Artificial Intelligence (AI)
-
ఏఐతో మీడియా రంగంలో పెనుమార్పులు
థింపూ: ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై కీలక సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 30, 31 తేదీల్లో జరిగింది. భూటాన్ మీడియా ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించింది. భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాయల్ థింపూ కాలేజ్కు చెందిన ప్రొఫెసర్ పల్లవి మజుందార్, కాంట్రైల్స్ ఏఐకు చెందిన అమితాభ్ కుమార్ కూడా శిక్షకులుగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే ఉడుముల, పల్లవి మజుందార్, అమితాభ్ కుమార్లతో మాట్లాడారు.పత్రికారంగంలో కృత్రిమ మేధస్సు పాత్రపై ఉడుముల మాట్లాడుతూ, “జర్నలిజం, దర్యాప్తు కథనాలు, ధృవీకరణ, పంపిణీ, న్యూస్రూమ్ పనితీరులో ఏఐ పెద్ద మార్పులు తీసుకొస్తోంది” అన్నారు. “నాణ్యత పెంపు, సమాచారం సేకరణ మెరుగుదల, పునరావృత పనుల్లో వేగం పెంపు, పంపిణీ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రిపోర్టింగ్, ధృవీకరణ, సంపాదకీయ నిర్ణయాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు” అని చెప్పారు. దర్యాప్తు జర్నలిజంలో పెద్ద డేటా విశ్లేషణ, పత్రాల పరిశీలన, నమూనాల గుర్తింపు, ట్రాన్స్క్రిప్షన్, అనువాదం, ధృవీకరణ పనుల్లో ఏఐ సహాయపడుతుందని ఆయన వివరించారు. అదే సమయంలో తప్పుడు సమాచారం, నకిలీ వ్యాఖ్యలు, పాక్షికత, అతి విశ్వాసం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. మానవ పర్యవేక్షణ అవసరం ఉందని స్పష్టం చేశారు. పత్రికారంగంలో ఏఐ వినియోగం బాధ్యతాయుతంగా ఉండాలంటే స్పష్టమైన సూచనలు, నైతిక నియంత్రణలు, పారదర్శకత, బాధ్యత, డీప్ఫేక్లపై జాగ్రత్త అవసరమని ఉడుముల పేర్కొన్నారు. “ఏఐ జర్నలిస్టులకు సహాయక సాధనంగా ఉండాలి. సంపాదకీయ నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాకూడదు” అని తెలిపారు. -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
AI ద్వారా నెలకు 1లక్ష సంపాదించే టాప్ మార్గాలు.. ఇలా వాడితే మీ లైఫ్ సెటిల్
-
కొత్త కోర్సుల జోష్..
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కొత్త జోష్ క న్పిస్తోంది. బీటెక్తో సమానంగా తీసుకొస్తున్న ఎమర్జింగ్ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు కొత్త కోర్సులు మొదలు పెట్టేందుకు కాలేజీలు కూడా ముందుకొస్తున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో వీటిని ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కాలేజీలు చెబుతున్నాయి. అనుమతి కోరుతూ ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటివరకూ యూజీ కాలేజీల నుంచి 200, పీజీ కాలేజీల నుంచి 73 దరఖాస్తులు అందాయి.అత్యధికంగా బీఎస్సీ అండ్ మెషీన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్), బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సుల వైపు కాలేజీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. తర్వాత స్థానంలో బీకాం డిజిటల్ మార్కెటింగ్ కోర్సుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆయా కాలేజీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనివే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధే లక్ష్యం యూజీ, పీజీ తర్వాత తక్షణ ఉపాధిని యువత ఆశిస్తోంది. అయితే సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఈ అవకాశం కల్పించలేకపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విద్య వైపు వెళ్తున్నారు. అక్కడా నైపుణ్యం కొరత అడ్డంకిగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిగ్రీ, పీజీ కోర్సుల్లో నైపుణ్యం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించారు.ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ సెక్యూరిటీ సర్విసెస్, ల్యాండ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్, ఏవిమేషన్ మేనేజ్మెంట్, మెరైన్ టెక్నాలజీ, లాజిస్టిక్స్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్తో పాటు పలు కోర్సులను డిజైన్ చేశారు. బోధన ప్రణాళికను కూడా ఇదే తరహాలో రూపొందించారు. మారుతున్న సాంకేతికత సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు మేలు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాకల్టీ మాటేంటి? అనుమతులు మంజూరు చేసే విషయంలో ఆచితూచి అడుగేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 4.6 లక్షల సీట్లున్నాయి. అయితే ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులో కూడా బీకాం, బీఎస్సీ లైఫ్సైన్సెస్ వంటి కోర్సుల్లోనే అడ్మిషన్లు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది అకడమిక్ ఆడిట్ చేపట్టాలని, విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీల్లో సీట్లు తగ్గించాలని మండలి భావించింది.అయితే అనూహ్యంగా కాలేజీలు కొత్త కోర్సుల వైపు వెళ్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా..ఎమర్జింగ్ కోర్సులు బోధించే అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకుంటారనే దానిపై కాలేజీలు స్పష్టత ఇవ్వడం లేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు బోధించే వారికి ఇది సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. దీంతో ఐటీ, ఇతర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆన్లైన్ ద్వారా బోధించే ఏర్పాటు చేయాలని కాలేజీలకు మండలి సూచిస్తోంది. అన్నీ పరిశీలించి అనుమతులిస్తాం.. ఏఐ సాంకేతికతతో కూడిన కొత్త కోర్సుల ప్రతిపాదనకు మంచి స్పందన వస్తోంది. కాలేజీలు వీటిని ప్రవేశ పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోధన సిబ్బంది, ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
రైల్వే, ఎన్హెచ్ఏఐ ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణకు కేంద్ర రైల్వేశాఖ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) శాఖలు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్యాచరణను రూపొందించాయి. రైల్వే ట్రాక్లపై లోపాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించగా... జాతీయ రహదారులపై 30 రకాల లోపాలను గుర్తించి సరిచేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఆ రెండు శాఖల కార్యాచరణ ఇలా ఉంది.. పట్టాలు తప్పకముందే అప్రమత్తం చేసే సీబీఎం రైలు బోగీలు పట్టాలు తప్పకుండా ముందుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ ఏఐ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘కండీషన్ బేస్డ్ మానిటరింగ్(సీబీఎం) సిస్టం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. దక్షిణ కొరియాకు చెందిన గ్లోబిజ్ ఈ ఏఐ పరిజ్ఞానాన్ని రూపొందించింది. ముందుగా హైస్పీడ్ రైళ్లలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అనంతరం దశల వారీగా ఇతర రైళ్లలో కూడా ప్రవేశపెట్టనుంది. ఏఐ ఆధారిత సెన్సార్లను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైలు చక్రాలు, బోగీలు, తలుపులు, ఎలెక్ట్రికల్ సిస్టంలలో ఏర్పాటు చేస్తారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్లు, రైలు మెకానికల్ బిహేవియర్ను ఈ సెన్సార్లు రికార్డు చేస్తాయి. రైలులోనే పొందుపరిచే ఎడ్జ్ సర్వర్లు వాటిని వెనువెంటనే విశ్లేషిస్తాయి. రైలు పట్టాలపై ఎక్కడైనా లోపాలు ఉంటే రైలు వైబ్రేషన్లు, మెకానికల్ బిహేవియర్లో వ్యత్యాసం తెలుస్తుంది. అంటే కొంత దూరంలో ఎక్కడో ట్రాక్పై లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దాంతో వెంటనే లోకో పైలట్ ట్రైన్ వేగాన్ని తగ్గించడంతోపాటు అవసరమైతే నిలిపివేస్తారు. అనంతరం రైల్వే సాంకేతిక బృందాలు ట్రాక్ వెంబడి పరిశీలించి లోపాలను సరిచేస్తాయి. తద్వారా ముందుగానే అప్రమత్తమై రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలను నివారించవచ్చు. అందుకోసం రూపొందించిన సీబీఎం విధానాన్ని దేశంలో అన్ని రైళ్లలో దశల వారీగా ప్రవేశపెట్టాలన్నదే లక్ష్యమని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.జాతీయ రహదారులపై డాష్కామ్ చెక్జాతీయ రహదారులపై గుంతలతోపాటు ఇతర లోపాలు గుర్తించేందుకు ‘డాష్కామ్ అనలిటిక్స్ సర్విసెస్’ పేరిట ఎన్హెచ్ఏఐ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. అందుకోసం అత్యధిక రిజల్యూషన్ ఉన్న స్మార్ట్ కెమెరా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతీయ రహదారులపై రూట్ పెట్రోలింగ్ వాహనాలు(ఆర్పీవీ)లకు ఈ స్మార్ట్ కెమెరాలను అమరుస్తారు. పెట్రోలింగ్ చేస్తుంటే ఆటోమేటిగ్గా రహదారులను స్కాన్ చేస్తూ ఫొటోలు తీస్తాయి. 30 రకాల అంశాలను ఈ ఫొటోల ద్వారా గుర్తించవచ్చు. రహదారులపై చిన్న పగుళ్లు, గుంతలు, బారియర్లు లేకపోవడం, రాంగ్రూట్లో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు రోడ్లను కట్ చేయడం వంటివాటి ఫొటోలు నేరుగా ‘సెంట్రల్ డేటా లేక్’పేరుతో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతాయి. ఆ ఫొటోల ద్వారా గుర్తించిన లోపాలను ఎన్హెచ్ఏఐ అధికారులు సరిదిద్దుతారు. జీపీఎస్ విధానం ద్వారా లోపాలు ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి మరమ్మతులు చేపడతారు. ఎన్హెచ్ఏఐ దేశంలో 40వేల కి.మీ. జాతీయ రహదారులను ఐదు జోన్లుగా విభజించి డ్యాష్కామ్ సిస్టం పరిధిలోకి తీసుకురానుంది. తద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్చేంజర్
రాయదుర్గం (హైదరాబాద్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైన గేమ్చేంజర్గా మారబోతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్ (సీఏఎఫ్) ఆ«ధ్వర్యంలో గురువారం పాలసీ కాన్క్లేవ్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలమైన, రియల్టైమ్ సిటిజన్ బేటాబేస్లను ఉపయోగించడం ద్వారా ఏఐ మధ్యవర్తులను తొలగించగలదని, అవినీతిని తగ్గించగలదని, ప్రభుత్వ సేవలు నిరంతరాయంగా సాగేందుకు అవకాశం కలుగుతోందన్నారు. తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్ ముసాయిదా రూపకల్పనలో ఐఎస్బీ సహకారం గురించి ఆయన వివరించారు. రోజువారీ పాలనలో ఏఐని సజావుగా ఏకీకృతం చేయడానికి తెలంగాణను కచ్చితమైన జాతీయ నమూనాగా భావించి విద్యావేత్తలు, పరిశ్రమలు, నియంత్రణదారులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రకటించారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ఐఎస్బీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున వ్యాపారపద్దులు, ప్రజా విధానాన్ని తెలియ జేయడానికి, కఠినమైన విద్యా పరిశోధనలను ఉత్పత్తి చేయాలనే దాని వ్యవస్థాపక దృష్టిని కొనసాగిస్తూనే ఉందన్నారు. ఎంఫాసిస్ మద్దతుగల కొత్త ‘ఏఐ ఫర్ ఇంపాక్ట్’చొరవను హైలైట్ చేస్తూ బలమైన ఏఐ ఆధారిత యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఫాసిస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కులకర్ణి, సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నతంత్రి పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. -
ఏఐతో... ఆటలొద్దు!
పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు, బుంగమూతి పెట్టి అలుగుతారు... వారికంటూ స్నేహితులు ఉంటారు. వారితో తమదైన భాషలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ పిల్లల ప్రపంచంలోకి ఏఐ టాయ్స్ వచ్చాయి. ఫ్రెండ్తో మాట్లాడినట్లే పిల్లలు వాటితో మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. తమకు ఏమనిపిస్తుందో చెబుతున్నారు... వినడానికి ఇది బాగానే ఉంది కానీ... ఏ.ఐ. బొమ్మల ప్రభావం పిల్లలపై మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు. సహజమైన బాల్యాన్ని, భావోద్వేగాలను ‘ఏఐ బొమ్మలు’ హరించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు...ఫ్రెండ్లాగా సంభాషించడం నుంచి భావోద్వేగాలు గ్రహించడం వరకు ఏఐ బొమ్మలు పిల్లలకు చేరువ అవుతున్నాయి. ఏఐ–ఆధారిత బొమ్మలు వినగలవు. అర్థం చేసుకోగలవు. ఏదైనా అడిగితే సమాధానాలు ఇవ్వగలవు. దీంతో అవి అపురూపంగా అనిపిస్తాయి.అయితే పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతికూలతల గురించి చెప్పుకోవాలంటే....పిల్లల భావోద్వేగాలకు సంబంధించి ఏఐ బొమ్మలు అతిగా స్పందిస్తుంటాయి. మితిమీరిన సానుభూతి చూపుతుంటాయి. ఒక నిమిషం విచారంగా, మరు నిమిషం సంతోషంగా ఉండగలిగే పిల్లలకు ఇది అవసరం లేదు అంటున్నారు నిపుణులు.సహజత్వం లేకుండా....‘పిల్లలకు ఏఐ బొమ్మలు తోడుగా ఉండే మాట వాస్తవమే అయినా, వివిధ సందర్భాలలో స్పందించడానికి సంబంధించి వాటి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం కష్టం’ అంటున్నారు నిపుణులు.‘ఏఐ ఆధారిత బొమ్మల కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది’ అంటుంది లండన్లోని డిజైన్ కంపెనీ ‘మోరమా’ వ్యవస్థాపకురాలు, యూకే డిజైన్ కౌన్సిల్ సభ్యురాలు జో బర్నార్డ్.మానవ సంబంధాలకు భిన్నంగా ఏఐ బొమ్మ ఫ్రెండ్స్ ఎప్పుడూ సహనంగా, స్నేహంగా ఉండేలా డిజైన్ చేశారు.‘ఏఐ బొమ్మలలో సహజ స్పందన లేక΄ోవడం వల్ల, వాస్తవ ప్రపంచాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. మీరు ఒక చాట్బాట్తో ఎంత దారుణంగా ప్రవర్తించినా, అది మిమ్మల్ని అభిమానిస్తుంది. కాని వాస్తవ ప్రపంచంలో అలా ఉండదు కదా!’ అంటుంది జో బర్నార్డ్.ఇలా అయితే... చాలా కష్టంసహజత్వం లోపించిన సంభాషణల వల్ల పిల్లలకు భావోద్వేగపరమైన నష్టాలతో΄ాటు, మేధోవికాసం (కాగ్నెటివ్ ఎఫర్ట్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. నిరంతరం పిల్లలతో సంభాషించేలా ఏఐ టాయ్స్ను రూ΄÷ందించారు. దీనివల్ల పిల్లలలో ఆధారపడే తత్త్వం పెరిగే ప్రమాదం ఉంది. దాని బారి నుండి వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది.వికటిస్తుందా?ఒక వస్తువును ఎలా డిజైన్ చేస్తారనే దానిపైనే మనం దానితో ఎలా వ్యవహరిస్తామనేది ఆధారపడి ఉంటుంది. ఈ తరానికి సంబంధించి ఏఐ బొమ్మల కంపెనీలు ‘ఆకర్షణీయత’కే పెద్ద పీట వేశాయి. అయితే ఆ ఆకర్షణీయ విధానం పిల్లల అవసరాలకు విరుద్ధంగా ఉంటుంది.ఏఐ బొమ్మల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కంపెనీలు మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించడానికి ΄ోటీ పడుతున్నప్పటికీ, అది వికటించే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.గాబో గందరగోళం!మూడేళ్ల పిల్లల కోసం ఎన్నో ఏఐ బొమ్మలు మార్కెట్లో ఉన్నాయి. అయితే ప్రీ–స్కూల్ పిల్లలపై ఏఐ సాంకేతిక ప్రభావం గురించి చాలా తక్కువ పరిశోధన జరిగింది. తాజా విషయానికి వస్తే...అయిదేళ్ల లోపు పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై తొలిసారిగా ఒక అధ్యయనం నిర్వహించింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ బృందం. ఈ నేపథ్యంలో పిల్లల కోసం రూ΄÷ందించిన ఏఐ–ఆధారిత బొమ్మలకు సంబంధించి కఠినమైన నియంత్రణ అవసరం అని చెబుతున్నారు పరిశోధకులు.తమ అధ్యయనంలో భాగంగా మూడు నుండి అయిదు సంవత్సరాల వయస్సు గల కొద్దిమంది పిల్లలు ‘గాబో’ అనే ఏఐ బొమ్మతో ఎలా వ్యవహరిస్తారో పరిశీలించారు. ‘గాబో’ అనేది వాయిస్–యాక్టివేటెడ్ ఏఐ చాట్బాట్. ప్రీ–స్కూలు పిల్లలు దానితో మాట్లాడేలా, ఆటలు ఆడే విధంగా రూ΄÷ందించారు. తమ అధ్యయనంలో భాగంగా ‘గాబో’ భాష, సంభాషణలకు సంబంధించిన నైపుణ్యాలను పరీక్షించారు. పిల్లలు ‘గాబో’తో మాట్లాడడానికి తరచుగా ఇబ్బందిపడడాన్ని గమనించారు. పిల్లలు, పెద్దవారి గొంతుల మధ్య తేడాని ‘గాబో’ గుర్తించలేక΄ోయింది. ఒక పిల్లవాడు బొమ్మతో ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పినప్పుడు అది అర్థం లేని సమాధానం ఇచ్చింది.పిల్లవాడి మాటకు ‘థ్యాంక్యూ’ లేదా ‘నాకు కూడా నువ్వంటే ఇష్టం’లాంటి మాటలేవో వాడాలి. అలా కాకుండా...‘మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి’ అని స్పందించింది ఆ ఏఐ బొమ్మ. మూడేళ్ల చిన్నారి ‘నాకు బాధగా ఉంది’ అనే భావం వ్యక్తీకరించే మాట మాట్లాడినప్పుడు...‘నేను సంతోషంగా ఉండే చిన్న రోబోట్ని. ఈ సరదాను కొనసాగిద్దాం. మనం తర్వాత దేని గురించి మాట్లాడుకుందాం?’ అని ఆ చిన్నారిని అడిగింది బొమ్మ.ఈ సమయంలో కరెక్ట్ కాదు‘పిల్లలు సామాజిక విషయాలను తెలుసుకునే అభివృద్ధి దశలో జనరేటివ్ ఏఐ అవుట్పుట్ గందరగోళంగా ఉంటోంది’ అంటున్నారు పరిశోధకులు. ‘గాబో వంటి బొమ్మలు పిల్లల మాటలు, భావాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు’ అంటున్నారు అధ్యయన సహ రచయిత డాక్టర్ ఎమిలీ.సంవత్సర కాలం ΄ాటు ఏఐ బొమ్మల పనితీరును, పిల్లలపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసిన తరువాత...‘అయిదేళ్ల లోపు పిల్లల కోసం విక్రయించే ఏఐ బొమ్మలు సైకలాజికల్ సేఫ్టీని అందిస్తున్నాయని నిర్ధారించడానికి నియంత్రణ సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు పరిశోధకులు.‘ఏఐ బొమ్మలను తల్లిదండ్రులు పర్యవేక్షించడానికి వీలుగా, అందరికీ కనిపించే ప్రదేశాలలో ఉంచాలి. గోప్యతా విధానాలను (ప్రైవసీ ΄ాలసీ) జాగ్రత్తగా చదవాలి’ అని స్టడీ రి΄ోర్ట్ తల్లిదండ్రులకు సూచించింది. నిజ ప్రపంచం వర్సెస్ సాంకేతిక ప్రపంచంపిల్లల ఆలోచన విధానంపై ఏఐ ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. ఏఐ సాధనాలపై అతిగా ఆధారపడడం వల్ల మేధోపరమైన కృషి తగ్గుతుంది అంటున్నారు విశ్లేషకులు.‘ఏఐ బొమ్మలపై అతిగా ఆధారపడితే పిల్లల మెదడులోని భాగాలు అభివృద్ధి చెందడం ఆగి΄ోతాయి’ అని హెచ్చరిస్తున్నారు.నిజ ప్రపంచం సంక్లిష్టమైనది, అనూహ్యమైనది. మనుషులు తమ జీవితానుభవాల ద్వారా ఎలా మసలుకోవాలో నేర్చుకుంటారు. దీనికి విరుద్ధంగా ఏఐ పరిమితమైన సమాచారంతో పనిచేస్తుంది.‘ఒక పిల్లవాడి చుట్టూ ఉన్న అన్ని రకాల భావోద్వేగాలను ఏఐ బొమ్మలు అందుకోలేవు. దాని ప్రతిస్పందనలు అసంపూర్ణంగా, అనుచితంగా ఉంటాయి. ఇది తప్పుడు మార్గదర్శకత్వానికి దారి తీయడమే కాకుండా సృజనాత్మకంగా ఆలోచించడాన్ని తగ్గించవచ్చు, స్వతంత్రంగా సమస్య పరిష్కారానికి ఆలోచించే అవకాశాలను తగ్గించవచ్చు’ అంటుంది జో బర్నార్డ్. -
‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్!
ల్యాప్టాప్ అవసరం లేకుండానే ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే చకచకా పూర్తయిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ఇప్పుడు దీన్ని సాకారం చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘క్లాడ్’ (Claude)కు సంబంధించి ఒక విప్లవాత్మకమైన ఫీచర్ను ‘ఆంత్రోపిక్’ తాజాగా పరిచయం చేసింది.మనిషిలాగే కంప్యూటర్ వాడకంఇప్పటివరకు మనం ఏఐ సాయంతో ప్రశ్నలు అడగడమో లేదా సమాచారం సేకరించడమో చేసేవాళ్లం. కానీ ఇకపై ‘క్లాడ్’.. మీ కంప్యూటర్ను ఒక మనిషి మాదిరిగా ఆపరేట్ చేయగలదు. మౌస్ కదపడం, కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం, స్క్రీన్ను రీడ్ చేయడం లాంటి పనులను ఇది సునాయాసంగా చేస్తుంది. ఫలితంగా మీరు కంప్యూటర్ ముందు లేకపోయినా, మీరు ఇచ్చిన టాస్క్లను ‘క్లాడ్’ పూర్తి చేస్తుంది. అంటే మీ పనులను చక్కబెట్టే ఒక నమ్మకమైన ‘రిమోట్ ఉద్యోగి’ మీతో పాటు ఉన్నట్టేనని ‘ఆంత్రోపిక్’ పేర్కొంది.ల్యాప్టాప్ అవసరం లేని భవిష్యత్తుఈ కొత్త ఫీచర్ గురించి ఆంత్రోపిక్ పరిశోధకుడు అలెక్స్ ఆల్బర్ట్ మాట్లాడుతూ ‘పని కోసం ల్యాప్టాప్ తెరవాల్సిన అవసరం లేని భవిష్యత్తు అత్యంత వేగంగా మనకు చేరువవుతోంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆఫీస్ పనుల కోసం ఇకపై డెస్క్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ నుంచే క్లాడ్ ద్వారా అన్నింటినీ చక్కబెట్టవచ్చని ఆయన వెల్లడించారు.ఇది ఎలా పనిచేస్తుంది?క్లాడ్ మీ కంప్యూటర్లోని స్లాక్ (Slack) లేదా క్యాలెండర్ లాంటి అప్లికేషన్లకు కనెక్ట్ అవుతుంది. అవసరమైతే ఇతర యాప్స్ యాక్సెస్ చేయడానికి మీ అనుమతి అడుగుతుంది. ఇటీవలే విడుదలైన 'డిస్పాచ్' (Dispatch) ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచే కంప్యూటర్లో ఉన్న క్లాడ్కు ఆదేశాలు ఇవ్వవచ్చు. మీరు బయట తిరుగుతున్నా, ‘క్లాడ్’ మీ బ్రౌజర్లో సమాచారం వెదకడం, స్ప్రెడ్షీట్లను నింపడం లాంటి పనులను చిటికెలో పూర్తి చేసి పెడుతుంది.ఎవరికి అందుబాటులో ఉంటుంది?ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం రీసెర్చ్ ప్రివ్యూ దశలో మాత్రమే ఉంది. పెయిడ్ వెర్షన్ వాడుతున్న ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork)‘క్లాడ్ కోడ్’ (Claude Code) యూజర్లు మాత్రమే దీనిని వినియోగించగలరు. ముఖ్యంగా ప్రస్తుతం ఇది కేవలం మ్యాక్ ఓఎస్ (macOS) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం క్లాడ్ డెస్క్టాప్, మొబైల్ యాప్స్ రెండింటినీ అప్డేట్ చేసి అనుసంధానించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఏఐ పోటీఆటోమేషన్ రంగంలో వస్తున్న ఈ మార్పులు టెక్ ప్రపంచంలో కొత్త యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఇప్పటికే ఎన్విడియా ‘నెమోక్లా’ (NemoClaw)ను అందుబాటులోకి తీసుకురాగా, మెటా, ఓపెన్ ఏఐ సంస్థలు కూడా తమ సొంత ఏఐ ఏజెంట్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ రేసులో ఆంత్రోపిక్ ఒక అడుగు ముందే ఉన్నదని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం -
‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం
ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రం జపిస్తోంది. రేపటి ఉద్యోగాలన్నీ ఏఐ నైపుణ్యం మీదనే ఆధారపడి ఉండబోతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన చైనా, దేశంలోని క్లాస్రూమ్ల రూపురేఖలను మార్చేస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే పాత చింతకాయ పచ్చడి నుండి బయటపడలేకపోతోంది. ఏఐ వినియోగంలో ఈ రెండు దేశాల మధ్య నున్న అంతరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.చైనా: ‘డబుల్ రిడక్షన్’ విప్లవం2021లో చైనా 'డబుల్ రిడక్షన్' అనే కీలక విధానాన్ని తీసుకొచ్చింది. పైకి ఇది కేవలం ప్రైవేట్ ట్యూషన్లపై ఆంక్షలు అనిపించినా, దీని వెనుక ఒక వ్యూహం ఉంది. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించి, బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికారు. కేవలం టాపర్లను వెతకడం కంటే, ప్రతి విద్యార్థిలో నైపుణ్యాన్ని (Capabilities) పెంచడమే లక్ష్యంగా చైనా స్కూళ్లు ముందడుగు వేస్తున్నాయి. టెక్నాలజీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా చైనాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు.భారత్: డిగ్రీలు సరే.. ఉద్యోగాలేవి?భారత్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఏటా మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఇంజనీర్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, వారిలో ఎంతమంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం ప్రతి 10 మంది యువకులలో నలుగురు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ‘మన విద్యార్థులు పరీక్షలు పాస్ అయ్యేందుకే చదువుతున్నారు తప్ప, సమస్యలను పరిష్కరించడానికి కాదు’ అని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోచింగ్ సెంటర్ల మాయాజాలంహైదరాబాద్ నుండి రాజస్థాన్లోని కోట వరకు.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కోచింగ్ సెంటర్లే నడిపిస్తున్నాయి. ర్యాంకులు, కటాఫ్ మార్కులే విద్యార్థి తెలివితేటలకు కొలమానాలుగా మారిపోయాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది.తేడా ఎక్కడ వస్తోంది?చైనా తన విద్యార్థులను ‘రేపటి’ కోసం సిద్ధం చేస్తోంది. అక్కడి విద్య.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. కానీ భారత్ ఇంకా 'నిన్నటి' పద్ధతులలోనే పరీక్షలు పెడుతోంది. చైనా మోడల్లో నియంత్రణ ఎక్కువ ఉన్నా, వారు భవిష్యత్తు సాంకేతికతపై పట్టు సాధిస్తున్నారు. మన దగ్గర పోటీ ఎక్కువ ఉన్నా, అది కేవలం ర్యాంకులకే పరిమితమవుతోంది. ఏదిఏమైనప్పటికీ మన దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు అంటున్నారు. కేవలం మార్కులే విజయానికి కొలమానం అనుకుంటే, భవిష్యత్తులో మన యువత గ్లోబల్ మార్కెట్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: బ్లూటూత్ ఇయర్ఫోన్స్తో భయంకర వ్యాధి? -
ఏఐ.. ప్రాణదీపికై
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వే మార్గాలపై ఏనుగులు, ఇతర వన్యప్రాణులను ప్రమాదాల బారి నుంచి కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని రైల్వే మార్గాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులూ మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్లకు సమీపంలో వాటి ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా గుర్తిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డి్రస్టిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ (డీఏఎస్)తో రైల్వే ట్రాక్లపై వీటి ఉనికిని గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ట్రాక్ సమీపంలోకి ఏనుగులు, ఇతర వన్యప్రాణులు వస్తే ఈ వ్యవస్థ వాటి కదలికలను లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందికి హెచ్చరిక జారీ చేస్తోంది. దీంతో సకాలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే 141 రూట్ కిలోమీటర్లలో అమలు.. ప్రస్తుతం ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను రైల్వేలోని 141 రూట్ కిలోమీటర్ల మేరకు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఈ వ్యవస్థను మరో 981 రూట్ కిలో మీటర్లలో విస్తరించేందుకు టెండర్లను ఆహా్వనించినట్లు తెలిపింది. వన్యప్రాణుల మరణాలపై 127 రైల్వే మార్గాల్లో 3,452.4 కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించింది. దీని ద్వారా ఏనుగుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 110 రైల్వే మార్గాలను, పులుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 17 రైల్వే మార్గాలను గుర్తించింది. తక్షణం నష్ట నివారణకు 14 రాష్ట్రాల్లో 77 రైల్వే మార్గాల్లో 1,965.2 కిలో మీటర్ల మేర పలు నిర్మాణాలను చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.రైల్వే ప్రమాదాల బారి నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు 503 లెవెల్ క్రాసింగ్లు, ర్యాంపుల నిర్మాణం, 72 చోట్ల వంతెనల విస్తరణ, మార్పు, 39 చోట్ల కంచె, బారికేడింగ్, కందకాల నిర్మాణం, నాలుగు నిష్క్రమణ ర్యాంపులు, 65 కొత్త అండర్ పాస్లు, 22 ఓవర్పాస్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు వివరించింది. రైలు ప్రమాదాల్లో 2020–21 నుంచి 2024–25 వరకు 79 ఏనుగులు మృత్యువాత పడినట్లు తెలిపింది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, కేరళ, ఒడిశా ,త్రిపుర, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మృతి చెందుతున్నట్లు పేర్కొంది. -
వైరల్ వీడియో వెనుక భయంకర నిజం
హర్ష ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వయసు ఇరవై ఏడేళ్లు. మంచి జీతం. అతనికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్లిపనులు మొదలుపెడదాం అనుకున్న అతనికి ఆరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని కుదిపేసింది. ఒకరోజు ఉదయం అతని ఫోన్ మోగింది. అటు పక్కనుంచి అతడి స్నేహితుడు ఆదిత్య.‘‘హర్షా .. నువ్వేంటి ఇలాంటి దందా పనులు చేయడం ఎప్పటినుండి మొదలుపెట్టావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఏంట్రా నేనేం దందా పనులు చేస్తున్నాను?’’ ఆందోళనగా అడిగాడు హర్ష. ‘‘నువ్వు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నువ్వు చేసే పనులు వీడియోలు ఉన్నాయి... ఆ వీడియోలు నీకు కాబోయే భార్య చూసిందంటే... నీ పెళ్లి క్యాన్సిల్ కావచ్చు... జాగ్రత్త!’’ అని చెప్పి ఆదిత్య ఫోన్ పెట్టేశాడు. హర్ష ఆందోళనగా ఆదిత్య పంపిన వీడియో చూడసాగాడు. అందులో హర్ష చేతిలో తుపాకీ పట్టుకుని, కర్కశమైన గొంతుతో మాట్లాడుతూ ఒక ప్రముఖ వ్యాపారవేత్తను బెదిరిస్తున్నాడు. ఆ వ్యాపారవేత్త భయంభయంగా వదిలేయమన్నట్టుగా హర్షను వేడుకుంటున్నాడు. ఆ వీడియో చూడగానే అతని గుండె ఒక్కసారిగా బరువైంది. ‘ఇది... ఇదెలా సాధ్యం?’ హర్షకు ఒక్కసారిగా భయంతో మెదడు మొద్దుబారింది. ఇది అసలు తాను కాదు. మరి ఇదెలా సాధ్యం? ఆలోచనలు... ఆందోళన కమ్ముకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.కొద్ది నిమిషాల తరువాత...హర్ష ఫోన్ ఆగకుండా అలా మోగుతూనే ఉంది. తేరుకున్న అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ పేరు చూడగానే, తన జీవితం ఇక ముగిసింది అనుకున్నాడు హర్ష. కారణం ఫోన్ చేసింది తన కాబోయే భార్య స్నేహ...తాను కూడా ఆ వీడియోస్ తప్పకుండా చూసే ఉంటుంది. తనతో తెగతెంపులు చేసుకోవడానికి ఫోన్ చేస్తోంది అని అర్థం అయింది అతడికి. చివరిసారిగా ఆమెతో మాట్లాడాలని వణుకుతున్న చేతులతో ఫోన్ తీసాడు హర్ష.‘‘హలో...’’ కంపిస్తున్న స్వరంతో అన్నాడు హర్ష. ‘‘నేను ఆ వీడియోస్ చూశాను’’ అన్నది స్నేహ. కొన్ని నిముషాలు అలా మౌనంగా ఉండిపోయాడు హర్ష.‘‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు’’ మెల్లగా అన్నాడు హర్ష. తన కళ్ళముందే తన కలలసౌధం కూలిపోతున్నట్టు అనిపిస్తోంది అతడికి.‘‘ఆ వీడియోస్లో ఉన్నది మీరు కాదని నాకు తెలుసు’’... ప్రశాంతంగా చెప్పింది స్నేహ‘‘ఇది బహుశా సైబర్ మోసం కావచ్చు. డీప్ ఫేక్ తో ఇలా ఒకరి మొహాన్ని, స్వరాన్ని అనుకరించి అనుసరించి మోసాలు చేస్తారని తెలుసు. మీరు వెంటనే ఆ వీడియో గురించి సైబర్ కంప్లయింట్ ఇవ్వండి.’’ చెప్పింది.స్నేహ మాటలు హర్షకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు అయింది. సైబర్ క్రైమ్ అధికారి సాగర్ కేసు విచారణ మొదలుపెట్టాడు.ఆ వీడియోని జాగ్రతగా పరిశీలిస్తున్నాడు సాగర్. వీడియోలోని ముఖం, స్వరం అన్నీ హర్షవే...‘‘ఇది కచ్చితంగా డీప్ ఫేక్ వీడియో.’’ అన్నాడు సాగర్. హర్ష కొద్దిగా కుదుటపడ్డాడు.‘‘డీప్ ఫేక్ అంటే?’’ అడిగాడు.‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎవరి ముఖాన్నైనా, స్వరాన్నైనా ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేయడం.’’ వివరించాడు. ఆ వీడియోను సాగర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషణ జరిగింది. కళ్ల కదలికల్లో స్వల్ప అసమానత. లైట్ రిఫ్లెక్షన్లో చిన్న తప్పులు. చివరకు నిర్ధారణ అయ్యింది– అది డీప్ ఫేక్.కాని, ఎవరు చేశారని అసలు విచారణ ఇప్పుడు మొదలైంది.అసలు నేరస్థుడు హర్ష కంపెనీలో పని చేసిన మాజీ ఉద్యోగి రాహుల్. అతను చేసిన ఒక మోసం వల్ల కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. హర్ష అతని ప్రాజెక్ట్ లీడర్.రాహుల్ సోషల్ మీడియాలో హర్ష ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి అతని ముఖం, స్వరం కాపీ చేశాడు. ఆ వీడియోతో వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ వీడియో ముందుగానే లీక్ అయింది.సైబర్ ట్రేసింగ్ ద్వారా రాహుల్ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్, డ్రాఫ్ట్ ఫైళ్లు దొరికాయి.అతను అరెస్ట్ అయ్యాడు.హర్ష నిర్దోషిగా బయటపడ్డాడు. కాని, అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.‘‘ఇప్పటి ప్రపంచంలో మన ముఖం కూడా మనదేనా?’’∙∙ ‘థాంక్యూ స్నేహా..పెళ్ళికి ముందే కాబోయే భర్త నిర్దోషి అని నమ్మావు. మోరల్ సపోర్ట్ ఇచ్చావు’’ స్నేహని చుట్టేస్తూ అన్నాడు హర్ష.‘‘టెక్నాలజీ చాలా శక్తిమంతమైనది. కాని, బాధ్యత లేకుండా వాడితే అది ఆయుధం అవుతుంది.’’ ముఖ్యంగా డీప్ ఫేక్ గురించి అవగాహన, సైబర్ నేరాల పట్ల ఎవేర్నెస్ లేకపోతె ప్రమాదం. భయపడటం మానేస్తే నేరాలను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు’’ చెప్పింది స్నేహ. గమనిక:ఇన్నాళ్లూ కొనసాగించిన ‘క్రైమ్ రిపోర్టర్’ కాలమ్ను పాఠకులు ఆదరించారు. పాఠకుల్లో చాలామంది ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ఫిక్షన్ కోరుకుంటున్నందున ఈవారం నుంచి ‘క్రైమ్ రిపోర్టర్’ స్థానంలో కొత్తగా ‘క్లూషియల్’ శీర్షికను ప్రవేశ పెడుతున్నాం. ఇందులో వారం వారం క్రైమ్ కథలు అందించనున్నాం.∙శ్రీసుధామయి -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
ప్రమాదకర పోకడలు
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ల మధ్య సాగుతున్న యుద్ధంలో రోజూ వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో గత రెండు రోజుల పరిణామాలతో మేల్కొన్నట్టు కనబడుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపై పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో అయిదు దేశాల్లోని ఆరు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతినటమే అందుకు కారణం. దక్షిణ ఇరాన్లోని సహజ వాయు క్షేత్రం పార్స్ను ఇజ్రాయెల్ గురిచూసి కొట్టిన వెంటనే ప్రపంచంలోనే అతి పెద్ద ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్పైనా, దాంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్ చమురుశుద్ధి కర్మాగారాలపైనా ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల వల్ల ఒక్క ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్లోని 17 శాతం నిక్షేపాలు ఆవిరయ్యాయి. యుద్ధం పరిసమాప్తమయ్యేవరకూ దాన్ని చక్కదిద్దటం అసాధ్యం. ఆ పనులకు దాదాపు అయిదేళ్లు పడుతుందంటున్నారు. అంటే అయిదేళ్ల ఖతార్ ఆదాయం 10,000 కోట్ల డాలర్లు మాయమైనట్టు! దీనివల్ల మన దేశంతో సహా ఆసియా, యూరప్ దేశాలు తీవ్రసంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 116 డాలర్లను దాటింది. అది 130కి చేరిందంటే అమెరికాతోపాటు అందరికీ కష్టాలు మొదలవుతాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలవుతున్నారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఇక దాడి చేయబోదని ఆ దేశం తరఫున ఆయన హామీ ఇచ్చారు. మరికొన్ని గంటలకే హార్మూజ్ దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్కు చెందిన ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే పథక రచన సాగిస్తున్నట్టు లీకులిచ్చారు. అసలు ఇజ్రాయెల్ తన ఆదేశం పాటిస్తుందని నిజంగా ట్రంప్ భావిస్తున్నారా? అది ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ శక్తిమంతమైన సేవకుడిగా మారితే, అమెరికా బలహీనమైన యజమానిగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆవిర్భవించటానికి వీలుగా చుట్టూవున్న ముస్లిం దేశాల్ని పాదాక్రాంతం చేసుకోవాలని 1996లోనే ఇజ్రాయెల్ పథక రచన చేసింది. గత అమెరికా అధినేతల దగ్గర దాని ఎత్తులు పారలేదు. తెలిసీ తెలియని ట్రంప్ ఆ కొరతను తీర్చారు. తమకు క్షిపణులకు కొరతేమీ లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనిపై ఇజ్రాయెల్ దాడిచేసి హతమార్చింది. ఇలాంటి చర్యలు యుద్ధ విరమణను జటిలం చేస్తాయి తప్ప సాధించేదేమీ ఉండదు. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన దశలో కూడా ఆ రెండు దేశాలూ అతిగా అంచనా వేసుకుంటూ, ఇరాన్పై తప్పుడు లెక్కలు కడుతున్నాయి. చట్టవిరుద్ధ మైన ఈ యుద్ధానికి మరో 20,000 కోట్ల డాలర్లు కావాలంటూ అమెరికన్ కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికన్ కుబేరులకు కోట్లాది డాలర్ల పన్ను రాయితీలిచ్చిన ప్రభుత్వం, సాధారణ ప్రజానీకానికి అందే అరకొర సదుపాయాలకు సైతం కోత పెడితే తప్ప ఈ నిధులు సమకూర్చుకోలేదు. ఈ అకారణ యుద్ధానికి ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేయటం అవసరమా?వీటి సంగతలా ఉంచి అత్యంత అమానవీయ పద్ధతుల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యల పర్యవసానాలేమిటో కనబడుతూనే ఉన్నాయి. ఓపెన్ ఏఐ, పాలంటీర్ కలిసి ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ ఆసరాతో మారణహోమానికి తోడ్పడుతున్నాయి. పదేళ్లుగా పాఠశాల నడుస్తున్న ఒక ఆవరణను ఏఐ ఇరాన్ సైనిక స్థావరంగా అర్థం చేసుకుని చూపితే, దాని ఆధారంగా అమెరికా క్షిపణి దాడికి పాల్పడి ఒకేసారి 170 మంది బాలబాలికల ప్రాణాలు తీసింది. సైనిక దాడులకోసం తమ సాఫ్ట్వేర్ ఇచ్చేది లేదని ట్రంప్కు చెప్పిన ఆంత్రోపిక్ అయినా, ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుని లాభపడిన ఓపెన్ ఏఐ అయినా సారాంశంలో ఈ ప్రాణాంతక దాడులకు వ్యతిరేకం కాదు. ఆంత్రోపిక్ అభ్యంతరమల్లా ఆ సాఫ్ట్వేర్మరింత పదునుదేరాలన్నదే. ఆ తర్వాతే అందుబాటులోకి తీసుకురావాలని దానిఉద్దేశం. ప్రపంచ మనుగడ ఎంత ప్రమాదకరంగా మారిందో దీన్నిబట్టే గ్రహించవచ్చు. -
ఇదీ ఏఐ ప'వార్'!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఉక్రెయిన్ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం. దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..1. అమెరికా: మొత్తం బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్ డాలర్లు కేటాయించారు.2. చైనా: మొత్తం బడ్జెట్ 314 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్ క్లస్టర్ల కోసం 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.3. రష్యా: మొత్తం బడ్జెట్: 149 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.4. భారత్: మొత్తం బడ్జెట్: 93.5 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ కలిసి ‘మిషన్ సుదర్శన్ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..1. ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ: ది గోస్పెల్ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్ టార్గెట్ సిస్టమ్. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. లావెండర్: సోషల్ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. వేర్ ఈజ్ డాడీ?: లావెండర్ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్ సాధనం. స్మార్ట్ షూటర్స్: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్–సైట్స్. 2. ఉక్రెయిన్–రష్యా యుద్ధం: అటానమస్ డ్రోన్లు: రష్యన్ జీపీఎస్ జామింగ్ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. డెల్టా సిస్టమ్: ఇది ఉక్రెయిన్ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్ టైమ్ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 3. వెనిజులానికోలస్ మదురోను పట్టుకోవడానికి కారకాస్లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని (పలాంటిర్ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. ఇరాన్ (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ): కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్ మావెన్, క్లౌడ్ ఏఐని ఉపయోగించారు. -
ఒంటరి.. డిజిటల్ దరి
సాక్షి, స్పెషల్ డెస్క్ : పట్టణీకరణ, పని ఒత్తిడి, మారుతున్న సామాజిక సంబంధాలు.. కారణం ఏదైనా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేవలం పనిముట్టుగా మాత్రమే కాకుండా మనుషులకు ఒక ‘డిజిటల్ తోడు’గా మారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది వినియోగదారులు ఏఐ కంపానియన్ యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 18–30 ఏళ్ల వయసు వారు ఈ యాప్స్ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాప్స్ మనుషులతో స్నేహితుల్లా లేదా ఒక తోడులా సంభాషిస్తున్నాయి. సాధారణ చాట్బాట్స్ కంటే ఇవి భిన్నమైనవి. వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికి తగినట్లుగా స్పందిస్తాయి.ఐటీ ఉద్యోగుల వాడకమే అధికం..వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా కేవలం కాలక్షేపం కోసం ‘డిజిటల్ స్నేహితుల’తో యూజర్లు గంటల తరబడి గడుపుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని యువత, ఐటీ ఉద్యోగులు వాటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటి వాడకం వల్ల వినియోగదారుల్లో 30% నుంచి 50% వరకు సానుకూల మార్పు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగిస్తున్నట్లు అంచనా. యూజర్లపరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది.ఇదీ మార్కెట్..నాస్కామ్ లెక్కల ప్రకారం 2024లోప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్ మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 30.8% వార్షిక వృద్ధిరేటుతో 2030 నాటికి 140.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం 2024లోభారత్లో ఏఐ కంపానియన్ మార్కెట్ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. 40.4% వార్షిక వృద్ధితో 2030 నాటికి 7.9 బిలియన్ డాలర్లనుతాకుతుందని అంచనా.రోజుకు 45 నిమిషాలు..» భారత్లో ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగం ప్రపంచ సగటు కంటే 40% వేగంగా పెరుగుతోంది.» సగటున ఒక్కో వినియోగదారు రోజుకు45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు.» వినోదం కోసమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఆధారం: నాస్కామ్, సెన్సార్ టవర్, టెక్నావియో, గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రయోజనాలు ఇవీ..» సామాజికంగా ఒంటరినని బాధపడే వారికి ఈ యాప్స్ 24/7 అందుబాటులో ఉండే స్నేహితుడిలా తోడుంటాయి. » కొన్ని యాప్స్ ఒత్తిడి,ఆందోళన, కుంగుబాటుతగ్గించడానికి ‘కాగ్నిటివ్బిహేవియరల్ థెరపీ’ పద్ధతులను వాడుతూసహాయపడతాయి. » మనుషులతో మాట్లాడితే వారు మనల్ని జడ్జ్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ ఏఐతో ఎలాంటి సంకోచం లేకుండా మనసులోని మాటలు పంచుకోవచ్చు.నష్టాలూ ఉన్నాయి» మన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల డేటా హ్యాక్ అయ్యే లేదా ప్రకటనల కోసం అమ్ముడయ్యే ప్రమాదం ఉంది. » మనుషుల కంటే ఏఐతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల నిజజీవితంలో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయి, మనుషులతో మాట్లాడటం కష్టంగా మారవచ్చు. » మనుషులు ఏఐ స్నేహితులకు బానిసలుగా మారే ప్రమాదం. » ఏఐ ఇచ్చే సలహాలు వాస్తవ విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉండే అవకాశం. -
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్! -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు» ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. » ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. » ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. » మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. » వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎల్రక్టానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మంచి పనులకు ఉపయోగించాలి కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకంగా కొనసాగుతున్న కృత్రి మ మేధస్సు (ఏఐ) ను మంచి పనులకు ఉపయోగించడం వల్ల అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప తప్పుడు మార్గాలకు వెళితే కచ్చితంగా శిక్షలకు గురికాక తప్పదు. ఏఐ ఉపయోగం, దుర్వినియోగం పై అవగాహన పెంచుకోవాలి. – ప్రొఫెసర్ ఎం.వీ.బీ.చంద్రశేఖర్, హెచ్ఓడీ, సీఎస్ఈ, ఏఐఎంఎల్దుర్వినియోగం చేస్తే కఠినమైన శిక్షలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏఐను దుర్వినియోగం చేస్తే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి. ఏఐను ఒక టూల్గా ఉపయోగించి ఎన్నో ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుల్లో ఏఐతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి.– ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
సెమీకాన్ మార్కెట్ @ 300 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ భవిష్యత్తుపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్లో 60 శాతం చిప్స్ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా. ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్లో మొబైల్ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది. ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ..టెస్ట్ (ఓఎస్ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమలోకి మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది. భారీగా ఉద్యోగాలు.. సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది. -
ఏఎంఐ ల్యాబ్స్తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ)తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్ ఏఐ కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ రోడ్మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు. సిలికాన్ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు. -
ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?
అహ్మదాబాద్: విదేశాల్లో భారీ ప్యాకేజీలు అందుకుంటూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసి, ఏవో కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారతీయ కంపెనీల్లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వంటి అత్యున్నత రంగాల్లో అనుభవమున్న టెక్కీలను ఇంటర్వ్యూల్లో ‘నోట్ప్యాడ్' మీద కోడ్ రాయమనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.అసలేం జరిగింది?అహ్మదాబాద్కు చెందిన ‘న్యూకాన్స్’ (Pneucons) సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ లఖానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఉదంతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతని స్నేహితులిద్దరు గత ఐదేళ్లుగా జర్మనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఒకరు క్యాన్సర్ కణాలను గుర్తించే ఏఐ మోడల్స్ను రూపొందించగా, మరొకరు మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పైప్లైన్స్లో నిపుణుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం వారు తమ విదేశీ ఉద్యోగాలను వదిలి భారత్కు తిరిగివచ్చారు.అయితే వారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే.. సదరు రిక్రూటర్లు వారి అనుభవాన్ని పక్కన పెట్టి, 2026వ సంవత్సరంలో కూడా ఒక సాధారణ ‘నోట్ప్యాడ్’ ఇచ్చి కోడ్ రాయమని అడగడం వారిని షాక్నకు గురిచేసింది. ‘క్యాన్సర్ను గుర్తించే ఏఐ మోడల్స్ తయారు చేసే మేధావులను నోట్ప్యాడ్పై కోడ్ రాయమనడం హాస్యాస్పదం’ అని లఖానీ ఎద్దేవా చేశారు.నెటిజన్ల రియాక్షన్: 'ఇది టెక్ ఇంటర్వ్యూనా.. జోకా?'ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘భారతీయ ఇంటర్వ్యూ వ్యవస్థ ఇంకా పురాతన కాలంలోనే ఉంది. 15 ఏళ్ల అనుభవం ఉన్నవాడిని కూడా లాజిక్ అడగకుండా, బట్టీ పట్టినట్టు కోడ్ రాయమనడం రిక్రూటర్ల అసమర్థతకు నిదర్శనం’ అని ఒకరు మండిపడ్డారు. ‘అనుభవం ఎంత ఉన్నా ప్రాథమిక అంశాలు ముఖ్యం. నోట్ప్యాడ్పై రాయడం వల్ల వారి సృజనాత్మకత, పట్టు అర్థమవుతుంది" అని మరికొందరు వాదించారు. మొత్తానికి ప్రపంచమంతా ఏఐ వేగంతో దూసుకుపోతుంటే, మన దగ్గర ఇంకా పాత పద్ధతులతోనే ప్రతిభను కొలవడం ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే.. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు
న్యూఢిల్లీ: కంపెనీల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ప్లగ్ అండ్ ప్లే (సిద్ధంగా ఉన్న) రకమైన సాధారణ సాఫ్ట్వేర్లు సరిపోవని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ వెల్లడించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి స్థాయి ఏఐ పరిష్కారాలను అందించే ఐటీ కంపెనీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపింది. ఏఐపై నిర్ణయాధికారం కలిగిన 600 మందితోపాటు 38 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను సర్వే చేసి ఒక నివేదిక విడుదల చేసింది.సంస్థలు ఏఐ భాగస్వామిని (టెక్నాలజీ సంస్థ) ఎంపిక చేసేటప్పుడు ధర లేదా సత్వర ఫలితాలు కంటే, తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ప్రత్యేక పరిష్కారాలు, విధానాలను కీలకంగా చూస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా అందుబాటులో ఉండే ఏఐ సాఫ్ట్వేర్లు తమ వ్యాపార అవసరాలకు సరిపోవంటూ కొన్ని సంస్థలు ఏఐ సేవలను తిరస్కరిస్తున్నాయని వెల్లడించింది. తగినంత అనుభవం లేకపోవడం, ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేయకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొంది. కీలక సవాళ్లు.. ఏఐ స్వీకరణలో సంస్థలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లలో.. నియంత్రణ, నిబంధనలపరమైన ఆందోళనలు.. పెట్టుబడిపై సరైన రాబడిని చూపించడం కష్టంగా ఉండడం.. ఏఐ వ్యూహంపై సరైన స్పష్టతలేమిని పేర్కొంది. ఏఐ విజయవంతం కావాలంటే ఒక్కో నమూనాను అమలు చేయడంతోనే సరిపోదని, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. అలాగే ఏఐపై పెట్టుబడులను ప్రయోగాత్మకంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా సంస్థలు చూస్తున్నాయని తెలిపారు. ఏఐ మనుషుల పనులను వేగవంతం చేస్తుందే కానీ, వారి ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని కాగ్నిజెంట్ అధ్యయన నివేదిక పేర్కొంది. మనుషులు ఏఐ కలిసి పనిచేసే విధంగా పనితీరులో మార్పులు వస్తాయని తెలిపింది. -
ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్ను కొట్టివేశారు.పంజాబ్లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్లో ఉన్న పిటిషన్ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు. పిటిషన్లో పేర్కొన్న 'ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్' (Fiduciary Risk of Corporate Donors) అనే పదానికి అర్థం చెప్పాలని సీజేఐ కోరగా, సిద్ధూ నీళ్లు నమిలాడు.తన నోట్స్ చూసి చెప్పడానికి ప్రయత్నించగా.. ‘మిస్టర్ సిద్ధూ, ఇది ఎవరో న్యాయవాది రాసి ఇచ్చింది. నువ్వు కేవలం స్క్రిప్ట్ చదువుతున్నావు’ అని సీజేఐ అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరోతో విచారణ జరిపిస్తామని హెచ్చరించడంతో సిద్ధూ అసలు విషయం బయటపెట్టారు. సుప్రీంకోర్టు ఆవరణలోని ఒక టైపిస్ట్ తనకు సహాయం చేశాడని, అతనికి గంటకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ, నాలుగు జాకెట్లు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. తాను న్యాయవాదిని పెట్టుకోలేక, మూడు నాలుగు రకాల ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్ ఉపయోగించి ఈ పిటిషన్ను రూపొందించానని అంగీకరించాడు.సాంకేతికతను తప్పుగా వాడుకుంటూ, కోర్టు సమయాన్ని వృథా చేసే పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ఆర్థిక జరిమానాలు కూడా తప్పవని హెచ్చరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, సోమవారం కూడా ఇదే బెంచ్.. ఉల్లి, వెల్లుల్లిలో ‘తామసగుణం’ ఉంటుందా అనే అంశంపై వచ్చిన పిటిషన్తో సహా ఐదు ఉపయుక్తంకాని వ్యాజ్యాలను కొట్టివేసింది.ఇది కూడా చదవండి: మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు -
ఒక‘ట్రెండు’సార్లు ఆలోచించండి...
‘ఏమవుతుంది లే’ అనే నిర్లక్ష్యం కంటే... ‘ఎందుకైనా మంచిది’ అనే ముందు చూపు చాలా మంచిది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ‘వైరల్ ఏ.ఐ. క్యారికేచర్’ ట్రెండ్ అనేది హాట్ టాపిక్. ‘ఇదిగో నా గురించి నీకు అన్నీ చెప్పేస్తున్నాను. క్యారికేచర్ అదిరిపోవాలి’ అని ఏ.ఐ.కి ప్రాంప్ట్ ఇవ్వడం అనేది ఈ ట్రెండ్లో భాగం. అయితే అయితే... ఈ ట్రెండ్లో భాగంగా వేలం వెర్రిగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వల్ల, మోసగాళ్లకు చేతినిండా పనే అని హెచ్చరిస్తున్నారు డిజిటల్ నిపుణులు...యూజర్లు పర్సనల్ ఫొటోను షేర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ను క్యారికేచర్ లేదా ఇలస్ట్రేషన్ క్రియేట్ చేయమని అడగడమే వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్. మన అభిరుచులు, జీవిత విశేషాలు, ఉద్యోగ విశేషాల ఆధారంగా ఈ క్యారికేచర్ క్రియేట్ అవుతుంది. క్యారికేచర్ కదా అనుకోవద్దు! ‘ఏమవుతుంది? వస్తే గిస్తే నా క్యారికేచర్ బయటికి వస్తుంది. దీంతో మోసాలు ఎలా చేస్తారు?’ అనే వాళ్లు బోలెడు మంది. అయితే మనం అనుకున్నట్లు బయటికి వచ్చేది క్యారికేచర్ మాత్రమే కాదు...‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’ అనే ఒకే ఒక ప్రాంప్ట్తో ఏఐ ఎన్నో వివరాలను లాగేస్తుంది. చివరికి మన కమ్యూనికేషన్ స్టైల్ను కూడా విడిచి పెట్టదు. ఒక్కముక్కలో చె΄్పాలంటే... బయటికి వచ్చేది క్యారికేచర్ రూపంలోని మన పర్సనల్ ప్రోఫైల్! అది మనం ఇష్టపూర్వకంగా అందజేసిందే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.ట్రెండ్లో భాగంగా...వైరల్ క్యారికేచర్ ట్రెండ్ క్రియేటివ్గా, ఎంటర్టైనింగ్గా కనిపించినప్పటికీ, ఈ ట్రెండ్ ద్వారా బయటికి వచ్చే వ్యక్తిగత సమాచారం ఆధారంగా మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘నా మనస్తత్వానికి అద్దం పట్టే క్యారికేచర్ క్రియేట్ చేసుకోవాలి’ అనే ఉత్సాహంతో యూజర్లు ఎటువంటి పరిమితులూ లేకుండా సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. సమాచారం ఎంత ఎక్కువ ఇస్తే క్యారికేచర్ అంత బాగా వస్తుందనేది వారి ఉద్దేశం. ట్రెండ్లో భాగంగా రెఫరెన్స్ ఫొటోతో పాటు అదనపు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు... కంపెనీ పేరు, కార్పొరేట్ లోగో, చేస్తున్న ఉద్యోగం, పని చేస్తున్న నగరం పేరు, దినచర్య, కుటుంబ వివరాలు... మొదలైనవి తెలియజేస్తున్నారు.ఎమోషనల్ మానిప్యులేషన్ఫొటోగ్రాఫ్కు సందర్భోచిత వివరాలు జత చేస్తే డిజిటల్ మోసాలు జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఫొటోతో స్కామర్లు వివిధ ΄్లాట్ఫ్లామ్లలో నకిలీ ప్రోఫెషనల్ ప్రోఫైళ్లను సృష్టించవచ్చు. జెనరేటివ్ వాయిస్ లేదా డీప్ఫేక్లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు. ఫొటోను డిస్ప్లే ఇమేజ్గా ఉపయోగించి కంపెనీ లేదా ప్రోఫైల్ పేజీలను క్లోన్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రామాణికంగా, నమ్మదగినదిగా చేయడానికి ఇలాంటి ట్రిక్స్ను ఉపయోగిస్తుంటారు. ఫొటోగ్రాఫ్తో పాటు ఉద్యోగం, ఆఫీసు వివరాలు మోసగాళ్ల చేజిక్కితే ఎంతమాత్రం అనుమానం రాకుండా బిజినెస్ ఈమెయిల్స్, మెసేజ్లను స్కామర్లు రూపొందించి ఆ వ్యక్తి కొలీగ్స్కు ఫేక్ ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్లను పంపే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే స్కామర్లు ఎమోషనల్ మానిప్యులేషన్కూ పాల్పడే ప్రమాదం ఉంది.యస్... ఇది నిజమేమనం అందించే డేటా పాయింట్స్ సవివరమైన డిజిటల్ ప్రోఫైల్ను రూపొందించడానికి ఉపకరిస్తాయి. ఇమేజ్తో జత చేసిన వివరాలతో సైబర్ నేరగాళ్లు సోఫిస్టికేటెడ్ స్కామ్లు చేసే అవకాశం ఉంది ‘ఏఐ–జనరేటెడ్ పర్సనల్ ఇమేజ్లు స్కామర్లకు ఉపయోగపడతాయా?’ అనే ప్రశ్నకు వచ్చే జవాబు... ‘అవును’ సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ (వోఎస్ఐఎన్టీ)పై తగిన సమయం వెచ్చిస్తారు. లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, న్యూస్ ఆర్టికల్స్....మొదలైన వాటి ద్వారా వ్యక్తుల డిజిటల్ ఫుట్ప్రింట్ను సేకరిస్తారు. వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్ ద్వారా వారి పని మరింత సులభం అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాలు, ΄్లాట్ఫామ్ల ద్వారా సేకరించడానికి బదులు ఒకేచోటు నుంచి తీసుకోవడానికి స్కామర్లకు అవకాశం ఇస్తుంది.‘యూజర్లు పంచుకునే ఏ ఒక్క సమాచారం విడిగా ప్రమాదం కాదు. అయితే ఈ ట్రెండ్తో వచ్చిన చిక్కు ఏమిటంటే, అలవాట్ల నుంచి ఆందోళన వరకు యూజర్ షేర్ చేసే సమాచారాన్ని మొత్తం ఒకే దగ్గర చేరుస్తుంది. స్కామర్లు ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనునుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇస్తుంది.ఏ చెడు జరిగినా ‘ఇది కలికాలం నాయనా’ అనే మాట బాగా వినిపిస్తుంది. ఇప్పుడు కాలం మారింది. ‘ఇది డిజిటల్ కాలం నాయనా’ అనుకోవాల్సి వస్తోంది. ఏ ట్రెండ్ నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా! అందుకే జాగ్రత్త అవసరం...అత్యవసరం.ఇలా చేయాలి...⇒ ఐడెంటిఫైయబుల్ డేటా ప్రాంప్ట్స్ ఇవ్వవద్దు. ఉదా: పూర్తి పేరు, చేస్తున్న ఉద్యోగం, కంపెనీ పేరు, ఇంటి అడ్రస్... మొదలైనవి.⇒ మీ లొకేషన్ లేదా, సంస్థ గురించి తెలుసునేలా చేసే లోగోలు, ఐడీ కార్డ్, డాక్యుమెంట్లు, లైసెన్స్ ప్లేట్స్, స్క్రీన్లు, భవన ముఖద్వారాలు, స్ట్రీట్ సైన్లు, బిల్డింగ్ పేర్లు కనిపించే ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.⇒ ఎమోషనల్ స్కామ్స్ నివారించడానికి పిల్లలకు సంబంధించి సమాచారాన్ని షేర్ చేయకూడదు. కుటుంబ వివరాలను వెల్లడించకూడదు.⇒ ‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’లాంటి ప్రాంప్ట్లు ఇవ్వకూడదు. దీనికి బదులుగా ‘క్రియేట్ యూజింగ్ వోన్లీ ది డిటేల్స్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ డోన్ట్ యూజ్ పాస్ట్ చాట్స్ ఆర్ హిస్టరీ’ అని ఇస్తే సరిపోతుంది.⇒ ఇతరుల అనుమతి లేకుండా వారి ఫొటోను అప్లోడ్ చేయవద్దు.⇒ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ముందు ప్రైవసీ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కంటెంట్ను ఎంత కాలం స్టోర్ చేస్తారు? కంటెంట్ను మోడల్ ట్రైనింగ్, సర్వీస్ ఇంప్రూమెంట్స్ కోసం ఉపయోగిస్తారా?... మొదలైన విషయాలు తెలుసుకోవాలి.⇒ ‘టెంపరరీ చాట్’లాంటి ప్రైవసీ మోడ్స్ను ఉపయోగించడం మంచిది.⇒ ఒకవేళ మీరు ట్రెండ్ను ఫాలో కావాలనుకుంటే తాజాగా తీసిన హై–రిజల్యూషన్ ఫొటో కాకుండా పాత లేదా ఎడిటెడ్ ఇమేజ్ను ఉపయోగించాలి.⇒ వైరల్ ట్రెండ్తో సంబంధం ఉన్న హానికరమైన లింక్లు, ప్రమాదకరమైన డౌన్లోడ్లు, ఫిషింగ్ నివారించడానికి సెక్యూరిటీ టూల్స్ను ఉపయోగించాలి. -
బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే!
న్యూయార్క్: కార్పొరేట్ ప్రపంచంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. నిన్నటి వరకు కేవలం మన సందేహాలకు సమాధానాలిచ్చే ‘చాట్బాట్’లుగా ఉన్న కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు, ఇప్పుడు నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, కెనడాల్లోని అనేక దిగ్గజ కంపెనీల్లో సాగే కార్యకలాపాలను సమూలంగా మార్చేస్తున్నాయి. కేవలం సహాయకులుగా కాకుండా, పనులను ప్లాన్ చేస్తూ, తోటి ఉద్యోగులకు బాధ్యతలు కేటాయించే ‘ఏఐ ఏజెంట్లు’గా ఇవి అవతరిస్తున్నాయి.సాధారణ ఏఐ చాట్బాట్లకు, ఏఐ ఏజెంట్లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాటి ‘స్వయంప్రతిపత్తి’. చాట్బాట్లు మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తాయి. కానీ ఏఐ ఏజెంట్లు ఒక అడుగు ముందుకు వేసి, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా క్యాలెండర్లు, సమావేశాల ట్రాన్స్క్రిప్ట్లు, అంతర్గత డేటాబేస్లను విశ్లేషించి, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలవు. అమెరికన్ క్లౌడ్ డేటా సంస్థ ‘స్నోఫ్లేక్’ వంటి చోట్ల ఇంజనీర్లు గతంలో గంటల తరబడి చేసే కోడింగ్ సమీక్షలు, సిస్టమ్ పర్యవేక్షణ వంటి పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి.కొన్ని సందర్భాల్లో ఒక ఏఐ ఏజెంట్ రాసిన కోడ్ను మరో ఏఐ ఏజెంట్ తనిఖీ చేసి, లోపాలను సరిదిద్దుతోంది. మానవ పర్యవేక్షణ కేవలం తుది ఆమోదానికే పరిమితమవుతోంది. మేనేజర్లు చేసే పనుల కేటాయింపు, పనితీరు పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఇప్పుడు సాఫ్ట్వేర్లే చూసుకుంటున్నాయి. అమెజాన్, యూపీఎస్, టార్గెట్ వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తూ, ఆటోమేషన్ ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అమెరికాలో దాదాపు 6 నుంచి 7 శాతం మంది ఉద్యోగులు ఏఐకు ప్రభావితం కావచ్చని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. ముఖ్యంగా అకౌంటెంట్లు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు.కాగా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్ల సంస్థలో సహకారం క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొన్ని సంస్థలు ఏఐ ద్వారా పెరిగిన ఉత్పాదకతను ఉద్యోగులకు పంచుతూ, వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెడుతున్నాయి. మరోవైపు మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఉండే కౌన్సెలింగ్, వెల్నెస్ వంటి రంగాల్లో ఏఐ ఏజెంట్ల వినియోగానికి వినియోగదారులు విముఖత చూపుతున్నారు. సామర్థ్యం కంటే సామాజిక అనుబంధానికే విలువనిస్తూ, కొన్ని కంపెనీలు ఇప్పటికీ మనుషులకే పెద్దపీట వేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు -
ఏఐకి రేపటి తరం సిద్ధమా?
మానవాళి ప్రగతిలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నూతన శకాన్ని ఆరంభిస్తోంది. అయితే మనుషులకు ప్రయోజనం చేకూర్చడంలో ఈ టెక్నాలజీకున్న అపారమైన సామర్థ్యాన్ని, అది సమాజానికి హాని చేయడానికి కూడా ఉన్న ప్రమాదంతో బేరీజు వేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మన సాధనాలలోని ఏఐ మోడళ్ళు ఇప్పటికే రుచి చూపిస్తున్నాయి. నా ఫోన్లోని ఫొటోలలో ఒక టీనేజీ అమ్మాయిని ఏఐ ‘స్వీట్’గా అభివర్ణించడంతో నేను ఖంగుతిన్నాను. ఫోన్లోని ఏఐకీ, ఆన్లైన్ మృగాడికీ ఇంక తేడా ఏముంది? రక్షణ కంచెలు, భద్రతల అవసరాన్ని ఈ చిన్ని ఉదాహరణ చెప్పకనే చెబుతోంది. ఓ కుర్రాడి ఆత్మహత్యకు చాట్ జీపీటీ దారి చూపిన వైనాన్ని మరచిపోగలమా? ఇవేవో చెదురుమదురు ఘటనలు కావు. ప్యారిస్లో జరిగిన కడపటి ఏఐ కాన్ఫరెన్స్ని ‘ఏఐ సేఫ్టీ సమిట్’గా అందుకే పిలిచినట్లుంది. ఉద్యోగాల కోతపై రెండు వాదనలుఅడ్డూ ఆపులేని ఏఐ సిస్టంలు తీసుకురాగల ప్రమాదాలపై ఆందోళనలు ఇదివరకే మొదలయ్యాయి. ఏఐ అభివృద్ధిపై మారటోరియం విధించాలంటూ ఓ లాబీ తయారైంది. అలా అడిగిన వారిలో ఒకరైన ఎలాన్ మస్క్ ఇపుడు ఏఐ రేసులోకి దిగక తప్పలేదు. ఏఐ సిస్టంలు స్విచాఫ్కు బదులుగా మనుషులను చంపేసే అవకాశాన్ని ఎంచుకున్నాయని ల్యాబ్ అధ్యయనాలలో తేలింది. ప్రముఖ కంప్యూటర్ సైన్స్ నిపుణుడు స్టువర్ట్ రసెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ సంగతి వెల్లడించారు. కోడర్లలో చాలా మంది పురుషులే అయినందున లింగ వివక్ష ఈ సిస్టంలకు కూడా పాకిందని మహిళా నిపుణులు అన్నారు. కనుక, ఏఐ ఎకోసిస్టంని కంప్యూటర్లు, డేటా సెంటర్లు, ఎనర్జీ అవసరాలు, మోడళ్ళు–అప్లికేషన్ల వంటి పదజాలంతోనే కాక నైతిక దృక్కోణం నుంచీ వీక్షించవలసి ఉంది. ఉద్యోగాలు ఏమవుతాయోనని క్రమేపీ పెరుగుతున్న ఆందోళనల అంశాన్ని కూడా పరిశీలించవలసి ఉంది. ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దీనిపై కలత చెందుతోంది. దీనిపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఉద్యోగుల అవసరం లేని విధంగా అంతిమంగా ఏఐ పరిణమిస్తుందన్నది వాటిలో ఒకటి. ఉద్యోగాల తీరుతెన్నులు మారతాయన్నది మరో వాదన. కొత్త టెక్నాలజీతో వివిధ రకాల నైపుణ్యాలు అవసరమవుతాయని అంటున్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం సమయంలో అదే జరిగింది. దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ రెండవ కేటగిరీలోకి వస్తారు. వ్యాల్యూ–యాడెడ్ సర్వీసులపై ఏఐ చూపగల ప్రభావంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను వారు ఇటీవలి ఢిల్లీ సమిట్లో తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఐటీ పరిశ్రమలోని లక్షలాది ఉద్యోగులు తక్షణ బెడదను ఎదుర్కొంటున్నారు. ఆ పరిశ్రమలోని అట్టడుగు ఉద్యోగులు చేసే పనులను ఇకపై ఏఐ సిస్టంలు చక్కబెడతాయని చెబుతున్నారు. మారుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించడం స్వల్పకాలిక పరిష్కారంగా భావించవచ్చు. దీర్ఘకాలిక సమస్య కట్టెదుటే కనిపిస్తోంది. ఏఐ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అత్యవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థులు ఒంటబట్టించుకునే విధంగా దేశంలోని విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. ప్రాథమిక విద్య నుంచే...ఇది ఉన్నత విద్యా రంగానికి మాత్రమే పరిమితమయ్యే సవాల్ కాదు. ప్రాథమిక, సెకండరీ విద్యా స్థాయులలో కూడా తగు మార్పులు చేసుకోక తప్పదు. మూడవ, నాల్గవ తరగతుల విద్యార్థులు చిన్నపాటి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వార్షిక (2024) విద్యాస్థాయి నివేదిక వెల్లడిస్తోంది. అధునాతన ఏఐ ఎకోసిస్టంతో వ్యవహరించగలిగిన విధంగా ఈ విద్యార్థులను సంసిద్ధులను చేయవలసి ఉంది. ప్రీ–ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయులలోను ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ప్రాథమిక విద్యా ప్రమాణాలను, ఆలంబనగా నిలువవలసిన మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా తీర్చిదిద్దినప్పుడే ఆ రకమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. డిజిటల్ వ్యత్యాసాన్ని ఏఐ వ్యత్యాసంగా పరిణమించనివ్వకూడదని ఢిల్లీ సదస్సులో పాల్గొన్న గూగుల్ ఛీఫ్ సుందర్ పిచాయ్ దాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్చరించారు. నవీకరణ, ప్రతిభా సామర్థ్యాలకు గ్లోబల్ కేంద్రంగా తనకున్న అనుకూలతను భారత్ నిలబెట్టుకుంటుందో, లేదో నిర్ణయించగల మౌలికాంశాలవి. పునాది బలంగా ఉంటేనే సౌధం నిలుస్తుంది. ప్రపంచంలోని చిప్ డిజైనర్లలో 20% మంది మన దేశంలోనే ఉన్నారు. సెమీకండక్టర్ అభివృద్ధికి ఆశావహమైన పథకాలతో అడుగు ముందుకేయడం దానివల్లనే తేలికైంది. విద్యా రంగంలో మౌలిక వసతులను సకాలంలో ఉన్నతపరిస్తేనే ఈ పోటీదాయక అడ్వాంటేజి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గకూడదు!ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నా ఇంకా మనం అమెరికా, చైనాలను అందుకునే పరుగులోనే ఉన్నామనే ఫిర్యాదు వినవస్తోంది. ఏఐలో మనం రేసులోనే ఉన్నామని ఢిల్లీ సమిట్ వెల్లడించింది. విదేశీ ఆర్కిటెక్చర్పై ఆధారపడకుండానే పలు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళ (ఎల్.ఎల్.ఎం.)ను మనం ఆవిష్కరించగలిగాం. ఏకంగా 22 భాషల్లో రియల్–టైమ్ స్పీచ్, డీప్ రీజనింగ్ సామర్థ్యాలతో ఆవిష్కృతమైన ‘సర్వం’ ఏఐ మోడళ్ళు అబ్బురపరచాయి. స్వయం శక్తితో ఏఐలో ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చాయి. భారత్ జెన్ మోడల్, జ్ఞాని ఏఐ, టెక్ మహీంద్రా, ఫ్రాక్టల్ ఎనలటిక్స్ మోడళ్ళు కూడా చెప్పుకోతగినవే. కొన్ని మోడళ్ళు ‘ఇండియా ఏఐ మిషన్’ ద్వారానే సాధ్యమయ్యాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా, ఢిల్లీ సమిట్ ఫలవంతమైనదనే చెప్పాలి. వచ్చే రెండేళ్ళలో ఏఐ, డీప్టెక్ పెట్టుబడి కింద 200 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రిలయన్స్ద, అదానీ వంటి దేశీయ కంపెనీలతోపాటు, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. మన ప్రభుత్వ పెట్టుబడులు మాత్రం ఓ మోస్తరుగానే ఉన్నాయి. గత ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో అవి అందులో సగానికి తగ్గిపోయాయి. అత్యధునాతన టెక్నాలజీపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉన్న సమయంలో కోత పెట్టడం నివ్వెరపరుస్తోంది. ఇది ప్రభుత్వపరంగా ఖర్చును తగ్గించుకోవాల్సిన సమయం కాదు. పెద్ద టెక్ కంపెనీల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లు వస్తే రావచ్చు. ఏఐ ఇండియా మిషన్ వంటి విజయ గాథల వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి కూడా నిధుల మద్దతు అవసరం. అదే సమయంలో, ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపుదలకు పెట్టుబడులు అత్యావశ్యకమని దీర్ఘకాలిక దార్శనికత సూచిస్తోంది. ప్రాథమిక పాఠశాలల మౌలిక వసతులను గణనీయంగా మెరుగుపరచి తీరాలి. అప్పుడు మాత్రమే ఏఐతో రాగల సమస్యలు, ప్రమాదాలను తదుపరి తరం సమర్థంగా ఎదుర్కోగలదు. సుష్మా రామచంద్రన్వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ -
ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!
ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.కైట్లిన్ కలినోవ్స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్వర్క్లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.కైలిన్ కలినోవ్స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!కలినోవ్స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది. -
ఏఐ ఆఫీసర్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్–కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్మానవ శ్రమను భర్తీ చేయలేదుకొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 1980ల్లో స్ప్రెడ్షీట్స్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్కీపింగ్ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. ఏఐ నిపుణుల కొరత.. మ్యాన్పవర్ గ్రూప్ నిర్వహించిన గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ సర్వే ప్రకారం.. భారత్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్–4లో భారత్ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. ఏఐ లిటరసీ, ఏఐ మోడల్ డెవలప్మెంట్ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో.. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రిసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలంటే.. ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్ స్థాయి ’చీఫ్ ఏఐ ఆఫీసర్స్’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్ పెరగనుంది. వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్ అనలిస్ట్ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, స్మార్ట్ గ్రిడ్ అనలిస్ట్ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్ టూల్స్ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది. -
‘కోడ్ అదిరింది.. లాజిక్ అడగ్గానే ఫ్యూజులు అవుట్’
సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తోంది. సంక్లిష్టమైన కోడింగ్ను నిమిషాల్లో పూర్తి చేస్తూ, డెవలపర్ల పనిని మరింత సులభతరం చేస్తోంది. అయితే ఇదే ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను రాసిన (ఏఐ సాయంతో) కోడ్ను వివరించలేక తోటి ఉద్యోగుల ముందు అభాసుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డెవలపర్లు తాము రాసిన కోడ్ను రివ్యూ కోసం ‘పుల్ రిక్వెస్ట్’ రూపంలో సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన డెవలపర్ ఒక ఫంక్షన్కు సంబంధించిన కోడ్ను తన టీమ్ లీడర్కు పంపాడు. ఆ కోడ్ అద్భుతంగా పని చేస్తోంది. ఎటువంటి ఎర్రర్స్ లేవు. అయితే ఆ కోడ్ వెనుక ఉన్న లాజిక్ను వివరించాల్సిందిగా సీనియర్ ఎడిటర్ కోరడంతో అసలు విషయం బయటపడింది. ఆ డెవలపర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరకు తల దించుకుని తాను ఆ కోడ్ను 'క్లాడ్' (Claude) అనే ఏఐ టూల్ నుంచి నేరుగా కాపీ-పేస్ట్ చేశానని తెలిపాడు.ఈ ఉదంతాన్ని సదరు టీమ్ లీడర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. ‘అతనికి కోడింగ్ రాదని కాదు.. కానీ తాను స్వయంగా రాయకపోవడం వల్ల అందులోని లాజిక్ను విశ్లేషించలేకపోయాడు. ఏఐ ఇచ్చింది.. పంపేశాడు.. అంతే!’ అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ పుల్ రిక్వెస్టుల్లో ఏఐ ప్రమేయం ఉంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్టాక్ ఓవర్ఫ్లో వంటి వెబ్సైట్ల నుంచి గతంలో కోడ్ తీసుకునేవారని, కానీ అప్పట్లో కనీసం ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని సీనియర్లు గుర్తుచేస్తున్నారు.ఇప్పుడు ఏఐ టూల్స్ నేరుగా పరిష్కారాన్ని అందిస్తుండటంతో, యువ డెవలపర్లు మౌలిక సూత్రాలను (Fundamentals) విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోడ్ పని చేస్తే చాలు, అది ఎలా ఉన్నదనేది ముఖ్యం కాదు అనే ధోరణి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్లో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐని ఒక సహాయకారిగా చూడాలే తప్ప, అది ఇచ్చే సమాచారాన్ని కళ్లు మూసుకుని వాడటం వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ -
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్లను (కమాండ్స్ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు. -
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్ డిజిటల్ విధులను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్..ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్సైకిల్ మెకానిక్లు, లైఫ్గార్డ్లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్స్లాంటి మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది. -
ఎవుసానికి ఏఐ ఊపు!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్ ఫోకస్...కార్బన్ డేటాకు ఏఐ సొబగుఆర్మ్స్4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయ్యింగ్– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్ క్రెడిట్లు’ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్పార్టీ వెరిఫికేషన్ తర్వాత కార్బన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది. మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్– ఎం.ఆర్.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్ 4 ఏఐ’ అనే స్టార్టప్ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్ ఎంఆర్వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్తో కూడిన ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. ఆర్మ్స్ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగృతి దబస్ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.ఏఐ ఆధారిత డిజిటల్ బిడ్డింగ్అ΄్జావో ఆగ్రోటెక్... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్ బిడ్డింగ్ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్ ΄్లాట్ఫామ్లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది. ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది. ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. డిజిటల్ ఓపెన్–మార్కెట్ ట్రేడింగ్ ΄్లాట్ఫామ్ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్ బిడ్డింగ్ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరాఖ్ ΄్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ డిజిటల్ ట్రేడింగ్ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్ ట్రేడ్లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. గుజరాత్ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్ క్వాలిటీ అసెస్మెంట్ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్చాట్’డిజిటల్ గ్రీన్ ట్రస్ట్.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్ఫామ్ ‘ఫార్మర్చాట్’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్లోడ్ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్ మెసేజ్ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్చాట్’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్చాట్’ డిజిటల్ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ఇండియా సీఈఓ నిధి భాసిన్ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్చాట్ జెనెరిక్ ఏఐ అవుట్పుట్స్పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్చాట్ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026 -
ఏఐతో మరిన్ని అవకాశాలు
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. -
ట్రంప్ vs ఒబామా: AI చెప్పిన జాతకం.. అమెరికాకి పట్టిన గ్రహణం!
హాయ్ ఫ్రెండ్స్... లోకంలో వింతలు విశేషాలు అయిపోయాయి, ఇప్పుడు విడ్డూరాలు మొదలయ్యాయి. అసలే అమెరికా ఎన్నికలు అంటేనే ఒక పెద్ద జాతర. అక్కడ ఎవరు గెలిచినా మనకేంటి అనుకుంటాం కానీ, అక్కడ తుమ్మితే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ ముక్కు తుడుచుకోవాలి. అయితే తాజాగా మన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గారికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. "ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా తలపడితే ఎవరు గెలుస్తారు?" అని ఎవరో అడిగితే, మన AI గారు కూర్చుని లెక్కలు కట్టేసి ఒక రిజల్ట్ ఇచ్చేసారు. అంటే.. ప్రస్తుతం ఉన్న బైడెన్ గారిని సైడ్ చేసేసి, రిటైర్ అయిపోయిన ఒబామా గారిని మళ్ళీ గోదాలోకి లాగారన్నమాట. ఇది ఎలా ఉందంటే.. రిటైర్ అయిపోయిన సచిన్ టెండూల్కర్ ని పిలిచి, ఇప్పుడున్న బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు కొట్టమన్నట్టు ఉంది!సరే AI విశ్లేషణ ప్రకారం.. ట్రంప్ గారి బలం ఆయన 'బేస్'. అంటే ఆయన ఏం మాట్లాడినా, అది అబద్ధమా, నిజమా అని చూడకుండా జేజేలు కొట్టే ఒక బ్యాచ్. ట్రంప్ మామ స్టైలే వేరు.. "అమెరికా ఫస్ట్" అంటారు, కానీ ఆయన కోపం వస్తే "ట్విట్టర్ ఫస్ట్" అంటారు .ఇక ఒబామా గారి విషయానికి వస్తే.. ఆయన స్పీచ్ ఇస్తుంటే అమెరికా కాదు కదా, పక్కన ఉన్న కెనడా వాళ్ళు కూడా మైమరచిపోతారు. ఆయనకి 'యూత్' లో క్రేజ్ ఎక్కువని AI చెబుతోంది. కానీ పాపం AI కి ఒక విషయం తెలియదు.. ఒబామా గారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ, నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీలు తీసుకుంటూ చిల్ అవుతున్నారు. ఆయన్ని మళ్ళీ వైట్ హౌస్ పిలిచి.. ఆ ఫైళ్లు, ఆ గొడవలు చూడమంటే ఆయన ఒప్పుకుంటారా? ఇంకా AI ఏం చెబుతుందంటే, "ఎకానమీ" విషయంలో ట్రంప్ వైపు మొగ్గు ఉందట. అంటే వ్యాపారవేత్త కదా, పైసల లెక్కలు బాగా తెలుసని AI ఫీలింగ్. కానీ అదే AI "సోషల్ హార్మనీ" (సామాజిక సామరస్యం) విషయంలో ఒబామాకి ఓటు వేసింది. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కావాలంటే ట్రంప్ ని నమ్ముకోండి, ప్రశాంతత కావాలంటే ఒబామాని నమ్ముకోండి అని! కానీ అమెరికా జనాలకి రెండు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు "మాకు ఆ ఇద్దరూ వద్దు.. మాకు కనీసం సరిగ్గా నడవగలిగే, పేర్లు గుర్తుపెట్టుకునే అభ్యర్థి ఉంటే చాలు" అని మొత్తుకుంటున్నారు.ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ పోటీ పడితే సోషల్ మీడియా ఎలా ఉంటుందో ఊహించండి! ట్రంప్ గారు ఒబామాని "స్లీపీ బరాక్" అనో లేక ఇంకేదో వింత పేరు పెట్టి పిలుస్తారు. ఒబామా గారు తనదైన శైలిలో ఒక పెద్ద ఇంగ్లీష్ డిక్షనరీ తిరగేసి కౌంటర్లు ఇస్తారు.మధ్యలో ఎలాన్ మస్క్ వచ్చి.. "నేను ఎవరికీ ఓటు వేయను, నేను అంగారక గ్రహానికి వెళ్ళిపోతున్నా" అని ట్వీట్ చేస్తారు. AI కి ఉన్న ఒకే ఒక సౌలభ్యం ఏంటంటే.. అది మనుషుల ఎమోషన్స్ ని లెక్కించదు. కేవలం డేటా చూస్తుంది. కానీ అమెరికా ఎన్నికల్లో డేటా కంటే 'డ్రామా' ఎక్కువ పని చేస్తుంది. ఆ విషయం పాపం ఆ AI కి ఎవరు చెప్తారు?ఈ కథనంలో అందరూ మర్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు.. ఆయనే జో బైడెన్! పాపం, ఆయన మాజీ ప్రెసిడెంట్. కానీ AI మాత్రం ఆయన పేరు కూడా ఎత్తకుండా ఒబామాని తెచ్చి కూర్చోబెట్టింది. ఇది ఎలా ఉందంటే.. ఇంట్లో పెళ్లి కొడుకు రెడీగా ఉంటే, పాత పెళ్లి కొడుకు ఫోటో చూసి "ఈయనైతే బాగుండు" అని మురిసిపోయినట్టు ఉంది.AI ప్రిడిక్షన్ ప్రకారం.. ఈ ఊహాజనిత పోరులో ఒబామాకి కొంచెం ఎడ్జ్ ఉందట. ఎందుకంటే ఆయనకి నెగటివ్ రేటింగ్ తక్కువంట. ట్రంప్ గారికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, "ఈయన వద్దు బాబోయ్" అనే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో, ఫైనల్ గా తేలిందేంటంటే.. AI దృష్టిలో పాత కాలపు యుద్ధాలే బాగున్నాయి. ఉన్న వాళ్ళతో ఎలాగో వేగలేకపోతున్నాం, పోనీ లేని వాళ్ళని తెచ్చుకుందాం అనే రేంజ్ కి అమెరికా పాలిటిక్స్ వెళ్ళిపోయాయి. అసలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే.. ఈ AI చేసే విశ్లేషణలు మాత్రం మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మరి మీరేమంటారు? ట్రంప్ కావాలా? ఒబామా కావాలా? లేక మన ఊరి సర్పంచ్ నయమా? కామెంట్ చేయండి! -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు. -
వాహనదారులకు గుడ్న్యూస్.. సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగానే రద్దీ అంచనా..ఈ సందర్భంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్కు చెందిన 'ట్రాన్స్కాలిటీ' సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రాజధానిలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చని వివరించారు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా నియంత్రించి వాహనాల రాకపోకలను సుగమం చేయవచ్చని తెలిపారు.రోడ్డు భద్రతే లక్ష్యం..నగరంలో రాబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీలను వినియోగించడం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డీసీపీలు టి. అన్నపూర్ణ, ఐ. రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ మరియు ఆస్కి/ ASCI ప్రతినిధులు పాల్గొన్నారు.🚦 Cyberabad Goes High-Tech: AI-Driven Traffic Management! 🤖Cyberabad Police is exploring a world-class, AI-based predictive traffic management model to tackle congestion and enhance road safety.@CPCYBERABAD Dr. M. Ramesh met with Dr. Lucas Ambul (CEO, Transcality, Zurich)… pic.twitter.com/dvj49vdvsS— Cyberabad Police (@cyberabadpolice) February 25, 2026 -
ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI
-
స్వదేశీ విశ్వరూపం.. సర్వం విజయం
దిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సాక్షిగా ‘సర్వం ఏఐ’ సగర్వంగా చెప్పకనే చెప్పింది. ‘వరల్డ్–క్లాస్ హార్డ్ టెక్నాలజీ ఇండియాలో కూడా సాధ్యమే’ అని! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ విజయం ఆ కంపెనీ వ్యవస్థాపకుల సమర్థతకు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ‘మన దేశం–మన కంపెనీ’ అని కలలు కనే ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్ల విజయం. ‘మేధోవలస’కు చేయి అడ్డు పెట్టి...‘ఎక్కడో ఎందుకు? మన దేశంలోనే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చే విజయం....‘పీహెచ్డీలు ముఖ్యం కాదు. కంపెనీకి సరిగ్గా అవసరమైన వారే ముఖ్యం’ అంటూ ఎంటర్ప్రెన్యూర్లుగా స్వదేశంలో ప్రయాణం మొదలుపెట్టిన వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్లు ‘సర్వం ఏఐ’తో సత్తా చాటారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) నుంచి నిన్నా మొన్నటి ‘సర్వం కేజ్’ స్మార్ట్గ్లాసెస్ వరకు, ఏ.ఐ మోడల్స్ శిక్షణకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం వరకు... సర్వం సాంకేతికమయం!సర్వం సక్సెస్ మంత్రాఒక స్టార్టప్ సక్సెస్ కావడానికి, సూపర్ సక్సెస్ కావడానికి ఏం ఉండాలి? ‘సర్వం ఏఐ’ ఫౌండర్లలో ఒకరైన వివేక్ రాఘవన్ మాటల్లో చె΄్పాలంటే ‘ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి’ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ మోడల్స్ను నిర్మించాలనే లక్ష్యంతో బయలుదేరింది సర్వం. ‘మా విజయం ఎలా ఉండాలంటే ఇతర డెవలపర్లు, స్టార్టప్లు కూడా యస్...మేము కూడా ప్రపంచంతో ΄ోటీ పడుతూ వరల్డ్–క్లాస్ మోడల్స్ను నిర్మించగలం అనే నమ్మకాన్ని పాదుకొల్పేంతగా’ అన్నారు వివేక్. ‘వీరి ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంది. సాధించగలరా?’ అని కొందరికి సందేహం వచ్చింది.పగటి కలలకే పరిమితమై ఉంటే వారి కలలు కలలుగానే ఉండేవి. అయితే వారు రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు.ఇది యువత విజయంతొలి అడుగులు వేస్తున్నప్పుడు ‘సర్వం’ టీమ్లో ఉన్నది సాంకేతిక ఉద్దండులు కాదు. నవ యువకులు! ‘వీరితో విజయం సాధ్యమా?’ అని కూడా కొందరికి సందేహం వచ్చింది. ‘కచ్చితంగా సాధ్యమే’ అని నిరూపించింది సర్వం. అందుకే...‘‘మా సంస్థ విజయాన్ని భారతదేశ యువత విజయంగా కూడా నేను భావిస్తున్నాను’ అంటారు వివేక్. ఎంటర్ప్రెన్యూర్గా సిలికాన్ వ్యాలీలో గెలుపు జెండా ఎగరేసిన తరువాత స్వదేశీ బాట పట్టారు. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి బయలుదేరారు.పీహెచ్డీ... పెద్ద విషయం కాదు!‘మీ ఇద్దరికీ పీహెచ్డీ ఉంది. సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లు పీహెచ్డీ చేసిన డీప్–టెక్ వ్యవస్థాపకులు మన దేశంలో పెద్దగా కనిపించరు’ అనే ప్రశ్నకు ‘నిజమే!’ అని కాలర్ ఎగరేయలేదు వివేక్. ‘పీహెచ్డీ అనేది పెద్ద విషయం కాదు. సంస్థకు పనికొచ్చే సామర్థ్యమే ముఖ్యం. పీహెచ్డీ వరకు ఎందుకు? హైస్కూల్ స్థాయిలో కూడా అద్భుత ప్రతిభæ చూపుతున్న విద్యార్థులను మనం చూస్తూనే ఉన్నాం. నాకు పీహెచ్డీ ఉన్నప్పటికీ దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. పీహెచ్డీలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. కంపెనీకి అవసరమైన సరిౖయెన వ్యక్తిని ఎంచుకోవడమే ముఖ్యం’ అంటారు వివేక్.వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్లు వ్యవస్థాపనలో బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ 2023లో ప్రారంభమైంది. భారతీయ భాషలలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేసింది. స్పీచ్–టు–టెక్ట్స్, విజన్–లాంగ్వేజ్ మోడల్స్లాంటి మల్టీ మోడల్స్ను, సిస్టమ్స్ను కూడా కంపెనీ డెవలప్ చేసింది. ‘సర్వం విజన్’ పేరుతో విజన్–లాంగ్వేజ్ మోడల్ని పరిచయం చేసింది.గత సంవత్సరం సర్వం ఏఐ ‘ఇండియా ఏఐ మిషన్’కు ఎంపికైంది. డొమెస్టిక్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్ డెవలప్మెంట్కు ఈ మిషన్ స΄ోర్ట్ చేస్తుంది. ‘ఏఐ ఫర్ భారత్’తో పాటు లాంగ్వేజ్ డాటాబేస్, స్పీచ్ రిసెర్చ్కు సంబంధించి విద్యాసంస్థలతో కలిసి పనిచేసింది సర్వం. ఇద్దరూ ఇద్దరేవివేక్ రాఘవన్ ఐఐటీ–దిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఐఐటీ–బాంబే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రత్యూష్ కుమార్కు కంప్యూటర్ సైన్స్ పరిశోధనకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. జ్యూరిచ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఇద్దరు ప్రతిభావంతులు ఒక దగ్గర చేరితే అద్భుతాలు జరుగుతాయనేది నిజమే అయినా, ఆ ప్రతిభావంతులు తమలాంటి వారి కోసం అన్వేషించి, తమ జట్టులో చేర్చుకోవడమే అసలుసిసలు అద్భుతం.రిస్క్ తీసుకోక΄ోవడమే పెద్ద రిస్క్!సిలికాన్ వ్యాలీ తన ఆలోచన తీరును మార్చింది అంటారు వివేక్ రాఘవన్. ‘మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే కచ్చితంగా రిస్క్ తీసుకోవాలి’ అనేది సిలికాన్ వ్యాలీ చెప్పిన పాఠం. ‘ఇతరత్రా రిస్క్లతో ΄ోల్చితే టెక్నాలజీ రిస్క్ అనేది భిన్నమైది’ అనే విషయం తెలిసినా ‘సై’ అంటూ స్వదేశీ బాట పట్టారు వివేక్ రాఘవన్.నెట్ అవసరం లేదండీ!‘ఎడ్జ్’ అనే కొత్త ఆన్–డివైజ్ ఏఐ మోడల్ను ఆవిష్కరించింది సర్వం ఏఐ. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా నేరుగా స్మార్ట్ఫోన్, లాప్టాప్లలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. స్పీచ్ రికగ్నిషన్, ట్రాన్స్లేషన్, టెక్స్›్ట–టు–స్పీచ్లాంటి పనులెన్నో చేస్తుంది. డివైజ్లోనే డాటా ప్రాసెస్ చేయబడినందున యూజర్లు సమాచారాన్ని క్లౌడ్కు పంపాల్సిన అవసరం లేదు. ‘ఈ మోడల్ వేగం, గోప్యత, విశ్వసనీయతపై దృష్టి సారిస్తుందని, అదే సమయంలో ప్రధాన భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది.ఇండస్ స్వదేశీ స్టార్టప్ సర్వం ఏఐ ‘ఇండస్’ అనే కొత్త ఏఐ చాట్బాట్ యాప్ను తీసుకువచ్చింది. ‘భారతీయ వినియోగదారుల కోసం భారత్లో రూపొందించిన యాప్ ఇది’ అని ప్రకటించింది కంపెనీ. చాట్జీపీటీ, జెమినివంటి ప్రసిద్ధ చాట్బాట్ల మాదిరిగానే ‘ఇండస్’లో ఫీచర్లు ఉన్నాయి. యూజర్లు వాయిస్ కమాండ్లు ఇవ్వవచ్చు. ప్రశ్నలను టైప్ చేయడానికి బదులుగా మాట్లాడవచ్చు. ఏఐ వెబ్లో శోధించవచ్చు. స్పష్టమైన సమాధానాలను తెలుసుకోవచ్చు, లోతైన పరిశోధన చేయవచ్చు. నేరుగా యాప్లోనే డాక్యుమెంట్లు రాయవచ్చు. ఇమేజ్లు, పీడీఎఫ్లు, ఫైళ్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లోని మరో ప్రత్యేకత భాషా సౌలభ్యం. -
ఏఐకి భయపడం
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ)తో నెలకొన్న రిస్కుల గురించి తమ సంస్థ భయపడబోదని దేశీ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎండీ కె. కృతివాసన్ స్పష్టం చేశారు. కంపెనీ ఆదాయం తగ్గినా ఫర్వాలేదు కానీ ఏఐ సాధనాలను వినియోగించుకోవడాన్ని నేర్చుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొత్తం 6 లక్షల మంది ఉద్యోగుల్లో ప్రతీ ఒక్కరు కృత్రిమ మేధలో నిష్ణాతులుగా మారేలా ప్రయతి్నస్తున్నట్లు వివరించారు. ఇదే క్రమంలో కొంత భాగం ఆదాయాన్ని కోల్పోయినా, వివిధ ప్రాజెక్టుల్లో ఏఐని ఉపయోగించే విధానాలను అన్వేషించాలని సిబ్బందికి సూచించినట్లు కృతివాసన్ తెలిపారు. యువ సిబ్బందితో పోలిస్తే కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్ని రూపొందించడంలో సీనియర్ ఉద్యోగులు కాస్త నెమ్మదిగా ఉంటున్న విషయాన్ని గమనించినట్లు వార్షిక నాస్కామ్ టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం (ఎన్టీఎల్ఎఫ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. కొత్త ఏఐ నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదని, అందరూ వాటిపై ఆసక్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, నైపుణ్యాలంటే చాట్జీపీటీ లాంటి ప్లాట్ఫాంకి ప్రాంప్్టలు ఇవ్వడం మాత్రమే కాదని, సిబ్బంది శ్రమించి ఏఐ సాధనాలతో కొత్త సొల్యూషన్స్ను రూపొందిస్తేనే ప్రయోజనకరమని కృతివాసన్ చెప్పారు. ఏఐ ప్రస్తుతం బోర్డు స్థాయి సమావేశాల్లోను ప్రధాన ఎజెండాగా ఉంటోందన్నారు. కొత్త టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని, కానీ, అలాంటి సాంకేతికతలతో తమ కస్టమర్లకు ఏవిధంగా ప్రయోజనం చేకూర్చగలం అనే అంశంపై కూడా తాము ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. -
ఏఐ: సానుకూలం సగం.. ఆందోళన అధికం
వాషింగ్టన్: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో నేటి యువత ముందుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంలో అమెరికాలోని టీనేజర్లు ఆసక్తికర ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో దాదాపు 64 శాతం మంది చాట్జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ చాట్బాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు.కేవలం వినోదం కోసమే కాకుండా, సమాచార సేకరణ, పాఠశాల హోంవర్క్, కంటెంట్ను క్లుప్తీకరించడం వంటి పనుల కోసం యువత ఏఐపై ఆధారపడుతున్నారు. వచ్చే రెండు దశాబ్దాలలో ఏఐ తమ వ్యక్తిగత జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని 36 శాతం మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చదువులో ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది టీనేజర్లు ఏఐ వల్ల విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి క్షీణించే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు.సామాజికంగా చూస్తే 31 శాతం మంది ఏఐ వల్ల మేలు జరుగుతుందని భావిస్తుండగా, 26 శాతం మంది ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని అంటున్నారు.చదువుల విషయంలో ఏఐ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. సుమారు 51 శాతం మంది విద్యార్థులు తమ అకడమిక్ అవసరాల కోసం చాట్బాట్ల సహాయం తీసుకుంటున్నారు. గణిత సమస్యల పరిష్కారం నుంచి వ్యాస రచన వరకు ఏఐ వినియోగం విస్తరించింది. అయితే, ఏఐను కేవలం సహాయకారిగా మాత్రమే కాకుండా, పరీక్షల్లో కాపీ కొట్టడానికి (Cheating) వినియోగిస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.59 శాతం మంది విద్యార్థులు తమ తోటివారు ఏఐ సహాయంతో మోసాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల అవసరాలు ఎలా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మాత్రం భిన్నంగా ఉంది. సమాచార సేకరణకు ఏఐను అనుమతించే 80 శాతం మంది తల్లిదండ్రులు, వ్యక్తిగత విషయాల్లో లేదా భావోద్వేగ మద్దతు కోసం ఏఐపై ఆధారపడటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇది కూడా చదవండి: కేరళ ‘కేరళం’.. బెంగాల్ ‘బంగో’ అయ్యేదెన్నడు? -
సవాళ్లున్నా సాఫ్ట్వేర్దే హవా
ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్డ్ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు. నివేదిక ప్రకారం.. ⇒ ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్ డాలర్ల నుంచి 149 బిలియన్ డాలర్లకు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రెవెన్యూ 55 బిలియన్ డాలర్ల నుంచి 59 బిలియన్ డాలర్లకు, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ⇒ ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఆదాయాలు 59 బిలియన్ డాలర్ల నుంచి 63 బిలియన్ డాలర్లకు, హార్డ్వేర్ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్ డాలర్ల నుంచి 21 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి. ⇒ గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం. ⇒ విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ⇒ చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. -
ఏఐతో ఐటీకి ఇబ్బందే...
ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్ రాకతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్ విషయంలో ఆంథ్రోపిక్ క్లాడ్ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడింగ్ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు. ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్ చెప్పారు. క్లయింట్లకు భారీగా బిల్లింగ్ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు. -
ఏఐ విప్లవం: భారత్ ముందున్న అతిపెద్ద సవాల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో అగ్రగామిగా నిలుస్తోంది. గ్లోబల్ జాబ్ పోర్టల్ ‘ఇన్డీడ్’ (Indeed) 12 దేశాల్లో నిర్వహించిన తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయ యజమానులు, అభ్యర్థులు ఏఐ వినియోగంపై అత్యంత సానుకూలత కనబరుస్తున్నారు.బ్రిటన్ వంటి దేశాల్లో 60 శాతానికి పైగా అభ్యర్థులు ఉద్యోగ వేటలో ఏఐ సాధనాలను వాడేందుకు విముఖత చూపుతుండగా, భారత్లో కేవలం 5 శాతం మంది యజమానులు, 8 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఈ సాంకేతికతకు దూరంగా ఉండటం గమనార్హం. గత దశాబ్ద కాలంలో భారత్ మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ విద్య వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా స్వీకరించడంతో ఏఐ అనేది ఒక అడ్డంకిలా కాకుండా అవకాశాలను మెరుగుపరిచే ఒక సాధనంగా భారతీయులు భావిస్తున్నారు.నియామక ప్రక్రియలో ఏఐ ప్రవేశం కేవలం ఒక మార్పు మాత్రమే కాదని, అది అపారమైన వేగాన్ని ఇస్తుందని భారత్లోని పలు సంస్థలు నమ్ముతున్నాయి. వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులను వడపోసి, సరైన అభ్యర్థులను గుర్తించడంలో ఏఐ ఒక అద్భుతమైన ‘ఎనేబులర్’గా పనిచేస్తోంది. అయితే ఈ సాంకేతికత స్క్రీనింగ్, మ్యాచింగ్కు మాత్రమే పరిమితం కావాలని, తుది నిర్ణయం మాత్రం మానవ మేధస్సుతోనే జరగాలనే ఒక అప్రకటిత ఒప్పందం యజమానులకు, అభ్యర్థులకు మధ్య కొనసాగుతోంది.మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ పునీత్ చందోక్ అంచనా వేసినట్లుగా, రాబోయే మూడేళ్లలో ఏఐ ఉద్యోగాలను హరించడం కంటే సృష్టించడమే ఎక్కువగా ఉంటుందనే ధీమా భారత మార్కెట్లో కనిపిస్తోంది. భారీ జనాభా, తీవ్రమైన పోటీ ఉన్న భారతదేశంలో నియామకాల్లో జరిగే గందరగోళాన్ని తగ్గించడానికి ఆటోమేషన్ ఒక ఒక అనివార్యమైన అవసరంగా మారింది. ఆటోమేటెడ్ వ్యవస్థలు కేవలం 'కీ వర్డ్స్' ఆధారంగా ప్రొఫైల్స్ ఎంపిక చేస్తున్నాయని, అభ్యర్థిలోని ప్రతిభను, అనుభవాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.ఏఐ ఏజెంట్స్ అల్గారిథమ్స్ నమూనాలను మాత్రమే గుర్తించగలవు కానీ, ఒక వ్యక్తిలోని పట్టుదలను, సృజనాత్మకతను అంచనా వేయలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఏఐని స్వీకరించడంలో ముందున్నప్పటికీ, నియామకాల్లో పారదర్శకత, వివక్ష లేని అల్గారిథమ్స్, పటిష్టమైన పర్యవేక్షణ మార్గదర్శకాలు అత్యవసమని చెబుతున్నారు. సాంకేతికతను వాడుకోవడమే కాకుండా, దాన్ని ఎంత నైతికంగా అమలు చేస్తున్నామనేదే భారత్ ముందున్న అసలైన సవాలని నిపుణులు అంటున్నారు. నియామక ప్రక్రియలో మానవత్వపు విలువలను కోల్పోకుండా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే భారత్ ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: అమెరికా: మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన జనజీవనం -
దమ్ముంది.. దన్ను కావాలి
ఏఐ సదస్సు చూపిన ‘ఇంపాక్ట్’ఢిల్లీలో ఐదు రోజుల ఐఏ ఇంపాక్ట్ సదస్సు ఇటీవలే ముగిసింది. ఇండియా ఈ సదస్సును మొదటిసారి నిర్వహించింది. ప్రపంచ దేశాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలపై అంతా దృష్టి పెట్టారు. ఇండియాకైతే ఇది ఒక కీలకమైన సందర్భం. మన ఏఐ వ్యవస్థలో ఉన్న బలాలు, పూరించుకోవలసిన లోట్లను ఈ సదస్సు స్పష్టం చేసింది.నిపుణుల సంఖ్యలో రెండో స్థానంఏఐ రంగంలో మెరికలు ఉన్న దేశంగా ఇండియా పేరు పొందింది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉంది. 2024 ‘టార్టాయిస్ గ్లోబల్ ఏఐ ఇండెక్స్’ ప్రకారం, ఏఐ సామర్థ్యంలో ఇండియా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. ఏఐ నిపుణుల సంఖ్యలో మాత్రం 2వ స్థానంలో నిలిచింది.సౌకర్యాలలో 68వ స్థానంఏఐ ఆపరేషన్స్లో ఇండియా 3వ స్థానంతో మంచి ప్రతిభ కనబరిచింది. అయితే కంప్యూటింగ్ పవర్, ఇతర సౌకర్యాల విషయంలో 68వ స్థానంలో ఉంది. ఈ కారణంగా అమెరికా, చైనాతో పోటీ పడటం భారత్కు కష్టం కావచ్చన్న అభిప్రాయం ఏఐ పరిశ్రమంలో వ్యక్తం అవుతోంది.ఉన్నది కొన్నే సూపర్ కంప్యూటర్లుప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన 500 సూపర్ కంప్యూటర్లలో ఇండియా వాటా కేవలం 1 శాతం మాత్రమే. అంటే, ఏఐకి కావలసిన కంప్యూటింగ్ సామర్థ్యం మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అమెరికా ఈ విషయంలో చాలా ముందుంది. ప్రపంచంలోని మొత్తం సూపర్ కంప్యూటర్లలో 35 శాతం సిస్టమ్లు, దాదాపు 48 శాతం కంప్యూటింగ్ సామర్థ్యం అమెరికా దగ్గరే ఉంది.ట్రైనింగ్ డేటాలో 3 శాతం వాటాఏఐ ట్రైనింగ్ డేటా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులలో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే. అంటే, మన దేశానికి చాలా తక్కువ పెట్టుబడులు అందుతున్నాయి. ఈ విషయంలో అమెరికా 56 శాతంతో అందరికంటే ముందుంది. ఆ తర్వాత చైనా 17 శాతంతో, ఐరోపా సమాఖ్య దేశాలు 15 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రపంచాన్ని శాసించగలమా?మన దగ్గర అద్భుతమైన తెలివితేటలు కలిగిన నిపుణులు ఉన్నారు. కానీ, ఆ తెలివితేటలకు తగ్గట్టుగా శక్తివంతమైన కంప్యూటర్లు, భారీ పెట్టుబడులు తోడవాల్సి ఉంది. అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే, కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యం మాత్రమే సరిపోదు; సొంతంగా డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లను పెంచుకోవాలి. అప్పుడే ఇండియా ఏఐ ప్రపంచాన్ని శాసించ గలుగుతుంది.⇒ హెచ్.పి.సి. సిస్టమ్ : హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ (యంత్ర సామర్థ్యం)⇒ హెచ్.పి.సి. కెపాసిటీ : హై పెర్ఫార్మింగ్ కెపాసిటీ (శక్తి సామర్థ్యం)⇒ హెచ్.ఐ.సి.: హై ఇన్కం కంట్రీస్; యు.ఎం.ఐ.సి.: అప్పర్ మిడిల్ ఇన్కం కంట్రీస్⇒ ఎల్.ఎం.ఐ. సి. : లోయర్–మిడిల్ ఇన్కం కంట్రీస్ -
ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్, మెడికల్ వంటి కీలకమైన కోచింగ్నూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేయబోతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బిజినెస్ కన్సల్టెన్సీ ఇన్ఫీనియం సంస్థ ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల మార్కెట్ రీసెర్చ్ నివేదికను వెల్లడించింది. మారుతున్న ట్రెండ్కు అనుకూలంగా కోచింగ్ విధానాలను ఏఐతో ఆధునీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థల తోడ్పాటును ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు ఇప్పటికే తీసుకున్నాయి. నీట్, జేఈఈ రాసే విద్యార్థుల్లో 80 శాతం మంది కోచింగ్పైనే ఆధార పడుతున్నారు. 2022 వరకూ కోచింగ్ కేంద్రాల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రూ.70 వేల కోట్లకు చేరింది. 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే, ఏఐ ఆధారిత మాడ్యూల్స్ను జోడించడం వల్ల ఇది 2028 నాటికి 2.5 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ కేంద్రాలు మార్కెట్లో పబ్లిసిటీకి ఏటా రూ.150 కోట్లకుపైగానే ఖర్చు పెడుతున్నాయి. ఈ లాంగ్వేజ్ కీలకం పైథాన్ లాంగ్వేజ్ ఆధారంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. నీట్, జేఈఈ వంటి వాటిల్లో అనలైటిక్స్, స్టూడెంట్ ప్రొఫైలింగ్, అనుమానాల నివృత్తి చేసే బాట్స్ మొత్తం ఏఐతోనే పనిచేస్తాయి. ఇవి ప్రశ్నల్లో ఉన్న కఠినత్వం, వాటి పరిష్కారం, మాక్ టెస్టుల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత స్టడీ ప్లాన్ రూపొందిస్తాయి. లైవ్ డాష్బోర్డ్, ఏఐ చాట్బాట్లను రూపొందిస్తున్నారు. ర్యాంక్ ప్రిడిక్షన్ ద్వారా సీటు ఎక్కడ వస్తుందనే కౌన్సెలింగ్ ప్లానింగ్ కూడా ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్, అటెన్షన్ మాడ్యూల్స్ ప్రిపరేషన్ స్థాయిని పెంచేలా ప్రొగ్రామ్ చేస్తున్నారు. కెమికల్ ఎడ్యుకేషన్ పార్శింగ్, ఆర్గానిక్ రియాక్షన్ స్వీకెన్స్ అనాలసిస్ ఏఐ అందిస్తుంది. సింబాలిక్ రీజనింగ్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ లాజిక్, వెక్టార్ అండ్ మ్యాట్రిక్స్ ఇంటర్ప్రిటేషన్ వంటి మ్యాథ్స్ ఆధారిత ప్రోగ్రామింగ్లోనూ ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది. ఒత్తిడి పెరుగుతుందా? తగ్గుతుందా? కోచింగ్ కేంద్రాలు ఏఐ మాడ్యూల్స్ను అనుసరిస్తున్నాయి. అయితే, దీనిపై ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇందుకు అవసరమైన ప్లాట్ఫాం ఏర్పాటు చేయాలి. దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేపోతున్నారు. ఈ దశలో ఏఐ మాడ్యూల్స్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు మానసిక ఒత్తిడి వస్తుందని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్స్కు ఏటా 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. కోచింగ్ కేంద్రాలు ర్యాంకులు సాధించే మెరిట్ విద్యార్థులను విడగొట్టి క్లాసులు నిర్వహిస్తాయి. వీళ్లు 20 శాతమే ఉంటున్నారు. మిగతా వాళ్లను నాణ్యత లేని ఫ్యాకల్టీతో కాలం వెళ్లదీస్తున్నాయి. ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహ్యలు చేసుకుంటే, 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 నాటికి ఇది 13 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. ఈ పరిస్థితికి వెళ్లకుండా ఆన్లైన్ కేంద్రాలపై నియంత్రణ అవసరమని ఐఐటీ–బాంబే అధ్యాపకుడు నీలం త్రివిక్రమ్ సూచించారు. కేంద్ర కమిటీ అధ్యయనం జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ గత ఏడాది కమిటీ వేసింది. కేంద్ర ఉన్నత విద్య కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ను ఇందులో సభ్యులుగా చేర్చింది. కోచింగ్తో పనిలేకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల పబ్లిసిటీ, నాణ్యత ప్రమాణాలను ఈ కమిటీ పరిశీలించాలి. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, స్కూల్ విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇప్పుడు ఏఐ పాత్ర పెరుగుతుండటంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. నిఘా అవసరం... రాష్ట్రానికి మండలి నివేదిక ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై సరైన నియంత్రణ ఉండాలన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయం. ఈ మేరకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గతంలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. అకడమిక్ పాఠాల వల్ల ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారని, ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పాదర్శకంగా అన్పించడం లేదన్నారు. దీనివల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని, కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదని, ఫీజుల భారం పేదవాళ్లను కుంగదీస్తోందని తెలిపారు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వాడకం వల్ల విద్యా ఫలితాలు దెబ్బతింటున్నాయని గుర్తించారు. . తప్పుడు అంచనాలు, ఆర్థిక నష్టాలు, విద్యా అంతరాయాలు పెంచుతున్నాయని తెలిపారు. -
పొట్ట కొడుతున్న ‘ఏఐ’.. ‘రియాలిటీ’ యజమాని కన్నీరు!
ఒట్టావా: కృత్రిమ మేధ (ఏఐ) రాకతో కార్పొరేట్ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉద్యోగులు అవసరమైన పనులను నేడు ‘ఏఐ’ క్షణాల్లో పూర్తి చేస్తోంది. అయితే ఈ సాంకేతిక పరివర్తన ఆర్థిక లాభాలను తెస్తున్నప్పటికీ, తీవ్రమైన మానసిక వేదనను మిగిలుస్తున్నదని కెనడాకు చెందిన ‘ఫౌండర్ రియాలిటీ’ వ్యవస్థాపకుడు జార్జ్ పు పేర్కొన్నారు.తన సంస్థను నిలబెట్టుకోవడానికి 14 మంది ఉన్న బృందాన్ని కేవలం ఐదుగురికి తగ్గించాల్సి రావడం తన వృత్తి జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని జార్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలో టీమ్ సభ్యులను భారీగా తగ్గించి, కొత్త నియామకాలు చేపట్టకుండా ఏఐపైనే ఆధారపడటంతో ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అయితే అది మానవత్వాన్ని మరచిన ఒంటరి ప్రయాణంగా మారిందని చెబుతూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. We went from 14 people to 5 in 2023. Most painful moment of my career.Then we didn't hire again. For two years. Used AI for everything we thought we needed people for.Best financial decision I ever made. Worst emotional experience I've been through.Nobody talks about how…— George Pu (@TheGeorgePu) February 22, 2026వ్యాపార వ్యయాలు పెరిగి, ఆదాయంపై ఒత్తిడి పడుతున్న తరుణంలో సంస్థ మనుగడ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జార్జ్ తెలిపారు. గతంలో మనుషులు అవసరమని భావించిన ప్రతి పనినీ ప్రస్తుతం కృత్రిమ మేధతోనే పూర్తి చేస్తున్నామని, సాంకేతికత మన అంచనాలకు మించి ఫలితాలనిస్తోందని ఆయన వివరించారు. ఈ మార్పు వల్ల కంపెనీ మార్జిన్లు పెరిగినప్పటికీ, తోటి ఉద్యోగులను పంపించివేయడంతో కలిగిన మానసిక క్షోభ ఎవరూ తీర్చలేనిదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘ఇది నా కెరీర్లో అత్యుత్తమ ఆర్థిక నిర్ణయం.. కానీ అత్యంత దారుణమైన భావోద్వేగ అనుభవం’ అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒంటరితనం గురించి ఎవరూ మాట్లాడరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్పై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ పనితీరును (ఔట్పుట్) భర్తీ చేయగలదు కానీ, ఒక సంస్థ నిర్మాణం వెనుక ఉండే మనుషుల ఉద్వేగాలను, వారి శక్తిని భర్తీ చేయలేదని పలువురు అభిప్రాయపడ్డారు. పొదుపు చర్యల పేరుతో ఉద్యోగులను తొలగించడం వల్ల యజమానిపై పనిభారం పెరగడమే కాకుండా, సహోద్యోగులతో ఉండే సంబంధాలు తెగిపోతాయని పలువరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: Mexico: డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం -
ఆ సదస్సు టర్నింగ్ పాయింట్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ సాధించిన విజయాలు చూసి ప్రపంచ దేశాల అధినేతలు ఆశ్చర్యపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును కీలక టర్నింగ్ పాయింట్గా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ శక్తిని ఎలా వినియోగించుకోవాలో దిశా నిర్దేశం చేయడానికి సదస్సు తోడ్పడుతుందని తెలిపారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక వర్గాలు, సీఈఓలు, ఐఏ స్టార్టప్ రంగం ప్రతినిధులు, నవీన ఆవిష్కర్తలు హాజరయ్యారని గుర్తుచేశారు. ‘‘సదస్సులో ప్రధానంగా రెండు అంశాలు దేశాధినేతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వారు అమూల్ పాల కేంద్రాన్ని సందర్శించారు. రైతులు తమ పాడి పశువులను ఏఐ టెక్నాలజీతో నిరంతరం గమనించే తీరు పరిశీలించామన్నా రు. మన ప్రాచీన గ్రంథాలు, విజ్ఞానం, రాతప్రతులను ఏఐ టెక్నాలజీతో పరిరక్షిస్తున్న తీరు, వాటిని నేటి తరానికి అందిస్తున్న వైనాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. సదస్సులో మూడు ‘మేడిన్ ఇండియా’ ఏఐ మోడల్స్ విడుదల చేశాం’’ అని వివరించారు. డిజిటల్ మోసాలతో జాగ్రత్త ఆన్లైన్ ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ‘‘ప్రధానంగా వృద్ధులు ఈ మోసాల బారిన పడుతుండటం ఆందోళనకరం. బ్యాంకుల కేవైసీ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి’’ అన్నారు. టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో విదేశాల తరఫున భారతీయ మూలాలున్న ఆటగాళ్లు చాలామంది ఆడుతుండటం పట్ల ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ‘‘భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ మూలాలు మర్చిపోరు. భారతీయతకు ఇదొక హాల్మార్క్. తాము నివసిస్తున్న దేశాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. బానిసత్వ గుర్తులను శరవేగంగా వదిలించుకుంటున్నాం. భారతీయ సంస్కృతిని సూచించే చిహ్నాల విలువను గుర్తించడం మొదలైంది. ఈ దిశగా రాష్ట్రపతి భవన్ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం రాజాజీ ఉత్సవ్ జరుగనుంది. రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ విగ్రహం స్థానంలో స్వతంత్ర భారత తొలి భారత గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పరీక్షలంటే భయమొద్దు విద్యార్థులంటే పరీక్షల యోధులని మోదీ అన్నారు. ‘‘మీరు త్వరలో పరీక్షలు రాయనున్నారు. మార్కుల ఆధారంగా సత్తాను లెక్కగట్టలేరని తెలుసుకోండి. మీ ప్రతిభకు అవొక్కటే ఆధారం కాదు. పరీక్షల గురించి ఎన్నో సందేహాలుంటాయి. అలాగని ఆందోళన వద్దు మిమ్మల్ని మీరు విశ్వసించండి. చదివింది మనసుపెట్టి పరీక్షల్లో రాయండి’’ అని వారికి సూచించారు. కేరళ కుంభమేళాగా పిలిచే మామంగం సంప్రదాయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ వేడుక 250 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. పలు రాష్ట్రాల్లో రైతులు సాధించిన విజయాల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. -
పాడి రైతులకూ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 131వ ఎపిసోడ్లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతికత, సామాజిక స్పృహ, భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని మేళవిస్తూ సాగిన ఈ ప్రసంగంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్- 2026 విశేషాలను పంచుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, పాడి రైతులకు కూడా సహాయకారిగా నిలుస్తూ అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘జీరో-డిఫెక్ట్’ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను రూపొందించాలని స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, హరిత ఇంధనం తదితర రంగాల్లో యువత చూపుతున్న ప్రతిభే రాబోయే కాలంలో భారత్ను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు.ఈ క్రమంలో ఒడిశాకు చెందిన యువ రైతు హిరోద్ పటేల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి, నూతన దృక్పథంతో సాగు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన తీరును కొనియాడారు. అవయవ దానం ప్రాముఖ్యతను వివరిస్తూ కేరళకు చెందిన చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం త్యాగాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆ చిన్నారి మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరికొందరికి ప్రాణదానం చేసిందని, ఇలాంటి ఘటనలు సమాజంలో అవయవ దానంపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు.దేశం బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి పొంది తన స్వంత సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుకోవాలంటూ ప్రధాని ‘పంచ ప్రాణ్’ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్రపతి భవన్లో జరగనున్న రాజాజీ ఉత్సవాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, మన వారసత్వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాగా డిజిటల్ యుగంలో పెరుగుతున్న మోసాల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేవైసీ (KYC) ప్రక్రియ విషయంలో జాగ్రత్త వహించాలని, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవాలని సూచించారు. తన ప్రసంగం ముగింపులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమెకు ఘన నివాళులర్పించారు. జయలలిత వంటి ప్రజానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. -
ఏఐ దెబ్బ: ‘లివ్స్పేస్’లో వెయ్యి మంది అవుట్!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఏ రంగాన్నీ విడిచిపెట్టడం లేదు. ప్రపంచాన్ని ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో హోమ్ ఇంటీరియర్ రంగంలో అగ్రగామి స్టార్టప్ సంస్థ ‘లివ్స్పేస్’ సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచి, కార్యకలాపాలను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చే క్రమంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సుమారు 1,000 మంది సిబ్బందిని, అంటే సంస్థలోని 12 శాతం సిబ్బందిని ఇంటికి పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.కేకేఆర్ (కేకేఆర్) లాంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో రూపుదిద్దుకున్న ఈ యూనికార్న్ స్టార్టప్లో 7,000 నుండి 8,000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా డిజైనింగ్, సేల్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా పడింది. ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థను ‘ఏఐ-నేటివ్ ఏజెంటిక్’ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఈ పరిణామాలపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ, ఇది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, వనరులను వ్యూహాత్మకంగా పునఃకేటాయించడంలో భాగమేనని అన్నారు. సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేస్తున్నట్లు వివరించారు. గతంలో మానవ వనరులతో సాధ్యమయ్యే పనులను ఇప్పుడు అధునాతన ఏఐ ఏజెంట్లు చేపడుతున్నాయని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న బృందాల పనితీరు కూడా మెరుగుపడుతుందని సంస్థ భావిస్తోంది.లివ్స్పేస్ చరిత్రలో ఉద్యోగుల తొలగింపు ఇది మొదటిసారి కాదు. గతంలో 2020లో 400 మందిని, 2023లో దాదాపు 100 మందిని ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా తొలగించింది. ఆర్థిక ఫలితాల పరంగా చూస్తే 2025 మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లివ్స్పేస్ తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. మునుపటి ఏడాది 1,185 కోట్లుగా ఉన్న ఆదాయం, తాజాగా 23 శాతం వృద్ధి చెంది 1,460 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో సంస్థ తన నష్టాలను కూడా 416 కోట్ల నుండి 242 కోట్లకు తగ్గించుకోగలిగింది. సుమారు 500 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి, ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన సంస్థగా ఎదిగినప్పటికీ, మారిన సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.మరోవైపు సంస్థ నాయకత్వంలోనూ కీలక మార్పు చోటుచేసుకుంది. లివ్స్పేస్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015లో తన స్టార్టప్ ‘డిజైన్అప్’ను లివ్స్పేస్లో విలీనం చేసిన నాటి నుండి సంస్థలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2022లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన వ్యక్తిగత కారణాలతో సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిణామాల నేపథ్యంలో నాయకత్వ మార్పులు కూడా సహజంగానే జరుగుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ పేర్కొనడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘మూన్ మిషన్’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన -
క్లిక్కంటేనే చిక్కు!
ఒక్క క్లిక్తో ప్రపంచాన్ని ఇంటి ముందుకు తెస్తున్న ఈ–కామర్స్ రంగంలో ఇప్పుడు వినియోగదారులు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వస్తువుల ఎంపికలో గందరగోళం, రేటింగ్స్లో నిజానిజాలు, ధరల వ్యత్యాసాలతో 69 శాతం మంది నెటిజన్లు సతమతమవుతున్నట్లు ‘లోకల్ సర్కిల్స్’తాజా సర్వే బాంబు పేల్చింది. అయితే, ఈ చిక్కుముడులను విప్పేందుకు 64 శాతం మంది కొనుగోలుదారులు ఇప్పుడు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. – సాక్షి, హైదరాబాద్ వస్తువుల కొనుగోళ్లకు ఎక్కువ మంది ఇప్పుడు ఈ–కామర్స్ వెబ్సైట్లను వినియోగిస్తున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వంటి వెబ్సైట్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు ఇలా ఏ వస్తువునైనా ఇంటి వద్దే కూర్చుని కొనుగోలు చేయవచ్చు. అయితే వస్తువుల ఎంపిక, నాణ్యత, ధరల్లో వ్యత్యాసం ఇలా ఎన్నో అంశాలను వినియోగదారుడు పరిశీలించుకోవాలి. అప్పుడే మన్నికైన, తక్కువ ధరలో వస్తువు పొందగలుగుతారు. అయితే ఈ పోలికల్లో చిక్కులు తప్పడం లేదని, ఆన్లైన్ షాపింగ్ కూడా అంత ఈజీ కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను వాడేందుకు ఆసక్తి పెరుగుతోంది. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా 332 జిల్లాల నుంచి 75 వేల మంది వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రానున్న ఏడాదిలోపు చాట్జీపీటీ, గ్రోక్, మెటా, జెమిని వంటి ఏఐ టూల్స్ వాడతామని వారు పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్లో ఇబ్బందులు సరైన వస్తువు ఎంపికలో ఎక్కువ సమయం: 69 శాతం ఉత్తమ ధర, డెలివరీ, రిటర్న్ పాలసీలు: 49 శాతం విక్రేత వివరాలు తెలుసుకోవడం: 43 శాతం రివ్యూలు, రేటింగ్స్ వాస్తవికత: 40 శాతం ఇతర అంశాలు: 6 శాతం /ఏమీ చెప్పలేం: 6 శాతంఏఐ టూల్స్ ఎందుకు వాడాలనుకుంటున్నారు? అమ్మకందారుల ప్రామాణికత తనిఖీకి.. 68%సమయం ఆదా చేయడానికి.. 64%రివ్యూలు, రేటింగ్స్ విశ్లేషణకు.. 56%సందేహాల నివృత్తికి 46%ధరల మార్పులు గుర్తించేందుకు.. 36%కొనుగోళ్ల ప్లానింగ్ కోసం.. 22% -
ఆర్టీసీ బస్సులకు ఏఐ హెడ్లైట్లు
సాక్షి, హైదరాబాద్: బస్సులకు కృత్రిమ మేధతో పనిచేసే హెడ్ లైట్ల ఏర్పాటుకు సంస్థ కసరత్తు చేస్తోంది. కేరళకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా, ఆ సంస్థ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేసి పరిశీలించాలని నిర్ణయించింది. దూరప్రాంత బస్సుల్లో ఈ సాంకేతికత ఎలాంటి ఫలితాలనిస్తుందో సంబంధిత డ్రైవర్ల స్పందనను తెలుసుకుని సమీక్షించి దీని ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. భద్రతలో భాగమే...ప్రస్తుతం కొత్త వాహనాల్లో కాంతి చాలా ఎక్కువగా ఉండే హెడ్లైట్లను వాడుతున్నారు. ఇది ఎదురుగా వచ్చే వాహనా లకు ప్రమాదకరంగా మారుతోంది. కాంతి ఎక్కువగా ఉండటంతో ఎదురు వాహనాల డ్రైవర్లకు రోడ్డు సరిగా కనిపించని పరిస్థితి ఉంటోంది. ఆ కాంతి నేరుగా ఎదురు డ్రైవర్లపై ప్రసరించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్ని ప్రాంతాల్లో సరిగ్గా ఉండటం లేదు. రోడ్డుపై సెంట్రల్ మీడియన్ లేని చోట్ల ఇది ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఇక, రోడ్డు మ లుపులు, గుంతలు, ఇరుకుగా ఉండటం లాంటి సమ స్యలను డ్రైవర్లు రాత్రి వేళ వేగంగా గుర్తించాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో హెడ్ లైట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇలాంటి అన్ని రకాల పరిస్థితులను గమనంలో ఉంచుకుని తనంతట తానుగా కాంతిని పెంచుకోవటం, తగ్గించుకోవటం చేసుకోగలిగే లైటింగ్ వ్యవస్థను ఈ సాంకేతికత సమకూరుస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా లైటు కాంతిని పెంచుకోవటం, తగ్గించుకోవటం డ్రైవర్ ప్రమేయం లేకుండా ఆ సాంకేతికతనే చూస్తుంది. డ్రైవర్ స్పందించడానికి ముందే ఈ సాంకేతికత స్పందించటం దీని ప్రత్యేకత.» ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్ లైట్ కాంతి నేరుగా ఎదుటి వాహన డ్రైవర్ కంటిలోకి ప్రసరించకుండా డిప్పర్ వాడాల్సి ఉంటుంది. కానీ, చాలా మంది డ్రైవర్లు దాన్ని పట్టించుకోకుండా అలాగే దూసుకొస్తారు. అప్పుడు ఆ కాంతికి ఎదురు వాహనం డ్రైవర్ రోడ్డును సరిగా గుర్తించలేదు. ఇలాంటి తరుణంలో, ఏఐ ఆధారిత వ్యవస్థ ఆ వాహన కాంతిని పెంచి డ్రైవర్కు రోడ్డు కొంతమేర కనిపించేలా చేస్తుంది. » వీధి దీపాల కాంతి ధారాళంగా ఉన్న చోట, ఇతర రకాలుగా వెలుగు ఎక్కువగా ఉన్న చోట, హెడ్ లైట్లు డిమ్గా మారుతుంది. దీంతో బ్యాటరీ వినియోగం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.» రోడ్డు మలుపులున్న చోట, బస్సు లైట్ల కాంతి రోడ్డు మీద సరిగా ఉండదు. ఈ వ్యవస్థలో ఆ సమస్య కూడా అధిగమించి లైటింగ్ వ్యవస్థ వెంటనే స్పందించి పక్కలకు వెలుగు వచ్చేలా చేస్తుంది. » డిప్పర్ విషయంలోనూ ఈ సాంకేతికత స్పందించి తదనుగుణంగా వ్యవహరిస్తుంది. » కొన్ని ప్రీమియం కార్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ, బస్సుల్లో ఇప్పటి వరకు లేదు. తొలిసారి ఆర్టీసీ తన బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేసుకోబోతోంది. » కొద్ది రోజుల పాటు దీన్ని పరిశీలించి, సానుకూల ఫలితాలనిస్తోందని డ్రైవర్లు చెబితేనే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. -
‘అందరికీ కృత్రిమ మేధ సాంకేతికత’
న్యూఢిల్లీ: ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకొనే దిశగా కీలకమైన ముందడుగు పడింది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ(అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషం) అనే స్ఫూర్తితో భారత్ రూపొందించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్’ను ప్రపంచ దేశాలు ఆమోదించాయి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా శనివారం ఈ డిక్లరేషన్పై 86 దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. మానవాళి బాగు కోసం ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధ ప్రయోజనాలను అందరూ సమానంగా పంచుకోవాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ నిర్దేశిస్తోంది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, బహుళ భాగస్వాముల మధ్య అనుసంధానం, దేశాల జాతీయ సార్వ¿ౌమత్వాన్ని గౌరవించడం, ఏఐని మరింత ముందుకు తీసుకెళ్లడం, ఏఐ టెక్నాలజీ వినియోగంలో భద్రమైన, విశ్వసనీయమైన ఫ్రేమ్వర్క్ నిర్మించడం డిక్లరేషన్ ప్రధాన లక్ష్యం. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఏఐ సాంకేతికతను అందించడమే ధ్యేయం. అంతర్జాతీయ సహకారమే పునాది ఏడు కీలకమైన మూలస్తంభాల ఆధారంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ రూపొందించారు. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక వృద్ధి–సామాజిక సంక్షేమం, భద్రమైన–విశ్వసనీయమైన ఏఐ, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఏఐ, సామాజిక సాధికారత సాధన, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, సుస్థిరమైన, ప్రభావవంతమైన, నూతన ఏఐ వ్యవస్థల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. డిక్లరేషన్కు అంతర్జాతీయ ఏఐ సహకారమే పునాదిగా నిలుస్తోంది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’శనివారం ఈ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సదస్సులో పాల్గొన్న దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక పరివర్తనలో ఏఐ పోషించబోయే పాత్రను డిక్లరేషన్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ ఎకోసిస్టమ్స్ను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. తక్కువ ఇంధనంతో పనిచేసే ఏఐ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైన్స్, పరిపాలన, ప్రజాసేవల పంపిణీలో ఏఐ వినియోగం పెంచుకోవాలని స్పష్టంచేశారు. ఈయూ, ఐఎఫ్ఏడీ ఆమోదం న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించిన వాటిలో రష్యా, ఆ్రస్టేలియా, బెల్జియం, భూటాన్, బ్రెజిల్, కెనడా, డెన్మార్క్, ఇస్తోనియా, ఇథియోపియా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్, ఐర్లాండ్, ఇండోనేసియా, ఇరాన్, హంగేరీ, గ్రీస్, జర్మనీ, ఫిన్లాండ్, మెక్సికో, యూఏఈ, ఉక్రెయిన్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, టాంజానియా, స్విట్జర్లాండ్, నార్వే, ఒమన్, ఫిలిప్పైన్స్, పెరూ, రొమేనియా, నేపాల్, మయన్మార్, న్యూజిలాండ్ తదితర దేశాలున్నాయి. అంతర్జాతీయ సంస్థలైన యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్(ఐఎఫ్ఏడీ) సైతం డిక్లరేషన్ను ఆమోదించాయి. సమతుల్యం అత్యంత కీలకం: అశ్వినీ వైష్ణవ్ ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘మానవ కేంద్రీకృత ఏఐ దార్శనికత’ను ప్రపంచదేశాలు ఆమోదించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కృత్రిమ మేధ వనరులను ప్రజాస్వామీకరించడం వల్ల ఏఐ సేవలు, సదుపాయాలు, సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమాన్ని సమతుల్యం చేసుకోవడం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆర్థిక ప్రగతిని మాత్రమే కాకుండా సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంలో భద్రత, విశ్వాసం ముఖ్యమైన అంశాలేనని చెప్పారు. భద్రమైన, విశ్వసనీయ, బలమైన ఐఏ ప్రేమ్వర్క్ను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ పరస్పరం కలిసి పని చేయడానికి ముందుకొచ్చాయని వైష్ణవ్ స్పష్టంచేశారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ సూక్తిని ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఆమోదించాయని స్పష్టంచేశారు. -
ఏఐ: ఆల్ ఉమెన్ ఇంటెలిజెన్స్
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అనేది సిలికాన్ వ్యాలీ వాసుల, బడా కంపెనీల వ్యవహారం’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కాలం మారింది. మారుమూల పల్లెలోని పార్వతమ్మకు కూడా ఇప్పుడు ‘ఏ.ఐ.’పై ఆసక్తి పెరిగింది. స్వయం సహాయక బృందాల నుంచి వ్యాపారాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనుకునే చిన్న స్థాయి మహిళా వ్యాపారుల వరకు ఏ.ఐ. సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026’ అనేది సాంకేతిక దిగ్గజాల సదస్సు మాత్రమే కాదు, సామాన్య మహిళలు సైతం ఆసక్తి చూపే సదస్సు అయింది...వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మార్పులు తేనున్నది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ హైలెట్ చేసింది. అట్టడుగు స్థాయిలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంటర్ప్రెన్యూర్షిప్ విషయంలో భాష, మార్కెట్ యాక్సెస్, పరిమిత వనరులలాంటి అడ్డంకులను అధిగమించడంలో గ్రామీణ మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతోంది.బహుళ ప్రయోజన శిక్షణ‘షీ లీడ్స్ భారత్’లాంటి ఏఐ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్లు గ్రామీణ ప్రాంతాలలోని చిరు మహిళా వ్యాపారులు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించి మెరుగైన శిక్షణ ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ భాగసామ్యంతో 25,000 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇస్తోంది షీ లీడ్స్. ఎలాంటి వస్తువులకు అధిక డిమాండ్ ఉందో గుర్తించడం నుంచి వాటికి సరిౖయెన ధరలను నిర్ణయించడం, కస్టమర్ల సంఖ్యను ఎలా పెంచుకోవాలి, కీలకమైన వ్యాపార సవాళ్లను ఎలా అధిగమించాలి... మొదలైన విషయాలను తెలుసుకోవడానికి, ‘మేరీ సహేలి’ యాప్లో విలీనం చేసిన ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి తద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ‘మహిళల నేతృత్వంలోని గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడానికి, ఏఐకి సంబంధించిన బాధ్యతాయుతమైన, ఆచరణాత్మక ఉపయోగాల అవగాహనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది షీ లీడ్స్ భారత్.గల్లీ నుంచి దిల్లీ వరకుఉత్తర్ప్రదేశ్లోని వారణాసి జిల్లా నవహానిపూర్ గ్రామానికి చెందిన రుచిసింగ్ స్వయం సహాయక బృందంలో సభ్యురాలు. స్మార్ట్ఫోన్ ల నుంచి ఏఐ–ఎనేబుల్డ్ ఫ్లాట్ఫామ్ల వినియోగం వరకు ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్గా నిలిచింది. దేశవ్యాప్తంగా రుచిసింగ్లాంటి మహిళలకు దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులోని విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ‘ఏఐ సమ్మిట్’లో తమకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్–ఆమెదిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026లో వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించారు. ఈ సదస్సులో ‘ఏఐ కాలంలో మహిళలకు ఎదురవుతున్న భద్రతా సమస్యలు–డిజిటల్ ప్రపంచంలో అసమానతలు’... మొదలైన వాటి గురించి నటి, రచయిత్రి సోహ అలీఖాన్ ప్రసంగించారు. ఏఐ టూల్స్ విస్తృతస్థాయి ఉపయోగాలతో పాటు దుర్వినియోగాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.‘ఏఐ సాంకేతికత వల్ల ఫేక్ ఇమేజ్లను సృష్టించడం నుంచి డాటా దుర్వినియోగం వరకు హానికరమైన పనులు అత్యంత వేగంగా జరుతున్నాయి’ అని ఏఐలోని ప్రతికూలతల గురించి ప్రస్తావించారు సోహ అలీఖాన్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై భయాలు, అపోహలు ఉన్నాయి. అవి నిజం కాదు’ అంటూ వైద్య రంగానికి ఏఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... అనివార్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్యుల అవసరాన్ని లేకుండా చేసేది కాదు. వైద్యుల భారాన్ని తగ్గించేది. ఏఐ సాంకేతికతపై రకరకాల భయాలు, అపోహలు ఉన్నాయి. అయితే ఇది నిజం కాదు. వైద్య సమాజానికి ఏఐ సాంకేతికత అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నిపుణులు కాని వారు ఏఐ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. మన దేశంలోని విస్తారమైన జనాభా, ప్రాంతాల మధ్య వైవిధ్యాలు, వైరు«ధ్యాలు, గ్రామీణ–పట్టణ విభజన, సవాళ్లు విసురుతున్న అంటువ్యాధులు... ఈ నేపథ్యంలో సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనివార్యమైన సహాయకారిగా మారుతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. – అనుప్రియ పటేల్, కేంద్రమంత్రిపవర్ హిట్టర్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతికతను మాత్రమే కాదు వ్యూహాలు, నాయకత్వం, నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా పునర్నిర్వచిస్తోంది. ఏఐ అనేది టీ 20 క్రికెట్లో ‘పవర్ హిట్టర్’లాంటిది. టీ 20 మ్యాచ్లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్ను చూశారు. ఇలాంటి పవర్ హిట్టరే ఏఐ. సంస్థలు పనిచేసే విధానాన్ని పునర్నిర్వచించే సామర్థ్యం ఏఐకి ఉంది. ఏఐ వల్ల అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కొత్త శక్తితో, కొత్త దారులలో సంస్థలు పయనిస్తాయి. వ్యాపార నమూనాలు మారుతాయి. వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ నైపుణ్యంతో పనిచేస్తారు. ఏఐ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అనేది ముఖ్యం కాదు ఎంత బాధ్యతతో ఉందనేది ముఖ్యం. బాధ్యతాయుతమైన ఏఐ అనివార్యం.– రోహిణి నాడర్ మల్హోత్రా, చైర్పర్సన్, హెచ్సీఎల్ఏఐ... ఎన్నో ద్వారాలు!లక్షలాది మంది భారతీయ మహిళలు వినడానికి, నేర్చుకోవడానికి, పని చేయడానికి టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఆ అవకాశాలను వినియోగించుకోవాలంటే ఆన్లైన్ సురక్షితమని మహిళలు భావించాలి. ఏఐతో దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. యువతులు ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారు. బాలికలు వీరి విజయగాథల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు సృజనాత్మకతకు సంబంధించి కూడా మహిళలకు ఏఐ ప్లాట్ఫామ్లు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నాయి. మహిళా సాధికారతకు ఆన్లైన్ టూల్స్ కొత్త దారులు చూపుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే సమాజంలో ఉండే అసమానతలు డిజిటల్ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి.– సోహా అలీఖాన్, నటి, రచయిత్రి -
ఏఐ సదస్సు ద్వారా 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ద్వారా వివిధ దేశాల నుంచి 250 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలు రాబట్టినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే మరో 20 బిలియన్ డాలర్ల మేర డీప్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ సదస్సు పూర్తి స్థాయిలో విజయవంతమైందని శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయల రంగంలో ఈ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రతిపాదిత ఢిల్లీ డిక్లరేషన్కు 70 దేశాలు ఇప్పటికే మద్దతు పలికాయని అన్నారు. శనివారం కల్లా ఈ సంఖ్య 80కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డిక్లరేషన్పై శనివారం సంతకాలు జరుతాయని వివరించారు. సదస్సును 5 లక్షల మందికిపైగా ప్రజలు సందర్శించారని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయని స్పష్టంచేశారు. ఢిల్లీ డిక్లరేషన్పై పూర్తి వివరాలను సదస్సు ముగిసిన తర్వాత బహిర్గతం చేస్తామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇండియా ఏఐ మిషన్ 2.0లో భాగంగా 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు స్పష్టంచేశారు. -
సీఈఓలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు టెక్నాలజీ, ఏఐ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 16 ఏఐ, డీప్టెక్ స్టార్టప్ల వ్యవస్థాపకులతో రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉన్నత విద్య తదితర రంగాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపై వారితో చర్చించారు. వీటితో పాటు పలు అంశాలపై తమ వ్యూహాలు తదితరాలను సీఈఓలు ప్రధానితో పంచుకున్నారు. వారంతా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, స్లొఒవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం, లీచెన్స్టైన్ రాకుమారుడు అలోయిస్తో మోదీ విడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై వారితో లోతుగా చర్చించారు. దిస్సనాయకెతో భేటీ అద్భుతంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, కీలక నైపుణ్యాలు, సంస్కృతి, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. ఇతర దేశాధినేతలతో భేటీలో కూడా పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచి్చనట్టు వెల్లడించారు. గుటెరస్తో సమావేశం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా మోదీ సమావేశమయ్యారు. ఏఐ ప్రస్థానం, దాని ఫలాలు అన్ని దేశాలకు సముచితంగా అందడంలో ఐరాస పాత్ర తదితరాలపై ఆయనతో లోతుగా చర్చించారు. ఏఐ సాంకేతికతను ప్రపంచ ప్రగతి కోసం మరింత సమర్థంగా వినియోగించే విషయంలో భారత్ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని గుటెరస్కు హామీ ఇచ్చారు. -
పాక్స్ సిలికాలోకి భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పాక్స్సిలికా కూటమిలో భారత్ శుక్రవారం సభ్యదేశంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఈ కూటమి ముఖ్యోద్దేశం. భారత్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. మోదీ సర్కారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హెల్బర్గ్ అభినందించారు. ‘‘అరుదైన ఖనిజ సరఫరా వ్యవస్థలపై ప్రస్తుతం కొందరి గుత్తాధిపత్యమే సాగుతోంది. ఇది ఆర్థిక ఒత్తిళ్లతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దారి తీస్తోంది’’అంటూ చైనా తీరును ఉద్దేశించి ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మా సన్నిహిత మిత్ర దేశాలు నిత్యం ఇలాంటి బ్లాక్మెయిలింగ్ల బారిన పడుతుంటే మేం చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. అవి ప్రగతి కోసం తమ సార్వ¿ౌమత్వాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని నివారించడంలో సిలికా కూటమిది కీలక పాత్ర కానుంది. ఎందుకంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత’’అని అభిప్రాయపడ్డారు. కూటమి మరింత బలోపేతం: గోర్ 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతిక ప్రపంచ క్రమాన్ని పాక్స్సిలికా కూటమి పునర్ నిర్వచిస్తుందని గోర్ జోస్యం చెప్పారు. భారత్ చేరికతో ఈ కీలక కూటమి మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘కూటమిలో భారత్ చేరిక కేవలం లాంఛనప్రాయం కాదు. అది అత్యంత ఆవశ్యకమైన చర్య. అరుదైన ఖనిజాలు, ఏఐ రంగాల్లో ప్రత్యర్థులను సవాలు చేయగల అపారమైన నైపుణ్యం భారత్ సొంతం. కనుక టెక్నాలజీ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారం అత్యంత కీలకం. రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్నొవేషన్ తదితరాల్లో ఇది కీలక పాత్ర పోషించగలదు’’అని ఆయన చెప్పారు. ‘‘ప్రత్యర్థులు నియమాలకు కట్టుబడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. శాంతి సాధన బలం, శక్తి సామర్థ్యాలతోనే సాధ్యం. ఈ విషయం భారత్కూ బాగా తెలుసు’’అని గోర్ పేర్కొన్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలుకుని పాక్స్సిలికా దాకా భారత్, అమెరికా పరస్పర సహకారానికి ఆకాశమే హద్దు. నేను రాయబారిగా ఉండే మూడేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తా’’అని తెలిపారు. పలు అడ్డంకులను అధిగమించి, అపోహలను తొలగించుకుని మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. కీలక నిర్ణయం: వైష్ణవ్ పాక్స్సిలికా కూటమిలో చేరికను భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్ర మంత్రి వైష్ణవ్ అభివరి్ణంచారు. ఏఐ, అరుదైన ఖనిజాల రంగంలో సురక్షిత భవితకు ఇది బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలను నానాటికీ మరింతగా పెంచుకుంటోందని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన నానోమీటర్ చిప్స్ను భారత యువ ఇంజనీర్లే రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రస్తుతం కనీసం 10 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరం. భారత్కు అతి పెద్ద అవకాశమిది’’అని పేర్కొన్నారు. ఏమిటీ పాక్స్సిలికా? ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్ చిప్స్ మొదలుకుని స్వచ్ఛ ఇంధనం, ఏరో స్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమన్నది తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. దాంతో ఆ ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతులపై కొన్నేళ్లుగా ఆ దేశ గుత్తాధిపత్యమే సాగుతోంది. అరుదైన ఖనిజాల వెలికితీతలో చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటాయే ఏకంగా 97 శాతం! ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయిగా నిలవనుంది. దాంతో ఈ విషయంలో చైనా పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గత డిసెంబర్లో పాక్స్సిలికా కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికాన్కు సిలికా ముడి ఖనిజమన్నది తెలిసిందే. అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్యదేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని లక్ష్యం. ఆ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో వాటి వినియోగం... ఇలా అన్ని దశల్లోనూ కూటమి దేశాలు సమన్వయంతో పని చేయాలన్నది ఉద్దేశం. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్, ఖతార్ ఇందులో సభ్యులుగా చేరాయి. భారత్లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పాక్స్సిలికా కూటమిలో చేరేలా భారత్ను ఒప్పించేందుకు అమెరికా ముమ్మరంగా ప్రయతి్నస్తూ వచ్చింది. గోర్ భారత రాయబారిగా వచ్చిన క్షణం నుంచే ఈ ప్రయత్నాలకు పదును పెట్టారు. తొలి రోజు బాధ్యతలు స్వీకరించినప్పుడే భారత్ను ఆయన కూటమిలోకి ఆహ్వానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాధ్యత నిండిన భవిత కోసం...
కృత్రిమమేధ (ఏఐ) ప్రపంచాన్ని సమ్మోహపరుస్తోంది. దాని ప్రభావంతో మానవ జీవితంలోని ప్రతి పార్శ్వమూ రూపాంతరం చెందుతోంది. మానవాళికీ, అవనికీ మేలు చేకూర్చగల గొప్ప సామర్థ్యం దానికి ఉందనడంలో సందే హం లేదు. అయితే, అది చూపగల ప్రభా వాల గురించే తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా చాలామంది ఉపాధి కోల్పోతారని, తప్పుడు సమా చారం పెరుగుతుందని చెబుతున్నారు. మానవాళికి ఏఐ గొప్ప మేలు చేసినదవుతుంది, లేదా భయంకరమైన శత్రువుగా పరిణమిస్తుందని నేను భావిస్తున్నాను. ఏఐకి మార్గదర్శక సూత్రాలు లేదా నియంత్రణలు తీసుకురావాలనే ప్రయత్నం ఊపందుకుంది. నేను ‘కరుణా పూరిత ఏఐ’ అనే కొత్త భావనను పరిచయం చేయాలనుకుంటు న్నాను. ఇది దయా గుణంలో ఏఐకి దారి చూపుతుంది. దానిగురించి మరింత వివరించే ముందు ఇపుడు ఎదురవుతున్న కొన్ని తీవ్రమైన సవాళ్ళు ఏమిటో చూద్దాం. ఏఐ విసురుతున్న సవాళ్ళు ఒకటి – భారీ ప్రయోజనాలు పణంగా ఉన్న రేసులో ఏఐ అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిణమించింది. ఏఐ తెచ్చి పెట్టగల లాభాలు, అధికారం కోసం కొద్దిపాటి దేశాల మధ్య, దిగ్గజాల వంటి టెక్ కంపెనీలు, ప్రైవేటు సంస్థల మధ్య పోటీ మొద లైంది. సంపన్న దేశాలు, అభివృద్ధిలో ఇంకా అఆలు కూడా నేర్చు కోని దేశాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఏఐపై గుత్తాధిపత్యం సంపాదించినవాళ్ళు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపైన కూడా అసా ధారణమైన పట్టును ప్రదర్శించ గలుగుతారు. రెండు – ఏఐ ఇక ఎంతమాత్రం సాంకేతిక సాధనం కాదు. అది తనకుతాను మార్గదర్శనం చేసుకుని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తిగల ఏజెంట్గా పరిణమిస్తోంది. ఇపు డున్న మానవ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏఐ సిస్టంలు సిద్ధమవుతున్నాయి. వీటిలో పక్షపాతపూరిత చారిత్రక కథ నాలు, భ్రమలు, విశ్వాసాలు, అభూత కల్పనలు, అసత్యాలు కూడా ఉన్నాయి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఏఐ ఆటోమేటిక్గా సృష్టించగలదు. మోసపూరిత చర్యలకు వెసులుబాటు కల్పించ గలదు. విభేదాలను, విద్వేషాలను రెచ్చగొట్టగలదు. హింసకు కూడా ప్రేరేపించగలదు. మానవ సంభాషణలను ఏఐ సిస్టంలు తిమ్మిని బమ్మి చేయగలవు. బ్యాంకులను వంచించడం, డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతతో సహా ఏఐ సంబంధిత నేరాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మూడు – సమాజంపై సైకలాజికల్ ప్రభావం. ముఖ్యంగా ఏఐపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న యువత దాని ప్రభావా నికి లోనవుతున్నారు. భవిష్యత్తులో వచ్చే సూపర్ ఇంటెలిజెన్స్ ఊహించనలవికానిది. తల్లితండ్రులు, టీచర్లు, సహాధ్యాయులతో నామమాత్రపు చనువు, లేదా అసలేమీ పట్టనట్లుగా పెరిగే తరాన్ని ఊహించుకోండి. ఏఐ ప్రాథమిక రూపంపై ఆధారపడిన సోషల్ మీడియా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతోందో ఇప్పటికే మనం గమనిస్తున్నాం. కౌమారంలో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక వైకల్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒంటరితనం, మనోవ్యధ, ఆందోళనతో వారు సతమతమవుతున్నారు. నాలుగు – సహజంగానే మెషీన్ మెదడు మానవ మెదడు కన్నా చురుకుగా పనిచేస్తుంది. ఏఐ వల్ల లాభాలు ఉత్తేజపరచేవిగాను, వినోదపరచేవిగాను కనిపిస్తున్నప్పటికీ, ఎవరు ఎవరిని అంతిమంగా నియంత్రిస్తారనే తాత్త్విక ప్రశ్న తలెత్తుతోంది. సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, న్యాయం, పరిపాలనను కాపాడే నిర్ణయాలు ఎవరివవుతాయి? భావోద్రేకాలు, స్పందించే గుణం ఉన్న మానవ మెదళ్ళవా, లేక ఇతరుల బాధలను, కష్టాలను కనిపెట్టగల జీవశాస్త్ర సామర్థ్యం కొరవడిన కలనగణితాలవా? కరుణ ఆధారంగా...నైతికత, నియంత్రణలు ముఖ్యమే. కానీ, వాటికి పరిమి తు లున్నాయి. వాటిని సృష్టించేది, పర్యవేక్షించేది మనుషులే కదా! తన మార్గాన్ని నిర్ణయించుకోవడంలో మెషీన్ మెదడు యుక్తితో, వేగంతో వ్యవహరిస్తుంది. ఏఐ వెనుక ఉండే మానవ మనస్తత్త్వం మారకపోతే ఎటువంటి నియంత్రణనైనా అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళి పోగలదు. కనుక, ఏఐ దిక్సూచి కరుణను ఆధారం చేసుకున్నదిగా ఉండాలి. కరుణను నేనొక విలువగానో, సద్గుణంగానో, బలహీ నమైన మనస్కుల నుంచి వ్యక్తమయ్యేదిగానో, లేదా నైతిక నైరూప్య ఆలోచనగానో చెప్పడం లేదు. ఇతరుల బాధను చూసి అలాంటి కష్టం తనకూ రావచ్చుననే జ్ఞానంతో, ఎదుటి వ్యక్తిని దాన్నుంచి బయటపడేయడానికి కార్యాచరణకు దిగాలని ప్రోత్సహించే శక్తిగా చూస్తున్నాను. న్యాయం, సమానత్వం, శాంతి, స్వావలంబనను ఏర్పరచడానికి అటువంటి చోదక శక్తి అత్యవసరం. మనసు లోపల ఉండే ఆర్ద్రతను కనిపెట్టవచ్చు. వ్యక్తులు,సంస్థలలో దానిని పెంపొందించవచ్చు. దీని నిమిత్తం మేమొక శాస్త్రీయ చట్రాన్ని అభివృద్ధి చేశాం. దానిని ‘సత్యార్థి కంప్యాషన్ కోషియంట్’గా పిలుస్తున్నారు. యుక్తితోనే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించగల భవిష్యత్తుకు అది తోడ్పడ గలదు. అందరూ పంచుకోవలసిన విలువలు, సంపద, బాధ్యత, జవాబు దారీతనంతో కూడిన ప్రపంచాన్ని అది స్వప్నిస్తోంది. ఏఐని సృజించే, అమలుపరచే, దాన్నుంచి లబ్ధి పొందేవారిలో మనం దయా గుణాన్ని ప్రోత్సహించాలి. కరుణలో చైతన్యం, అను సంధానమవడం, స్పందించడం, కార్యాచరణకు దిగడమనే నాలుగు కీలక కోణాలున్నాయి. మానవ, జీవావరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆ నాలుగింటి గురించి ఏఐ అభివృద్ధిలో చొప్పించాలి. తొలు తటి ఆలోచన నుంచి తుది ఉత్పత్తి వరకు ఆ అంశాలను సమైక్య పరచాలి. సమస్య నిర్వచనం, వ్యూహం, డేటా సేకరణ, ఇంజనీరింగ్, మోడల్ డెవలప్మెంట్, మదింపు, పరీక్ష, డిప్లాయ్మెంట్, ఇంటెగ్రేషన్, నిర్వహణ... ఇలా అన్నింటిలోనూ ఆ నాలుగూ మమేక మవ్వాలి. ఈ విధానం కంప్యాషనేట్ ఏఐ అభివృద్ధికి దారి తీస్తుంది. టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వాలతో సహా ఈ విభాగంలో పాత్రధారులైన అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. ఉమ్మడి శ్రేయస్సును ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. ఋగ్వేదం‘సంగచ్ఛధ్వవం, సంవదధ్వవమ్, సం వో మనాంసి జానతావ్ు’అంటుంది. మనందరం కలసి నడుద్దాం. ఉమ్మడి భాషను మాట్లాడు కుందాం. అందరి క్షేమం కోసం అందరం పంచుకునే విధంగా సమష్టిగా విజ్ఞానాన్ని సృష్టించుకుందాం అని దాని అర్థం.-వ్యాసకర్త నోబెల్ బహుమతి గ్రహీత-కైలాశ్ సత్యార్థి -
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్! -
గ్లోబల్ జాబ్స్కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలుఇండియాపై ప్రశంసలుపన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
‘ప్యాక్స్ సిలికా’లోకి భారత్.. ఇక ఏఐలో మనదే హవా..
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల సరఫరాను పటిష్టం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ‘ప్యాక్స్ సిలికా’ (Pax Silica) కూటమిలో భారత్ చేరనుంది. 2025 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కూటమిలో భారత్ అధికారికంగా భాగస్వామి కావడంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలో దేశ ప్రతిష్ట మరింత పెరగనుంది. మిత్రదేశాల మధ్య చిప్స్, ఏఐ సరఫరా వ్యవస్థను సురక్షితం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం.ఈ భాగస్వామ్యం ద్వారా సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాల లభ్యత, ఏఐ పరిశోధనల్లో భారత్కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో బలంగా ఉన్న భారత్, ప్యాక్స్ సిలికాలో చేరడంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది. సుస్థిరమైన సరఫరా గొలుసు (Supply Chain) ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగిన చిప్ తయారీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకోనుంది. గతంలో సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ ఒప్పందంతో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే దిశగా ఢిల్లీ, వాషింగ్టన్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. సాంకేతికత, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాల్లో కలిసి పనిచేయడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ప్యాక్స్ సిలికా కూటమిలో అమెరికా, భారత్తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, యూఏఈ, ఇజ్రాయెల్, సింగపూర్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో చేరడం వల్ల గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ విషయంలో భారత్ కీలక నిర్ణయాధికారిగా మారనుంది. మారుతున్న ప్రపంచ పరిణామాల దృష్ట్యా, సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిలో భారత్ ఇకపై ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయనుంది.ఇది కూడా చదవండి: రూ. 20 కోట్ల లాటరీ దక్కింది.. టిక్కెట్ పోయింది! -
జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ)విభాగంలో తాజాగా మరో భారీ అప్డేట్ను ప్రకటించింది. జెమిని శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ‘జెమిని 3.1 ప్రో’ మోడల్ను కంపెనీ ఆవిష్కరించింది. ఇది గతంలో ఉన్న మోడల్ కంటే రెండు రెట్లు మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ‘జెమిని 3.1 ప్రో’ను కేవలం టెక్స్ట్ జనరేషన్ మాత్రమే కాకుండా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేలా తీర్చిదిద్దారు.గత నవంబర్లో విడుదలైన జెమిని 3 సిరీస్ను మెరుగుపరుస్తూ, రూపొందించిన జెమిని 3.1 ప్రో.. మేధస్సులో ఒక కొత్త మైలురాయిని దాటిందని గూగుల్ తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత పరీక్షల ప్రకారం కఠినమైన తార్కిక సమస్యలను పరిష్కరించే ‘ఏఆర్సీ- ఏజీఐ-2' బెంచ్మార్క్లో ఈ మోడల్ 77.1% స్కోరును సాధించింది. ఇది గతంలోని 3.0 ప్రో మోడల్ పనితీరు కంటే రెట్టింపు కంటే ఎక్కువే కావడం విశేషం. లాజిక్ నమూనాలను విశ్లేషించి, పరిష్కరించడంలో ఈ మోడల్ అసాధారణ ప్రతిభను కనబరుస్తుందని గూగుల్ వెల్లడించింది. Gemini 3.1 Pro is here: A smarter model for your most complex tasks.Building on the Gemini 3 series, 3.1 Pro is a step forward in reasoning. It's designed for tasks where a simple answer isn’t enough, taking advanced reasoning and making it useful for your hardest challenges.🧵— Google Gemini (@GeminiApp) February 19, 2026డెవలపర్లు, డిజైనర్ల కోసం జెమిని 3.1 ప్రో అద్భుతమైన ఫీచర్లను తీసుకువచ్చింది. కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, వెబ్సైట్లలో నేరుగా ఉపయోగించుకోదగ్గ యానిమేటెడ్ ఎస్వీజీ (ఎస్వీజీ) ఫైళ్లను ఇది సృష్టించగలదు. ఇవి కోడింగ్ ఆధారంగా రూపొందుతాయి. అంతేకాకుండా, హ్యాండ్ ట్రాకింగ్ ద్వారా నియంత్రించే సంక్లిష్టమైన 3డీ సిమ్యులేషన్లను, వాటికి అనుగుణంగా రియల్ టైమ్ ఆడియోను కూడా ఇది రూపొందించగలదు.వేల పేజీల సాంకేతిక పత్రాలను, లేదా మొత్తం సాఫ్ట్వేర్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి విశ్లేషించగలగడం ‘జెమిని 3.1 ప్రో’ ప్రత్యేకత. 2026, ఫిబ్రవరి 20 నుండి జెమిని 3.1 ప్రో మోడల్ అందుబాటులోకి రానున్నదని గూగుల్ తెలిపింది. గూగుల్ ఏఐ స్టూడియో, గూగుల్ యాంటీగ్రావిటీ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా డెవలపర్లకు, గూగుల్ ఏఐ ప్రో అల్ట్రా సబ్స్క్రైబర్లకు జెమిని యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉండనుంది. ఇది కూడా చదవండి: ‘వయనాడ్’ బాధితులకు రాహుల్ భారీ కానుక -
ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్. ఏఐ రంగంలో ఢీ అంటే ఢీ అంటున్న ప్రత్యర్థులు. వాటి సీఈఓలు శామ్ ఆల్ట్మన్, దరియో అమొదెయ్ గురువారం ఒకే వేదికపైకి వచ్చారు. కానీ చేతులు కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు! ఈ ఇబ్బందికర క్షణాలకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికైంది.ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టెక్ దిగ్గజాలంతా వేదికపైకి వెళ్లారు. గ్రూప్ ఫొటో సందర్భంగా అందరూ చేతులు కలిపి పైకెత్తారు. యాదృచ్ఛికంగా పక్కపక్కనే నిలబడ్డ ఆల్ట్మన్, అమొదెయ్ మాత్రం అందుకు నిరాకరించారు. ఎవరికి వారు విడిగా పిడికిళ్లు బిగించి పైకెత్తి సరిపెట్టారు. పైగా నిలబడ్డంతసేపూ ఇద్దరూ చాలా అసౌకర్యంగా కూడా కన్పించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం ఈ ఉదంతంపై ఆల్ట్మన్ స్పందించారు. ‘నేను అయోమయానికి గురయ్యా. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. మోదీ నా చేతిని పట్టుకుని పైకెత్తారు. దాంతో ఏం జరుగుతోందో కాసేపటిదాకా అర్థమే కాలేదు’ అని చెప్పుకొచ్చారు."I didn't know what was happening on stage. I was confused. Modi grabbed my hand and put it up, and I just wasn't sure what we were supposed to be doing." - Sam Altman pic.twitter.com/Hs6nlRuSsP— Mini Nagrare (@MiniforIYC) February 20, 2026మాజీ సహోద్యోగులే..కాగా, ఆల్ట్మన్, అమొదెయ్ ఒకప్పుడు సహోద్యోగులే కావడం విశేషం. ఆల్ట్మన్తో పాటు అమొదెయ్ కూడా ఓపెన్ ఏఐలోనే పని చేశారు. ఆయనతో విభేదాల నేపథ్యంలో 2020లో కంపెనీని వీడారు. ఇక, అంతకుముందు శామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా అని కుండబద్దలు కొట్టారు. ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు. -
ఏఐ ‘విండోస్’!
ఒకట్రెండేళ్లలో ‘ఏఎస్ఐ’: ఆల్ట్మన్ ‘‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా’’అని దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఏఐ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్వత్రా చర్చనీయంగా మారిన ఆరి్టఫిíÙయల్ సూపర్ ఇంటలిజెన్స్ (ఏఎస్ఐ) తాలూకు తొలి వెర్షన్లు అందుబాటులోకి రావడానికి మరో ఒకట్రెండేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాల్లోనూ మానవ మేధను మించిపోయే ఏఎస్ఐని కృత్రిమ మేధ ప్రస్థానంలో కీలకమైన తదుపరి అడుగుగా భావిస్తున్నారు. ‘‘ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం’’అని స్పష్టం చేశారు. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు.మా పెట్టుబడుల గమ్యస్థానం భారతే: మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్కు అతి పెద్ద ఏఐ పెట్టుబడుల గమ్యస్థానాల్లో భారత్ది అగ్ర స్థానమని సంస్థ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వెల్లడించారు. ఏఐ వినియోగంలో గ్లోబల్ సౌత్ దేశాలు భారత్ను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఈ విషయంలో గ్లోబల్ సౌత్ చేయాల్సింది ఎంతో ఉంది. డేటా సెంటర్లతో పాటు కనెక్టివిటీ, విద్యుత్... ఇలా మొత్తంగా మౌలిక సదుపాయాలన్నీ ఎంతగానో మెరుగవ్వాలి. ఇందుకు భారీ పెట్టుబడులు కావాలి. ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగమూ ముందుకొస్తేనే ఇది సాధ్యం. గ్లోబల్ సౌత్లో ఏఐ విస్తరణకు వచ్చే పదేళ్లలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించడానికి కారణం కూడా అదే’’అని వెల్లడించారు. తమ పెట్టుబడి ప్రణాళికల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టెక్నాలజీ అంతరాలను పూడ్చేందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ముఖ్యమే అయినా మానవ నైపుణ్యాలే అత్యంత కీలకమని స్మిత్ చెప్పారు.ఏఐ దుర్వినియోగ కట్టడిలో భారత్దే కీలకపాత్ర: దరియో ఏఐ వాడకం ఎన్నో సవాళ్లను తెరపైకి తెస్తోందని ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్ అభిప్రాయపడ్డారు. ఏఐ మోడళ్ల స్వతంత్ర ప్రవర్తన మరిన్ని సమస్యలకు దారితీస్తోందన్నారు. ‘‘వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఏఐ దుర్వినియోగం పెరిగిపోతోంది. మున్ముందు ఇది పెద్ద సమస్యగా మారనుంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. దాన్ని కట్టడి చేయడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. చారిత్రకంగా గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అన్ని విషయాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ ఫలాలు ఆయా దేశాలకు అందడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ వచి్చందన్నారు. ‘‘తొలి ఏఐ సదస్సు 2023లో జరిగింది. ఈ మూడు నాలుగేళ్లలోనే ఏఐ రంగం అనూహ్య ప్రగతి సాధించింది. వాణిజ్యపరంగానే గాక సామాజికంగా కూడా ఏఐ వాడకాన్ని దేశాలన్నీ పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు నైతిక సమస్యలు, సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వాటికి తక్షణం సమాధానాలు కనిపెట్టాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ సాంకేతికత పలు విషయాల్లో మానవ మేధను అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏఐ మోడళ్లు సూపర్ హ్యూమన్ సామర్థ్యాలతో పనులు చక్కబెట్టనున్నాయి. దేశాల మేధో సామర్థ్యమంతా ఇకపై డేటా సెంటర్లలో నిక్షిప్తం కానుంది. కనీవినీ ఎరగని ఈ పరిణామాలు మానవాళికి అవకాశాలతో పాటు మరెన్నో సవాళ్లను కూడా తేనున్నాయి. ఏఐతో అందివచ్చే అవకాశాల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా చికిత్స లేని రోగాలకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఏఐ వ్యవస్థల స్వతంత్ర పనితీరు విపరిణామాలకు దారి తీయవచ్చు. వ్యక్తులు, వ్యవస్థలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా వాటిని దుర్వినియోగం చేయవచ్చు’’అని అమొదెయ్ హెచ్చరించారు.గ్లోబల్ లీడర్గా భారత్: రషీద్ ప్రేమ్జీ ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగే సువర్ణావకాశం భారత్ ముందు ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రషీద్ ప్రేమ్జీ అన్నారు. ఈ విషయమై వచ్చే కొన్నేళ్లలో భారత్ తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలు కీలకమని అభిప్రాయపడ్డారు. దానిపైనే దేశ ఆర్థిక ప్రగతి, 140 కోట్ల ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారాలు ఆధారపడతాయన్నారు. ‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఏఐ టాలెంట్ పూల్ భారత్ సొంతం. ఇది తిరుగులేని సానుకూలత. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐకి, టాలెంట్కు మన దేశం గమ్యస్థానంగా మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా ఏకంగా 6.5 లక్షల మంది నిపుణులు ఏఐ, సంబంధిత రంగాల్లో నిత్యం కృషి చేస్తున్నారు. మరో ఏడాదిలో వారి సంఖ్య రెట్టింపు కానుంది. యూపీఏ పేమెంట్ల విధానం భారత్లో ఎంతగా సక్సెస్ అయిందో ప్రపంచమంతా చూస్తోంది. డీప్టెక్, ఏఐ స్పేస్లో 4,000 పై చిలుకు స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఏఐ పటిమను పెంచుకోగలిగితే అద్భుతాలు సాధ్యపడతాయి’’అని ప్రేమ్జీ చెప్పారు.ఏఐ ఎడ్యుకేషన్లో భారత్ భేష్: యాక్సెంచర్ విద్యా వ్యవస్థలో ఏఐని అంతర్భాగంగా తీర్చిదిద్దడంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ అన్నారు. ‘‘ప్రాథమిక విద్యలోనే ఏఐని భాగంగా చేయడం నిజంగా అభినందనీయం. దీన్ని అన్ని దేశాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది’’అని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఐ వర్క్ఫోర్స్ విషయంలో కూడా భారత్ అగ్ర స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘అభ్యసన నిరంతర ప్రక్రియ అన్నది ఏఐ రాకతో మరింత వాస్తవంగా మారింది. సంస్థలైనా, దేశాలైనా కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటేనే ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయి’’అని స్పష్టం చేశారు.భారత ఏఐ మోడల్స్ ప్రపంచానికి ఆదర్శం: ఫిలిప్స్ వైద్య రంగంలో భారత్ తయారు చేస్తున్న ఏఐ మోడళ్లు ప్రపంచానికి ఆదర్శమని రాయల్ ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్ అన్నారు. ఈ రంగంలో గ్లోబల్ మోడల్స్లో సంస్కరణలకు దారి చూపగల సత్తా వాటి సొంతమని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ సాంకేతికత అత్యంత ప్రభావం చూపగల రంగాల్లో ఆరోగ్యం కీలకమైనది. ఈ రంగంలో ఏఐ వాడకంలో భారత్ చాలా ముందుంది. దీనికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్ వంటివి నిదర్శనం. ఆరోగ్య రంగంలో భారత్ను గ్లోబల్ ఇన్నొవేషన్ ఇంజన్గా ఫిలిప్స్ పరిగణిస్తోంది’’అని చెప్పారు.దూకుడైన వ్యూహాలే మార్గం: మెటా ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టాలంటే సరైన విధానాలు, భారీ పెట్టుబడులతో పాటు దూకుడైన వ్యూహాలు కూడా చాలా కీలకమని టెక్నాలజీ దిగ్గజం మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ అన్నారు. దేశాలన్నీ దీనిపై తక్షణం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ టూల్స్ అన్ని అవసరాలనూ తీర్చేందుకు అనువుగా రూపొందాలి. అంతే తప్ప అన్నింటికీ ఒకే టెక్నాలజీ వాడుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాంతం, భాష, సంస్కృతి వంటివాటితో నిమిత్తం లేకుండా ప్రజలంతా ఏఐ టెక్నాలజీని సులువుగా వాడుకోగలగాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఒక్కతాటిపైకి వస్తేనే అది సాధ్యం’’అన్నారు. ఇందుకోసం ‘పర్సనల్ సూపర్ ఇంటలిజెన్స్’దిశగా మెటా కృషి చేస్తోందని గుర్తు చేశారు. మనుషుల బిజీ జీవితాలను చక్కగా ప్లాన్ చేయడం తదితరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు.ఇన్నొవేషన్కు భారత్ సారథ్యం: ష్నీడర్ ‘‘దేశాల ప్రగతి ప్రస్థానంలో కృత్రిమ మేధతో పాటు ఇంధన మేధ (ఎనర్జీ ఇంటలిజెన్స్–ఇంధన మేధ) పాత్ర కూడా నానాటికీ కీలకంగా మారుతోంది. ఆ రెండు రంగాలూ పరస్పరం అవిభాజ్యంగా రూపొందుతున్నాయ. అలాంటి ఈ కీలక రంగాల్లో గ్లోబల్ ఇన్నొవేషన్కు సారథ్యం వహించే సువర్ణావకాశం భారత్ ముందుంది’’అని ష్నీడర్ ఎలక్ట్రిక్ సీఈఓ ఒలివియర్ బ్లుమ్ అభిప్రాయపడ్డారు. ఆ రంగాలకు ప్రభుత్వ, పరిశ్రమపరంగా లభిస్తున్న బలమైన మద్దతే ఇందుకు కారణమని చెప్పారు. ఏ రంగంలోనైనా భారత్లో నిలదొక్కుకోగలిగిన సంస్థ ప్రపంచంలో మరెక్కడైనా రాణించవచ్చని చెప్పారు. ‘‘వ్యయ నియంత్రణ, ఇన్నొవేషన్, తిరుగులేని నైపుణ్యం, అపార మానవ వనరులతో ఏఐ విప్లవానికి భారత్ సారథిగా మారుతోంది. ఇంధనం, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ తదితరాల్లో తిరుగులేని సామర్థ్యాలు ఆ దేశానికి ఎంతగానో కలిసొస్తున్నాయి’’అని చెప్పారు.వికటించే రిస్కుతో జాగ్రత్త: నీలేకని ‘‘ఏఐ రంగంలో శరవేగంగా సాధిస్తున్న ప్రగతి అన్ని రంగాలకూ విస్తరించేలా చూడటం చాలా ముఖ్యం. తద్వారా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు అది ఉపయోగపడాలి’’అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. లేదంటే ఏదో ఒక దశలో ఏఐ టెక్నాలజీ వికటించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ తదితర వృత్తి నిపుణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ ఇండియా సదస్సులో భాగంగా ఏఐ ప్రభావం తదితరాలపై ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్తో నీలేకని ముచ్చటించారు. డీప్ఫేక్ సమస్య వంటి ఏఐ తాలూకు ప్రతికూల పార్శా్వలను కూడా ఆయన ఉదాహరించారు. -
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్నగర్లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్లోడ్లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు. -
ఏఐ.. ఆవిష్కరణలకు అడ్డంకి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)ను ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ఏరోడైనమిక్స్గా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. నియంత్రణలు లేకుండా సాధించే వేగవంతమైన వృద్ధి త్రైమాసిక నివేదికల్లో అద్భుతంగా కనిపించవచ్చు.., కానీ, సరైన భద్రతా చర్యలు లేకుంటే జరిగే ఒక్క చిన్న పొరపాటు దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్–2026లో.. గురువారం డిజిటల్ గవర్నెన్స్ అడ్వైజరీ, ఆల్ బ్రైట్ స్టోన్బ్రిడ్జ్ గ్రూప్ (డీజీఏ–ఏఎస్జీ) లాంటి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వైజరీ సంస్థల ప్రతినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణులను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేశారు. కీలకమైన కూడలిలోనే ఉన్నాం... ఈ సందర్భంగా ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ మాటలను మంత్రి శ్రీధర్ బాబు ఉటంకించారు. ‘ఖ్యాతిని గడించడానికి 20 ఏళ్లు పడితే, దానిని కోల్పోవడానికి కేవలం 5 నిమిషాలు చాలు‘అని బఫెట్ చెప్పినట్లుగానే నేడు ఏఐ విషయంలో మనం అలాంటి కీలక కూడలిలోనే ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు. విమానయాన రంగం ప్రారంభ దశలో భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. సీటు బెల్టులు, రాడార్ వంటి కఠినమైన భద్రతా ప్రమాణాలు ఆ రంగాన్ని ఆపలేదని, మరింత ఎత్తుకు ఎదగడానికి అవి అవకాశాన్ని కల్పించాయని గుర్తుచేశారు. ఏఐకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు.‘ప్రస్తుతం 80 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న హైదరాబాద్ వృద్ధిలో సగానికి పైగా మన టెక్ నిపుణుల కృషితోనే సాధ్యమైంది. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్గా ఎదగడం ద్వారా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే మా లక్ష్యం’అని చెప్పారు. ప్రొయాక్టివ్ గవర్నెన్స్లో భాగంగా 2027 నాటికి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సరీ్వసెస్ ప్లాట్ఫారమ్ (ఐడీఎస్పీ) ద్వారా 4 కోట్ల మంది పౌరులకు 300కు పైగా ప్రభుత్వ సేవలను అరచేతిలోనే అందించనున్నామని చెప్పారు. -
భవిష్యత్ అంతా ఏఐదే
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పైనే భవిష్యత్ ఆధారపడి ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఏఐ వేగం శాస్త్రీయ పురోగతి మాత్రమే కాదని, నేటి తరానికి దీని ఉపయోగం ఎంతో ఉందన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) నేతృత్వంలో సెంట్రల్ జోన్ వైస్ చాన్స్లర్ల సదస్సు ఉస్మానియా యూనివ ర్సిటీ కేంద్రంగా గురువారం ప్రారంభమైంది. గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న మార్పులను విశ్వవిద్యాలయాలు అందిపుచ్చు కోవాలని సూచించారు. ఏఐ వేగానికి భారతీయ నైతికత, విలువలు తోడవ్వాలని, అంతర్జాతీయ సాంకేతికత వేగంతో మన యవత పోటీ పడాలని, అవసరమైన నైపుణ్య విలు వలు పెంచేందుకు కృషి జరగాలన్నారు. ఈ దిశగా మేధో మథనం చేసేందుకు మేధావులు నడుం బిగించాలని పిలుపు నిచ్చారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ తర్వాత సాంకేతిక విప్లవం శరవేగంగా జరిగిందని, ఇప్పుడిది ప్రతీ వ్యక్తికీ నిత్యకృత్యమైందని తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏఐ, క్వాంటం మయంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన రీతిలో ఉన్నత విద్య బోధన విధానా న్ని మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పా రు. ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు కేవలం జ్ఞానాన్ని అందించేందుకే పరిమితం కాకూడదని, ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్గా మారాలన్నారు. విద్యార్థులను భావి సాంకేతికతకు సిద్ధం చేయాలని అధ్యా పకులను కోరారు. ఉస్మానియాలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ను స్మార్ట్ సిటీలు, మేధో రవాణా వ్యవస్థలు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం జాతీయ స్థాయి హబ్గా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. రేపటి తరాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఏఐ అధారిత పరిశోధనలు అవసరమని ఏఐయూ అధ్యక్షుడు ప్రొఫెసర్ వినయ్కుమార్ పాఠక్ అన్నారు. ఏఐ సమర్థవంతంగా ఉప యోగించుకోవాలని, ఈ దిశగా సదస్సు దిశా నిర్దేశం చేస్తుందన్న ఆశాభావం ఏఐయూ సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిత్తల్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ న్యూస్ ప్రత్యేక సంచికను గవర్నర్ ఆవిష్కరించారు. కార్య క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నరేష్ రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బిల్ గేట్సూ... మన నైతికత!
దాదాపు 48 గంటల ఊగిసలాట తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో భారీ యెత్తున జరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సులో గురువారం కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెనక్కి తగ్గారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చి, ఒక కేసులో శిక్ష కూడా పడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్తో సాన్నిహిత్యం ఉందని వెల్లడైనప్పటి నుంచి గేట్స్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే ఈ భంగపాటు. గురువారం నాటి ఏఐ సదస్సు కార్యక్రమం గురించి నిర్వాహకులు వెబ్సైట్లో మంగళవారం ఉంచిన జాబితాలో గేట్స్ పేరు లేదు. ఇక అక్కడినుంచి మొదలైంది ప్రహసనం! ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రస్తావన ఉంది గనుక ఆయన హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు చెప్పడం, అదేం కాదు... వస్తున్నారంటూ గేట్స్ ఫౌండేషన్ వివరణ, ఆ వెంటనే వెబ్సైట్లో మళ్లీ ఆయన పేరు దర్శనమీయటం, కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం తప్పించుకునే ధోరణిలో జవాబీయటం పెద్ద చర్చకు దారితీసింది. తెరవెనుక ఏం జరిగిందోగానీ... గేట్స్ హాజరు కాబోరని చివరి నిమిషంలో నిర్ధారణ అయింది. చిత్రమేమంటే... ఈలోగా సోమవారం ఆయన విశిష్ట అతిథిగా అమరావతిలో ప్రత్యక్షం కావటం, చంద్రబాబు పాలనను చూసి పొంగిపోయి ఉదారంగా ప్రశంసలు కురిపించటం పూర్తయిపోయింది. ఆయన్ను ‘తీసుకు రాగలినందుకు’ కూటమి పక్షాలన్నీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్న తరుణంలోనే పిడుగుపాటులా ఏఐ సదస్సు ఎపిసోడ్ వెల్లడై పరువు పాతాళానికి పడిపోయింది. అలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు సామాజిక మాధ్యమాల్లో చీవాట్లు మొదలయ్యాయి. ఆయన నేపథ్యాన్ని గమనించకుండా తీసుకొచ్చి పొగిడించుకున్నంత మాత్రాన భ్రమల్లో పడేదెవరు? ‘అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక...’ అన్న నానుడి బాబు మరిస్తే ఎలా?అయిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నా, ఇప్పటికీ ఎప్స్టీన్ ప్రేతాత్మ అనేకుల్ని వెన్నాడుతోంది. 30 లక్షల పేజీలున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను అమెరికా న్యాయశాఖ గత నెలలో బట్టబయలు చేసినప్పటినుంచీ పీఠాలు కదులుతున్నాయి. శిఖరాలు కూలు తున్నాయి. ఇందులో ఆడ, మగ కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధినేత క్లింటన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ తదితరుల పేర్లున్నాయి. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ గురువారం అరెస్టయ్యారు. బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మాన్ శాక్స్ న్యాయ సలహాదారు క్యాథరిన్ రుమెల్లర్ పదవికి రాజీనామా చేశారు. ఎంతో అయిష్టంగా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నానన్నందుకు ఆ సంస్థ చీఫ్ డేవిడ్ సోలొమాన్కు చీవాట్లు పడుతున్నాయి. ప్రముఖ నౌకా రవాణా నిర్వహణ సంస్థ డీపీ వరల్డ్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్ తప్పుకున్నారు. అమెరికా ప్రముఖ న్యాయ సహాయ సంస్థ పాల్వీస్ చీఫ్ బ్రాడ్ కార్ప్ రాజీనామా చేశారు. ఇంకా బ్రిటన్ మాజీ రాయబారి, ఎంపీ లార్డ్ పీటర్ మాండెల్సన్, శత కోటీశ్వరురాలైన బ్యాంకర్ అరియానే డి రోత్స్, ఆర్థికవేత్త లారీ సమ్మర్స్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ వగైరాల పేర్లున్నాయి. ఆఖరికి మన కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి అమెరికాలో రాయబారిగా ఉండగా ఆయనతో సంభాషించినందుకు ఈ ఫైల్స్లోకెక్కారు. వీరంతా ఎప్స్టీన్ నేరాల్లో భాగస్వాములని కాదు. ఈ మెయిళ్లలో అతన్ని ‘విలాస పురుషుడి’గా ప్రశంసించినవారు మొదలుకొని, అతగాడు అడిగిన పనులు చేసిపెట్టినవారి వరకూ ఎందరో ఉన్నారు. ఎవరినుంచి అయినా సమాజం నైతిక విలువలు ఆశిస్తుంది. అవి లోపించాయని గ్రహిస్తే ఎంతటివారినైనా తృణీకరిస్తుంది. బిల్ గేట్స్కు ఏపీలో నీరాజనాలు పట్టడం చూసినా, ఏఐ సదస్సులో ఆయన పాల్గొనటంపై బాహాటంగా బయటపడిన ఊగిసలాట గమనించినా ఈ విషయంలో మనం పాశ్చాత్య దేశాలకన్నా వెనకబడి ఉన్నామా అన్న సంశయం ఏర్పడి విచారం కలిగిస్తుంది. మన పురాణాలు, ఇతిహాసాలు మాత్రమే కాదు... మన రాజ్యాంగం సైతం మహిళల పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో చెబుతుంది. కానీ బిల్ గేట్స్ ఎపిసోడ్ ఆ విషయంలో మనకంతగా పట్టింపులేదన్న అభిప్రాయం కలిగిస్తుంది. -
ఏఐకి మానవ్ విజన్!
న్యూఢిల్లీ: ‘‘మానవాళి చరిత్రలో అతి గొప్ప పరివర్తనశీల అధ్యాయానికి ఏఐ నాంది పలికింది. అందులో భారత్ కేవలం ఒక భాగస్వామిగా మిగిలిపోలేదు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది’’అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవాళి ఇప్పుడు కీలక కూడలి వద్ద నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ ప్రస్థానాన్ని నేడు మనం ఏ దిశగా తీసుకెళ్తామన్నది మన రేపటిని, అంటే మానవాళి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) వెల్లువలో అంతిమంగా మనిషి కేవలం ముడిసరుకుగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తరాదు. జీపీఎస్ వంటి నావిగేషన్ టూల్స్ మనం ఏయే దారుల్లో వెళ్లొచ్చో సూచిస్తాయి. వాటిలో ఏ దారిని ఎంచుకోవాలన్న నిర్ణయం మాత్రం మనమే తీసుకుంటాం. అలాగే ఏఐ వాడకానికి ఆకాశమే హద్దు కావాలి. కానీ దాని నియంత్రణ మాత్రం నిత్యం మన చేతుల్లోనే ఉండాలి. అది జరగాలంటే ఏఐ వాడకాన్ని ప్రజాస్వామీకరించాలి. మనిషే ప్రధాన కేంద్రంగా దాని వినియోగం ఉండేలా సమగ్ర విధానాలు రూపొందించుకోవాలి’’అని పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాషియో లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలు, పలు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేశారు. ఏఐని అపారమైన శక్తి సామర్థ్యాలతో కూడిన పెన్నిధిగా ఆయన అభివరి్ణంచారు. ‘‘ఏఐ వాడకం ఆశించిన దిశగా సాగకుండా దారి మళ్లితే లక్ష్యసాధనకు బదులు వినాశనానికే దారితీస్తుంది. సజావుగా వాడినప్పుడు మాత్రమే మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రగతికి బాటలు పరుస్తుంది. అలా జరగాలంటే టెక్నాలజీ మనపై పెత్తనం చేయకూడదు. మనమే టెక్నాలజీని నియంత్రించాలి. అందుకోసం అన్ని రంగాల్లోనూ నానాటికీ కీలకంగా మారుతున్న అత్యాధునిక ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సమగ్ర విధానాలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం’’అని సూచించారు. ఇందుకోసం ‘మానవ్’విజన్ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. అంటే ‘నైతిక వ్యవస్థలు (మోరల్, ఎథికల్ సిస్టమ్స్–ఎం), జవాబుదారీతనంతో కూడిన పాలన (అకౌంటబుల్ గవర్నెన్స్–ఏ), దేశాల సార్వ¿ౌమత్వం (నేషనల్ సావర్నిటీ–(ఎన్), అందుబాటులో, సమ్మిళిత (యాక్సిసబుల్, ఇంక్లూజివ్–ఏ), ఆమోదయోగ్య, చట్టబద్ధ (వాలీడ్ అండ్ లెజిటిమేట్–వీ)’అని వివరించారు. ఈ విలువలు ఏఐ సమర్థ వాడకానికి దేశాలన్నింటికీ దారి చూపుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సార్వత్రిక సంక్షేమం, అందరికీ ఆనందమే ఏఐ వినియోగం విషయంలో భారత్ నిర్దేశించుకున్న ప్రమాణమని పేర్కొన్నారు. కనుకనే దాన్ని సదస్సు ఇతివృత్తంగా ఎంపిక చేసినట్టు వివరించారు. ‘‘ఏఐ అన్నివిధాలుగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అప్పు డు మాత్రమే అది సర్వ మానవాళికీ మేలు చేస్తుంది. ఇది నా నిశి్చతాభిప్రాయం’’అని స్పష్టం చేశారు. భారత్ సిద్ధం ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ ఏ మాత్రమూ వెనకాడటం లేదని మోదీ చెప్పారు. పైగా ఈ టెక్నాలజీని ఒక గొప్ప సంపదగా, బంగారు భవిష్యత్తుకు నమూనాగా పరిగణిస్తోందని దేశాధినేతలతో పాటు సభికులందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏఐ రంగంలో సూపర్ పవర్గా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యం, వనరులు, విధాన స్పష్టత తదితరాలన్నీ భారత్ సొంతమని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత సదస్సులోనే మూడు భారత కంపెనీలు తమ సరికొత్త ఏఐ మోడళ్లను, యాప్లను ఆవిష్కరించాయి. భారత యువతలో దాగున్న ప్రతిభకు ఇదే నిదర్శనం’’అని వివరించారు. ‘‘ఏఐ మన వ్యవస్థలన్నింటినీ మరింత తెలివైనవిగా, సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. ఇన్నొవేషన్లకు, పారిశ్రామికతకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఒక గొప్ప అవకాశంగా ఏఐ నిలుస్తోంది. ఏఐ టూల్స్ను అతి గోప్యంగా అభివృద్ధి చేయాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఏఐ సాంకేతికతను అందరితోనూ పూర్తిస్థాయిలో పంచుకోవాలన్నది మా విధానం. అప్పుడే కోట్లాది మంది యువతీ యువకులు మరింతగా ఎదుగుతారు. తద్వారా సార్వత్రిక ప్రగతి, ప్రపంచ శ్రేయస్సు సాధ్యమన్నది మా విశ్వాసం’’అని మోదీ వివరించారు. ‘‘మన భావి తరాలకు ఎటువంటి ఏఐ నమూనాను అందిస్తమన్నది చాలా ముఖ్యం. అది సాధికారత, సమ్మిళిత భావనతో కూడుకుని ఉండేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది’’అంటూ పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పర్మెలిన్, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రాంగులామ్, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్జాండర్ వుకిక్, సీషెల్స్ ప్రధాని సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓర్పో తదితర దేశాధినేతలు ఏఐ సదస్సులో పాల్గొన్నారు.ఏఐ.. మేలిమలుపు ‘‘మానవ చరిత్రలో పలు కీలక మైలురాళ్లున్నాయి. శతాబ్దాల పాటు అవి మన చరిత్రను తీర్చిదిద్దాయి. మన నాగరికతలను, అభివృద్ధి వేగాన్ని నిర్దేశించాయి. ఏఐ కూడా అలాంటి కీలక మార్పే’’అని మోదీ అన్నారు. ‘‘ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఇక్కడే ఉంది. టెక్నాలజీపరంగా అతి పెద్ద టాలెంట్ పూల్కు భారత్ నిలయం. కనుక ఏఐ ఇంపాక్ట్ సదస్సు భారత్లో జరుగుతుండటం చాలా సముచితంగా ఉంది’’అని మోదీ అన్నారు.సైగల భాషలో ప్రత్యక్ష తర్జుమా! న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆకర్షించింది. గురువారం సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఏఐ ఆధారిత సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటేషన్ పరిజ్ఞానం సాయంతో 11 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అంతేగాక ప్రసంగాన్ని సైగల భాషలోకి కూడా అనువదించి వేదికపై ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ప్రదర్శించడం విశేషం. -
రఫేల్ విమానాలపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ యువర్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్- ఫ్రాన్స్ల మధ్య రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత్ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, దసో ఏవియేషన్కు మధ్య జరుగుతున్న చర్చల్లో రఫేల్ కొనుగోళ్లు ఓ భాగం. దీనిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ డీల్ భారత్ను సైనికపరంగా మరింత శక్తిమంతం చేస్తుంది. స్థానికంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.ఇటీవల భారత్- ఫ్రాన్స్ల మధ్య సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని నిర్ణయించాం. ఇందులో రఫేల్ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరిక మేరకు.. ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికే పెద్దపీట వేస్తామని మాక్రాన్ హామీ ఇచ్చారు. గరిష్ట సంఖ్యలో భారతీయ విడిభాగాలు, కీలక పరికరాలను భారత్లోనే తయారు చేయడానికి, నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. -
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? -
‘నేషనల్ ఏఐ ప్లాన్’తో దూకుడు..
సోషల్ మీడియా వినియోగానికి పలు నిబంధనలు విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఏఐ సాయంతో మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. నిన్నటి వరకు 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసిన ఆ కంగారూ గడ్డ.. కృత్రిమ మేధతో అత్యాదునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేసింది. ఆస్ట్రేలియా వేస్తున్న ఈ అడుగులు ప్రపంచ టెక్ దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏఐ కారణంగా ముంచుకొస్తున్న ముప్పును ముందే పసిగట్టి, దేశాన్ని డిజిటల్ గాడిలో పెట్టేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా వ్యూహం ఏమిటి?సోషల్ మీడియా బ్యాన్ తర్వాత..16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా, ఇప్పుడు టెక్ ప్రపంచంలో మరో కీలక ముందడుగు వేసింది. కేవలం నిషేధాలతోనే సరిపెట్టకుండా, భవిష్యత్తు సాంకేతికత అయిన కృత్రిమ మేధను (ఏఐ)ఒక క్రమపద్ధతిలో గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఆస్ట్రేలియా తన ‘నేషనల్ ఏఐ ప్లాన్’ను అధికారికంగా ప్రకటించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.కొత్త చట్టాలు లేవు.. పాతవే పక్కాగా..సాధారణంగా ఏవైనా నూతన సాంకేతికతలు వచ్చినప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుంది. కానీ ఆస్ట్రేలియా ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. ఏఐ నియంత్రణ కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాలు తీసుకురావడానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న వాటినే ఉపయోగించి కొత్త రిస్క్లను అరికట్టాలని నిర్ణయించింది. దీనివల్ల అనవసరమైన జాప్యం లేకుండా తక్షణమే నియంత్రణ సాధ్యమవుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.ప్రభుత్వ సంస్థలకే బాధ్యతఈ ప్రణాళికలో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, రెగ్యులేటరీ సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. తమ పరిధిలోని రంగాల్లో ఏఐ వల్ల ఎలాంటి హాని కలుగుతుందో గుర్తించి, వాటిని అడ్డుకోవడంలో ఆయా సంస్థలే ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, ప్రజల భద్రతను పణంగా పెట్టకుండా, సమతుల్యం పాటించడం ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా తెలుస్తోంది.మూడు అంశాల వ్యూహంఆస్ట్రేలియా ప్రకటించిన ఈ జాతీయ ఏఐ ప్రణాళిక ప్రధానంగా మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది. మొదటిది అత్యాధునిక డేటా సెంటర్ల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. రెండవది ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా చూస్తూనే, పౌరుల్లో ఏఐ నైపుణ్యాలను పెంచడం. మూడవది ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం. ఈ మూడు లక్ష్యాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ఈ ప్రణాళికలో అత్యంత ఆసక్తికరమైన అంశం 'ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్' ఏర్పాటు. 2026 నాటికి ఈ ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సాంకేతికత ఎంత వేగంగా పెరిగినా, దానికి తగినట్లుగా ప్రభుత్వ స్పందనను సిద్ధం చేయడంలో ఈ ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషించనుంది.చాట్ జిపిటి, జెమినిపై నిఘాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న జనరేటివ్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమిని వల్ల కలిగే ప్రమాదాలను అంచనా వేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త ప్రణాళికను వాడుకోనుంది. వీటి ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, భద్రతా పరమైన లొసుగులు తలెత్తకుండా నిరంతరం నిఘా ఉంచడం ఈ వ్యూహంలో భాగం.భద్రతతో కూడిన సాంకేతిక ప్రగతి‘సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా ప్రణాళికను మరింత బలోపేతం చేస్తాం’ అని ఫెడరల్ ఇండస్ట్రీ మినిస్టర్ టిమ్ ఐర్స్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియన్లందరికీ సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అటు సాంకేతిక పురోగతిని, ఇటు సామాజిక భద్రతను ఒకేసారి సాధించే దిశగా ఆస్ట్రేలియా వేస్తున్న అడుగులు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్కు రండి’ -
AI Summit 2026: ప్రపంచానికి దిక్సూచిగా భారత్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు రెండో రోజు(మంగళవారం) అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుడి సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.అందుబాటులోకి ఏఐ కళ్లద్దాలుఈ సందర్భంగా భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘సర్వం కాజే’ (Sarvam Kaze) అనే ఏఐ వేరబుల్ పరికరాన్ని ధరించి ఆయన స్వయంగా పరీక్షించారు. ఇది చూడడానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగా ఉన్నప్పటికీ, అత్యాధునిక ఏఐ సాంకేతికతను కలిగి ఉంది. రాబోయే మే నెల నుంచి ఈ స్వదేశీ పరికరాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని సదస్సులో ప్రతినిధులు వెల్లడించారు.#WATCH | Delhi | Union Minister Rajiv Ranjan, Bihar Deputy CM Samrat Choudhary, JD(U) MP Sanjay Kumar Jha and Bihar Minister Dilip Jaiswal visit the Bihar pavilion at #IndiaAIImpactSummit2026 pic.twitter.com/XX8lBiQmyO— ANI (@ANI) February 17, 2026విద్యా రంగంలో సరికొత్త విప్లవంభారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాబోయే కాలంలో డేటా సెంటర్ల రంగంలో సుమారు 200 బిలియన్ డాలర్ల(రూ.18.15 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. మరోవైపు, విద్యా రంగంలో ఏఐ పాత్రపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, రాబోయే తరానికి ఏఐ ఆధారిత విద్యను అందించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.#WATCH | Delhi: India AI Impact Summit 2026 | Dr Ramanand, Founder-Director, Centre of Policy Research and Governance (CPRG) says, "The AI Summit is being held in India. The first Summit was held in France. After Europe, it is being held in India, and India is being looked at… pic.twitter.com/2IGiJgtryp— ANI (@ANI) February 17, 2026చాట్ జీపీటీతో భారత్కు అత్యధిక ప్రయోజనంజోహో (ZOHO) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏఐ ఒక అద్భుతమైన ‘లెర్నింగ్ బూస్టర్’లా పనిచేస్తుందని, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇది గొప్ప సాధనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధిలో సమానత్వం ఉండాలని, లేకపోతే ప్రపంచ సమాజంలో తీవ్ర అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ హెచ్చరించారు. చాట్ జీపీటీ (ChatGPT) వంటి సంస్థలకు అమెరికా కంటే భారత్ 33 శాతం ఎక్కువ డేటాను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఏఐతో మరిన్ని ఉపాధి అవకాశాలుగ్లోబల్ సౌత్ దేశాలు కేవలం డేటాను అందించే వనరులుగా మాత్రమే మిగిలిపోకూడదని, ఈ సాంకేతికత వల్ల కలిగే లాభాల్లో వీరికి సమాన వాటా దక్కాలని ప్యానెల్ చర్చల్లో అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చుతూ, ఈ సాంకేతికత కొత్త తరహాలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమితాబ్ కాంత్ అన్నారు. India AI Impact Expo 2026 was a powerful convergence of ideas, innovation and intent.It showcased the extraordinary potential of Indian talent in shaping the future of Artificial Intelligence for global good.Above all, it reaffirmed our commitment to harnessing AI… pic.twitter.com/jfVWCP4BHh— Narendra Modi (@narendramodi) February 17, 2026చిన్నారుల భద్రతపై కీలక చర్చలుఈ మెగా సమిట్కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. బిల్ గేట్స్ ఈ సదస్సులో పాల్గొంటారని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేయగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా హాజరుకానున్నారు. సుమారు 20 దేశాల అధినేతలు, 60 మందికి పైగా మంత్రులు ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. సదస్సులో భాగంగా చిన్నారుల భద్రతపై కీలక చర్చలు జరిగాయి. వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని నిపుణులు సూచించారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని, అయితే డిజిటల్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ -
ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత మండపంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలు కంపెనీలు, స్టార్టప్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన కలియదిరిగారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులతో మాటలు కలిపారు. వారి పరిశోధనలు తదితరాలను గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ దాకా జరిగే ఈ ఐదు రోజుల సదస్సులో 600కు పైగా భారీ స్థాయి స్టార్టప్లు పాలుపంచుకోనున్నాయి. వాటితో పాటు 13 దేశాలకు చెందిన ఏఐ పెవీలియన్లు తమ ప్రత్యేకతను చాటేందుకు సిద్ధమయ్యాయి. గ్లోబల్ సౌత్లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు 20 మందికి పైగా దేశాధినేతలు, 60కి పైగా దేశాల నుంచి మంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు పలు ఏఐ దిగ్గజ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు కూడా హాజరై ఈ రంగంలో విస్తరణకు అమలు చేయదలచిన ప్రణాళికలు తదితరాలను ఆహూతులతో పంచుకోనున్నారు. 19వ తేదీన సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అదే తేదీన మాక్రాన్ కూడా సదస్సులో పాల్గొంటున్నారు. భారత్కే గాక ప్రపంచమంతటికీ పలు రంగాలకు సంబంధించిన కీలక సవాళ్లకు ఈ సదస్సు సమర్థమైన పరిష్కారాలు చూపగలదని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. ఇన్నొవేటర్లు, పరిశోధకులు, టెక్ ఔత్సాహికుల నడుమ గడపడం ఎనలేని ఆనందాన్ని ఇచి్చనట్టు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఇండియా ఏఐ ఎక్స్పోను ప్రారంభించా. ఇంతటి కీలకమైన సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుండటం హర్షణీయం’’అన్నారు. ‘గ్లోబల్ ఏఐ గవర్నెన్స్’కు ఈ సదస్సు స్పష్టమైన రోడ్మ్యాప్ను అందజేస్తుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. అంతకుముందు వేదిక వద్ద జియో ఏఐ ఎకో సిస్టమ్స్ స్టాల్ను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. తొలి రోజు విస్తృత చర్చలు ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోకు కేంద్రం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారత్ మండపంలో 10 వేదికల్లో 70 వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ప్రాంతంలో స్టాళ్లు, స్టార్టప్లు, ఏఐ వేదికలు కనువిందు చేస్తున్నాయి. సోమవారం ఉదయానికే భారీ సంఖ్యలో తరలివచి్చన పలు ప్రఖ్యాత ఏఐ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు తదితరులతో వేదికతో పాటు పరిసరాల్లోని హాల్లన్నీ నిండిపోయాయి. వారంతా బృందాలుగా ఏర్పడి పలు రంగాల్లో ఏఐ ప్రభావం, దాని మంచిచెడులను గురించి చర్చోపచర్చల్లో మునిగితేలారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ స్థాయి దిగ్గజ ఏఐ సంస్థలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి పరస్పరం అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నాయి. ఏఐ దెబ్బకు పలు రంగాల్లో భారీగా కొనసాగుతున్న కొలువుల కోత మొదలుకుని బాలల భద్రత దాకా భిన్నమైన అంశాలు, సమస్యలపై చర్చలు, పరిష్కార మార్గాల అన్వేషణకు సదస్సు వేదిక కానుంది. 13కు పైగా దేశాలు ఇప్పటికే మండపంలో ప్రత్యేక పెవీలియన్లు ఏర్పాటు చేశాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజకిస్తాన్ వంటివి వీటిలో ఉన్నాయి. 300కు పైగా క్యూరేటెడ్ ఎగ్జిబిషన్ పెవీలియన్లు ఆకట్టుకోనున్నాయి. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ థీమ్తో కూడిన లైవ్ డెమాన్్రస్టేషన్లు కంపెనీల ఏఐ ప్రణాళికలను కళ్లకు కట్టనున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా ఏఐ సదస్సును సందర్శిస్తారని భావిస్తున్నారు. -
డాక్టర్ ఏఐతో తస్మాత్ జాగ్రత్త!
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్ గైడెన్స్) డిజిటల్ యాప్లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో అవి చేసే సిఫార్సులు ఒక్కోసారి పెద్దపెద్ద ముప్పులు తెచ్చిపెడుతున్నాయంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ హెచ్చరిస్తోంది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కాలూనని రంగమంటూ ఏదీ లేదు. చట్టాలూ, సాఫ్ట్వేర్, విద్యా, వినోదంతో పాటు ఆఖరికి లక్షలాది మెడికల్ కేసుల అనుభవంతో వైద్య విద్య, చికిత్సల్లో కూడా అది పాలుపంచుకుంటోంది. ఇక చైనాలాంటి దేశాలైతే ఏఐతో నడిచే క్లినిక్లూ, హాస్పిటళ్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. మిగతా రంగాలెలా ఉన్నప్పటికీ... వైద్యరంగంలో మాత్రం ఏఐతో కొన్ని తప్పులూ, పొరబాట్లు జరుగుతున్నాయనీ, ఇవి ఆందోళన గొలిపేలా ఉన్నాయంటూ డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న నిపుణులు బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ పేషెంట్లు తమంతట తామే ఏఐకు తమ సమస్య చెప్పుకుని ఆ మేరకు వైద్య సలహా పొందితే అది ఆందోళనకరంగా పరిణమించేందుకు అవకాశాలు లేకపోలేదంటూ హెచ్చరిస్తున్నారు. టర్కీ (తుర్కియా) రాజధాని అంకారాలోని ఒక హాస్పిటల్కు వచ్చిన ఒక పేషెంట్ తాలూకు కేస్స్టడీతో ఒక సంఘటన వెలుగుచూసింది. అదేమిటంటే... ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ సెమ్ అక్సోయ్ అనే డాక్టర్ దగ్గరికి కౌమార వయస్సులో ఉన్న ఓ పద్ధెనిమిదేళ్ల పిల్లాడు వచ్చాడు. అతడికి కాలిలో క్యాన్సర్ గడ్డ ఉందని నిర్ధారణ అయ్యాక తన కేసు వివరాలను ‘ఏఐ’కి సంబంధించిన చాట్ జీపీటీకి తెలిపి తనకు సలహా ఇవ్వాలంటూ కోరాడు. అంతే... ‘‘నువ్వు ఐదేళ్లకు మించి బతకవు’’ అంటూ ఏఐ సమాధానమిచ్చింది. ఈ సమాచారం ఆ కుర్రాడిని ఎంతగా ఆందోళనపరిచి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. కానీ ఓ సర్జికల్ ఆంకాలజిస్టూ, ఓ ΄్లాస్టిక్ సర్జన్ నిర్వహించిన సర్జరీల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు... ‘‘ఇప్పుడు నీలోంచి క్యాన్సర్ తొలగిపోయినట్టే’’ అంటూ భరోసా కూడా ఇచ్చారు. అయితే మళ్లీ అదే అబ్బాయి కొన్ని వారాల తర్వాత డాక్టర్ అక్సోయ్కు మరోసారి ఫోన్ చేశాడు. ఈసారి వచ్చిన ఫోన్ సందేశంలోని సందేహమేమిటంటే... ‘‘నాకు తరచూ దగ్గు వస్తోంది. అంటే మొన్నటి క్యాన్సర్ ఇప్పుడు ఊపిరితిత్తులకు సోకిందంటారా?’’ అని అతడు ప్రశ్నించాడు. అయితే డాక్టర్లు అతడి ఊపిరితిత్తులను పూర్తిగా పరీక్షించాక తేలిందేమిటంటే అతడికి క్యాన్సర్ ఏమాత్రం లేదు. అయితే... ఆ పిల్లాడు ఈమధ్య సిగరెట్లు తాగడం మొదలుపెట్టడమే అతడి దగ్గుకు కారణమని తేలింది. ‘‘ఏదైనా వ్యాధి నిర్ధారణ చేయాలంటూ కేవలం లక్షణాలను మాత్రమే చూడకూడదు. అతడికి ఆ లక్షణాలు కనిపిస్తున్న సందర్భాలనూ పరిశీలించాలి. ఆ యువకుడు ఇటీవల పొగతాగడం మొదలుపెట్టినందువల్ల దగ్గు వచ్చిందని తేలింది. వైద్యవిజ్ఞాన సమారమంతా ఓ దట్టమైన అడవి అయితే... ఇలా అరకొర పరిజ్ఞానంతో అందులో తిరగడమన్నది దారీతెన్నూ తెలియకుండా అందులో తప్పిపోవడం లాంటిదం’’టూ డాక్టర్ అక్సోయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘ఏఐ’ సంస్థలకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ఇలాంటి అనుభవాల తర్వాత... ఏఐ అడగాల్సిన ప్రశ్నలను నమోదు చేస్తూ కృత్రిమ మేధ మరింత సమర్థంగా, పరిపుష్టంగా పనిచేసేలా మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధ ఎప్పటికీ ఓ డాక్టర్ / మెడికల్ ప్రొఫెషనల్కు మంచి ప్రత్యామ్నాయం కాబోదంటూ ఆయన తెలిపారు. ఇక్కడ ఈ టర్కిష్ అబ్బాయి ఉదంతం రెండు అంశాలను సూచిస్తోంది. మొదటిది... ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు... తాము హాస్పిటళ్ల వరకూ వెళ్లాల్సిన శ్రమ తప్పడం కోసం అలాగే తమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెక్నాలజీ ఆధారిత సలహాల మీద ఎలా ఆధారపడుతున్నారనే అంశం. ఇక రెండోది... ఏఐ ఆధారిత చాట్బాట్లు తమకున్న పరిజ్ఞానంతో సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో తెలపడం కోసం ఈ టర్కీ అబ్బాయి ఉదంతమే ఒక తార్కాణం.మేర దాటుతున్న మేధ... ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని మెడికల్ యాప్స్ తమ నైతిక పరిధులను దాటుతున్నాయి. ఉదాహరణకు ‘యురేకా హెల్త్’ అనే ఓ యాప్ తనను తాను ‘‘ఆల్ ఇన్ వన్ హెల్త్ కంపేనియన్’గా ప్రకటించుకుంది. అంటే... ఆరోగ్యం విషయంలో అన్ని వ్యాధుల నిపుణుడూ తానే అయిపోయి ఆరోగ్య సమాచారాన్ని తెలుపుతానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఆపిల్ యాప్ స్టోర్ మాత్రం కొంత సంయమనం పాటిస్తూ... ‘‘ఇది కేవలం తగిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే. తాను వ్యాధి నిర్ధారణగానీ లేదా చికిత్సగానీ చేయడానికి తగనం’’టూ’’ స్పష్టం చేస్తోంది. కానీ దాన్ని అభివృద్ధి చేసిన సంస్థవాళ్లు మాత్రం ‘మీకు మీరే మీ డాక్టర్’ అంటూ ప్రచారాలు చేసేస్తున్నారు. అలాగే ‘‘ఆస్క్, డయాగ్నోజ్, ట్రీట్’’ అనే మరో సైట్ వాళ్లు మరికాస్త ముందుకెళ్లి ‘‘మా ఐఏ వ్యాధి నిర్ధారణా చేసేస్తుంది. వాడాల్సిన మందుల్ని సూచిస్తూ ప్రిస్క్రిప్షన్ కూడా రాసేస్తుంది. ఈ ప్రపంచంలోని హాస్పి టల్స్లో వాస్తవంగా మీకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో దాన్ని ఇక్కడే మీకు సూచిస్తుంది’’ అంటూ గొప్పలకు పోతున్నారు. అయితే... రాయిటర్స్ సంస్థలో వచ్చిన వార్తల వల్ల... ‘‘యురేకా హెల్త్’’ యాప్ కారణంగా జరిగిన అనర్థాలను తెలుసుకున్న తర్వాత ‘ఆపిల్’ సంస్థ సదరు యాప్ను తమ స్టోర్నుంచి తొలగించింది. అంతే కాదు... ఏ సమాచారం ఆధారంగా; ఏ పద్ధతుల ద్వారా; ఏయే అంశాల సహాయంతో వ్యాధి నిర్ధారణ విషయంలో ఆ నిర్ధారణకు వస్తున్నారో స్పష్టంగా తెలపాలంటూ యాప్ను అభివృద్ధి చేసే నిపుణులకు స్పష్టమైన సూచనలు చేసింది.మెడికల్ యాప్స్!ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో గూగుల్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే మెడికల్ యాప్ల సంఖ్య బాగా పెరిగింది. నిజానికి అవి ఎలాంటి వ్యాధి నిర్ధారణా చేయకూడదు. అయినప్పటికీ వాటిని ఆశ్రయించి... తమ సమస్య ఏమిటో తెలుసుకోవడమన్నది చాలా ఎక్కువైంది. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. నిజానికి ఏఐ ఎలాంటి వ్యాధినిర్ధారణా (డయాగ్నోజ్) చేయకూడదు. కానీ యూఎస్ ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నియమాల ప్రకారం... ప్రజల ప్రాథమిక అవగాహన కోసమే సమాచారం తెలిపే సందర్భాల్లో ఆ చాట్బాట్లు ఎవరి అనుమతులూ తీసుకోనక్కర్లేదు. అందుకోసమే ‘‘తాము డాక్టర్కు ప్రత్యామ్నాయం కానేకాదనీ,వ్యాధిని నిర్ణయించడంలో విషయంలో తాము చేసేది ‘తుది నిర్ధారణ’ కాదం’’టూ స్పష్టంగా సూచన (డిస్కె›్లయిమర్) చేస్తుంటాయి. – యాసీన్ -
వడివడిగా ఏఐ దిశగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్–విస్తార్ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, బ్లాక్స్టోన్ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్ జీపీటీ మోడల్ను తీసుకొచ్చిన సామ్ ఆల్ట్మాన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ... నిరుడు జనవరిలో డీప్సీక్ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్సీక్పై భారీ స్థాయి సైబర్ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్సీక్ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3 ఓపస్ మోడళ్లు చాట్ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి. -
నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు
న్యూఢిల్లీ: విద్యుత్ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, డీప్మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబీస్, ఆంత్రోపిక్ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 2025లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్లో, 2023లో బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం విని్పస్తున్నాం. ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. ఏఐ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.భారతీయ ఏఐపైనే దృష్టి ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్ మోడల్ పిల్లర్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్, మల్టీ లింగ్వల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం), స్పీచ్–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్ కోసం జనరేటివ్ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్ సిములేషన్, మెటీరియల్ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్ ఎక్స్పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్పోలో 600కుపైగా కీలక స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. డేటా కేంద్రంగా మార్చండి‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్ఫా మ్లు, డివైజ్ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.సరైన వేదిక భారత్: గుటెరస్ ‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్పవర్ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. -
‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాల్లో విస్తరిస్తున్న భారత్ ప్రభావంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కీలక అంశాలపై ప్రపంచ స్థాయి చర్చలు నిర్వహించడానికి భారత్ అత్యంత అనువైన దేశమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధి పథంలో ఉందని, ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఏఐ సాంకేతికత మానవాళి అందరికీ ఉపయోగపడాలని ఆంటోనియో గుటెర్రెస్ ఆకాంక్షించారు.ఏఐ సాంకేతికత కేవలం ధనిక దేశాలకో లేదా రెండు అగ్రరాజ్యాలకే (అమెరికా, చైనా) పరిమితం కాకూడదని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ శక్తివంతమైన సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని, ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దేశాలకు ఇందులో సమాన వాటా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఈ అధికారం ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, అభివృద్ధి, ఆవిష్కరణలు, ప్రపంచ ప్రగతికి ఏఐ ఒక సార్వత్రిక సాధనంగా మారాలని ఆయన అన్నారు.ఫిబ్రవరి 16 నుండి 20 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సు, గ్లోబల్ సౌత్లో జరుగుతున్న మొట్టమొదటి భారీ ఏఐ సదస్సుగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తదితర దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు గుటెర్రెస్ స్వయంగా భారత్కు రానున్నారు.కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు రావాలని, నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. భారత ప్రాచీన నాగరికత, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనియాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. -
రూ .300 లకు కొన్న 2 అక్షరాలు.. ఇప్పుడు రూ .634 కోట్లు
అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.ఏఐ బూమ్తో పెరిగిన విలువగత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.రూ.634 కోట్ల డీల్2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫారమ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది. -
ఐఐఎం లక్నోలో 3 కొత్త ఏఐ కోర్సులు
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు చేరువచేయాలనే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(లక్నో) గురువారం మూడు ఏఐ కొత్త కోర్సులను అందుబాటులోకి తెచి్చందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) ఇన్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, టెక్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ సైన్స్ + టెక్ ఎంబీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చారని ఆయన వెల్లడించారు. గురువారం ఢిల్లీలో జరిగిన భారత్ బోధన్ ఏఐ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘‘నైతిక ఏఐలో భారత్ను ప్రపంచ అగ్రగామిగా అవతరింపజేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మేనేజ్మెంట్ విద్యతోపాటు ఆవిష్కరణలు, రియల్ వరల్డ్ సోషియాటిక్ అప్లికేషన్లలో ఏఐ కోర్సులను విస్తృతంగా అందించాలని బిజినెస్ స్కూళ్లకు సూచిస్తున్నాం. ఏఐ ఆధారిత భవిష్యత్తుకు తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేయడంతోపాటు మానవీయ విలువలను పెంపొందిస్తూ జాతీయాభివృద్ధికి సాంకేతికత దోహదపడేలా చేయండి’’అని బిజినెస్ స్కూళ్లకు మంత్రి పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువ కారి్మకశక్తితో అలరారే భారత్లో దేశీయంగా ఏఐ మోడళ్లను తయారుచేసుకునే అద్భుత అవకాశం దాగి ఉంది. ఇది ప్రపంచ సమస్యలనూ తీర్చగలదు అని చెప్పారు. -
‘కృత్రిమ’ ధోరణులపై కొరడా
డిజిటల్ ప్రపంచంలో కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా వేషం మార్చుకుని మోసగిస్తున్న మాయగాళ్ల పనిపట్టడానికి కేంద్రం నడుం బిగించింది. 2021లో తెచ్చిన సమాచార సాంకేతికత(ఐటీ) నిబంధనల్ని సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకప్పుడు వదంతులుగా, లేదా తప్పుడు ప్రచారంగా చలామణీ అయిన ప్రతిదీ ఇప్పుడు అసలుగా భ్రమింపజేసే వీడియోలు, ఆడియోలుగా మారిపోతోంది. ఏది నిజమో, ఏది కాదో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎన్నికల్లో సామాన్య జనాన్ని ఏమార్చటానికి ప్రయత్నించటం దగ్గర నుంచి... మనుషుల్లో క్రౌర్యాన్నీ, హైన్యాన్నీ, నీచప్రవృత్తినీ ప్రేరేపించే, భావోద్వేగాలను రెచ్చగొట్టే ధోరణి గలవన్నీ డిజిటల్ ప్రపంచంలో స్వైరవిహారం చేస్తున్నాయి. వాటి ప్రభావంతో మనుషులు స్వీయనియంత్రణను కోల్పోయి, మానసిక దుర్బలులవుతున్నారు. కొందరు వ్యామోహాలకు లోనై నిలువుదోపిడీ ఇచ్చుకుంటున్నారు. ఆనక లబోదిబోమంటున్నారు. నిత్యజీవిత ఆచరణ ద్వారా, అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా ఒక క్రమపద్ధతిలో రావలసిన జ్ఞానాన్ని కృత్రిమ మేధ అడ్డుకుని, వారిలోని విచక్షణను ఆవిరి చేస్తోంది.లింగవివక్ష అధికంగా ఉన్న సమాజాల్లో సహజంగానే మహిళలు ఈ సాంకేతికతల వల్ల బాధితులవుతున్నారు. ప్రపంచమంతటా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. బుడి బుడి నడకల్లో ఉన్న బుడతల దగ్గర్నుంచి, వృద్ధుల వరకూ అందరికందరూ దీని ప్రభావం నుంచి తప్పించు కోలేకపోతున్నారు. ఇందులో పొంచివున్న ప్రమాదాన్ని అందరి కన్నా ముందు పసిగట్టింది యూరోపియన్ యూనియన్(ఈయూ). అది రెండు మూడేళ్లపాటు శ్రమించి 2024లో తెచ్చిన ఈయూ కృత్రిమ మేధ(నియంత్రణ) చట్టం ఉన్నంతలో సమగ్రమైనది. అయితే ఆ చట్టం వచ్చేనాటికి డీప్ లెర్నింగ్ సాంకేతికత బీజప్రాయంలో ఉంది. దాంతో తయారయ్యే నకిలీ(ఫేక్)ని చెప్పడానికి ‘డీప్ఫేక్’ పదం ఇటీవల వాడుకలోకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లోని కంటెంట్ వల్ల ఏర్పడగల ప్రమాదతీవ్రత ఆధారంగా ఆ చట్టం వాటిని నాలుగు రకాలుగా – అంగీకారయోగ్యం కానివి, అధిక ప్రమాదంతో కూడుకున్నవి, పరిమితంగా ప్రమాదకరమైనవి, కనిష్ఠ ప్రమాదం ఉన్నవిగా వర్గీకరించింది. మన ప్రభుత్వం ఇప్పుడు రూపొందించిన నిబంధనలు వినియోగదారుడి రక్షణ, దేశభద్రతనూ ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాయి. ఈ నెల 20 నుంచి అమల్లోకొచ్చే ఆ నిబంధనలు ఇకపై ఏఐ ఆధారంగా రూపొందే ఎలాంటి కంటెంట్కైనా ఆ విషయాన్ని స్పష్టంగా సూచించటం తప్పనిసరి చేశాయి. అలాగే అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, తప్పుడుగా ఉన్నాయని ప్రభుత్వాలు, లేదా న్యాయస్థానాలు నిర్ధారించి తొలగించమని ఆదేశిస్తే... మూడు గంటల్లో శిరసావహించాలి. పాక్షిక లేదా పూర్తి నగ్నంగా చిత్రించే ఫొటోలు, వీడియోలు, శృంగార సంబంధిత కంటెంట్పై అభ్యంతరాలు వ్యక్తమైన రెండు గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 36 గంటల గడువును వాటి తీవ్రతను బట్టి తగ్గించారు. హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నపక్షంలో అది తయారు చేసిందెవరో, అప్లోడ్ చేసిందెవరో కూపీలాగే ఉపకరణాలను సామాజిక మాధ్యమాలు రూపొందించుకోవటం తప్పనిసరి చేశారు.అయితే మన ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రతిస్పందన ప్రాతిపదికగా ఉంది. రూపొందే కంటెంట్ ఏ పరిమితుల్లో ఉండాలన్నది ఈయూ చట్టం ముందస్తుగా నిర్దేశిస్తోంది. ఏ సామాజిక మాధ్యమమైనా ఉల్లంఘించిన పక్షంలో మన నిబంధనలు క్రిమినల్ కేసులకు మొగ్గుచూపుతుండగా, ఈయూ చట్టం నిర్లక్ష్యం వహించిన సామాజిక మాధ్యమానికి దాని ప్రపంచవ్యాప్త టర్నోవర్లో 7 శాతం వరకూ జరిమానా విధిస్తోంది. మారుతున్న సాంకేతికతల్ని ఆసరాగా చేసుకుని ప్రతిరోజూ, ప్రతి నిమిషమూ వచ్చి పడుతున్న కంటెంట్ను అరికట్టడానికి నిబంధనలు ఏర్పర్చటం, చట్టాలు రూపొందించటం ఏ దేశంలో పాలకులకైనా పెను సవాలు. అంతకన్నా ముఖ్యం... అవి దుర్విని యోగం కాకుండా చూడటం! కుల, మత, రాజకీయ వివక్షతో సద్విమర్శలను నేరపూరితం చేసే ధోరణులు భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. సద్భావంతో చేసే సృజనాత్మ కతకు శాపంగా పరిణమిస్తాయి. బహుపరాక్! -
‘స్టార్ట్’కి చెదలు!
అడిగేవారు లేకపోతే, జవాబుదారీతనం కొరవడితే... ఎక్కడైనా ఇష్టారాజ్యం తప్పదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్టు రెచ్చిపోతున్నాయి. అణ్వాయుధాల వల్ల భూగోళానికి పెను ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ప్రజానీకం దశాబ్దాల పాటు ఒత్తిళ్లు తెచ్చిన పర్యవసానంగా ఆ రెండింటి మధ్యా 1991లో మొదటిసారి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు(స్టార్ట్)–1 ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో 2010లో ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం సాకారం కాగా, దానికి ఈనెల 5తో నూకలు చెల్లాయి. ఆ విషయంలో మళ్లీ చర్చలు మొదలెట్టాలని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి రావాలని రెండేళ్లుగా పలువురు నిపుణులు, ప్రపంచ శాంతిని కాంక్షించేవారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఆయన స్థానంలో నిరుడు జనవరిలో వచ్చిన డోనాల్డ్ ట్రంప్కు సైతం ఈ సంగతి తెలుసు. దాన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే ‘ముగిసిపోతుందా...పోనీయండి. దాని స్థానంలో మరొకటి కుదుర్చుకుంటాం’ అన్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా చర్చల కోసం చేసిందేమీ లేదు. కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడపా దడపా చెప్పకపోలేదు. కానీ ఉక్రెయిన్లో ఆయన సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఆ మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అమెరికా పోకడలూ దానికి భిన్నంగా ఏమీలేవు. ‘న్యూ స్టార్ట్’ ముగియటంతో ఇరుపక్షాలనూ కట్టిపడేసే అంతర్జాతీయ ఒప్పందమేదీ ఉనికిలో లేకుండా పోయింది. ఇకపై రెండు అగ్రరాజ్యాలూ ఆయుధాలు పోగేసుకున్నా, పరస్పరం కయ్యానికి కాలు దువ్వుకున్నా, అణ్వాయుధాల్ని ప్రయోగించే సాహసం చేసినా... ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలకూ, వాటిని సమర్థిస్తున్నవాటికీ జవాబుదారీతనం, భయభక్తులు, వెరపు వంటివి మాయ మయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం ఇంతకన్నా కాస్తయినా మెరుగ్గా ఉండేదనటానికి వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం(సాల్ట్) గురించిన చర్చలే ఉదాహరణ. ఆ ఒప్పందం సాకారం కాలేదు. ఒకవేళ అలా అయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఇరు దేశాలూ పోగేసుకున్న ఆయుధాలు ఇక పెరగకుండా చూడటం తప్ప ఆ చర్చలు సాధించేది పెద్దగా ఏమీ ఉండేదికాదు. కానీ అంతకన్నా మెరుగైన ‘స్టార్ట్–1’ కుదిరింది. అణ్వాయుధం, లేదా వేరే బాంబును మోసుకేళ్లే సామర్థ్యమున్న క్షిపణులను (వార్హెడ్లను) 6,000కు తగ్గించటం, వాటి లాంచర్ల (వాహనాల) సంఖ్యను 1,600కు కుదించటం అది సాధించిన ఘనవిజయం. 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్’ కూడా చెప్పుకోదగ్గ ముందడుగు. దానివల్ల వార్హెడ్ల సంఖ్య 1,550కి, లాంచర్ల సంఖ్య 700కు తగ్గాయి. పరస్పరం డేటా మార్పిడి, నోటిఫికేషన్ల విడుదల, క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాల తనిఖీలకు అనుమతించటం అందులో ఉన్నాయి. నిజానికి ఈరెండింటికీ మధ్య 1993లో ‘స్టార్ట్–2’ గురించి చర్చలు సాగాయి. బహుళ సంఖ్యలో వార్హెడ్లను ప్రయోగించగల క్షిపణులను నిషేధించాలన్నది ఈ చర్చల ఆంతర్యం. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా ముగిసిపోయాయి. ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య చడీచప్పుడూ లేకుండా ఆయుధ పోటీ సాగుతోంది. తమదగ్గరున్న అణ్వాయుధాలకు కృత్రిమ మేధ(ఏఐ)ను జతచేసి, వాటి శక్తిని అనేక రెట్లు పెంచుకుంటున్నాయి. గంటకు 6,437 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల రకరకాల క్షిపణులు వచ్చేశాయి. వాటిని విడివిడిగా గురిచూసి కొట్టడం అసాధ్యమని తేలాకే ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ పేరుతో కొత్త పాట అందుకున్నారు. ఆ ‘బంగారు గుమ్మటం’ అమెరికాను ఎంతవరకూ రక్షిస్తుందో నిజంగా ఏమైనా జరిగితే తప్ప ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇద్దరి వద్దా అటూ ఇటూగా చెరో 5,000 అణ్వాయుధాలున్నాయి. మిగతా దేశాలన్నిటి వద్దా అందులో సగం కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ప్రజానీకం, ముఖ్యంగా ఆ రెండు దేశాల్లోని ప్రజలూ తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావాలి. లేనట్టయితే ప్రపంచం క్షణక్షణ గండంగా బతుకీడ్చక తప్పదు. -
నెట్టింట 'డీప్గా' నకిలీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల డీప్ఫేక్ ప్రకటనలు, క్లోన్డ్ వాయిస్లు, వీడియోలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. 2025లో ఏకంగా 80 లక్షల డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లోకి చొచ్చుకుపోయాయి. ఈ వీడియోల కారణంగా బాధితుల కీర్తిప్రతిష్టలకు భంగం కలగడంతోపాటు సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటువంటి కంటెంట్కు సోషల్ మీడియా వేదికలు ‘ఏఐతో రూపొందించినది’ అని యూజర్లకు కనిపించేలా ప్రసారం చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్సైబర్ నేరగాళ్ల లక్ష్యం ఎవరంటే..» ఫేక్ యాడ్స్, గౌరవానికి భంగం కలిగించే డీప్ఫేక్ వీడియోల్లో 40% సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారు.» వేధింపులు, మోసాలకు సంబంధించిన వీడియోలతో బాధితులుగా మిగిలిన వారిలో 35% మంది ప్రైవేట్ వ్యక్తులు.» ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, డీప్ఫేక్ కంటెంట్తో సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వారిలో 99% మంది మహిళలే.» వ్యాపారులు లక్ష్యంగా నకిలీ ప్రొఫైల్స్, బ్రాండ్ పేరుతో 40% మోసాలు జరుగుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ కంటెంట్ విస్తృతి ఇలా..» గతేడాది 80 లక్షలకుపైగా డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయని అంచనా.» ఏటా ఈ కంటెంట్ 900% అధికం అవుతోంది.» 2023తో పోలిస్తే డీప్ఫేక్ ఫైల్స్ గత ఏడాదికి 1,500% పెరిగాయి. » ఇటువంటి కంటెంట్ ఉత్తర అమెరికాలో ఏకంగా 1,740%, ఆసియా పసిఫిక్లో 1,530% పెరిగింది.» డీప్ఫేక్ కంటెంట్లో సింహభాగం వీడియోలు కైవసం చేసుకున్నాయి.డీప్ఫేక్తో అంతర్జాతీయంగా ఆర్థిక మోసాలు..» డీప్ఫేక్ కంటెంట్ను ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసాలు ఏడాదిలో 3,000% అధికం అయ్యాయి.» వాయిస్ క్లోనింగ్ విధానం సైబర్ నేరగాళ్ల మోసాల్లో సర్వసాధారణం» డీప్ఫేక్ కంటెంట్ కారణంగా గరిష్టంగా ఒక బాధితుడు నష్టపోయిన మొత్తం రూ.2.18 కోట్లు.» కంపెనీలు, ఫైనాన్స్ టీమ్స్, కుటుంబాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. డీప్ఫేక్ ఖాతాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా..సంవత్సరం సంఖ్య2019 15,0002022 5 లక్షలు2023 10 లక్షలుడీప్ఫేక్ దుర్వినియోగంపై అంతర్జాతీయంగా నమోదైన కేసులు..సంవత్సరం కేసుల సంఖ్య2024 1502025 జనవరిృమార్చి 179(ఆధారం: లాత్వియాకు చెందిన ఫోరెన్సిక్ డివైజెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్ సొల్యూషన్స్ కంపెనీ రెగ్యులా) -
ఏఐ, డీప్ఫేక్ కంటెంట్పై కేంద్రం ఆంక్షల కొరడా
న్యూఢిల్లీ: యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో తామరతుంపరలా పుట్టుకొస్తూ విస్తృతంగా షేర్ అవుతున్న ఏఐ కంటెంట్, డీప్ఫేక్ అంశాల ఉరవడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల కొరడా ఝుళిపించింది. కృత్రిమమేథ(ఏఐ) సృష్టించిన సమాచారం(కంటెంట్)తోపాటు అసలును భ్రమింపజేసేలా ఉండే డీప్ఫేక్ కంటెంట్ విస్తృతిని అరికట్టేందుకు మోదీ సర్కార్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్,2021లో సవరణలు చేస్తూ కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదలచేసింది.దీని ప్రకారం ఇకపై ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు ఫలానా అభ్యంతర, అసభ్య, తప్పుడు ఏఐ/డీప్ఫేక్ కంటెంట్ను ఆన్లైన్ నుంచి తొలగించాలని ఆదేశిస్తే సోషల్మీడియా వేదికలు కేవలం మూడు గంటల్లోపే వాటిని తొలగించాలి. గతంలో 36 గంటల గడువు ఉండేది. ఇతర కంటెంట్లకు సంబంధించి గడువులను కొన్నింటికి 15 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించగా మరికొన్నింటికి 24 గంటల నుంచి 12 గంటలకు గడువు తగ్గించారు. పూర్తి/పాక్షిక నగ్నత్వం లేదా శృంగార సంబంధ, ప్రైవేట్భాగాలను చూపించే కంటెంట్ను కేవలం 2 గంటల్లోపే తొలగించాలి ప్రభుత్వం నిబంధనను తీసుకొచ్చింది. ఏఐ టూల్స్ సాయంతో సృష్టించిన ఎలాంటి కంటెంట్కైనా దానిపై ‘ఏఐ జనరేడెడ్’అనే లేబుల్ను ముద్రించాలి. ఆ సమాచారాన్ని తాము సృష్టించారో లేదా ఏఐ సాయంతో మార్పులు చేశారో స్పష్టంగా పేర్కొనాలి. వెరిఫికేషన్ మెకానిజం తేవాలి.. హానికర, చట్టవ్యతిరేక కంటెంట్ను మూడుగంటల్లోపే ఆన్లైన్ సోషల్మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలి. ఏదైనా కంటెంట్ను ఎవరైనా అప్లోడ్ చేస్తే అది వాళ్లు తయారుచేసిందా? లేదా మరొకరి నుంచి కాపీ కొట్టారా? అనేది రూఢీచేసుకునేందుకు వీలుకలి్పంచే టూల్స్, వెరిఫికేషన్ మెకానిజంను సోషల్మీడియా ప్లాట్ఫామ్లు అందుబాటులోకి తేవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు డీప్ఫేక్కు చెక్పెట్టేందుకే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. వీటిని ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి తెస్తారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’అదే తేదీన ముగుస్తుండటం విశేషం.ఏఐ కంటెంట్ లేదా ఏఐతో మార్పులుచేసిన ఆడియో, వీడియో, ఆడియో–వీడియో కంటెంట్ను సింథటికల్లీ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్(ఎస్జీఐ)గా పరిగణిస్తారు. ఈ కంటెంట్ను ఆన్లైన్లో చూసిన యూజర్లు ఇది నిజమైనదా? కల్పనా? అనేది తెల్సుకునేందుకు ఆ కంటెంట్పై ఖచి్చతంగా ఏఐ లేబుల్ను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంటర్మీడియేటరీ సంస్థలు ఈ లేబుల్ను తొలగించడానికి వీల్లేకుండా మెటాడేటా/టెక్నికల్ ప్రూవెన్స్ మార్కర్లను శాశ్వతంగా ముద్రించాలని పేర్కొంది. అప్పుడే అది ఎక్కడి నుంచి తొలుత షేర్ అయిందనేది తెలుస్తుంది. దాంతో అలాంటి ఏఐలో చట్టవ్యతిరేక సమాచారముంటే తొలిసారి షేర్చేసిన వ్యక్తి/సంస్థను గుర్తించడం అత్యంత సులభమవుతుంది. యూజర్ డిక్లరేషన్ ఉండాల్సిందేతొలిసారిగా అప్లోడ్ చేసిన వ్యక్తి/సంస్థ/యూజర్ సంబంధిత కంటెంట్పై డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. సింథటిక్గా సృష్టించిందా లేదా ఏఐతో మార్పులు చేసిందా? అనేది పేర్కొనాలి. అయితే ఈ డిక్లరేషన్లు నిజమైనవా కావా ? అని సరిచూసుకునే టెక్నికల్/ఆటోమేటెడ్ టూల్స్ను సామాజికమాధ్యమ వేదికలు అందుబాటులోకి తేవాలి. లేబులింగ్ లేదా వెరిఫికేషన్ జరగని పక్షంలో సంబంధిత డేటాపై సామాజికమాధ్యమ వేదికలదే బాధ్యత అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. చట్టవ్యతిరేకమైనదంతా నేరమేచట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సృష్టించబడే ఏఐ కంటెంట్ను ఇకపై నేరమయ కంటెంట్గా పరిగణిస్తారు. చిన్నారులపై లైంగికవేధింపుల మెటీరియల్, అసభ్య కంటెంట్, గొప్ప వ్యక్తిని కించపరుస్తూ ఆయన ప్రతిరూపాలు తయారుచేయడం, తప్పుడు ఎల్రక్టానిక్ రికార్డ్లు సృష్టించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి అక్రమ వస్తువులను ప్రోత్సహించే ఎలాంటి కంటెంట్ను అయినా నేరమయ కంటెంట్గా లెక్కించి కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే కృత్రిమ కంటెంట్ను ఎప్పటికప్పుడు ఆటోమేటెడ్ టూల్స్తో తొలగించే బాధ్యతాయుత సంస్థలకు ఐటీ చట్టంలోని 79 సెక్షన్ ప్రకారం రక్షణ లభిస్తుందని కేంద్రం భరోసా ఇచి్చంది. కంప్యూటర్ ఆధారిత, చాట్జీపీటీ, గ్రోక్, జెమినిలతో కృత్రిమ, అల్గారిథంతో సృష్టించిన, ఎడిట్ చేసిన, మార్పులుచేసిన, అవాస్తవ ఫొటో లు, ఆడియో, విజువల్, ఆడియో–విజువల్ కంటెంట్ మొత్తాన్నీ ఏఐగా పరిగణస్తారు. -
బిలియన్ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్
సాక్షి, బిజినెస్ డెస్క్: భారత్లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్ పెట్స్ (ఏఐ పెట్స్) యువతలో వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.వీటితో కూడా రోజువారీ రొటీన్ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్ వర్చువల్ పెట్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్ డాలర్లని అంచనా. వెంచర్ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్లు ప్రధానంగా సబ్ర్స్కిప్షన్లు,ఇన్–యాప్ కొనుగోళ్లు, పెట్ యాక్సెసరీస్ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయిస్ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.టమాగోచ్చి నుంచి ఏఐ వరకువాస్తవానికి డిజిటల్ పెట్స్ కాన్సెప్ట్ కొత్తది కాదు. జపాన్లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్ వర్చువల్ పెట్స్కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్ టామ్, ఫ్రెండ్స్ యాప్స్, విడ్జెట్స్ వంటి అప్లికేషన్లు పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్ పెట్స్ మరింత అడ్వాన్స్డ్గా మారాయి. పాకెట్ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే అవకాశం ఇస్తున్నాయి. -
సాంకేతికతకు సాగిలపడొద్దు
న్యూఢిల్లీ: సాంకేతికత అనేది విద్యార్థులను బానిసలుగా మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తంచేశారు. విద్యార్థి దశలో శిక్షణలో భాగంగా నేర్చుకునే పరంపరను కొనసాగించాలనీ అన్నింటిపై కృత్రిమ మేథ మీద ఆధారపడొద్దని ఆయన హితవు పలికారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులకు విద్యా సంబంధ చిట్కాలు, సలహాలు చెబుతూ అత్యంత ప్రజాదరణతో కొనసాగుతున్న ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం 9వ విడత రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, గుజరాత్లకు చెందిన పలువురు ఔత్సాహిక విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఏఐ అంటే భయమేల? ‘‘కృత్రిమ మేధ(ఏఐ) వంటి కొత్త తరం సాంకేతికతలను చూసి విద్యార్థులు భయపడొద్దు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ వాటిలోనూ మీరు రాణించాలి. ఏఐ లేదా స్మార్ట్ఫోన్ను అత్యున్నత గురువుగా భావించొద్దు. కొందరు పిల్లలకు తొలుత స్మార్ట్ఫోన్లో ఏదైనా చూశాకే వాళ్ల నోట్లోకి ముద్ద దిగుతుంది. మనం ఏఐను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. అంతేగానీ అదే మన మార్గదర్శి అనే స్థాయిలో దానికి విలువ ఇవ్వొద్దు. పాఠ్యపుస్తకాల్లో ఉన్నదానికి ఏఐ సమాచారం అనేది అదనపు విలువ జోడింపు ఇస్తుంది అనే భావనతోనే మెలగాలి. అంతేగానీ నేర్చుకోవడం మానేసి పూర్తిగా ఏఐ ఆధారపడొద్దు. గతంలో ఎడ్లబండి మీద వెళ్లిన మనం ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్లినట్లుగా పాతరకం ఉద్యోగాలు మటుమాయమై ఎల్లప్పుడూ కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఉపాధి మారొచ్చేమోగానీ జీవితం మారదు. కొనసాగుతూనే ఉంటుంది. భయం, జంకూ వీడి కొత్త రకం సాంకేతికతలను నేర్చుకోవాలి. వాటిపై పట్టుసాధించాలి. సాంకేతికతతో మీ శక్తిసామర్థ్యాలను మరింత పెంపొందించుకోండి. సాంకేతికత సత్తాను మీ పనిలో చూపించండి’’అని మోదీ సూచించారు. పాతవి తిరగేయండి.. హాయిగా నిద్రపొండి ‘‘పరీక్షలకు సంబంధించి పాత క్వశ్చన్ పేపర్లను తిరగేయండి. ప్రశ్నల తీరును అర్థంచేసుకోండి. పగలంతా పక్కా ప్రణాళికతో చదివేసి రాత్రి హాయిగా నిద్రపోండి. రాత్రి బాగా నిద్రపోతేనే ఉదయం అంతకంటే బాగా పరీక్ష రాయగల్గుతారు. పరీక్షకు బాగా సంసిద్ధమయ్యాక కొత్తగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. చక్కటి నిద్ర అనేది మిమ్మల్ని రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది’’అని అన్నారు. తమ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చి చూసే ధోరణిని తల్లిదండ్రులు విడనాడాలని మోదీ సూచించారు. రెండింటిపై స్వారీ చేయండి విద్య, సొంత ఇష్టాయిష్టాలను సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉందని ఓ విద్యార్థి వెలిబుచి్చన ఆవేదనపై మోదీ తనదైన శైలిలో సలహా ఇచ్చారు. ‘‘ఓ వైపు ఆర్ట్ అంటే ఇష్టం. మరోవైపు శాస్త్రసాంకేతిక రంగంలో రాణించాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎటూపాలుపోక నిట్టూర్చేకంటే ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి సొంత ఇష్టాయిష్టాలపై దృష్టిపెట్టండి. విద్యకు ఎప్పట్లాగే అత్యంత ప్రాధాన్యతా ఇవ్వండి’’అని సూచించారు. అంకుర సంస్థల వైపు మొగ్గుచూపొచ్చా? అని మరో విద్యార్థి అడగ్గా..‘‘ముందు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టతకు రావాలి. ఇప్పటికే ఉన్న సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేయదలిచారా? లేదంటే డ్రోన్లు, విద్యుత్ వ్యవస్థల వంటి వాటికి కొత్త పరిష్కారాలు వెతకాలనుకుంటున్నారా? దీంట్లో స్పష్టత వస్తే అంకురసంస్థను స్థాపించాలా వద్దా అనేది తేలిపోతుంది. ముందుగా సాంకేతికత లేదా ఆర్థిక రంగాలపై పట్టున్న స్నేహితులతో ఒక బృందంగా ఏర్పడండి. స్టార్టప్ను ఆరంభించడానికి వయసుతో పనేలేదు. నిజంగా మీకు దీనిపై ఉత్సుకత ఉంటే ఇప్పటికే ఉన్న అంకురసంస్థలను సందర్శించండి. మీకున్న పరిజ్ఞానంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను సిద్ధంచేయండి. అది బాగుంటే అందరినోటా పడి చివరకు భారీ మద్దతు లభిస్తుంది. ఆర్థికసాయమూ అందుతుంది. తర్వాత ఎలా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకోవచ్చు’’అని మోదీ సూచించారు. -
అసమానతలను రాజేయనున్న ఏఐ
దావోస్లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి. ‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు. వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు. కీలక రంగాల్లో ఏఐ వినియోగంబ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది. కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.దేశ కార్మికశక్తికి సవాల్మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్. ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు. ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.మదన్ సబ్నవీస్వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత -
సర్వం భారతీయం!
ప్రపంచ టెక్ గమనాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఇన్నాళ్లూ అగ్రరాజ్యాలదే ఆధిపత్యం. కానీ, ఆ గతాన్ని తిరగరాస్తూ భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’అద్భుతాలు సృష్టిస్తోంది. కేవలం అనుకరణలతో సరిపెట్టుకోకుండా, మట్టి వాసన తెలిసిన ‘సొంత’సాంకేతికతతో అంతర్జాతీయ దిగ్గజాలైన గూగుల్ జెమిని, చాట్ జీపీటీనీ వెనక్కి నెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గూగుల్, చాట్ జీపీటీలకే సవాల్ భారతీయ మేధస్సు గ్లోబల్ టెక్ మ్యాప్పై తన ముద్రను బలంగా వేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘సర్వం ఏఐ’అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ మోడల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రెండు టూల్స్ ద్వారా ఈ సంస్థ టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది. 93.28 శాతం కచ్చితత్వం ఇది అద్భుతమైన ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ టూల్). భారత భాషల్లోని పత్రాలను చదవడంలో అమోఘమైన పనితీరును కనబరుస్తోంది. ఓఎల్ఎంఓసీఆర్ బెంచ్మార్క్లో 84.3 శాతం స్కోరును సాధించి, గూగుల్ జెమిని 1.5 ప్రో, చాట్ జీపీటీలను మించిపోయింది. సంక్లిష్ట పట్టికలు, గణిత ఫార్ములాలనూ 93.28 శాతం కచ్చితత్వంతో విశ్లేషించగలగడం దీని విశిష్టత. బుల్ బుల్ వి3 ఇది అచ్చమైన భారతీయ గొంతుకలతో కూడిన వాయిస్ ఏఐ మోడల్. ప్రస్తుతం 11 భారతీయ భాషల్లో 35కు పైగా సహజసిద్ధమైన స్వరాలను ఇది అందిస్తోంది. త్వరలో దీనిని 22 భాషలకు విస్తరించనున్నారు. అంతర్జాతీయ టూల్స్ భారతీయ భాషల విషయంలో తడబడుతున్న వేళ, సర్వం ఏఐ అత్యంత స్పష్టమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందిస్తోంది. ‘సర్వం’ పనితీరుకు ఫిదా ఒకప్పుడు భారతీయ ఏఐ నమూనాల సామర్థ్యాన్ని శంకించిన విమర్శకులు సైతం ‘సర్వం’ పనితీరుకు ఫిదా అవుతున్నారు. గ్లోబల్ ఏఐ ల్యాబ్లు విస్మరించిన భారతీయ భాషా వైవిధ్యాన్ని శక్తిగా మలుచుకుంటూ ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందనడానికి ఈ విజయమే నిదర్శనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ పెట్టుబడుల్లో భారత్ @ 8
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం. మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది.ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటివరకు మొత్తంగా రూ.55 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘భారీ డేటా సెంటర్ల’ సంఖ్య 1,136 కాగా 2030 నాటికి ఇది 2,000 దాటొచ్చని అంచనా.ఆధారం: వరల్డ్ ఎకనమిక్ ఫోరం శ్వేతపత్రం -
నియామకాలను శాసిస్తున్న ఏఐ!
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) నియామకాల ప్రక్రియను మరింత సమర్థవంతం, సులభతరం చేస్తోంది. సరైన నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం రిక్రూటర్లకు (నియామకాలు చేపట్టేవారు) సవాలు కాగా.. వీరు ఏఐ సాయాన్ని తీసుకుంటున్నారు. తమకు కావాల్సిన సరైన అర్హతలు, నైపుణ్యాలు దాగి ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు ఏఐ సాయపడుతున్నట్టు రిక్రూటర్లు లింక్డ్ఇన్ సర్వేలో భాగంగా తెలిపారు. ఒత్తిళ్ల మధ్య ఏఐని పరిష్కారంగా వారు భావిస్తున్నారు. 2025 నవంబర్ 13 నుంచి 28 మధ్య 19,113 మంది అభిప్రాయాలను, నవంబర్ 10 నుంచి 27 మధ్య 6,554 అంతర్జాతీయ హెచ్ఆర్ నిపుణులను లింక్డ్ఇన్ సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → గతంలో తాము గుర్తించలేని నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల నియామకానికి ఏఐ సాయపడుతున్నట్టు 71 శాతం మంది చెప్పారు. → అభ్యర్థుల నైపుణ్యాలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు ఏఐ ఉకపరిస్తున్నట్టు 80 మంది పేర్కొన్నారు. → నియామకాలను ఏఐ వేగవంతం చేసిందని 76 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. → నియామకాలు కరోనా ముందునాటితో పోలి్చతే 40 శాతం పెరిగినా.. అర్హులైన అభ్యర్థులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్టు 74 శాతం మంది రిక్రూటర్లు తెలిపారు. → ఏఐ ఆధారిత దరఖాస్తులు పెరిగినట్టు 53 శాతం మంది తెలిపారు. → కావాల్సిన నైపుణ్యాల్లో లోటు ఉంటున్నట్టు 47 శాతం రిక్రూటర్లు పేర్కొన్నారు. → తప్పుదోవ పట్టించే, తక్కువ నాణ్యత కలిగిన వాటి నుంచి నిజమైన దరఖాస్తులను వడబోయడంలో ఏఐ సాయపడుతున్నట్టు 48 శాతం మంది చెప్పారు. → 2026లోనూ ఇంటర్వ్యూల ముందస్తు స్క్రీనింగ్కు, వేగవంతమైన నియామకాలకు, మెరుగైన అభ్యర్థుల ఎంపికకు ఏఐని ఉపయోగించనున్నట్టు మెజారిటీ రిక్రూటర్లు తెలిపారు. -
ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు
ప్రకృతి రమణీయతకు, అద్భుతమైన బీచ్లకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా... ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు వస్తుంటారు. అయితే ఇటీవల ఒక ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ చేసిన చిన్న పొరపాటు పర్యాటకులను విస్తుపోయేలా చేసింది.ఆస్ట్రేలియాలోని టాస్మేనియా ప్రాంత పర్యటనలకు సంబంధించిన ఒక వెబ్సైట్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో లేని ప్రదేశాన్ని ఉన్నట్లుగా చూపించి పర్యాటకులను తప్పుదోవ పట్టించింది. ఈ ఏఐ ఫీచర్ ఈశాన్య టాస్మేనియాలోని అడవుల్లో ‘వెల్డ్బరో హాట్ స్ప్రింగ్స్’ (వేడినీటి బుగ్గలు) ఉన్నాయని, ఆ ప్రాంతం ప్రశాంతతకు నిలయమని వర్ణించింది. దీంతో పర్యాటకులు అక్కడికి క్యూ కట్టారు.వెబ్సైట్ ఇచ్చిన సమాచారాన్ని నమ్మి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరవచ్చని భావించిన పర్యాటకులు టాస్మేనియాకు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక పర్యాటకులు అక్కడి సీన్ చూసి అవాక్కయ్యారు. వెబ్సైట్లో చెప్పినట్లుగా అక్కడ ఎటువంటి వేడినీటి బుగ్గలు లేకపోవడమే కాకుండా, ఆ ప్రాంతం వెబ్సైట్లోని వివరణకు పొంతన లేకుండా ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై 'ఆస్ట్రేలియన్ టూర్స్ అండ్ క్రూయిజెస్' యజమాని స్కాట్ హెన్నెస్సీ స్పందించారు. తమ వెబ్సైట్లోని ఏఐ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, దీనివల్ల తప్పుడు సమాచారం ప్రచురితమైందని ఆయన అంగీకరించారు. మార్కెటింగ్ కంటెంట్ కోసం ఒక థర్డ్ పార్టీ సంస్థకు బాధ్యతలు అప్పగించామని, సాధారణంగా తానే స్వయంగా ప్రతి పోస్ట్ను తనిఖీ చేస్తానని, అయితే తాను విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆయన వివరించారు.తమది మోసపూరిత సంస్థ కాదని, కేవలం సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని సంస్థ వివరణ ఇచ్చింది. ఈ పొరపాటు కారణంగా తమ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినడంపై స్కాట్ హెన్నెస్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో వస్తున్న విమర్శలు తమను మానసికంగా కుంగదీస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అతిగా ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.ఇది కూడా చదవండి: విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు -
బడ్జెట్ 2026.. ఇండియా ఏఐ మిషన్ విస్తరణకు చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాలన, పరిశ్రమల అభివృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. పాలన- ప్రజా సేవలు.. ఏఐ అనువర్తనాలు “ఫోర్స్ మల్టిప్లయర్స్”గా పనిచేస్తాయని.. సేవల అందజేతలో సమర్థత పెరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యరంగం, వ్యవసాయం, సామాజిక సంక్షేమ పథకాలలో AI వినియోగం ద్వారా లక్ష్యబద్ధత పెరిగి.. లీకేజీలు తగ్గుతాయని అంచనా వేశారు.రంగాల వారీగా AI వినియోగం చూసుకుంటే.. డిజిటల్ పాలన: మోసాల గుర్తింపు, కంప్లయెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం.విద్య: వ్యక్తిగతీకరించిన లెర్నింగ్ ప్లాట్ఫారమ్లుఆరోగ్య రంగం: డయాగ్నస్టిక్స్, టెలీమెడిసిన్ విస్తరణ.వ్యవసాయం: పంట దిగుబడుల అంచనా, వాతావరణ సూచనలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం..ఇండియా AI మిషన్ విస్తరణ.. పరిశ్రమ వర్గాలు ఇండియా AI మిషన్కు కేటాయింపులను రూ.2,000 కోట్ల నుంచి కనీసం రూ.5,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా.. జాతీయ కంప్యూట్ సామర్థ్యం (GPUలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు), స్టార్టప్లు, పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం అవసరమైన కంప్యూటింగ్ వనరులు (GPUలు, క్లౌడ్ సర్వర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు) తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా ప్రభుత్వం లేదా సంస్థలు క్రెడిట్లు/సబ్సిడీలు ఇవ్వడం.. అందుబాటులో ఉండే AI ప్రయోగశాలలు (labs) ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వనరులు, సాంకేతికత, శిక్షణ, పరిశోధన అవకాశాలను అందరికీ సమానంగా అందించడం ఉన్నాయి.AI స్టార్టప్లకు ప్రోత్సాహకాలు.. AI స్వీకరణ ఖర్చు తగ్గించేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తక్కువ ఖర్చుతో కంప్యూట్ వనరులు, స్పష్టమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారత్ను గ్లోబల్ AI అభివృద్ధిలో పోటీదారుగా నిలపాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఏఐని దేశ అభివృద్ధి, పరిశ్రమల పోటీ, ప్రజా సేవల సమర్థత కోసం ప్రధాన సాధనంగా ప్రభుత్వం గుర్తించినట్లు ఈ బడ్జెట్తో అర్థమవుతోంది. -
అంతరిక్షంలోకి 10 లక్షల ఏఐ శాటిలైట్లు!
ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలను అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్ రంగం సిద్ధంచేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచే నేరుగా తీర్చేందుకు ఏకంగా 10,00,000 ఏఐ సూపర్కంప్యూటర్లను నింగిలోకి పంపనున్నారు. ఒక్కో కృత్రిమమేథ సూపర్కంప్యూటర్ను ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వ అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లన్నీ ఒకదానితో మరోటి లేజర్ కాంతిపుంజంతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఉమ్మడిగా ఊహించనంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించనున్నాయి. ఇన్నేసి సూపర్కంప్యూటర్లను భూమిపై సర్వర్ఫామ్లో ఏర్పాటుచేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్ను నిరంతరంగా సరఫరాచేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడంతో సౌరశక్తిని ఉపయోగించుకుని ఆకాశంలోనే అతిపెద్ద సోలార్ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా 10 లక్షల ఏఐ కంప్యూటర్ల శక్తి అవసరాలు తీర్చనున్నారు. 1968లో వచ్చిన ‘2001: స్పేస్ ఒడిస్సీ’హాలీవుడ్ చిత్రంలో ‘హాల్ 9000’కృత్రిమమేధావి చేసే ప్రయోగాలు ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితంకాగా ఇకపై వాటిని నిజజీవితంలోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఏఐ కంప్యూటర్ల దండును నింగిలో మోహరింపజేసి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారుల కృత్రిమమేధ అవసరాలు తీర్చబోతున్నామని మస్క్ వివరించారు. ఈ వ్యవస్థకు ‘ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్’అని పేరు పెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భూమిపై వినియోగదారులకు సంబంధించిన విపరీతమైన సమాచారం, సంక్లిష్టమైన డేటాను అత్యధిక వేగంతో ప్రాసెస్ చేయడమూ సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఏఐ మోడళ్లను పరీక్షించి అందుబాటులోకి తేవచ్చు. భూమి నుంచి 500 నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఒకదానితో మరోటి ఢీకొట్టకుండా వీలైనంత దూరంలో కక్ష్యలో స్థిరపరచనున్నారు. ‘‘ఊహించనంతగా వచ్చి పడుతున్న ఏఐ డిమాండ్ను అందుకోవాలంటే భూమి మీద సౌకర్యాల విస్తరణతో సాధ్యంకాదు. అంతరిక్షంలో కక్ష్యల్లో కొలువుతీరిన లక్షలాది ఉపగ్రహాలతోనే ఇది సాధ్యం. పుష్కలంగా లభించే సౌరశక్తిని ఒడిసిపట్టి ఈ సూపర్కంప్యూటర్ల విద్యుత్శక్తి అవసరాలు తీర్చుతాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా కేంద్రంగా అంతరిక్షాన్ని సిద్ధంచేయబోతున్నాం’’అని మస్క్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. స్టార్లింక్ స్ఫూర్తితో.. ఇప్పటికే వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీని స్ఫూర్తితోనే ఏఐ సేవలు అందించేందుకు ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదలెట్టారు. ఇందుకోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(యూఎస్ఎఫ్సీసీ) వద్ద స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసుకుంది. భూమిపై ఏర్పాటుచేసిన డేటా సెంటర్లు పవర్ గ్రిడ్లతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం పెద్ద అవరోధంగా తయారైంది. అతిపెద్ద సర్వర్ఫామ్ల ఏర్పాటుకు భూమి సేకరణ ఇబ్బందిగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూమి సేకరణ అనేది ఖరీదైన వ్యవహారంగా తయారైంది. విద్యుత్ తయారీకి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వినియోగిస్తారు. దీంతో ఇంతపెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడమూ కష్టమే. ఈ సమస్యలేవీ అంతరిక్షంలో ఉండవు. ఆ కారణంతోనూ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు నింగిని వేదికగా ఎంపికచేశారు. భూమి మీద ఏఐ సూపర్కంప్యూటర్లను చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరం. అదే అంతరిక్షంలో శూన్యం ఉంటుందికాబట్టి ఇది సహజ రిఫ్రిజిరేటర్గా పనిచేస్తుంది. రాత్రిళ్లు అత్యల్ప ఉష్ణోగ్రతలకు ఏఐ వ్యవస్థ ఆటోమేటిక్గా చల్లబడుతుంది. విద్యుత్ అవసరం కూడా ఉండదు. 10 లక్షల ఉపగ్రహాల మధ్య సమాచారాన్ని హైస్పీడ్ లేజర్ కాంతిపుంజం రూపంలో బదిలీచేస్తారు. దీంతో ట్రిలియన్ల బైట్ల డేటా వేగంగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థ మొత్తం ఆకాశంలో ఏర్పాటయ్యాక ప్రతి టన్ను సౌరఫలకాల వ్యవస్థ నుంచి ఏకంగా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీంతో అక్కడి డేటా సెంటర్ల శక్తి అవసరాలు సైతం తీరనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘హెచ్ఐవీ’కి ఏఐ సలహా.. ఆరోగ్యం విషమించి..
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకున్న కొందరు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఏఐ సలహాను పాటించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వైద్యుడిని సంప్రదించకుండా ఒక ఏఐ చాట్ ప్లాట్ఫామ్ ఇచ్చిన సలహాతో హెచ్ఐవీ నిరోధక మందులు వాడి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. లైంగిక సంబంధం తర్వాత హెచ్ఐవీ సోకుతుందనే భయంతో, అతను ముందు జాగ్రత్తగా ఏఐ సలహాతో కొన్ని మందులను వాడాడు.వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా మందులు తీసుకోవడం వల్ల అతనికి 'స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్' అనే అరుదైన, ప్రాణాంతక చర్మ వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో అతను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఏఐ సూచనలతో స్థానిక కెమిస్ట్ షాపు నుండి ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే 28 రోజుల కోర్సును కొనుగోలు చేశాడు. ఈ మందులను ఏడు రోజుల పాటు వాడిన తర్వాత, అతని శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది.ఆరోగ్య పరిస్థితి విషమించి, అతనికి కంటి సమస్యలు ఇతర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన అనంతరం చివరకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, డ్రగ్ రియాక్షన్ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యులు తెలిపారు. జాతీయ మార్గదర్శకాల ప్రకారం హెచ్ఐవీ నిరోధక మందులను వైద్యుల క్షుణ్ణమైన పరిశీలన, రిస్క్ అసెస్మెంట్, బేస్లైన్ పరీక్షల తర్వాతే అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఎటువంటి పర్యవేక్షణ లేకుండా యాంటీ రిట్రోవైరల్ మందులు వాడటం వల్ల శరీర అవయవాలు దెబ్బతినడం, చివరికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సాధనాలు కేవలం సాధారణ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవని, అవి ఎప్పటికీ వైద్యుని క్లినికల్ నిర్ణయానికి ప్రత్యామ్నాయం కాబోవని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో ఏఐ జోక్యాన్ని పరిమితం చేసేలా ప్రభుత్వం తగిన ప్రమాణాలను తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రతిష్టంభనకు చెక్.. సంతకాలే తరువాయి.. -
న్యాయాధికారులూ.. ఏఐతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వొకేట్ కమిషనర్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ.. ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులిచ్చారు. అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లో తేల్చుకోవాలని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో నాలుగు తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాణి, మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలను ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారులు తమ విచక్షణను, న్యాయపరమైన ఆలోచనను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలే తప్ప, ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేలి్చచెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐను ఉపయోగించే వారు, అది అందించే సమాచారాన్ని, తీర్పులను అత్యంత జాగ్రత్తగా, కఠినంగా పరిశీలించాలని సూచించారు. ‘ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా, ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగినా అవి వాస్తవంగా, చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులను సృష్టించడంతోపాటు సమస్యకు సంబంధం లేని తీర్పులను తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం దెబ్బతింటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.అందుకే.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం ‘ప్రస్తుత కేసులో కింది కోర్టు న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో ఏఐ సాధనాన్ని ఉపయోగించి ప్రస్తావించిన తీర్పులు అసలు ఉనికిలోనే లేవు. కానీ.. ఆ న్యాయాధికారి ఆ కేసుకు చట్టబద్ధమైన న్యాయసూత్రాన్ని మాత్రం సక్రమంగానే అన్వయించారు. సీపీసీ ప్రకారం అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం ఒక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరాలుంటే ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవచ్చని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కమిషనర్ నివేదికను కొట్టివేయాల్సిన అవసరం లేదని కూడా ఆ న్యాయాధికారి చెప్పారు. ఇదే చట్టబద్ధమైన న్యాయసూత్రం. దీనిని ఆ న్యాయాధికారి ఈ కేసుకు సరైన రీతిలో అన్వయింప చేశారు. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం గానీ, న్యాయపరిధి ఉల్లంఘన గానీ లేనే లేదు. అందువల్ల ఆ ఉత్తర్వుల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని తేల్చి చెప్పారు. ఉషారాణి, మరొకరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ)ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు వెలువరించారు. -
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది. -
ఆ ఘటన యావత్ సమాజానికి ఒక హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.కేరళలో ఓ ప్రొఫెసర్కు వీడియో కాల్ వచ్చింది. సాధారణ కాల్ అని వీడియో ఆన్ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్ కట్ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI సృష్టించిన బొమ్మ అని తెలిసి... ప్రొఫెసర్ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్గా మార్ఫ్ చేయడం.... ఛత్తీస్గఢ్ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్ చేసిన కేసు..అస్సాం లో ఇంజినీర్ ఆన్లైన్లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీవిద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాల బారిన పడుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు... సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.సోషల్ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి. బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయంఅం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.ఫరీదాబాద్ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది... టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి.... -
డీప్ఫేక్కు చెక్ పెట్టే టెక్నాలజీ!
సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.ఏఐ జనరేషన్, డీప్ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్ఫేస్ అభివృద్ధి చేశారు.ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్నూ చెక్ చేస్తుంది. కంటెంట్ను మూడు విధాలుగా (లెవెల్స్) విభజిస్తుంది.➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుందిడీప్ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు. కంటెంట్ హ్యాష్, టైమ్ స్టాంప్, ప్లాట్ఫామ్ యూస్డ్ వంటి వాటిని ఆడిట్ చేయడానికి ఇందులో శాండ్బాక్స్ ఉంటుంది. దీని ద్వారా డీప్ఫేక్ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారనేది గుర్తించడానికి మాత్రమే కాకుండా.. వాటిని ఎన్నిసార్లు షేర్ చేసారు అనేది గుర్తించవచ్చు.అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు, పేటెంట్ పబ్లిష్ కూడా పూర్తయింది. అయితే ఇది ప్రస్తుతం టెక్నికల్ ఎగ్జామినేషన్స్లో ఉంది. -
ఏఐ వాడకుంటే ‘ఫెయిల్’.. టెక్కీ ఇంటర్వ్యూ వైరల్
ఏఐ వినియోగం ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరించింది. మొన్నటి వరకూ ఫోను లేకుంటే ఏ పనీ జరగదనేవారు.. ఇప్పుడు ఏఐ సాయం లేకపోతే అంతా శూన్యమే అంటున్నారు. ఏఐ వినియోగించకపోవడంతో ఇంటర్య్యూలో ఫెయిలయిన ఒక యువకుని ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదని, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం ఇప్పుడు తప్పనిసరి అని ఆకాష్ విశాల్ హజారికాకు ఎదురైన అనుభవం స్పష్టం చేస్తోంది.గూగుల్, అమెజాన్, స్ప్లంక్, సేల్స్ఫోర్స్ తదితర దిగ్గజ సంస్థలలో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీర్ ఆకాష్ విశాల్ ప్రస్తుత టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న మార్పులను వివరించారు. ఏఐ అనేది ఇప్పుడు ఒక ఐచ్ఛికం కాదని, డెవలప్మెంట్ను వేగవంతం చేయడానికి, కోడింగ్ పనులను తగ్గించడానికి, నాణ్యతను పెంచడానికి ఇంజనీర్లు ఏఐని వాడాలని కంపెనీలు ఆశిస్తున్నాయని ఆయన వివరించారు.ఈ నూతన మార్పుల కారణంగా ఇంజనీర్లు సిస్టమ్ డిజైన్, క్లిష్టమైన బిజినెస్ లాజిక్పై అధికంగా దృష్టి పెట్టగలుగుతారని ఆయన తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సన్నద్ధమవడం అనేది ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని ఆయన ‘ఎన్డీటీవీ’తో అన్నారు. 2020లో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్లో పట్టు ఉంటే అభ్యర్థులు సులభంగా ఉద్యోగాలు సాధించేవారు. కానీ నేడు ఆ నైపుణ్యాలను కేవలం కనీస అర్హతగా మాత్రమే పరిగణిస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లౌడ్ నైపుణ్యాలతో పాటు, ‘ప్రాంప్ట్ ఇంజనీరింగ్’ ఏఐ సహాయంతో డీబగ్గింగ్ చేయడం వంటి కొత్త నైపుణ్యాలు అత్యవసరంగా మారాయని ఆకాష్ విశాల్ తెలిపారు.ఏ పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతులు వాడాలి? ఎప్పుడు ఏఐని సిస్టమ్స్తో అనుసంధానించాలి అనే అవగాహన ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంటర్వ్యూల తీరులో కూడా భారీ మార్పులు వచ్చాయంటూ, ఆయన తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ 2024లో నిర్వహించిన ఇంటర్వ్యూలో, ఒక పెద్ద కోడ్బేస్ను డీబగ్ చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో ఏఐ టూల్స్ వాడుకోవచ్చని కంపెనీ సూచన చేసింది. అయితే ఆయన సొంత నైపుణ్యంతోనే చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఏఐని ఉపయోగించుకోకపోవడం కారణంగానే తాను ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని, అది తనకు ఒక మేల్కొలుపులా మారిందని అని ఆయన తెలిపారు.ఇప్పుడు చాలా కంపెనీలు లైవ్ కోడింగ్ సెషన్లలో అభ్యర్థులు ఏఐని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారో కూడా గమనిస్తున్నాయని ఆకాష్ విశాల్ తెలిపారు. ప్రస్తుతం సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలలో ఏఐ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, మోడల్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్పై ప్రశ్నలు అడుగుతున్నారని తెలిపారు. కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాకుండా, ఏఐని ఎంత బాధ్యతాయుతంగా వాడుతున్నారో, ఆటోమేషన్, మానవ పర్యవేక్షణ మధ్య సమతుల్యతను ఎలా పాటిస్తున్నారో కూడా బిహేవియరల్ ఇంటర్వ్యూలలో పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: ‘పైలట్లపైకి తోసేస్తారా?’.. అమెరికా సంస్థ ఆగ్రహం -
ఏఐ అద్దాలతో రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా ఈసారి ఢిల్లీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే కళ్లద్దాలు ధరించనున్నారు! ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)తో పనిచేసే ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను నేరాల డేటాబేస్తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్లలో గత నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే బలగాలను హెచ్చరిస్తాయి! తద్వారా పాత నేరస్తులు, నిందితులు, అనుమానిత వ్యక్తులను తక్షణం అదుపులోకి తీసుకునే వీలుంటుంది. కార్యక్రమాలకు హాజరైన గుమిగూడిన జనంలోని వారిలో ఎవరి ముఖమైనా నేరచరితుల డేటాతో సరిపోలితే స్మార్ట్గ్లాస్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో జనం గందరగోళానికి గురికాకుండా కేవలం అనుమానితున్ని మాత్రమే జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని న్యూఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మాహ్లా వివరించారు.ఎరుపొస్తే పట్టివేత‘‘ ఏఐ స్మార్ట్గ్లాస్ ఆయా పోలీస్ ఉపయోగించే స్మార్ట్ఫోన్కు వెంటనే సందేశం పంపుతుంది. ఆ సందేశంలో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేరచరిత్ర లేదు అని అర్ధం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి గత నేరాలతో సంబంధం ఉందని అర్థం. వెంటనే అతని గుర్తింపు కార్డ్లను పరిశీలించి అదుపులోకి తీసుకోవాలా వద్దా? అతడిపై గతంలో ఉన్న నేరాభియోగాలు తీవ్రమైనావా కావా? వెంటనే అదుపులోకి తీసుకోవడం అవసరమా కాదా? అనేవి పోలీసులు నిర్ణయించి తగు రీతిలో స్పందిస్తారు’’ అని ఏసీపీ దేవేశ్ వెల్లడించారు. ‘‘వ్యక్తుల చరిత్రను తక్షణం గుర్తించడం అనే ఈ ప్రక్రియ కారణంగా గతంలో మాదిరి ఒక్కో వ్యక్తిని మాన్యువల్గా తనిఖీచేయాల్సిన శ్రమ తగ్గుతుంది. దీనికితోడు విస్తృతంగా ఏర్పాటుచేసిన సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ, ఏఐ ఆధారిత విశ్లేషణ విధానాలతో ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలనూ వేగంగా గుర్తించవచ్చు’’ అని ఆయన వెల్లడించారు.20 ఏళ్ల పాత ఫొటో అయినాసరే..‘‘ మా దగ్గర ఉన్న డేటాబేస్లో పాత నేరగాళ్లకు చెందిన 20 ఏళ్లక్రితంనాటి ఫొటో ఉన్నాసరే సంబంధిత నేరస్తుడు ఇవాళ కన్పించినా ఏఐ స్మార్ట్గాŠల్స్ అనేది సరిపోల్చుకోగలదు. అంతటి సామర్థ్యం ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్కు ఉంది. స్మార్ట్ గ్లాసెస్ చూపు నుంచి నేరస్తులు తప్పించుకోలేరు. ఈ అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యమూ ఉంది. ఇనుము, ఉక్కు లోహాలు సహా పదునైన వస్తువులు, నిషేధిత ఆయుధాలతో సంచరించే వ్యక్తులనూ ఇవి గుర్తించగలవు. సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు ఈ కళ్లద్దాలను ఇస్తున్నాం. పోలీసు వాహనాల ముందుభాగంలోనూ వీటిని అమర్చుతాం. గణతంత్ర వేడుకల్లో వీటిని ఢిల్లీలో ఉపయోగించడం ఇదే తొలిసారి’’ అని అధికారి చెప్పారు. అయితే ఎన్నింటిని కొనుగోలు చేశారో, వాటి ధర తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు. ‘‘ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతు మార్గంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో మొత్తంగా 10,000 మంది పోలీసులను న్యూఢిల్లీ జిల్లా నుంచి రప్పిస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రతి వాహనం మూడంచెల భద్రతావలయాన్ని దాటుకుని రావాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఏఐ హబ్లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
మూల రచయితలకు ద్రోహమేనా?
‘కృత్రిమ మేధ (ఏఐ) చేసే సృజన – కాపీరైట్’పై దేశంలోని ‘పారిశ్రామిక,ఆంతరంగిక వర్తక ప్రోత్సాహక శాఖ’ 2025 చివరలో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ఏఐ యుగంలో కాపీ రైట్ను కాపాడడమెలా అనే జటిలమైన అంశాన్ని ఒక నిపుణుల కమిటీ పరిశీలించి ఆ నివేదికను రూపొందించింది. సమీప భవిష్యత్తులో, ఈ అంశంపై భారత్ అనుస రించబోయే విధానానికి ఆ నివేదికలోని అంశాలే ప్రాతిపదికగా మారే అవకాశాలున్నాయి. ఛాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి జనరేటివ్ ఏఐ ప్రొడక్టులు భారీ లాంగ్వేజి మోడళ్ళు. యూజర్లు చేసే సూచనలను ఆధారంగా చేసుకుని అవి కంటెంట్ను సృష్టిస్తాయి. ఉదాహరణకు, మనం ఇతివృత్తాన్ని ఇచ్చి ఆర్.కె. నారాయణ్ లేదా ప్రేమ్చంద్ శైలిలో కథానికను రాసివ్వాలని ఛాట్ జీపీటీని అడిగితే అది రాసి పెడుతుంది. అలాగే డయల్–ఈ, మిడ్ జర్నీ వంటివాటికి మనం ఒక వచనాన్ని లేదా కవితను అందిస్తే, దాన్నిబట్టి అవి పెయింటింగ్ వేయడం లేదా వీడియో సృష్టించడం చేస్తాయి. జెమినీరాయ్ లేదా ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగుల మాదిరిగా ఉండాలని కూడా మనం కోరవచ్చు. అంతేకాదు, సత్యజిత్ రే తరహాలో ఒక చిన్న మూవీ క్లిప్ను రూపొందించి ఇమ్మని అడిగినా అవి ఆ పని పూర్తి చేసేస్తాయి.ఆ పని ఎలా చేయగలుగుతున్నాయంటే వాటికి ఇచ్చిన ట్రయినింగును అనుసరించి అని మనం జవాబు చెప్పు కోవాల్సి ఉంటుంది. నారాయణ్ నవలలు, హుస్సేన్ పెయింటింగులు వంటి రకరకాల వనరుల నుంచి అవి డేటాను గ్రహిస్తాయి. ఏఐ మోడళ్ళకు ట్రయినింగు ఇచ్చేటపుడు ఉపయోగించే డేటా వివిధ కేటగిరీలకు చెందినదై ఉండవచ్చు. అందులో కాపీరైట్ ఉన్నవీ, కాపీరైట్ గడువు తీరిపోయినవి కూడా ఉంటాయి. ‘సమంజస వినియోగానికి’ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న డేటా మాదిరిగా అది వివిధ వనరుల నుంచి తెచ్చుకున్నదై ఉంటుంది. జనరేటివ్ ఏఐ మోడళ్ళ కమర్షియల్ వెర్షన్లను టెక్నాలజీ సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఫోటోలు, సినిమాలు, సృజనాత్మక శక్తిని వ్యక్తపరచిన ఇతర రూపాల లోని కాపీరైట్ మెటీరియల్ను వాడుకోవచ్చునా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, ఏఐ డేటాబేస్కి అవి పునాదిగా మారాయి. ఇది సంక్లిష్టమైన లీగల్, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చిక్కు ముడులే ఇంకా విడలేదనుకుంటే, ఏఐ జనరేట్ చేసినవాటి కర్తృత్వం, కాపీరైట్ హక్కుల వర్తింపునకు సంబంధించిన అంశం మరో అపరిష్కృత అంశంగా తయారైంది. ఏఐ మోడళ్ళకు డేటా ట్రైనింగ్ అనే సరికొత్త సమస్యతో మనమే కాదు, చాలా దేశాలలోని ప్రభుత్వాలు, కోర్టులు సతమతమవు తున్నాయి. ఏఐ మోడళ్ళు కాపీరైట్ ఉన్న పుస్తకాలను లేదా ఫోటో లను కాపీ చేయడం లేదా చౌర్యం చేయడం లేదనీ, కనుక అవి కాపీరైట్ హక్కును ఉల్లంఘిస్తున్నట్లు కాదనీ ఇండియాలోని కంపె నీలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు వాది స్తున్నాయి. కొత్త కంటెంట్ను జనరేట్ చేయడానికి వీలుగా సరళులు, శైలులు, నిర్మాణ రీతులకు సంబంధించి కలన గణితాలను ట్రైన్ చేసుకునేందుకు, గణాంకాలతో సరిపోల్చుకునేందుకు వాటిని విభా గిత డేటాసెట్లుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని చెబు తున్నాయి. సృజనాత్మక వర్కులను సమంజసమైన రీతిలో వినియో గించుకోవచ్చన్న సాధారణ ఆమోదిత లోకోక్తినే అవి అనుసరిస్తున్నా యని ఆ కంపెనీలు తమ వ్యాసంగాన్ని వెనకేసుకొస్తున్నాయి. కానీ, ఏఐ మోడళ్లు ఒరిజినల్ వర్కులను ‘కాపీ’ చేయడం లేదని, వాటి నుంచి ’నేర్చుకోవడం మాత్రమే చేస్తున్నాయని అనడం వాదనకు నిలిచే అంశం కాదు. ఏఐ సిస్టం ట్రైనింగ్ ప్రక్రియలో అనేక దశలుంటాయి. వాటిలో డేటా (ఒరిజినల్ వర్కుల) కాపీయింగ్, స్టోరేజి కూడా ఒకటి. అది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది మహా అయితే ‘సాంకేతిక చొరబాటు’ కిందకు వస్తుంది కానీ, ‘లీగల్ పరమైన ఉల్లంఘన’ కిందకు రాదని ఏఐ పరిశ్రమ వాదించవచ్చు.ఏ విధమైన కాపీరైట్ లైసెన్సింగ్ అవసరం లేదనే భావనను నిపుణుల కమిటీ కూడా తిరస్కరించింది. భారత్లో అమలుకు ఒక హైబ్రిడ్ చట్రాన్ని సిఫార్సు చేసింది. కాపీరైట్ హక్కుదారులకు రాయల్టీ చెల్లించే పక్షంలో, కాపీరైట్ సంరక్షణ ఉన్న వర్కులను గ్రహించి ఏఐ డెవలపర్లు వాడుకోవచ్చని, ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని వినియోగించుకోవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. కానీ, ఏఐ సిస్టంలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ వర్కులను ఇవ్వకుండా నిలిపి ఉంచే అవకాశం కాపీరైట్ హక్కుదారులకు లేదు. ఏఐ డెవలపర్ల నుంచి ఆ (రాయల్టీ) చెల్లింపులను వసూలు చేసే బాధ్యత లాభాపేక్ష లేని ఒక కేంద్రీకృత సంస్థకు ఉండాలని కమిటీ పేర్కొంది. మొత్తానికి, అసలు సృజనశీలురకు రాయల్టీలను చేర్చ వలసిన బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలని చెప్పింది. కాపీరైట్ కంటెంట్ను వాడుకున్న ఏఐ సిస్టంలు తద్వారా గడించిన ఆదాయంలో కొంత శాతాన్ని ఆ కాపీరైట్ ఉన్నవారికి చెల్లించాలి. రేట్లను ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సిఫార్సుల పట్ల, కమిటీలో ఉన్న పరిశ్రమ (నాస్కామ్) ప్రతినిధి తన అసమ్మతిని వ్యక్తపర చారు.ఏఐ మోడళ్ళ రాబడిలో కొంత శాతాన్ని రాయల్టీలుగా చెల్లించాలన్న సిఫార్సుతో సదరు సభ్యుడు విభేదించారు. టీడీఎంకు వీలుగా తమ వర్కు పబ్లిక్గా అందుబాటులో లేకుండా నివారించుకోవలసిన బాధ్యత కాపీరైట్ హక్కుదారులపైనే పెట్టాలని ‘నాస్కామ్’ ప్రతినిధి సూచించారు. వారి రచన బహిరంగంగా అందుబాటులో ఉందని భావించినపుడు, దాన్ని ఇతరులు వాడుకునేందుకు వీలులేకుండా, ‘ఆప్ట్ ఔట్’ అవకాశాన్ని రచయిత లకు ఇవ్వవచ్చని ఆ ప్రతినిధి సూచించారు.ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కోట్లాది పుస్తకాలలోని అంశాలను టెక్నాలజీ కంపెనీలు తవ్వి తీసేశాయి. ఏఐ మోడళ్ళ ట్రైనింగుకు వాడుకు న్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆప్ట్ ఔట్’ కూడా ఆచరణసాధ్యమైన పరి ష్కారంగా కనిపించడం లేదు. నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడేవిగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చే విగా లేవు. దేశంలో కాపీ రైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరి శ్రమకు చెందినవారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడే విగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చేవిగా లేవు. దేశంలో కాపీరైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరిశ్రమకు చెందిన వారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మీ నిద్రలోనే మీ ఆయుష్షు!
సాధారణంగా మనమంతా నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతి దశగా భావిస్తాం. అయితే ఇదే అంశంపై అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక నూతన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఒక రాత్రి నిద్రలో మన శ్వాస తీరు, గురక శబ్దాలు, ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని వారు నిరూపించారు.రక్త పరీక్షలు, ఎక్స్-రేలు లాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే, మనం నిద్రపోయే తీరుతెన్నులే మన ఆరోగ్య స్థితిని చక్కగా వివరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా అనిపించినప్పటికీ, శాస్త్రవేత్తలు తమ నవ్య ఆవిష్కరణలో దీనిని నిజం చేసి చూపారు. స్టాన్ఫోర్డ్ పరిశోధకులు తాజాగా ‘స్లీప్ఎఫ్ఎం’ (SleepFM) అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలను, శ్వాస, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది.‘స్లీప్ఎఫ్ఎం’నకు సంబంధించిన పరిశోధనా పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర శ్వాస విధానం, హృదయ స్పందనల వేగం, పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది. తద్వారా ఇది సుమారు 130 రకాల వివిధ వ్యాధులను ఇది ముందే గుర్తించగలుగుతుంది.సుమారు 65 వేల మందికి సంబంధించిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించి, ఈ మోడల్ను రూపొందించారు. ఈ స్లీప్ఎఫ్ఎం మోడల్ ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ మోడల్ 80 శాతం కచ్చితత్వంతో గుర్తించగా, డిమెన్షియా లాంటి మెదడు సంబంధిత వ్యాధులను 85 శాతం కచ్చితత్వంతో అంచనా వేసింది. కిడ్నీ వైఫల్యాన్ని 80 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 90 శాతం మేర కచ్చితంగా గుర్తించింది. మొత్తంగా చూస్తే, ఈ ఏఐ వైద్యుడు దాదాపు 75 శాతం కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.మన శరీరం లోపల వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చేవరకూ వైద్యుడిని సంప్రదించరు. అయితే స్లీప్ఎఫ్ఎం పరికరం అందుబాటులో ఉంటే, ఏ వ్యాధిని అయినా ప్రాథమిక దశలోనే గుర్తించి, అప్రమత్తం కావచ్చు. భవిష్యత్తులో మన స్మార్ట్వాచ్ లేదా మన పరుపులోని సెన్సార్లు మన నిద్రను విశ్లేషించి.. ‘మీ ఆరోగ్యం సరిగా లేదు.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని హెచ్చరించే రోజులు దగ్గరలోనే రానున్నాయి. ఇది వైద్య ప్రపంచంలో ఒక గొప్ప విప్లవానికి నాంది కానుంది.ఇది కూడా చదవండి: ‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం.. -
కూ.. చెక్.. చెక్!
సాక్షి, హైదరాబాద్: వేగంగా దూసుకెళ్లే రైళ్లకు అడ్డుగా ట్రాక్ మీదకు వచ్చే జంతువులను ముందే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ త్వరలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రధాన రైల్వే కారిడార్లలో రైళ్ల గరిష్టం వేగం గంటకు 110 కి.మీ.గా ఉంది. కొన్ని ముఖ్య కారిడార్లను మాత్రం పటిష్ట పరిచి 130 కి.మీ.వేగాన్ని తట్టుకునేలా మార్చారు.త్వరలో మిగతా కారిడార్లను కూడా ఆ స్థాయికి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించుకుని అమలు ప్రారంభించింది. దీంతో రైళ్ల వేగం కూడా పెరగబోతోంది. ట్రాక్ మీదకు వచ్చే జంతువులు వేగంగా దూసుకెళ్లే రైళ్లకు ప్రమాదకరంగా మారుతున్నాయి.ట్రాక్ మీద జంతువుల కదలికలను ముందే గుర్తించి రైళ్ల వేగాన్ని తగ్గించటంతోపాటు అవసరమైతే నిలిపివేయగలిగేలా కృత్రిమ మేథతో కూడిన సాంకేతికతను వినియోగించుకోనున్నారు. ఇలా పని చేస్తుంది... అభివృద్ధి చెందిన దేశాలు కృత్రిమ మేథతో కూడిన వ్యవస్థను ఇందుకు అనుసరిస్తున్నాయి. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో మన రైల్వే శాఖ కూడా దీని ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.ఈ సాంకేతికత రెండు భాగాలుగా ఏర్పాటవుతుంది. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్), ఏఐ– కెమెరాల ఏర్పాటుతో పని చేస్తుంది. ఐడీఎస్ వ్యవస్థ డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (డీఏఎస్) ఆధారంగా పనిచేస్తుంది.ఇందులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ)ను రైలు పట్టాల వెంబడి అమరుస్తారు. ఈ కేబుల్స్ జంతువుల కదలికల నుంచి వచ్చే ప్రకంపనలను 300–500 మీటర్ల దూరం నుంచే గుర్తిస్తాయి.ఈ సమాచారాన్ని ఏఐ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసి, రైళ్లలోని లోకో పైలట్లు, స్టేషన్లోని సంబంధిత సిబ్బందికి, కంట్రోల్ రూమ్లకు రియల్–టైమ్ అలర్ట్ల ద్వారా పంపుతుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించి జంతువులు ట్రాక్ దాటిన తర్వాత ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటారు. అవి దాటని పక్షంలో రైళ్లను నిలిపేస్తారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 141 రూట్ కిలోమీటర్ల మేర పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఇటీవల అసోంలో రైలు ఢీకొని పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన నేపథ్యంలో దీన్ని వేగంగా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ప్రయోగాత్మక పరిశీలనకు రెండు కారిడార్లలో ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన స్పష్టత రానుంది. -
సమాజ పురోగతికి కృత్రిమ మేధ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు భారత్ను ఎంతగానో విశ్వసిస్తున్నాయని, అదే మన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) మోడల్స్ విశిష్టంగా ఉండాలని చెప్పారు. సమాజ పురోగతి కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని స్పష్టంచేశారు. డేటా గోప్యత సూత్రాలను పాటిస్తూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేసే ఏఐ మోడల్స్ రూపొందించాలని సూచించారు. అదేసమయంలో నైతికతను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్థానిక, స్వదేశీ కంటెంట్కు విశేషమైన ప్రాచుర్యం కలి్పంచాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను పరిపుష్టం చేయడానికి ఏఐ అనేది చక్కటి వేదిక అని ఉద్ఘాటించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు–2026’త్వరలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం ఇండియన్ ఏఐ స్టార్టప్ల రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని, ఆ దిశగా ఇప్పటినుంచే అంకితభావంతో కృషి చేయాలని స్టార్టప్లకు పిలుపునిచ్చారు. చౌకైన, సమగ్రమైన ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. భారతదేశ భవిష్యత్తుకు స్టార్టప్లు, ఏఐ ఔత్సాహికులే సహ రూపకర్తలు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సును వచ్చే నెలలో నిర్వహించబోతున్నామని, దీనిద్వారా టెక్నాలజీ రంగంలో మన ప్రాధాన్యం మరింత పెరుగుతుందని స్పష్టంచేశారు. అవతార్, భారత్జెన్, ఫ్రాక్టల్, గాన్, గెన్లూప్, జ్ఞాని, ఇంటెల్లిహెల్త్, సర్వం, శోధ్ ఏఐ, సాకేత్ఏఐ, టెక్ మహీంద్ర తదితర సంస్థలు, స్టార్టప్ల సీఈఓలు, ప్రతినిధులు ఈ రౌండ్టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. స్టార్టప్ల పనితీరు అద్భుతం యువతీ యువకులతో కృత్రిమ మేధ గురించి విస్తృతంగా చర్చించానంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇదొక మర్చిపోలేని భేటీ అని ఉద్ఘాటించారు. ఏఐ ప్రపంచంలో వస్తున్న మార్పులు, అందులో భారత్ పాత్ర గురించి అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ–కామర్స్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ స్టిమ్యులేషన్స్, మెటీరియల్ రీసెర్చ్, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన వంటి వేర్వేరు రంగాల్లో మన స్టార్టప్లు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రశంసించారు. చుట్టూ ఉన్న సమాజంలో సానుకూల మార్పుల కోసం ఏఐని ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించామని వివరించారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్’స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
తెల్లవారు జామున లేవగానే.. రోడ్డుపై అడుగుపెట్టే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారా? ఫోటోలు తీస్తున్నారా? చలానాలు వస్తాయెమోనన్న భయంతో బిక్కు బిక్కు మంటూ వెళ్లడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ముందు ట్రాఫిక్ పోలీసులున్నా.. లేకపోయినా... మనం మాత్రం ట్రాఫిక్ పోలీసుల కనుసైగల్లోనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించగానే ఆ సమాచారం నేరుగా ట్రాఫిక్ కంట్రల్ రూం చేరి.. తద్వారా వాహనదారులకు జరిమానా చేరుతుంది. ఇదేం కొత్త టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా.... అయితే జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి..బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను గమనించాడు. నిబంధనలు పాటించని వాహనదారుల కారణంగానే సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించాడు. ట్రాఫిక్ పోలీసులున్నా.. వారిని గుర్తించి పట్టుకోలేరనే ధీమాతో వాహనదారులు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారని గుర్తించి అలాంటి వాహనదారులను చెక్ పెడితే.. ట్రాఫిక్ సమస్యలను కొంత వరకు నివారించవచ్చని ఊహించాడు. సాధారణంగా వాహనదారులు తమకు కేటాయించిన దార్లలో కాకుండా.. రాంగ్సైడ్ వెళ్లడం.. అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదాలు జరగడం.. ఫలితంగా ట్రాఫిక్ అంతరాయాలు ఉంటాయని.. ఆ సమస్య నివారణ కోసం ఫోకస్ చేశాడు.రోడ్డుపై పోలీసులు ఉన్నా లేకున్నా.. వాహనదారుడు మాత్రం క్రమశిక్షణ పాటించాల్సిందేనని.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని గుర్తించడానికి ఓ హెల్మెట్ను సృష్టించాడు. ఏఐ టెక్నాలజీతో కెమెరాతో అనుసంధానించిన ఆ హెల్మెట్ పెట్టుకుని వాహనదారుడు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపై ఆ హెల్మెట్ దృష్టి సారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని గుర్తించి వాటి ఫోటోలు తీసి ఏకంగా ట్రాఫిక్ అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆధారాలతో పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. కొత్త సాంకేతికతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా కృషి చేసిన బెంగళూరు నగర యువకుడు పంకజ్ తన్వర్ను బెంగళూరు పోలీసు కమిషనర్ అభినందించారు.i was tired of stupid people on road so i hacked my helmet into a traffic police device 🚨while i ride, ai agent runs in near real time, flags violations, and proof with location & no plate goes straight to police. blr people - so now ride safe… or regret it. pic.twitter.com/lWaRO01Jaq— Pankaj (@the2ndfloorguy) January 3, 2026ఈ హెల్మెట్ ఎలా పనిచేస్తుందంటే.. హెల్మెట్లో ఉన్న కెమెరాలో చిప్తో పాటు సిమ్ అమర్చి ఉంటుంది. తీసిన ఫోటోలు ఆటోమెటిక్గా పోలీసులకు అందుతాయి. అందులోని సాఫ్ట్వేర్ ఆధారంగా పోలీస్ కంట్రోల్ రూంకు మెయిల్ ద్వారా పంపించే ఏర్పాట్లు ఉన్నాయి. లభించిన ఆధారాలతో పోలీసులు వాహనదారుల్ని గుర్తించి చలానాలు విధించడం లేదా కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు కనిపించని కెమెరాతో ఫోటోలు వస్తాయని వాహనదారులకు తెలిస్తే రోడ్డు నిబంధనలు పాటించే అవకాశముంది. -
థాంక్యూ.. గుడ్ బాయ్.. బ్రేకప్ చెప్పిన AI గర్ల్ ఫ్రెండ్
-
‘ఏఐ ఉత్త బడుద్దాయి’.. నిగ్గు తేల్చిన గణిత శాస్త్రవేత్త
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రపంచాన్ని ఏలుతోంది. అన్ని రంగాలనూ అది ఆక్రమించింది. జనం కూడా ఏఐని విరివిగా వినియోగించుకుంటూ, అన్నింటికీ దానిపైననే ఆధారపడే రోజులు వచ్చాయి. అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఏఐ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.అమెరికాలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన లాజిక్ ప్రొఫెసర్, ప్రముఖ గణిత శాస్త్రవేత్త జోయెల్ డేవిడ్ హామ్కిన్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గణిత పరిశోధనల్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంఎస్)కు ఏఐ ఏమాత్రం ఉపయోగపడటం లేదని, అవి ఇచ్చే సమాధానాలు పరమచెత్త(Garbage)గా ఉంటున్నాయని విమర్శించారు. లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో మాట్లాడిన జోయెల్ డేవిడ్ హామ్కిన్స్.. తాను అనేక పెయిడ్ ఏఐ మోడల్స్తో ప్రయోగాలు చేశానని, అయితే గణితంలో అవి ఏమాత్రం ఖచ్చితత్వాన్ని పాటించడం లేదని స్పష్టం చేశారు.గణితంలో ఏఐ వ్యవస్థలు తప్పులు చేయడమే కాకుండా, ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు అవి ప్రవర్తించే తీరు మరింత విస్మయానికి గురిచేసిందని హామ్కిన్స్ పేర్కొన్నారు. గణిత తర్కంలో స్పష్టమైన పొరపాట్లు ఉన్నాయని ఏఐకి తెలియజేసినా, అవి ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘అదంతా సరిగ్గానే ఉంది’ అంటూ మొండిగా సమాధానమిస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు వారు ఇలాంటి తప్పుడు వాదనలు చేస్తే, తాను ఇకపై వారితో మాట్లాడేందుకు నిరాకరిస్తానని జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ అన్నారు. ఏఐ ఇచ్చే తప్పుడు సమాధానాలు పరిశోధకుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం గణిత ప్రపంచంలో ఏఐ సామర్థ్యంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పరిశోధకులు ‘ఎర్డోస్’ లాంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ఏఐ సహాయపడుతుందని అంటుండగా, మరికొందరు ఏఐ ఇచ్చే నిరూపణలు (Proofs) పైకి చూడటానికి బాగున్నా, వాటిలో మానవ మేధస్సు కూడా పసిగట్టలేనంతటి సూక్ష్మమైన పొరపాట్లు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రామాణిక పరీక్షల్లో ఏఐ అద్భుతమైన మార్కులు సాధించినంత మాత్రాన, పరిశోధకులకు అది ఉపయోగపడుతుందని చెప్పలేమని హామ్కిన్స్ విశ్లేషించారు. మొత్తంగా చూస్తే గణితంలో ఏఐ ఉత్త బడుద్దాయి(పనికిమాలిన వ్యక్తి) అని జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచ వినాశనానికి కౌంట్డౌన్? -
ఆస్క్ మీ... ఏనుగంత టాస్క్
ఓపెన్ ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే చిన్న చిన్న సమస్యల్ని కాకుండా, పరిష్కారానికి అత్యంత కష్టంగా ఉండేవాటిని ఎంచుకోవాలని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టుగెదర్ ఫండ్’ కో–ఫౌండర్ మానవ్ గార్గ్ అంటు న్నారు. ఏఐ రంగంలో స్టార్టప్ పెట్టుబడుల వేటలో ఉన్నవారు తమ విజన్ ప్రపంచాన్ని ఎలా మెరుగుపరచ గలదో స్పష్టంగా చెప్పలేకపోతే వెంచర్ క్యాపిటలిస్టు లను ఒప్పించటం చాలా కష్టం అని గార్గ్ సూచిస్తు న్నారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:వస్తున్నది 100... పోతున్నది 110‘‘ప్రస్తుతం దాదాపు అన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. దీనర్థం ఏమిటంటే, మాకు వంద రూపాయల ఆదాయం వస్తే... కేవలం టెక్నాలజీ, కంప్యూటర్ సర్వర్ల కోసమే 110 రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక మార్కెటింగ్, ఉద్యోగుల జీతాల ఖర్చులు దీనికి అదనం. అలాగని ఇది తెలివి తక్కువ తనం కాదు, ఇదొక వ్యూహం. టెక్నాలజీ ఖర్చులు రాను రానూ వేగంగా తగ్గిపోతాయి కాబట్టి, ఇప్పుడు నష్ట మైనా సరే ఎక్కువ మంది వినియోగదారులను, డేటాను సంపాదించుకునే కంపెనీలే భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు మార్కెట్ను ఏలుతాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఖర్చు‘‘ఓపెన్–ఏఐ’ సంస్థ వేల కోట్లు నష్టపోతోందని వినిపి స్తోంది. వారు సుమారు 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడబోతున్నారని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నష్టంలో కేవలం 20 శాతం మాత్రమే కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వల్ల వస్తుంది. అసలైన భారీ ఖర్చంతా– దాదాపు 70 శాతం – ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. పెద్ద ఎత్తున డేటాసెంటర్ల నిర్మాణం, ఎంత వ్యయమైనా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనడం, కరెంట్ బిల్లుల చెల్లింపు వంటివి. గూగుల్ సంస్థలా సొంతంగా చిప్స్ తయారీ, సొంత డేటా సెంటర్లు ఏర్పాటు, ప్రత్యేక విద్యుత్ఒప్పందాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఏఐ వ్యాపారాన్ని లాభదాయకంగా నడపడం సాధ్య మవుతుంది.యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు!‘‘మనం ఇప్పుడు వాడుతున్న సాధారణ యాప్స్ భవి ష్యత్తులో మెల్లగా మరుగునపడిపోతాయి. రాబోయే కాల మంతా ‘ఏఐ ఏజెంట్’ (ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటి సాఫ్ట్వేర్)లదే. మనం గంటల కొద్దీ బ్రౌజింగ్ చేయటం ఉండదు. ఈ ఏఐ ఏజెంట్లకు మీ ఇష్టానిష్టాలు తెలు స్తాయి. మీ తరఫున అవి పనులు చేస్తాయి. మీ క్యాలెండర్ లేదా మీరు ధరించే వాచీలు వగైరాల నుంచి సమా చారాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు మీకు సాయపడ తాయి. ఒక్కసారి ఊహించండి:నా పర్సనల్ ఏఐఏజెంట్ నేరుగా అమ్మకాలు జరిపేవారి ఏఐ ఏజెంట్తో మాట్లాడుతుంది. నా బడ్జెట్ ప్రకారం బేరమాడుతుంది, నా ఆరోగ్యానికి తగిన, నా సమయానికి అనుకూలమైన వస్తువును ఎంచుకుంటుంది. ఆపై నేరుగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇదంతా నేను ఒక్క వెబ్సైట్ కూడా ఓపెన్ చేయకుండానే జరిగి పోతుంది.కొత్తవాటిపై కసరత్తు చేయాలి!‘‘మీరు ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే, అందరికీ తెలిసిన చిన్న చిన్న సమస్యలు కాకుండా, పరిష్కరించ డానికి కష్టంగా ఉండే కొత్త సమస్యలను ఎంచుకోవాలి. అప్పుడే మీ పోటీదారులు మిమ్మల్ని త్వరగా కాపీ కొట్ట లేరు. మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన డేటా ఆధారంగా ఇతరులు సులభంగా తయారు చేయలేని విధంగా మీ వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. ఏఐ రేసులో భారతదేశం శక్తిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఓపెన్–ఏఐ’ని ఎక్కువగా వాడు తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దగ్గర అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు. అంతేకాకుండా, ఇక్కడ చాలా రకాల వ్యాపారాలు ఇంగ్లిష్లోనే జరుగు తాయి కాబట్టి, భారతీయ కంపెనీలు మొదటి రోజు నుండే ప్రపంచ స్థాయిలో కొత్త ఏఐ ఉత్పత్తులను తయారు చేసే గొప్ప అవకాశం ఉంది.-ఎడిటోరియల్ టీమ్ -
ఏఐలో మనమేం చేయాలి?
‘డీప్సీక్’ గుర్తుందా? గడచిన 2025 మొదట్లో ఈ చైనీస్ కంపెనీ కృత్రిమ మేధ రంగాన్ని కుదిపేసింది. తక్కువ ఖర్చుతో అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ‘ఛాట్ జీపీటీ’ని తలదన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. కృత్రిమ మేధలో చైనా ఎంత ముందుందో ప్రపంచానికి చాటిన సందర్భం ఇది. తాజాగా అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ సైతం ‘డీప్సీక్’ ప్రాముఖ్యన్ని గుర్తించింది. కంపెనీ వ్యవస్థాపకుడు లియంగ్ వెన్ఫెంగ్ను గతేడాది టాప్ వ్యక్తుల్లో ఒకరిగా నిలిపింది. ఒకే ఏడాదిలో డీప్సీక్ తాలూకూ జనరల్ పర్పస్ వీ–3 మోడల్ విప్లవాత్మకమైన మార్పునకు కారణమైంది. దీంట్లోని అడ్వాన్స్డ్ మోడల్ ఆర్–1 తర్కానికి సంబంధించినది. ఫలితంగా ఇది గణిత, సాఫ్ట్వేర్ కోడింగులకు సంబంధించిన సంక్లిష్టమైన విషయాలను కూడా మెరుగ్గా చేపట్టగలదు. పైగా ఇది ఓపెన్ మోడల్. అంటే ఎవరైనా స్వేచ్ఛగా దీన్ని వేర్వేరు రంగాల్లో ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వాలంటే అపారమైన సమాచారం అవసరం. ఎంత సమాచారంతో శిక్షణ ఇస్తే అంత మెరుగైన ఫలి తాలు రాబట్టుకోవచ్చు. గతేడాది చైనీస్ ఏఐ మోడళ్లు మార్కెట్లో అన్నింటి కంటే ముందున్నట్లు ఒక సర్వే ద్వారా తెలిసింది. అంత ర్జాతీయంగా 33 శాతం మంది వీటిని వాడుతున్నట్లు అంచనా.ఇంగ్లీషు తరువాత అత్యధిక సంఖ్యలో టోకెన్లు అడిగింది కూడా చైనీస్ భాషలోనే కావడం గమనార్హం. చైనాతోపాటు అంతర్జాతీయంగానూ చైనా మోడళ్లు బాగా పనిచేస్తున్నాయనేందుకు ఇవి నిదర్శ నాలు. శిక్షణ సమయంలో ఏఐ మోడళ్లు ప్రాసెస్ చేసి అర్థం చేసు కోవడం ద్వారా అంచనా కట్టే, తర్కాన్ని అభివృద్ధి చేసుకునే యూనిట్లనే ‘టోకెన్లు’ అని పిలుస్తారు. ఏఐలో స్వావలంబన కోసం...డీప్సీక్ ప్రకటన వెలువడిన వెంటనే భారత్ కూడా ఎల్ఎల్ఎంలతో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాథమిక ఏఐ మోడళ్ల అభి వృద్ధి గురించి వివరాలు వెల్లడించింది. భారతీయ అవసరాలకు తగ్గట్టుగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా భాషిణి’ (భారతీయ భాషలను అను వదించేది), ‘భారత్ జెన్’ (ప్రభుత్వ సేవలను అందించే మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం), పదివరకూ భారతీయ భాషల ఏఐ ఎల్ఎల్ఎం మోడల్గా ‘సర్వం–1’, వీడియోలను సృష్టించే ‘చిత్ర లేఖ’, 35 వరకూ భారతీయ భాషలకు ‘హనూమాన్ ఎవరెస్ట్ 1.0’ పేరుతో ఓ ఏఐ వ్యవస్థ వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ‘భారత్ జెన్’ అభివృద్ధికి పలు టెక్నాలజీ విద్యా సంస్థలు చేతులు కలిపాయి.కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కొన్ని నిధులు సమకూర్చాయి. జాతీయ ఏఐ మిషన్ కింద మరో రూ. 980 కోట్లు కూడా కేటాయించారు. ఈ రకమైన మద్దతు లభించిన, ఒక దేశ లక్ష్యం కోసం ఏర్పాటైన మొట్టమొదటి ప్రాజెక్టు భారత్ జెన్ మాత్రమే అయివుంటుంది.భారత్ జెన్ను చాలామంది డీప్సీక్కు పోటీ అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. డీప్సీక్ పూర్తిగా వాణిజ్యపరమైంది. స్టార్టప్ మాదిరిగా మొదలైంది.భారత్ జెన్... వ్యూహాత్మకమైన జాతీయ మిషన్. సాంకేతిక రంగం విషయంలో స్వావలంబన కోసం ప్రభుత్వ మద్దతుతో మొదలైన ప్రాజెక్టు. డీప్ సీక్, ఛాట్జీపీటీల ముందున్న అతి పెద్ద సవాలు... సంక్లిష్టమైన భారతీయ భాషలను, సంస్కృతులను అర్థం చేసుకోవడం. ఈ అంత రాన్ని ‘భారత్ జెన్’ పూడ్చగలదని అంచనా. 1970, 80లలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సీఎంసీ, సీ–డాట్ కంపెనీల మాదిరిదే ఈ భారత్ జెన్. సీఎంసీ, సీ–డాట్లను దేశీ స్వావలంబన, ఆత్మనిర్భరత లక్ష్యాలతోనే ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం కావడం వెనుక ఐఐటీలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వంటిసంస్థలు కూడా ఉన్నాయి. అవసరమైన మార్గదర్శకాలుఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, భారతీయ టెక్ కంపె నీలేవీ ఏఐ ఫౌండేషనల్ మోడళ్లను అభివృద్ధి చేయకపోవడం. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏఐ వ్యవస్థలకు అవసరమైన డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. భార తీయ టెక్ పరిశ్రమ మొత్తం సేవా రంగం ప్రధానంగానే నడుస్తోంది. సుమారు 200 బిలియన్ డాలర్ల ఆదాయమున్న ఈ రంగం ఏఐ విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం అభిలషణీయం కాదు. నైపుణ్యం, అనుభవం, ఆర్థిక శక్తి కూడా కలిగిన భారతీయ టెక్ రంగం భారత్ జెన్ వంటి వాటి అభివృద్ధికి భాగస్వాములు కావాల్సిన అవసరముంది.ప్రభుత్వ సహకారం లేదు కానీ డీప్సీక్ అభివృద్ధి చేసిన మోడళ్లు చైనా ప్రభుత్వ పర్యవేక్షణకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుత చైనా నియంత్రణల ప్రకారం... అన్ని ఏఐ సేవలు కూడా సోషలిస్ట్ విలువలను పాటించాలి. జాతీయ ఏకతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే తియనాన్మెన్ స్క్వేర్ నిరస నలు, తైవాన్ పరిస్థితి, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై వస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల వంటి అంశాలపై ఈ మోడళ్లు కిమ్మనవు.బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి అన్న నినాదంతో మార్గదర్శ కాలను ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకత, జవాబుదారీ తనం, భద్రత, మానవ పర్యవేక్షణల ప్రాముఖ>్యన్ని, అవసరాన్ని ఈ మార్గదర్శకాలు నొక్కి చెప్పాయి.ప్రభుత్వ సహకారంతో నడుస్తోంది కాబట్టి, అటు ఈ మద్దతును కొనసాగించడం... ఇటు ప్రజా సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకోవడం భారత్ జెన్కు కీలకం. పాశ్చాత్య దేశాల ఏఐ మోడళ్లలో మాదిరి అల్గరిథవ్ుల పరమైన వివక్ష భారత్ జెన్లో ఉండకూడదు. రాజకీయ ప్రభావానికి గురిచేసేలా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొత్తం సామాన్యుల పన్నుల డబ్బుతోనే నడుస్తోంది. వేర్వేరు భాషలకు సంబంధించిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేసే సందర్భంలోనూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్ద పీట వేయాలి. భాషా శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, వేర్వేరురంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి అభివృద్ధి చేస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుందన్నది గుర్తుంచుకోవాలి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
బిలియన్ల బిడ్ వార్
సాధారణంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్బుక్ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్కు తెరతీస్తూ గత వారం మిడ్టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ఎన్కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐఐటీలకు ‘బూస్ట్’
సాక్షి, హైదరాబాద్: సీట్ల పెంపు, మౌలిక వసతుల కల్పన, కోర్సుల్లో నాణ్యత పెంపుతో దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లను బలోపేతం చేయాలని ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలకు డిమాండ్ పెరుగుతోందని, అందువల్ల సీట్లు గణనీయంగా పెంచాలని విజ్ఞప్తి చేశాయి. 2026–27 విద్యా సంవత్సరంలోనే కనీసం 2 వేల సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో దేశంలో ఎమర్జింగ్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐతో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కోర్సుల నాణ్యత పెంచాలని, లేబొరేటరీలను ఉన్నతీకరించాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు మౌలిక వసతులు సైతం పెంచాలని ఐఐటీలు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాయి. ఆయా అంశాలపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఏఐకి అనుగుణంగా మెరుగులు‘దేశంలో ఏఐపై విస్తృత పరిశోధన జరుగుతోంది. డేటా కేంద్రాల పరిధి పెరుగుతోంది. అంతర్జాతీయ ఏఐ సంస్థలు ఐఐటీల నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాయి. ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఇన్డెప్త్ ప్రాజెక్టు ఇంటర్న్షిప్పై దృష్టి పెడుతున్నాయి. ఏఐ, డేటాసైన్స్కు బలమైన పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరం పెరిగింది. ఈ మేరకు లేబొరేటరీలు ఏర్పాటు చేయడంతో పాటు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..’అని ఐఐటీలు కేంద్రానికి తెలిపాయి. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ ఏఐ, డేటాసైన్స్ లాంటి కోర్సులు పెంచాలని ఐఐటీ ముంబై సూచించింది. 120 గంటల హైబ్రిడ్ ఏఐ కోర్సులను అందించే దిశగా ఐఐటీ కాన్పూర్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొన్నిచోట్ల ప్రైవేటు, ప్రభుత్వ సమన్వయంతో ముందుకెళ్ళే ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాయి. ప్రధాన సమస్యగా హాస్టళ్ల కొరత.. ఐఐటీల్లో ప్రస్తుతం హాస్టళ్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్య వేగంగా పెరగడం, వసతి సదుపాయాల విస్తరణ ఆ స్థాయిలో జరగకపోవడమే దీనికి మూలకారణం. గత పదేళ్ళుగా ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, పీహెచ్డీ సీట్లు భారీగా పెరిగాయి. 2008 తర్వాత ఏర్పడిన కొత్త ఐఐటీలకు ఇంకా క్యాంపస్ల నిర్మాణం పూర్తవ్వలేదు. ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లకు కూడా వసతి అవసరమవుతోంది. హాస్టల్ ప్రాధాన్యత విద్యార్థులకే కాకుండా పరిశోధకులకు కూడా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. నిధులు, భూసేకరణ, నిర్మాణ ఆలస్యాలు, కేంద్రం నిధుల విడుదలలో జాప్యం తదితరాలు కూడా కారణమవుతున్నాయి. ఐఐటీ విద్యార్థులు, ఫ్యాకల్టీకి క్యాంపస్ వెలుపల అద్దె గదులు తీసుకోవాల్సి రావడంతో ఖర్చు పెరుగుతోంది. బయట ఉండేవారి ప్రయాణ సమయం పెరగడం.. బోధన, చదువుపై ప్రభావం చూపుతోంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు భద్రత పరమైన సౌకర్యాల సమస్య ఏర్పడుతోంది. టెక్నాలజీ అప్డేట్తో కూడుకున్న ఐఐటీ విద్యకు క్యాంపస్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐఐటీల్లో 18,160 సీట్లు ఉన్నాయి. అయితే 12 వేల మందికి మాత్రమే ఐఐటీ ప్రాంగణాల్లో హాస్టల్ వసతి ఉండటం గమనార్హం. మిగతా విద్యార్థులను ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచుతున్నారు. ఆ కోర్సులకే డిమాండ్.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం 62,853 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 వేలకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే ఉన్నాయి. గత నాలుగేళ్ళుగా ఏఐకి ప్రాధాన్యత పెరగడంతో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో డేటాసైన్స్, ఏఐఎంఎల్, ఎంబీడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్కు డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలతో కలుపుకొని 16 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అయితే వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్న వారు 9 శాతమే ఉంటున్నారు. ఐఐటీల్లో విద్యా బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 78 శాతం ఉపాధి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల పెంపుపై కొన్నేళ్ళుగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఆధారిత కొత్త కోర్సుల మేళవింపుపై కేంద్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.సీట్ల పెంపు ప్రతిపాదనలు ఇలా..ఏఐ ఆధారిత కంప్యూటర్ కోర్సులను కోర్ సీఎస్ఈకి అనుసంధానం చేసి కనీసం 800 సీట్లు పెంచాలని ఐఐటీలు సూచిస్తున్నాయి. మరో 400 సీట్లు డేటా సైన్స్లో కోరుతున్నాయి. మరో 800 సీట్లు ఇతర కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సులను తీసుకొచ్చి పెంచాలని కోరుతున్నాయి. మరోవైపు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు (ఎన్ఐటీలు), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో (జీఎఫ్టీఐలు) మొత్తం 62 వేలకు పైగా సీట్లున్నాయి. వీటిల్లో సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటాసైన్స్ కోర్సులతో కూడిన కంప్యూటర్ కోర్సులను రీ డిజైన్ చేయాలని ఐఐటీలు సూచిస్తున్నాయి. -
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏం జరిగిందంటే? ఇండోర్లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. బతకడం కష్టమై తప్పు చేశా.. పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
లిస్టింగ్కు శాంసంగ్ నో
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టింగ్ యోచన లేదని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎల్రక్టానిక్స్ తాజాగా స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది. వివిధ ప్రొడక్టులలో ఏఐను మరింత వినియోగించనున్నట్లు పేర్కొంది. కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశీ మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకు వీలుగా కన్జూమర్ ఫైనాన్స్ విభాగాన్ని విస్తరించనున్నట్లు తెలియజేసింది. భారత్లో తయారీ కార్యకలాపాలను మరింత లోతుగా విస్తరించే యోచనలో ఉన్నట్లు శాంసంగ్ నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ తెలియజేశారు. దేశీయంగా మొబైల్ ఫోన్ డిస్ప్లేల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(పీఎల్ఐ) దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ తయారీకి నోయిడాలో అతిపెద్ద ప్లాంటును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది కీలక ఎగుమతుల కేంద్రంగా ఆవిర్భవించింది. కాగా.. దేశీయంగా ఐపీవో చేపట్టడంపై స్పందిస్తూ పార్క్ ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలులేవని స్పష్టం చేశారు. అయితే ఇతర దక్షిణ కొరియా దిగ్గజాలు హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇటీవల పబ్లిక్ ఇష్యూతో నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. తద్వారా దేశీ కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు పార్క్ తెలియజేశారు. అవసరమైతే కార్పొరేట్ బాండ్ల జారీ లేదా సంస్థాగత రుణాలు తదితర మార్గాలలో నిధులు సమకూర్చుకోనున్నట్లు వివరించారు. -
భారత్లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే
న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్ కాలర్ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్ ఉందని చెప్పారు. -
ఏఐ.. 2025..ఉమెన్ రైజింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులు కీలకంగా మారాయి.మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రైజింగ్ 2025 సమ్మిట్లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్ల సంఖ్య పెరగడం శుభసూచకం.డీప్–టెక్ డొమైన్లలో...2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్ మాస్టర్ ప్రోగ్రామ్స్లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్లలో మాస్టర్స్ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్ఫామ్ రిపోర్ట్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్లాంటి డీప్–టెక్ డొమైన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్ సెక్యూరిటీ ఎన్రోల్మెంట్స్లో మహిళలు 25 శాతం, జనరేటివ్ ఏఐలో డాక్టోరల్ క్యాండిడేట్స్ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.మార్పు మంచిదే కదా!‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్ మోడల్స్ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ గుప్తా.పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్ కార్యక్రమాలు చేపట్టింది.స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్’ ఇండియా మ్యాగజైన్ సమ్మిట్ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.యశోద ఏఐ అంటే?డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్ ముందుకు వచ్చింది.యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హారిజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.ఎన్సీడబ్ల్యూ, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ (ఎఫ్ఎస్ఎల్) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్ యాప్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎందుకు కీలకం?హ్యాకింగ్, ఆన్లైన్ వేధింపులలాంటి సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్ ప్లాట్ఫామ్లను సురక్షితంగా నావిగేట్ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్లో చేరవచ్చు.‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్. ఏఐ బై హర్...గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్గ్లోబ్ ఇంపాక్ట్ ఛాలెంజెస్...‘ఏఐ బై హర్’ ‘ఏఐ ఫర్ ఆల్’ ‘యువ్ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్సెక్యూరిటీ, విద్య, డిజిటల్ వెల్బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్ క్లైమేట్ రంగాలలో, ఏఐకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ ‘ఏఐ బై హర్’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్–గుడ్ అప్లికేషన్స్’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది.ఎన్ని స్టార్టప్లో!ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్ డేటా ప్రకారం...అక్టోబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫండింగ్కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్లలో కొన్ని... డా.గీతా మంజునాథ్–నిరామయి హెల్త్ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్–మ్యాడ్ స్ట్రీట్ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్బజ్.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్స్క్రిప్ట్.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్ అగర్వాల్–బ్రెయిన్సైట్.ఏఐ. -
తప్పుడు సమాచార వ్యాప్తికి భారీ శిక్షలు
సియోల్: తప్పుడు, కృత్రిమ సమాచార కట్టడికి దక్షిణ కొరియా కొత్త బిల్లు తెచ్చింది. పదేపదే హెచ్చరించినా వాటి వ్యాప్తికి పాల్పడే సంప్రదాయ, ఆన్లైన్ వార్తా మాధ్యమాలకు ఇకపై భారీ జరిమానాలు విధించనుంది. అక్కడి చట్టసభ బుధవారం ఈ మేరకు ఒక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఆరోపణలు రుజువైతే సదరు మీడియా సంస్థలపై దేశ మీడియా నియంత్రణ సంస్థ ఏకంగా 100 కోట్ల వొన్ (7 లక్షల డాలర్ల) దాకా జరిమానా విధించవచ్చు. తప్పుడు వార్తలకు 50 లక్షల వొన్ల దాకా పరిహారం వసూలు చేయవచ్చు. మీడియా సంస్థలపై ఆరోపణలు కోర్టులో రుజువైతే బాధితులకు జరిగిన నష్టానికి హీనపక్షం ఐదు రెట్ల పరిహారం వసూలు చేయవచ్చు. అయితే ఈ బిల్లు అంతిమంగా మితిమీరిన ప్రభుత్వ సెన్సార్ షిప్ కు దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును వీటో చేయాల్సిందిగా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు జర్నలిస్టు, పౌర హక్కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ‘‘బిల్లులో వాడిన పదజాలమే చాలా అభ్యంతరకరం. పైగా మీడియాకు ఎలాంటి రక్షణ చర్యలూ పొందుపరచలేదు. ఇలాగైతే ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల అవినీతి తదితరాలపై విమర్శనాత్మకంగా ఒక్క ముక్క కూడా రాసేందుకు వీలుండదు’’ అంటూ మండిపడ్డాయి. -
జేఈఈ ప్రశ్నావళి @ ఏఐ
సాక్షి, హైదరాబాద్: జాతీయ పోటీ పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకపాత్ర పోషించబోతోంది. కేంద్ర విద్యాశాఖ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్లో వీలైనంత త్వరగా ఏఐని అందుబాటులోకి తేనున్నారు. కాన్సెప్ట్ క్లారిటీ మాడ్యూల్స్ను రంగంలోకి దించబోతున్నారు. ఐఐటీ ముంబై ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తిచేసింది. సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఐఐటీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలో కొంతమేర దీన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లపై సమీక్షిస్తారు. మార్పులు, చేర్పుల తర్వాత 2027లో పూర్తిస్థాయిలో ఏఐని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలుత జేఈఈ వరకూ పరిమితం చేసి, ఆ తర్వాత నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు ఏఐని అందుబాటులోకి తేవాలనే యోచనలో ఉన్నారు. సెక్యూరిటీ మాడ్యూల్స్పై కసరత్తు జేఈఈ పరీక్షను దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపకల్పన మొదలు, మూల్యాంకనం వరకూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉండాలని ఐఐటీ–బాంబే కేంద్రానికి సూచించింది. ప్రతీ పోటీ పరీక్షకు ప్రత్యేక లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ అవసరం ఉందని పేర్కొంది. ప్రశ్నపత్రాల తయారీ, ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాతోపాటు పలు దేశాల్లో ఏఐ ఆధారిత మాడ్యూల్స్ను ప్రత్యేకంగా రూపొందించారు. సైబర్ నేరాలకు సాధ్యం కాని ఫైర్వాల్స్ రూపొందించినట్లు ముంబై–ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం జేఈఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు పది సెట్లుగా తయారు చేస్తారు. ఇందులో కఠినం, మధ్యస్థం, సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సాఫ్ట్వేర్ ఆధారంగానే పది సెట్ల నుంచి ప్రశ్నలు ఎంపికవుతాయి. ఏఐ టెక్నాలజీతో చాప్టర్స్, సిలబస్ ఆధారంగా డేటాను ఫీడ్ చేస్తారు. వీటిలో ఏఐ మాడ్యూల్స్ అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేస్తాయి. తుది కూర్పు తర్వాత ప్రశ్నపత్రం కేంద్రీకృత అధికారి పాస్వర్డ్తోనే పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హాక్ అవ్వడానికి, ప్రశ్నపత్రం లీక్ అయ్యేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు అంటున్నారు. ఏఐకి అందించే డేటా కూడా అత్యంత గోప్యంగా ఉండాలని చెబుతున్నారు. సమస్యల పరిష్కారంపై సాధన డేటా ప్రైవసీ, అల్గారిథమ్లో కొన్ని సమస్యలున్నాయని ఐఐటీ–మద్రాస్ నిపుణులు అంటున్నారు. ఫీడ్ చేసే డేటా ఇతర సంస్థలకు వెళ్తే, ఏఐ టూల్ అక్కడా ఉంటే ప్రశ్నలు కొన్ని ముందే తెలిసే వీలుందని భావిస్తున్నారు. సంప్రదాయంగా జరిగే ప్రశ్నపత్రం కూర్పులో మేథ్స్, ఫిజిక్స్లో ట్విస్ట్ చేసే ప్రశ్నల తయారీ కోసం ఏఐకి సరికొత్త మాడ్యూల్స్ అందించాలి. లేకపోతే చాప్టర్ ఆధారంగానే సాధారణ ప్రశ్నావళి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. అనేక దేశాల డేటా కేంద్రాలకు సమన్వయం అవుతుంది. కాబట్టి ప్రశ్నావళి రూపకల్పనలో ఇతర డేటాను ఏఐ తీసుకుంటే, విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని పోటీ పరీక్షలకు, అందులోనూ ప్రతీ సబ్జెక్టుకు విస్తృతమైన దేశీయ డేటాను డేటా సెంటర్కు ఫీడ్ చేయడం, దాన్ని నిర్వహించడంపై కసరత్తు జరగాలని సూచిస్తున్నారు. కోచింగ్లోనూ ఏఐ దూకుడువాస్తవానికి ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఏఐని విరివిగా వాడుతున్నాయి. విద్యార్థి బలాలు, బలహీనతలు,వ్యక్తిగత స్టడీప్లాన్, రోజువారీ ప్రాక్టీస్ ప్రశ్నలు, సందేహాల నివృత్తికి 6.5 లక్షల మంది జేఈఈ రాసే విద్యార్థులు ఏఐ, చాట్బాట్ను వాడుతున్నారు. గత రెండేళ్ల ప్రశ్నల ఆధారంగా ట్రెండ్ అనాలసిస్ను ఏఐ అందిస్తోంది. విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు తయారు చేస్తూ మాక్ టెస్టులు, అడాప్టివ్ లెర్నింగ్ టెస్టులను ఏఐ ట్యూటర్లు అందిస్తున్నాయి. సమయ పాలన, స్కోర్, ర్యాంకు అంచనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఏఐ అనుసంధాన ప్రిపరేషన్ మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏఐ ప్రాక్టరింగ్తో ఫేస్ రికగ్నిషన్, విద్యార్థి ప్రవర్తనను గుర్తించే ఎల్ఎల్ఆర్ఎంలు రెండేళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీని ఆధారంగా పోటీ పరీక్షల్లో విద్యార్థిస్థాయి, ఆందోళనను ఆన్లైన్లో అందిస్తున్నారు. సలహాలు, సూచనలు ఏఐ నుంచి అందుతున్నాయి. ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫాంతో స్మార్ట్ కోచింగ్ వల్ల గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన కంటెంట్ అందుకుంటున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో వేగంగా ఫలితాలు వస్తున్నాయి. -
గచ్చిబౌలి: ఏఐతో కాపీ కొట్టి.. అలా ఇన్విజిలేటర్కు దొరికారు!
సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ ఎగ్జామ్స్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి కాపీ కొట్టే ప్రయత్నంలోనే అనూహ్యంగా ఆ ఇద్దరూ దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగాయి. మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ఇద్దరు అభ్యర్థులు అనిల్ కుమార్, సతీష్ పట్టుబడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ దివేశ్ నిగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం.అయితే.. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ఏఐతో పరీక్ష కాపీ కొట్టబోయారు. ముందుగా.. షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో పేపర్ స్కాన్ చేశారు. తరచూ బాత్రూమ్కు వెళ్లి ఏఐ సాయంతో సమాధానాలు సేకరించారు. చెవిలో ఉన్న బ్లూటూత్ పరికరాల ద్వారా సమాధానాలు వింటూ ఎగ్జామ్ రాశారు. ఈ క్రమంలో.. బ్లూటూ్ నుంచి వచ్చిన ‘బీప్’ శబ్దంతో ఇన్విజిలేటర్కు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో.. నిందితుల మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. -
మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు
-
చచ్చినా చావను..!
చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపించి ఉంటుందిలెండి. మందుమాకులతో చచ్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన వాళ్లూ కొంతమంది ఉన్నారు. అయితే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తాను 2039 నాటికల్లా చావును జయిస్తానంటున్నాడు బ్రయన్ జాన్సన్. ఎవరీ బ్రయన్? ఏమిటీ దీని వెనుక బ్రెయిన్?బ్రయన్ జాన్సన్ (Bryan Johnson) ఒక బయో హ్యాకర్. అంటే రకరకాల రసాయనాలు, పోషకాలతో శరీరం వయసు పెరక్కుండా చూసుకుంటూంటాడు. ఆ మధ్య న్యూఢిల్లీకి వచ్చి... వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక వెళ్లిపోయాడు కూడా. తాజాగా 48 ఏళ్ల బ్రయన్ ఇంకో సంచలన ప్రకటన చేశాడు. కృత్రిమ మేధ సాయంతో 2039 నాటికి చావును జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఎలా? అని అడిగితే ఆయనిస్తున్న సమాధానం ఏమిటంటే...కొన్ని పద్దతులను కచ్చితంగా ఉపయోగించడం మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని బ్రయన్ నమ్మకం. ఇందుకు రోజూ వంద వరకూ ట్యాబ్లెట్లు. బోలెడన్ని పౌడర్లు, ద్రవాలు మింగుతూంటాడు.వీటిల్లో మల్టీ విటమిన్స్, నాచు నుంచి తీసిన ఒమెగా-3, కొలేజన్ మిశ్రమాలు, పాలిఫినాల్లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్, దీర్ఘాయుష్షు ఇస్తాయని అతడు నమ్మే 13 రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కాకుండా.. మెదడు, గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలూ రోజూ తీసుకుంటూంటాడు. ఇందుకోసం ఈ మిలియనీర్ పెట్టే ఖర్చు ఏడాదికి 20 లక్షల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే 166 కోట్లు!. వీటన్నింటి కారణంగానే ఏమో... 48 ఏళ్ల బ్రయన్ జాన్సన్ చూసేందుకు మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. అయితే అతగాడు ఇప్పుడు అంత సంతృప్తిగా ఏమీ లేడు. వందేళ్లు కాదు.. ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు.సులువుగా సరికొత్త మందులు...ఐదేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న ఏఐ టెక్నాలజీ చావును జయించేందుకు కూడా కీలకమని బ్రయన్ విశ్వాసం. ఏఐ ద్వారా బయోటెక్, అవయవాల క్లోనింగ్, కొత్త కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని ఫలితంగా అంతం లేని ఆయుష్షు కూడా సాధ్యమే అంటాడు బ్రయన్. ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్షును జయించాయని, జెల్లీఫిష్, హైడ్రా, కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు. ఇప్పుడు తాను తీసుకుంటున్నట్లే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం, వైద్యుల పర్యవేక్షణలతో దీర్ఘాయుష్షు సాధ్యమంటాడు. కృత్రిమ మేధ ద్వారా అవయవాల క్లోనింగ్ సులువైతే ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త మందులను చాలా వేగంగా అభివృద్ధి చేయవచ్చునని, ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ... శాస్త్రవేత్తలు కొందరు మాత్రం బ్రయన్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. శరీరం వయసు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ.. మొత్తానికి నిలిపేయడం అంటే చావును జయించడం ఊహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చావు లేకుండా చేయవచ్చు అన్న భావనకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అమరత్వం (Immortal) సిద్ధించినా.. అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైతేనేం.. బ్రయన్ జాన్సన్కు జై! అమరత్వం జిందాబాద్! -
ఏఐ, చాట్ జీపీటీల వాడకం ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి సమాచారం కావాలన్నా సెకన్లలో ఇచ్చే ఏఐ, చాట్ జీపీటీలు అత్యంత ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది. ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగిస్తున్న కారణంగా.. దేశానికి సంబంధించిన రహస్య సమాచారమంతా బయటకు వెళుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు అధికారులు ఏఐ, చాట్జీపీటీ ద్వారా ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని మరింత ఎక్కువగా, చక్కగా తీర్చిదిద్దేందుకు ఈ రెండింటిలో షేర్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీని కారణంగా మన దేశంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న పనులు, ఇతర కీలకమైన సమచారం అంతా ఏఐ, చాట్జీపీటీ పక్క దేశాలకు చేరుతున్నట్లు ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. ఇలా చేయడం ద్వారా దేశానికే ముప్పు ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఈ రెండు వేదికల్లో షేర్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ
న్యూఢిల్లీ: 2030 నాటికి దేశీయంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్వాంటమ్ మొదలైన సరికొత్త సాంకేతికతల్లో శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నట్లు టెక్ దిగ్గజం ఐబీఎం వెల్లడించింది. ఇందుకోసం ఐబీఎం స్కిల్స్బిల్డ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు వివరించింది. అంతర్జాతీయంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి శిక్షణ కల్పించాలన్న మిషన్లో భాగంగా భారత్లో దీన్ని చేపట్టినట్లు ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఒకేషనల్ కాలేజీలకు చేరువ కావడంతో పాటు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో కూడా జట్టు కట్టనున్నట్లు వివరించారు. సరికొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలనేవి ఆర్థికంగా పోటీపడేందుకు, సాంకేతిక పురోగతికి, సమాజ పరివర్తనకు తోడ్పడతాయని కృష్ణ చెప్పారు. -
కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు..
ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, వీసా పాలసీలు మారిపోతున్న నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి గల విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అఫోర్డబిలిటీతో పాటు (అందుబాటు స్థాయిలో వ్యయాలు) చదువు అనంతరం ఉద్యోగావకాశాలు, తాము చదివే కోర్సులపై కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం తదితర అంశాలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ ఆధారిత విదేశీ విద్య సేవల ప్లాట్ఫాం లీప్ స్కాలర్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 30 లక్షల మంది పైగా విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇది రూపొందింది. దీని ప్రకారం 2024–25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 377 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 219 శాతం వృద్ధి చెందింది. ఇక న్యూజిలాండ్పై 6 శాతం నుంచి 2,900 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై 7 శాతం నుంచి 5,400 శాతానికి ఆసక్తి పెరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక 18 నెలల పాటు వర్క్ వీసా లభిస్తుండటం జర్మనీ విషయంలో సానుకూలాంశం. పాశ్చాత్య వర్సిటీలతో పోలిస్తే విద్యా వ్యయాలు తక్కువగా ఉండటం, కాస్త అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి సానుకూలంగా నిలుస్తోంది. అటు విద్యాభ్యాసం పూర్తయ్యాక మూడేళ్ల పాటు నివసించేందుకు, పని చేసేందుకు వర్క్ వీసా ఇచ్చే ఇమ్మిగ్రేషన్ పాలసీలతో భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ ఆకర్షణీయంగా ఉంటోంది. ‘విద్యార్థులు ఇప్పుడు కేవలం అఫోర్డబిలిటీని మాత్రమే చూడటం లేదు. ఫలానా యూనివర్సిటీలో చదివామని గొప్పలకు పోవడం కన్నా సదరు డిగ్రీతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా వారికి కీలకంగా ఉంటోంది. పెట్టిన పెట్టుబడిపై రాబడి అవకాశాలను సైతం వారు లెక్కలు వేసుకుంటున్నారు‘ అని లీప్ స్కాలర్ సహ–వ్యవస్థాపకుడు ఆర్నవ్ కుమార్ తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → స్పెషలైజేషన్కి విద్యార్థులు గతంలో కన్నా మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 40.4 శాతం మంది విద్యార్థులు ఏఐ, మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్ మొదలైన వాటిల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్పై ఆసక్తిగా ఉన్నారు. → 59.6 శాతం మంది వివిధ కోర్సుల్లో ఏఐ మాడ్యూల్స్ కూడా ఉన్న మాస్టర్స్ డిగ్రీలను ఎంచుకుంటున్నారు. → బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్కేర్ తదితర రంగాలకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు చేసినా, ఏఐకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం. → ఏఐ కోర్సులు చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్ల కన్నా తాము చదువుపై పెడుతున్న పెట్టుబడిపై రాబోయే రాబడులను కూడా లెక్కలు వేసుకుంటున్నారు. → కోర్సు ఖర్చు, ఇతరత్రా వ్యయాలూ తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని 75 శాతం మంది వెల్లడించారు. స్కాలర్షిప్కు 70 శాతం, కెరియర్ పురోగతికి 58 శాతం, జీతభత్యాల పెరుగుదల అవకాశాల అంశానికి 49 శాతం ఓట్లు లభించాయి. 40 శాతం ఓట్లతో అధ్యాపకుల అనుభవం, రీసెర్చ్ అవకాశాలకు అయిదో ర్యాంకు దక్కింది. టాప్ 5 ప్రాధాన్యతాంశాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. → విదేశీ విద్యను ఎంచుకునే అబ్బాయిలు (58 శాతం), అమ్మాయిల (42 శాతం) మధ్య అంతరం తగ్గుతోంది. అమ్మాయిలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ (స్టెమ్) కోర్సులను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఏఐ, డేటా సైన్స్కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. -
ఏఐల మెదడుకు ఇండియన్లే మేత
ఏఐ యాప్లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్ యూజర్–బేస్ మార్కెట్గా అవతరించిందని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్’ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ యాప్లకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రోజువారీ, నెలసరి యూజర్లు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా చాట్ జీపీటీకి 14.5 కోట్ల నెలవారీ వినియోగదారులు ఉంటే తరువాతి స్థానంలో 10.5 కోట్ల మందితో జెమినై ఉంది.ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్జీపీటీ’, గూగుల్కు చెందిన ‘జెమినై’, పెర్ప్లెక్సిటీ వంటి యాప్లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజువారీ, నెలవారీ యాక్టివ్ యూజర్లు భారత్లో ఉన్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.2025 నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో.. జెమినైకి 31 శాతం, పెర్ప్లెక్సిటీలను 38 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోని మొత్తం వాట్సాప్ వినియోగదారుల్లో మనవాళ్లు 32 శాతం కాగా, ఇన్స్టాగ్రామ్ యూజర్లలో భారతీయులు 31 శాతం కావడం విశేషం.-సాక్షి స్పెషల్ డెస్క్ -
ఏఐ మాయ.. ఆ లిస్ట్లో మరో హీరోయిన్.. ..!
టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.తాజాగా లిస్ట్లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్లో రాసుకొచ్చింది.(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. It has come to my attention that AI-generated images misusing my identity and a recent photograph I shared on my social media are being circulated online.The creation and circulation of such content without consent is deeply disturbing, unacceptable, and unlawful. It…— Nivetha Thomas (@i_nivethathomas) December 17, 2025 -
ఏఐని బెస్ట్గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?
ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా. ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్మెంట్లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయివాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?.. ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా. ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్లో మాత్రం ఏఐ తరహా కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్ పవర్లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు. -
పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ‘ఏఐ’
న్యూయార్క్: ఏఐ. కృత్రిమ మేధ. కొన్నేళ్లుగా ప్రపంచాన్నే ఏలుతున్న సరికొత్త సాంకేతిక విప్లవం. దాని రూపకల్పనలో శ్రమించిన వారందరికీ సమష్టిగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గౌరవం దక్కింది. గురువారం ఒక ప్రకటనలో మేగజైన్ ఈ మేరకు వెల్లడించింది. కృత్రిమ మేధ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని రీతిలో సