడు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల తరఫున నిలబడిన వ్యక్తి ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ టేప్లో.. తాను ఎలా రిగ్గింగ్ చేయబోతున్నాడో మరొకరికి విపులంగా వివరిస్తున్నాడు. ఆ ఆడియో బయటకు వచ్చాక సదరు నేత ఎన్నికల్లో ఓడిపోయాడు. అతనికి అమెరికా, నాటో దేశాలను సమర్థించే వ్యక్తిగా పేరుంది. అందుకే అతన్ని ఎన్నికల్లో ఓడించేందుకు ఏఐ సాయంతో రష్యన్ ఏజెన్సీలు డీప్ఫేక్ ఆడియోను çసృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి అమెరికా అనుకూల అభ్యర్థి ఓటమికి దారులు వేసి, రష్యన్ అనుకూల వ్యక్తిని గెలిపించుకున్నాయి. ఎన్నికల అనంతరం యూఎస్ చేపట్టిన సమగ్ర విచారణలో ఈ అంశం వెలుగు చూసింది.జంతువులతో పోల్చినట్టు..ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేషియా ఎన్నికలపైనా ఏఐ ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వాధినేత ప్రభోవో సుబియాంటో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమ్మింగ్ తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో అక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే వ్యక్తులను ఉపాధ్యక్షుడు ‘జూ’లోని జంతువులతో పోల్చినట్టుగా ఉందీ వీడియోలో. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వీడియోపై విచారణ జరిపించింది. గిబ్రాన్ పాత వీడియోకు ఏఐ జనరేటెడ్ వాయిస్ను జోడించి ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టుగా తేలింది.తప్పుకుంటున్నట్టు..ఈ సంవత్సరం మొదట్లో బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా నహీద్.. స్వతంత్ర అభ్యర్థిగా గాయ్బంధా నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల పోరులో గెలుపు కోసం అతను శ్రమిస్తుండగా.. హఠాత్తుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అతను పోటీ నుంచి తప్పుకుని ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా! దీంతో అప్పటి వరకు నహీద్కు వచ్చిన ప్రచార ఊపంతా గంగపాలైంది. చివరకు ఆ వీడియో డీప్ ఫేక్గా నిర్ధారణైంది.సోషల్ మీడియా..తొంభైయ్యవ దశకంలో ఎన్నికల ప్రచారం పేరుతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలైంది. సామాన్యులు పోటీలో నిలబడి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రాజకీయ ప్రచారంపై ఎన్నికల కమిషన్ నజర్ పెట్టింది. కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. అలా రాజకీయ ప్రచారానికి హద్దులు నిర్దేశమవుతున్న తరుణంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇంటర్నెట్ విప్లవం వచ్చి పడింది. సోషల్ మీడియాను మోసుకొచ్చింది. అంతే ఈమెయిల్స్, వాట్సాప్ మొదలు యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా పాపులర్ ప్లాట్ఫామ్స్ జనాలకు చేరువయ్యాయి. ఆదిలోనే వాటి ఇంపాక్ట్ని గ్రహించి.. సమర్థవంతంగా వాడుకున్న పార్టీగా బీజేపీకి పేరుంది. గుజరాత్లో మొదలైన మోదీ వేవ్ 2014లో సోషల్ మీడియా వేదికగా దేశమంతటా విస్తరించడానికి కారణమైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ..సోషల్ మీడియా ప్రచారాన్ని రాకెట్లోకి ఎక్కించి ఆకాశం అందుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స(ఏఐ) ఎంట్రీ ఇచ్చింది. 2013 నుంచే ఏఐ వాడకం మొదలైనా అది శైశవ దశ. ఇప్పుడు ఏఐ యవ్వన దశకు చేరుకుంది. సరదాగా మొదలైన ఏఐ వాడకం ప్రొఫెషన్స్సకి ఉపకరణంలా మారింది. ఇప్పుడు మరింతగా ముదిరి ఎన్నికల ప్రక్రియలో భాగమైంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారం ఎంతో కీలకం. తమకు తెలిసిన, తమ దగ్గరకు వస్తున్న సమాచారం ఆధారంగానే ఓటరు నిర్ణయం ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో రాజకీయాల్లోని వ్యక్తులతో పాటు ఆకతాయిలూ ఉంటున్నారు. ఫలితంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వరకు అంతటా ఎన్నికల ప్రక్రియ కుదుపునకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఐ వాడి, వేడికి అమెరికా, యూరప్లలో ఫెయిర్ ఎలక్షన్స్స కోరుకునే ప్రజాస్వామ్యవాదులకు దడ మొదలైంది.ఆర్థిక, ఆయుధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం తెలియంది కాదు. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో ఇండియాలో మన చేతికి ఉన్న వాచిలో టైమ్ ఎంతో చూడగలదని చెబుతుంటారు. అంతటి అమెరికా అధ్యక్షుడికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో! డెమొక్రాట్ల తరఫున బైడెన్, రిపబ్లికన్ ల తరఫున డోనాల్డ్ ట్రంప్లు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఏఐ ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం వారికీ సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న వీడియోఇద్దరినీ..తైవాన్ ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సైయింగ్ వెన్ లక్ష్యంగా అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్‡దేశాధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్ని వీడియో ఒకటి. అందులో చైనా – తైవాన్ సంబంధాలపై దేశ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా సమాచారం వ్యాప్తి చేశారు. ఈ డీప్ఫేక్ వీడియోలో అధ్యక్షుడి వాయిస్నే కాదు న్యూస్ యాంకర్నూ ఏఐ ద్వారా సృష్టించారు.ఘాటైన వ్యాఖ్యలు!బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే కొద్ది రోజులకే ఏఐ సాయంతో రణ్వీర్సింగ్ వాయిస్ను క్లోన్ చేసి అదే వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులో.. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మోడీ అసంబద్ధ విధానాలపై రణ్వీర్సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అంతేకాదు దేశ భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్కు ఓటేయాలని కోరినట్టుగా ఉంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే తేరుకున్న రణ్వీర్ సింగ్ కుటుంబం సదరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసు పెట్టింది. మరో హీరో ఆమిర్ఖాన్ కూ ఇలాంటి అనుభమే ఎదురైంది.ఇమ్రాన్ .. నీకు నేనున్నాను!ఈ మార్చి మొదట్లో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఒకటి అమెరికాలో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ును ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పిన మాటలు అమెరికాలో సంచలనం కలిగించాయి. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడిపిస్తానని, అమెరికా– పాకిస్తాన్ ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై నలువైపులా విమర్శలు చుట్టుముట్టాయి. చివరకు టెక్నోక్రాట్స్, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపితే.. అది ఏఐ యాప్ ద్వారా తయారైన డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ట్రంప్ మాట్లాడుతున్న పాత వీడియోలు, ట్రంప్ను పోలిన ఏఐ వాయిస్ సాయంతో కొత్త వీడియోను తయారుచేసి వదిలారు. అది నిజామా.. కాదా? అని తెలుసుకునేలోపు ఆ వీడియో సగం అమెరికాను చుట్టొచ్చింది.అంతేకాదు న్యూహాంప్షైర్ ప్రైమరీ ఎన్నికలప్పుడు.. అక్కడి ఓటర్లకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బైడెన్ స్వయంగా.. ప్రైమరీ ఎన్నికల్లో ఓటు వేయద్దంటూ ఆ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో సేవ్ చేసిన ఓటును త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బైడెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నిజమేనేమోనని సగటు అమెరికన్ ఓటరు నమ్మే పరిస్థితి నెలకొంది. కానీ విచారణలో ఏఐ సాయంతో బైడెన్ వాయిస్ను సృష్టించి ఆ కాల్స్ చేసినట్టు తేలింది. ఇలా అసలు జరగని విషయాన్ని కచ్చితంగా జరిగిందన్నట్టుగా మన పంచేద్రియాలను నమ్మించడం సులువైపోయింది.మన దగ్గర..అమెరికన్ ర్యాపర్ లిల్ యాచీ నడక ఆధారంగా.. ప్రధాని నరేంద్ర మోదీని డిక్టేటర్గా పేర్కొంటూ రూపొందిన ఏఐ మీమ్.. ఎక్స్లో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల ఏఐ మీమ్స్, ఏఐ అవతార్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఆఖరికి ఈ ఏఐ మీమ్స్ ట్రెండ్పై సాక్షాత్తు ప్రధాని ‘నా మీద చేసిన మీమ్ చాలా క్రియేటివ్గా ఉంది. ఎన్నికల ఒత్తిడితో సతమతమవుతున్న నేను దీన్ని చూసి భలే రిలాక్స్ అయ్యాను’ అని స్పందించారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారానికి ఏఐని వాడుకుంటోంది. ప్రధాని మోదీ హిందీ సంభాషణను ఏఐ సాయంతో ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి మార్చింది.నేరుగా దేశ ప్రధానే తమ సొంత భాషలో తమతో మాట్లాడారు అని ప్రజలు మురిసిపోయారు. సాంకేతికతను ఒడిసిపట్టుకున్నామని బీజేపీ ఆనందంతో గంతులేసింది. అదే విధంగా గడిచిన పదేళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపైనా ఏఐ సాయంతో వీడియో రూపొందించి జనాల్లోకి వదిలింది. ప్రచారంలో దూసుకుపోయింది. ఏఐని మంచికి వాడుకుంటే తప్పులేదు. ప్రజలను భ్రమల్లోకి నెట్టాలనుకుంటేనే ప్రమాదం. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత యువ జనాభా మన సొంతం. ఈ యువ భారతానికి స్పీడెక్కువ.సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేది వీళ్లే. ఈ ఉడుకు రక్తానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల ద్వారా.. నిజాన్ని తలదన్నేలా ఏఐ తయారుచేస్తున్న తప్పుడు సమాచారం అందితే? దాని ఆధారంగా వారి ప్రయాణం సాగితే? వ్యక్తులుగా వారికి, వ్యవస్థగా దేశానికి తీరని నష్టం. రెచ్చగొట్టే సభలు, సమావేశాలు, తప్పుడు ప్రకటనలనైతే అడ్డుకోవచ్చు. కానీ చేతిలో ఇమిడిపోయే ఫోన్లను టాయిలెట్లకు సైతం తీసుకుపోతున్న కాలంలో.. నియంత్రణ లేకుండా కనురెప్ప పాటులో సోషల్ మీడియా ద్వారా బట్వాడా అవుతున్న అబ్ధాలను అడ్డుకోవడమెలా?మరణించిన వ్యక్తి ప్రచారం..2019లో.. తమిళనాడు, కన్యాకుమారి నుంచి వసంత్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఆయన మరణించారు. మొన్నటి ఏప్రిల్ 19న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయ్కుమార్ పోటీ చేశారు. అయితే పోలింగ్కు కొన్ని రోజుల ముందు తన కొడుకు విజయ్ను గెలిపించాలంటూ వసంత్కుమార్ కోరుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో చనిపోయిన వసంత్ 2024లో ఎలా ప్రచారం చేశాడా అని జనాలు అవాక్కయ్యారు. అయితే అది డీప్ఫేక్ సాయంతో రూపొందించిన వీడియోగా తేలింది.ఫ్యాక్ట్ చెక్ ఉన్నా..సాంకేతికంగా రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో ప్రతి చెడును చట్టాలతో అరికట్టడం ఒకింత కష్టమే! అనుమానం ఉన్న కంటెంట్ను పట్టుకుని, దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిజానిజాలు తేల్చడం ఖర్చు, కాలంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ చెక్, ట్రూత్ ఫైండర్, ఫేక్న్యూస్ తదితర పద్ధతుల్లో అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. డిజిటల్ లిటరేట్సే కానీ డిజిటల్ ఎడ్యుకేట్స్ లేదా డిజిటల్లీ చాలెంజ్డ్ జనాభా ఉన్న దేశాల్లో.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పలురకాలుగా వడబోస్తే తప్ప అసలైన విషయం బటయకు రాదు. కానీ అసలు నిజం వెలుగు చూసేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.ముల్లును ముల్లుతోనే..ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారానికి చెక్ పెట్టాలంటే తిరిగి టెక్నాలజీనే ఆయుధంగా మలచుకోవాలి. సాంకెతిక నైపుణ్యంతో సృష్టిస్తున్న అభూత కల్పనలను ఇట్టే పసిగట్టి హెచ్చరించి, నిరోధించే ప్రత్యామ్నాయ యాప్లను డెవలప్ చేయడంపై భావి ఆవిష్కర్తలు దృష్టి సారించాలి. లేదంటే నీడే నిజమనే భ్రాంతిలో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, ఓపెన్ ఏఐ, టిక్టాక్లు తమ ఫ్లాట్ఫామ్స్పై డీప్ఫేక్ ద్వారా జరిగే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఫేక్ను గుర్తించే వ్యవస్థలను మరింత సమర్థంగా రూపొందిస్తామని వెల్లడించాయి.ఎన్నికల వ్యవస్థలోకి ఏఐని జొప్పించి చేస్తున్న విష ప్రచారంపై పాశ్చాత్య ప్రపంచం మేల్కొంది. ఏఐని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలను నిర్వహిస్తోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది. ఏఐని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనకు సమయం ఆసన్నమైందని పోరుతోంది.యంత్రమా.. హృదయ స్పందనా..వందమంది చేసే పనిని ఒక్క యంత్రమే చేయగలదు. మనిషి కంటే ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలు యంత్రాల సొంతం. ఇప్పుడా యంత్రాలకు మరింత మెరుగ్గా ఆలోచించే శక్తిని ఏఐ అందిస్తోంది. అయితే ఎన్ని శక్తియుక్తులు ఉన్నా మనిషి స్పృహ, హృదయ స్పందన ముందు అవన్నీ దిగదుడుపే.ముగింపు..సంప్రదాయం, సాంకేతికతకు ఎప్పుడూ ముడిపడదు. ఆ పోరులో టెక్నాలజే ఓ మెట్టు పైన ఉంటుంది. కాలానికి తగ్గట్టు మారాల్సిందే. తప్పదు.. తప్పు లేదు. అయితే మంచిచెడులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పర్యవసానాలు అనుభవించిన తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాల తయారీ మీద స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. జీవాయుధాల తయారీ, సాగులో బయోటెక్నాలజీ వినియోగం తదితర అంశాల మీద ఓ కన్నేసి ఉంచాయి. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఏఐ వాడకం వంటి వాటి నియంత్రణ మీదే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది అంటున్నారు సామాజిక, రాజకీయ విశ్లేషకులు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పారిస్లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్లో మస్క్ రిమోట్గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న మస్క్ కంప్యూటర్, రోబోట్లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు. -
అరుదైన ప్రతిభ.. అక్షత!
చిన్న వయసులోనే కృత్రిమ మేధా(ఏఐ) రంగంలో పెద్ద పేరు తెచ్చుకుంది అక్షతా కిశోర్ మొహరిర్. అభిరుచితో మొదలైన ప్రయాణం...అధ్యయనం, పట్టుదలతో మెషిన్ లెర్నింగ్ రంగంలో అక్షతను అగ్రగామిగా నిలిపింది.కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్శిటీ(విటీయు–బెళగావీ)లో కంప్యూటర్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లకు సంబంధించిన ఆసక్తి మరింత పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్పార్క్(యూఎంసీపీ)లో మెషిన్ లెర్నింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.ఇంటర్ప్రెటబుల్ అండ్ ఇంటరాక్టివ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అక్షతకు ఏడు యూఎస్ పేటెంట్లు లభించాయి. యూజర్ ఫ్రెండ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోల్యూషన్లను రూ΄÷ందించడంపై అక్షత దృష్టి పెట్టింది.ఇవి చదవండి: డెనిమ్ న్యూ లుక్ డిజైన్..! -
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
ఆహార ప్రాసెసింగ్ రంగంలో కృత్రిమ మేధా వినియోగాన్ని వేగవంతం చేయాలని భారత్ చూస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్(ఎన్ఐఎప్టీఈఎం) నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. నిజానికి ఇది భారత్లో ప్రారంభ దశలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఆహార ప్రాసెసింగ్ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని వేగవంతం చేయాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సీనియర్ బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సలహాదారులు ఏఐ పరిష్కారాలను అమలు చేసేందుకు సరైన రోడ్మ్యాప్ వ్యూహం అవసరమని అన్నారు. ఈ ఎన్ఐఎప్టీఈఎం సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ అనితా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఒక పరిశ్రమగా మనం ఒక రోడ్మ్యాప్ను రూపొందించాలి. దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈటీవై) మద్దతు కూడా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నీతీ అయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన ఆహార ప్రాసెసింగ్కి ఈ "వాతావరణ స్మార్ట్" రైతు ఆదాయాలను పెంపొందించడానికి, వినియోగదారులను సంతృప్తిపరచడానికే కాకుండా పెరుగుతున్న వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో గొప్ప సహాయకారిగా ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి సులభమైన పోర్టబుల్ పరికరాలను అవపసరమని, అందుకసం ఏఐని ఉపయోగించాలని చెప్పారు. అదీగాక 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ ఏఐ పరిష్కారాలు మొత్తం రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.ఆహార పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ..ఆహార రంగంలో కృత్రిమ మేధస్సు అనేది ఆహార ఉత్పత్తి, ఖచ్చితమైన వ్యవసాయం, నాణ్యత నియంత్రణ, వ్యక్తిగతీకరించిన పోషణ, సరఫరా గొలుసు నిర్వహణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతలు, డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లను ఉపయోగించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్లికేషన్లు సమర్థవంతమైన ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తూ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయని అర్థం.(చదవండి: ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!) -
ఏఐకి రూ.19 లక్షలు సైబర్ సెక్యూరిటీకి రూ.18 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు యాజ మాన్య కోటా సీట్ల బేరసారాల జోరు పెంచాయి. వీలైనంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లను పెద్ద మొత్తంలో అమ్ముకోవాలని చూస్తున్నాయి. డిమాండ్ ఉన్న టాప్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు సామాన్యులు ఆశించే స్థాయిలో లేవని తెలుస్తోంది.ఇంజనీరింగ్ సెట్ ఫలితాలు మరో పది రోజుల్లో రానుండటంతో యాజమాన్య సీట్ల వైపు ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అయితే, సీట్లు కొనుగోలు చేసేవాళ్లు, విక్రయించే కాలేజీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కడితేనే సీటు గ్యారంటీరాష్ట్రంలో ఈ ఏడాది 1.09 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండే వీలుంది. ఇందులో 30% అంటే దాదాపు 31 వేల సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకొస్తాయి. ఇందులో టాప్ కాలే జీల్లో 19 వేల సీట్ల వరకూ ఉండగా, వీటిలో సగం సీట్లను ఎన్ ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లు, ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి క్రమానుగతంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఏడాదికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) వసూలు చేసుకునే వీలుంది. అయితే, బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసే వాళ్ల వివ రాలు ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రావడం లేదు. ఆన్లైన్ విధానంలోనూ ఉండటం లేదు. దీన్ని సాకుగా తీసుకుని యాజమాన్యాలు ముందే సీట్లను అమ్ముకుంటున్నాయి. ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు రాదని తెలిసిన వాళ్లు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సెట్ రిజల్ట్ వస్తే డిమాండ్ పెరుగు తుందని, సీట్లు కూడా అయిపోయే ప్రమాదం ఉందని యాజ మాన్యాలు డిమాండ్ సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు ప్రత్యేక విభాగాలు పెట్టి సీట్ల కోసం వచ్చే వారిని ఒప్పించి, మెప్పించి డబ్బు వసూలు చేస్తున్నాయి. సీటు ఇవ్వాలంటే ముందే డబ్బులు కట్టి రిజర్వు చేసుకోవాలని షరతు విధిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాకే అడ్మిషన్లు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సీట్లు భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా సీట్లు అమ్ముకునే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాంకర్లకూ గాలం» జేఈఈ ర్యాంకర్లతో కాలేజీ యాజ మాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్లో దరఖాస్తు చేయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర సెట్లోనూ మంచి ర్యాంకు వస్తుంది. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు దరఖాస్తు చేస్తే తొలి కౌన్సెలింగ్లోనే సీటు వస్తోంది. జాయినింగ్ రిపోర్టు చేసి సీటు కన్ఫమ్ చేసుకుంటున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ తర్వాత, స్పాట్ అడ్మిషన్కు ముందు సీటు వదులుకుని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. ఇలా ఖాళీ అయిన సీట్లనూ యాజమాన్యాలు భారీ మొత్తంలో అమ్ముకుంటాయి. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి కోర్సులకు ఏకంగా రూ. 19 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. -
ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
ఒకప్పుడు ఫోటో తీయాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. టెక్నాలజీ బాగా పెరిగిన తరువాత స్మార్ట్ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫోటోలు తీయడం చిటికెలో పని అయిపోయింది. ఇవన్నీ కాదని నేడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నలజీతో ఓ కెమెరా అందుబాటులోకి వస్తోంది.కెలిన్ కరోలిన్ జాంగ్, ర్యాన్ మాథెర్ రూపొందించిన ఈ కెమెరా ఫోటో తీయగానే.. దానికి తగినట్లు ఉండే ఓ కవితను రాసేస్తుంది. ఒకప్పుడు కవులు బుర్రలకు పదునుపెట్టి.. సమయాన్ని వెచ్చించి అద్భుతంగా కవితలు రాసేవారు. కానీ నేడు ఈ కెమెరాతో ఫోటో తీస్తే కవిత రాసేస్తుంది.ఫొటోలో కనిపించే రంగులు, మనుషులు, వస్తువులను వర్ణిస్తూ ఏఐ కెమెరా కవిత రాస్తుంది. రాసిన వెంటనే ఓ చిన్న చీటీ మీద ప్రింట్ తీసి బయటకు కూడా పంపిస్తుంది. కవితలు రాయడానికి ఓపెన్ఏఐ జీపీటీ-4ని ఉపయోగిస్తుంది. వినియోగదారు ఇందులో సొనెట్లు, చిన్న పద్యాలు, హైకూ వంటి ఆప్షన్స్ కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. -
Buddhadeb Bhattacharya: నేను బుద్ధదేవ్ మాట్లాడుతున్నా...!
లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది! ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు! ఇంటికే పరిమితం... తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
ఇప్పుడు డీప్ఫేక్ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్ఫేక్లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్లో నడుస్తుంటే బీచ్లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు. మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్ఫేక్లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్ఫేక్తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్పర్ట్.బ్రిటిష్ ఇండియన్ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్ను గెలుచుకుంది.ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.చెడు ఎంతో ఉంది:‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు. మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత. -
సత్యానికి సవాల్!
కంటికి కనిపిస్తున్నదంతా నిజమేనా? ఏది సత్యం? ఏదసత్యం? వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారపు వేడి ఎక్కువై, నేతలు పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న వేళ... కృతిమ మేధ (ఏఐ) సాయంతో ఇష్టారాజ్యపు మార్పుచేర్పుల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నందున... ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ కేంద్ర హోమ్మంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రముఖ నటుడు ఆమిర్ఖాన్ కాంగ్రెస్కు మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షమవుతుంది. మరో ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ కాశీలోని గంగాతీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతిని పంచుకుంటే ఆ మాటలు మోదీ, బీజేపీలకు మద్దతు పలికినట్టుగా నకిలీ వీడియోలో మారిపోతాయి. ఇదీ వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి. గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సప్ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం వీరవిహారం చేస్తే, ఈసారి ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకూ, ఓటర్లకూ సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. నాటి ఐటీ బాట్ల నుంచి నేటి ఏఐ డీప్ఫేక్ల దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయింది.తాజాగా ఈ నకిలీ వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్షాలు ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల అంశంపై హోమ్ మంత్రి అనని మాటలను అన్నట్టుగా మార్చి చూపించిన ఫేక్ వీడియో ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారమైంది. సంచలనం రేపింది. తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి, శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఆరోపించారు. ఎన్నికల వేళ పెద్ద తల నొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అమిత్షాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అసోమ్లో ఒకరితో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ మంత్రం ఆశించినంతగా ఫలించడం లేదనీ, ‘ఈసారి 400 సీట్ల పైనే’ (అబ్ కీ బార్ 400 పార్) అన్న బీజేపీ నినాదం మంచి కన్నా చెడు చేస్తోందనీ ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఈ నకిలీ వీడియోల ముప్పు అధికార పార్టీకే కాదు... ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకూ ఉంది. ఇంకా చెప్పాలంటే, గడచిన 2019 ఎన్నికలు ‘సోషల్ మీడియా ఎన్నిక’లైతే, ఈ 2024 ఎన్నికలు ‘ఏఐ యుగపు ఎన్నికల’ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సగటు ఓటరుకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు సమాచారమందే ప్రమాదం ఈసారి పెరిగింది. చేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చిన స్మార్ట్ఫోన్లో వస్తున్నదంతా నిజమని నమ్మే ధోరణిని మార్చుకోక పోతే కష్టమే. వాట్సప్ సహా వివిధ మాధ్యమాల్లో షేర్ అవుతున్న వాటిలో ఏది అసలో, ఏది ఏఐతో మార్చిన నకిలీయో తెలుసుకోవడం తెలీక సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది. గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు. కాకపోతే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల్ని కంటోంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట విని పిస్తున్నాయి. సాంకేతికత వెర్రితలలు వేయడంతో ఈసారి మరింత చిక్కొచ్చి పడింది. మొత్తం మన రాజకీయ సమాచార ప్రసార, ప్రచారాలు శరవేగంతో మారిపోయాయి. 2019 ఎన్నికల ముందు మన ‘జనగణమన’ను ప్రపంచ అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే మెసేజ్ వాట్సప్లో తెగ తిరిగితే... ఇప్పుడు జనరేటివ్ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చు గుద్దినట్టు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగపు యూట్యూబ్ షార్ట్ వంతు వచ్చింది. జనాన్ని ఎలాగోలా బురిడీ కొట్టించి, బుట్టలో వేసుకోవాలనే తపన, తాపత్రయం గడచిన అయి దేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది. నిజానికి, సోషల్ మీడియా సంస్థలు సైతం ఫేక్ న్యూస్, ప్రాపగాండాలను అరికట్టడానికి కిందా మీదా పడుతున్నాయి. ఆన్లైన్లోనూ డీప్ఫేక్ను అడ్డుకొనేందుకు ప్రస్తుత చట్టాలను నవీకరించేందుకు భారత ప్రభుత్వమూ ప్రయత్నిస్తోంది. ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది. ఆన్లైన్ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులొచ్చిపడ్డాయి. సమాచారాన్ని వైరల్ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్ ఏఐ కూడా జతపడేసరికి అగ్నికి ఆజ్యం తోడైంది. ఉచితంగా, కాదంటే కారుచౌకగా ఏఐ సహా రకరకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడం ఆకతాయిలకూ వరమైంది. ఓ డీప్ఫేక్ వీడియో సృష్టికి మూడేళ్ళ క్రితం పది రోజులు పడితే, ఇప్పుడు మూడు నిమి షాల్లో చేయగలుగుతున్నారు. ఇవన్నీ సత్యాన్వేషణలో నేటి సవాళ్ళు. ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట వేయకుంటే అనర్థం తప్పదు. నేతలు, జర్నలిస్టులు, నటీనటులు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న విషం చిమ్ముడుకు విరుగుడు వెతకాలి. లేదంటే, వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. యావత్ సమాజం, ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది. -
ఫేక్ వీడియోల వెనుక రాహుల్ హస్తం
ఫేక్ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ హస్తం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ఉన్న కొద్దిపాటి ఓటుబ్యాంక్ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోంది. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాగువాహటి: కాంగ్రెస్లో నిరాశ, అసంతృప్తి తీవ్రస్థాయికి చేరాయని, అందుకే ఆ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సిద్ధాంతాలు, విలువలు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోటీ పడాలి తప్ప ఫేక్ వీడియోలను నమ్ముకోవడం ఏమిటని కాంగ్రెస్ను నిలదీశారు. మంగళవారం అస్సాం రాజధాని గౌహతిలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ గాం«దీకి, ప్రియాంక గాం«దీకి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోందని చెప్పారు. ఈసారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని అన్నారు. దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. అన్ని మతాల పౌరులకు ఒకే పౌరచట్టం ఉండాలన్నారు. లౌకిక దేశంలో మతానికో చట్టం ఉండడం సరైంది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్దమేనని అన్నారు. అధికారంలోకి వస్తే సివిల్ కాంట్రాక్టులు మైనార్టీలకు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆక్షేపించారు. తక్కువ బిడ్ దాఖలు చేసిన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తారు తప్ప ఇలా మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇస్తామనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా మతపరమైన రిజర్వేషన్ ఉందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. ఓటర్లను మైనారీ్టగా, మెజార్టీగా చూసే అలవాటు తమకు లేదని కాంగ్రెస్కు చురక అంటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి ఎంతమాత్రం లేదని పునరుద్ఘాటించారు. -
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
షోలాపూర్: విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, సమస్యలు.. కవల పిల్లలు అని విమర్శించారు. దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ మన దేశానికి ఇచ్చింది పేదరికాన్ని తప్ప ఇంకేమీ లేదని ధ్వజమెత్తారు. మంగళవారం మహారాష్ట్రలోని లాతూర్, ధారాశివ్, షోలాపూర్ జిల్లాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బీజేపీకి వ్యతిరేకంగా కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి తీసుకొస్తోందని ఆరోపించారు. తన రూపాన్ని, గొంతును అనుకరిస్తూ.. తాను అనని మాటలు అన్నట్లుగా, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారని, సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను కాంగ్రెస్ ప్రేమ దుకాణంలో అమ్మకానికి పెట్టారని అన్నారు. ఎన్నికల పోరాటంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక విపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడం లేదని, అందుకే తప్పుడు దారులు ఎంచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం మూతపడక తప్పదని తేచ్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. పాకిస్తాన్కు విజ్ఞాపన పత్రాలు బంద్ ‘‘కాంగ్రెస్ పాలనలో మన దేశంలో ఉగ్రవాద దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్కు విజ్ఞాపనలు పంపించే పరిస్థితి ఉండేది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్కు విజ్ఞప్తులు చేసేవారు. అది చూసి మీడియాలో కొందరు మిత్రులు కాంగ్రెస్ను పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉండేవారు. అప్పట్లో ఇలాంటి వినతిపత్రాలపై పత్రికల్లో నిత్యం పతాక శీర్షికలతో వార్తలు వస్తుండేవి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ముష్కరుల దాడులు ఆగిపోయాయి.విజ్ఞాపన పత్రాలను మనం నమ్ముకోవడం లేదు. శత్రువుల భూభాగంలోకి అడుగుపెట్టి మరీ గట్టిగా బుద్ధిచెబుతున్నాం. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించాం. నవభారత్ ప్రగతికి ఇదొక సూచిక. ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉండే బలహీన ప్రభుత్వం బలమైన దేశాన్ని నిర్మించలేదు. ఈ ఎన్నికల్లో మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ప్రపంచ అభివృద్ధికి నేడు భారత్ వేగాన్ని అందిస్తోంది. గత పదేళ్లలో మనం ఎన్నో ఘనతలు సాధించాం. బలమైన ప్రభుత్వంతోనే అనుకున్నది సాధించగలం. ఓటు వృథా చేసుకోవద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసింది. నేను ఏక్ భారత్, శ్రేష్ట భారత్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ యువరాజుకు జ్వరం వచ్చేస్తోంది. దేశాన్ని దోచుకున్న నేతలు ఇప్పుడు జైల్లో ఉన్నారు. జనం సొమ్ము మింగేసినవారు తిరిగి కక్కాల్సిందే. అవినీతిపరుల నుంచి డబ్బు తిరిగి వసూలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్కు ఒక్క కుటుంబమే ముఖ్యం. మాకు దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యమే. 2014, 2019లో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మేలు చేయడానికే ఉపయోగించాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోంది.ఇప్పుడు సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ వచ్చినా రిజర్వేషన్లను రద్దు చేయలేరు. విద్య, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. వాటిని రద్దు చేయడం ఎవరివల్లా కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత వేసి, ఓటు బ్యాంక్కు కట్టబెట్టాలన్నదే కాంగ్రెస్ కుట్ర. ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎదగనివ్వలేదు. గత పదేళ్లలో పార్లమెంట్లో, అసెంబ్లీల్లో అడుగుపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం బీజేపీ, ఎన్డీయేకు చెందినవారే.ఈ ఎన్నికల్లో కనీసం 275 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితితో కాంగ్రెస్ ఉంది. అలాంటి పారీ్టకి ఎన్నికల్లో మద్దతు పలికి ఎవరూ ఓటు వృథా చేసుకోవద్దు. మహారాష్ట్రలో సంచరించే ఆత్మ(శరద్ పవార్) ఒకటి ఉంది. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు చేసింది సున్నా. ఎన్నికల సమరంలో ప్రజలు ఆయనను ఓటుతో శిక్షించే సమయం వచ్చింది. ప్రధాని పదవిని ముక్కలు చేస్తారట! దేశ ప్రజలను, రైతులను కాంగ్రెస్ దగా చేసింది. వారి కలలను విచ్చిన్నం చేసింది. కాంగ్రెస్ హయాంలో రైతన్నలకు దక్కాల్సిన నిధులను, ఎరువులను కూడా లూటీ చేశారు. సాగునీటి వసతి కల్పించలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. ప్రతిభావంతులైన మన దేశ యువతకు కాంగ్రెస్ వల్ల అన్యాయం జరిగింది. మన దేశం ముక్కలు కావడాన్ని కళ్లారా చూసినవారు ఇప్పుడు ప్రధానమంత్రి పదవిని ముక్కలు చేయాలని అనుకుంటున్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఇన్స్టాల్మెంట్లలో పంచుకుంటారట! ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు అనేది దేశాన్ని దోచుకొనే పథకమే. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోంది’’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయండిఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ విపక్ష కాంగ్రెస్ దురుద్దేశాలు, ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి మోదీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఓటు బ్యాంక్కు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆ పార్టీ ఎత్తుగడ అని పేర్కొన్నారు. వారసత్వ పన్ను విధించి, ప్రజల ఆస్తులను లాక్కొని ఓటు బ్యాంక్కు అప్పగించాలన్నదే కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, వివక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ ఎజెండాను ఓటర్లకు వివరించి, అప్రమత్తం చేయాలని ఎన్డీయే అభ్యర్థులను మోదీ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీకి ఒక విలువైన కార్యకర్త అని ఆయన రాసిన లేఖలో ప్రధాని ప్రశంసించారు. గతంలో గుజరాత్ మంత్రిగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా అమిత్ షా చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. -
Narendra Modi: ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే
బాగల్కోట్/షోలాపూర్/సతారా: ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనివారు కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, తనపై, బీజేపీ నాయకులపై బురదజల్లుతున్నారని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు. కృత్రిక మేధను దురి్వనియోగం చేస్తున్నారని, టెక్నాలజీని, సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అచ్చంగా తన గొంతును పోలిన గొంతుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, తాను అనని మాటలు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ధారణ కాని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇది నిజంగా ప్రమాదకరమైన ధోరణి అన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై పోలీసులకు గానీ, బీజేపీకి గానీ ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు పనులు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. తప్పుడు సమాచారంతో ఇతరులను అప్రతిష్టపాలు చేయడం మన చట్టం అనుమతించదని తేలి్చచెప్పారు. సోమవారం కర్ణాటకలోని బాగల్కోట్, మహారాష్ట్రలోని షోలార్పూర్, సతారాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే నెల రోజుల్లో దేశంలో ఒక పెద్ద సంఘటన సృష్టించడానికి శత్రువులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపించారు. సామాజిక అశాంతి, అల్లకల్లోలం రేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉందని అన్నారు. తాను చాలా సీరియస్గా ఈ ఆరోపణలు చేస్తున్నానని చెప్పారు. ఫేక్ వీడియోల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఫేక్ వీడియోలను తెలిసీ తెలియక సోషల్ మీడియాలో షేర్ చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రిజర్వేషన్ల రక్షణకు ఎంత దూరమైనా వెళ్తా.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీ వెంట నడుస్తుండడంతో మైనారీ్టలను మచి్చక చేసుకోవడానికి కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల ను నమ్ముకుందని, అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోనని స్పష్టం చేశారు. దళి తులు, ఆదివాసీ, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఈ మేరకు వారికి గ్యారంటీ ఇస్తున్నానని మో దీ వివరించారు. టెక్నాలజీ హబ్గా పేరుగాంచిన బెంగళూరు కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్ హబ్గా మారిందని ఎద్దేవా చేశా రు. ట్యాంకర్ మాఫియా ప్రజలను దోచుకుంటోందని, ఇందులో కమీషన్లు కాంగ్రెస్ నేతలకు చేరుతున్నాయని దుయ్యబట్టారు. -
Lok sabha elections 2024: ఫేక్ రాజకీయం!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్లో పోస్టు చేశారన్నది రేవంత్పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. చౌక బేరండీప్ ఫేక్లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.ఏఐ వాడకం..బీజేపీతోనే మొదలు... » ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది. » ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు. » ఈ వ్యూహాన్ని 2014 లోక్సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు. » ప్రచారం కోసం డీప్ఫేక్లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు! గతి తప్పుతున్న వ్యూహం అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ను జోడిస్తూ డీప్ ఫేక్లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!చట్టాలకావల మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు. నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం డీప్ ఫేక్లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు. గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్కు ఓటేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.నోట్ దీజ్ పాయింట్స్» భారత్లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. » కనుక ఆన్లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది. » రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు. » పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు. » ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. » అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్ఫేక్లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ–సాక్షి, నేషనల్ డెస్క్ -
రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం! ఆడియో వైరల్
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ విపిస్తుంది. ఏఐ వాయిస్తో పాటు.. మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The day is soon… on June 4… The Prime Minister will be Rahul Gandhi… pic.twitter.com/ymrLZC447q— Aaron Mathew (@AaronMathewINC) April 25, 2024 ఒకవైపు లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావటంతో నెటిజన్లు తమ నేతకు మద్దతుగా కామెంట్లు పెడుతూ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.‘ఆ రోజు త్వరలోనే రానుంది.. అది జూన్ 4’, ‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆడియో క్లిప్.. ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ నిర్ధారణ చేశాయి. ఆడియో, వీడియో రెండు వేరుగా చేసి.. ఫ్యాక్ట్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్గా తేలిందని పేర్కొంటున్నాయి. ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని తేల్చాయి. ఇక.. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది. -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్గా ఐపీఎల్ (ఫోటోలు)
-
శ్రీరాముని దివ్య రూపం.. ఏఐ ఫోటోలు
-
చల్లచల్లని కూల్ కూల్
ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం కూల్ కూల్గా అనిపిస్తే? నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం. మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్ పెయింట్ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు. ‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్లో వైరల్ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్లు, ఐసు స్కూటర్ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్ తాగిన ఫీలింగ్ కలిగించింది. -
కొత్త ఏఐ ల్యాప్టాప్లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలామార్పులు వస్తున్నాయి. ప్రధానంగా యూత్ ఎక్కువగా వినియోగించే ల్యాప్టాప్ల సామర్థ్యం పెంచేందుకు కంపెనీలు చాలా మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయడం అనివార్యమైంది. దాంతో ఉద్యోగస్థులు, స్టూడెంట్లు ఇలాంటి వాటిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి అవసరాలు దృష్టిలో ఉంచుకొని ల్యాప్టాప్ తయారీ కంపెనీలు వాటి వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ల్యాప్టాప్లు మరింత వేగంగా, సమర్థంగా పనిచేయడానికి వాటిలో కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లనూ జోడిస్తున్నారు. అయితే అలా ఇంప్లిమెంట్ చేస్తున్న ఏఐల వర్క్లోడ్ ఒక్కోసారి అధికమై ప్రాసెసర్లపై భారం పడుతుంది. దాన్ని తగ్గించేందుకు కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. ల్యాప్టాప్ల్లో ఏఐ వర్క్లోడ్స్ సాఫీగా, అంతరాయం లేకుండా పనిచేయటానికి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ) అమర్చుతున్నారు. సీపీయూ, జీపీయూతోపాటు ఎన్పీయూ సైతం వీటిలో వాడుతున్నారు. దాంతో ఎన్పీయూ ఉన్న ల్యాప్టాప్లు హైబ్రిడ్ వర్క్కల్చర్కు తగ్గట్టుగా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ల్యాప్టాప్ తయారీ సంస్థ హెచ్పీ ఎన్పీయూ ఫీచర్ ఉన్న ఏఐ ఆధారిత గేమింగ్ ల్యాప్టాప్ ఒమెన్ ట్రాన్సెండ్ 14, ఎన్వీఎక్స్ 360 14 మోడల్ను విడుదల చేసింది. ఇవి వేగంగా, సమర్థంగా పనిచేస్తూ వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని హెచ్పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఇప్సితా దాస్గుప్తా చెప్పారు. హెచ్పీతోపాటు మరిన్ని కంపెనీలు ఏఐ ఆధారిత ల్యాప్టాప్లను మార్కెట్లో విడుదల చేశాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. హెచ్పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ఇంటెల్ కోర్ ఆల్ట్రా 9 ప్రాసెసర్ 14 అంగుళాల డిస్ప్లే 11.5 గంటల బ్యాటరీ బ్యాకప్ 1.637 కేజీల బరువు ఎన్వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్కార్డు ప్రారంభ ధర అంచనా: రూ.1,74,999 హెచ్పీ ఎన్వీఎక్స్ 360 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 4 జీబీ ప్రాసెసర్: ఇంటెల్ i7 ప్రాసెసర్ జనరేషన్: 13వ తరం ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 16 జీబీ గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 3050 ప్రారంభ ధర అంచనా: రూ.99,999 ఎంఎస్ఐ ప్రెస్టీజ్ 16 ఏఐ ఈవో బీ1ఎం ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ స్క్రీన్: 16 అంగుళాలు ప్రాసెసర్: ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ఇందులో ఎన్పీయూ, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయాలు ఉన్నాయి. బరువు: 1.5 కిలోలు. ధర సుమారు: 1,19,990 ఆసుస్ ఆర్ఓజీ జెఫిరస్ G14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 12 GB ప్రాసెసర్: AMD రైజెన్ 9 ఆక్టా కోర్ ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 32 GB DDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 4080 ధర సుమారు: 2,49,990 ఇదీ చదవండి: ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు ఆసుస్ జెన్బుక్ 14 ఓలెడ్ ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i7 ఎస్ఎస్డీ: 512 GB ర్యామ్: 16 జీబీ LPDDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్ ధర సుమారు: రూ.99,990 -
యుద్ధరంగంలో సాంకేతికత – కొన్ని ప్రశ్నలు
యుద్ధం వల్ల సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుందా? ఆ యా దేశాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్క రణలకు సిద్ధం కావటం అనేది ప్రయోజనకరమైనఅంశమా? లేదా అది యుద్ధనీతిని తప్పటం, అనైతి కతను ప్రోత్సహించటం అవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పడు తలెత్తుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశించని రంగం అంటూ లేదు. యుద్ధరంగంలోకి అది తన బాహువులను చాస్తోంది. ఇజ్రాయెల్ రణ క్షేత్రంలోకి ఏఐ ప్రవేశించటం తాజాగా చర్చనీ యాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేపట్టటానికి ఇంతవరకూ పరిచయం లేని కృత్రిమమేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించింది. హమాస్కు సంబంధించి దాదాపు 37 వేలకు పైగా లక్ష్యాలను గుర్తించటానికి దీనిని ఉపయోగించారు. అలాగే దీని ఆధారంగానే పాలస్తీనియన్ పౌరులను కొందరిని గుర్తించి హతమార్చారు. ‘మిషన్ లెర్నింగ్ విధానాల ద్వారా యుద్ధ వ్యూహాలను అమలు చేశారు. ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమమేధ వ్యవస్థకు ‘లావెండర్’ అని పేరు పెట్టారు. ఇక్కడ మనిషి పాత్ర పరిమితం. దానిని అమలు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవటమే. ‘ఊ’ అనుకున్న తర్వాత కొన్ని సెకండ్లలో పని పూర్తయిపోతుంది. ఇజ్రాయెల్ జర్నలిస్టు ఒకరు బాహ్య ప్రపంచానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్లో ఆరుగురు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారని ప్రకటించారు.అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ దాడులకు నిరసనగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేష న్లో ఇంత వరకు 33 వేలమందికి పైగా పాలస్తీని యన్లు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రా యెల్కి యుద్ధ సహాయాన్ని నిలిపివేయాలన్నడిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్కు సహకారం అందిస్తున్న యూఎస్, బ్రిటన్లపై ఒత్తిడి పెరుగుతోంది. పాలస్తీనా పౌరుల మరణాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూనే, బిలియన్ డాలర్ల విలు వైన బాంబులు, ఫైటర్ జెట్ల అందచేతను యూఎస్ సమర్థించుకుంటోంది. మరో వైపు బ్రిటిష్ ప్రధాని రుషి సునాక్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో ఛారిటీ వరల్డ్ కిచెన్సెంటర్లో ఏడుగురు బ్రిటిష్ పనివాళ్లు చనిపోవటంతో ఈఅంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రష్యా – ఉక్రెయిన్ల యుద్ధంలో ఉక్రె యిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి మానవ ప్రమేయం లేకుండా వాటంతటికవే లక్ష్యాలను గుర్తించటం, దాడులు చేయటం వంటివి చేస్తాయి. కృత్రిమ మేధ ద్వారా శాటిలైట్ చిత్రాలను, డ్రోన్ వీడియో ఫీడ్లను పొందటం వల్ల యుద్ధ భూమిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసు కోవచ్చు. చకచకా నిర్ణయాలు తీసుకోవటానికి వీల వుతుంది. శత్రువును వేగంగా, కచ్చితంగా ఎదుర్కోవ టానికి వీలవుతుంది. పూర్తిగా స్వయంచాలిత ఆయుధాలను విని యోగించటం అనే అంశంపైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒకరు ఒకరకమైన సాంకేతికత ఉపయో గిస్తే, దానిని ఎదుర్కోవటానికి మరో సాంకేతికత ముందుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ‘ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్’ వస్తున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటర్ పైన దాడులకు ఉపయోగపడతాయి. ఇది మరీ కొత్తది అని కూడా చెప్పలేం. ఐసిస్ కొన్నేళ్ల క్రితం అధునాతమైన డ్రోన్ సైన్యాన్ని వినియోగించేది. ఇరాకీ బృందాలపై దాడులు నిర్వహించింది. ఒక ఎయిర్క్రాఫ్ట్ను కొన్నట్టు ఏఐని కొనటం సాధ్యం కాదు. స్వయం చాలిత ఆయుధాలతో యుద్ధనియమాలు అంటి పెట్టుకుని యుద్ధాలు చేయాలి. అమెరికా, రష్యాతో పాటు దాదాపు 30 దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. యుద్ధాల విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధం (1914–1918)లో మెషిన్ గన్లు, గ్రెనేడ్లు ఇతర ఆయుధాలు... సబ్ మెరైన్లు, పాయిజనస్ గ్యాస్, వార్ ప్లేన్లు, ట్యాంకులు ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం (1939–1945) వచ్చేనాటికి రాడార్ టెక్నాలజీ ప్రవేశించింది. కొంత మంది చరిత్రకారులు ఈ సాంకేతికతే అణుబాంబు కంటే విజయానికి కీలకపాత్ర పోషించేదని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధానికి తెరవేయటానికి తొలి అణుబాంబును అభివృద్ధి చేశారు. రెండు దశాబ్దాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయటానికి అవసర మైనన్ని బాంబులు సిద్ధమైపోయాయి. యుద్ధంలో అణుబాంబును ఉపయోగిస్తే వచ్చే నష్టాన్నిఅంచనా వేసుకుని ఏ దేశానికి ఆ దేశం దానిని ఉపయోగించటానికి వెనకడుగు వేసేలా తయా రయ్యింది పరిస్థితి. మీరు శత్రు దేశం పైన అణుబాంబు వేసి సర్వనాశనం చేస్తే, మరో నిమిషం అవతల దేశం కూడా అదే పని చేస్తుంది. అందుకే తర్వాత రోజుల్లో చిన్నవి, తక్కువ శక్తిమంతమైన బాంబులను తయారుచేయటం మొదలు పెట్టారు. అణుబాంబు రూపొందించటంలో కీలక భూమిక షోషించిన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హైమర్ తర్వాత రోజుల్లో తాను చేసిన పనికి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా, ముందుగా మిలిటరీలోనే దానికి బీజాలు పడ్డాయనేది చారిత్రక సత్యం. – డాక్టర్ పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065' -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్ఫేక్ కంటెంట్పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
భారత్లో ఎన్నికలు.. చైనా ప్లాన్పై హెచ్చరించిన మైక్రోసాఫ్ట్!
ఢిల్లీ: దేశంలో ఎన్నికల హాడావుడి నడుస్తోంది. ఈసారి ఎన్నికలను అధికార బీజేపీ సహా ప్రతిపక్ష కూటమి నేతలు సీరియస్గానే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సందట్లో సడేమియాలాగా చైనా జోక్యం జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మెక్రోసాఫ్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా.. లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉంది. ఏఐ ఆధారిత కాంటెంట్తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి. Microsoft warns China is using AI to disrupt upcoming US, South Korean, and Indian elections. pic.twitter.com/AkEJPik0rZ — Everything you need to know (@Everything65687) April 5, 2024 ఎన్నికల వేళ ఏఐ ఆధారిత కాంటెంట్ను సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేయనున్నారు. కీలకమైన ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో ఆ ప్రచారం జరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు, ఆడియో రూపంలో ఆ కామెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే, చైనా పొజిషన్ను సపోర్టు చేసే రీతిలో వాటిని రూపొందించనున్నారు. అయితే, ఇలాంటి ఎత్తుగడలతో జనరల్ ఎలక్షన్స్లో ప్రభావం చూపడం తక్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. చైనా ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్ను వ్యాప్తి చేయించిందని తెలిపింది. ఈ విధంగా విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది. -
డెవిన్కు పోటీగా భారత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఎవరీ దేవిక?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన కాగ్నిషన్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించి.. దానికి ‘డెవిన్’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీనికి పోటీగా భారత్లో 'దేవిక' వచ్చేసింది. ఇంతకీ దేవిక ఎవరు? ఇది ఎలాంటి పనులు చేయగలదు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతదేశానికి చెందిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, లిమినల్ అండ్ స్టిటైన్.ఏఐ 'ముఫీద్ వీహెచ్' డెవిన్కు ప్రత్యర్థిగా దేవికను రూపొందించారు. దేవిక, డెవిన్ మాదిరిగానే.. మనిషి ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడానికి కావలసిన మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి వాటిని పొందుతుంది. తద్వారా సూచనలను తీసుకుని, వాటిని కార్యాచరణలో పెడుతుంది. దేవిక అనేది కూడా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది మనం ఇచ్చే సూచనల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సొంతంగా కోడ్ రాస్తుంది. ఇది అమెరికా రూపొందించిన డెవిన్కు ఏ మాత్రం తీసిపోకుండా.. గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఏఐ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టి.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో కొత్త శకానికి నాంది పలకడమే ఉద్దేశ్యంగా ఈ ఏఐ దేవికను రూపొందించారు. అయితే ఇది టెక్ జాబ్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి. అయితే ఖచ్చితంగా కోడింగ్ భవిష్యత్తు గణనీయమైన పరివర్తన చెందుతుందని మాత్రం చెప్పవచ్చు. ప్రాజెక్ట్ దేవికకు సంబంధించి టెస్టర్లు, కంట్రిబ్యూటర్ల నుంచి ఆహ్వానం వచ్చినట్లు ముఫీద్ వీహెచ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా పేర్కొన్నారు. ముఫీద్ దేవిక ఫీచర్స్ వివరించారు. మరిన్నిటెస్టులు నిర్వహించిన తర్వాత, బగ్ పరిష్కారాలు పూర్తయిన తరువాత అధికారికంగా ప్రారంభమవుతుందని డెవలపర్ పేర్కొన్నారు. ఏఐ దేవిక ఫీచర్స్ ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి.. వినియోగదారు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి, బ్రౌజ్ చేయడానికి, పరిశోధన చేయడానికి, కోడ్, డాక్యుమెంట్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఫీడ్బ్యాక్ లూప్లో ఒకదానితో ఒకటి పరస్పర చర్య చేయగల 12 ఏజెంట్ మోడల్లు ఉన్నాయి. ఒల్లామా ద్వారా క్లాడ్ 3, GPT-4, GPT-3.5, లోకల్ LLMలకు మద్దతు ఇస్తుంది. దేవికా తను వ్రాసిన కోడ్ని రన్ చేయగలదు, వినియోగదారు ప్రమేయం లేకుండా ఏదైనా లోపాలను ఎదుర్కొంటే కోడ్ను స్వయంగా సరిదిద్దుతుంది. Inviting early testers and contributors to Project Devika - The open-source alternative to Devin. 👩💻 As of now, Devika is far from the capabilities of Devin... but we'll eventually get there. So I am calling the open-source community to join forces! ❤️ Features: - 12 Agentic… pic.twitter.com/if8qfuiKm8 — mufeed vh (@mufeedvh) March 21, 2024 -
ఇలా ‘భాషించారు’!
మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్గేట్స్ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్గేట్స్కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్ ‘భాషిణి’ని ఆవిష్కరించారు. ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్ బడ్స్ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. తమ తదుపరి మోడల్ ఐఫోన్–16లో రియల్ టైం ట్రాన్స్లేషన్ టూల్ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట. భాషిణి ఎలా పనిచేస్తుందంటే.. భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తోపాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన (భాషాదాన్) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement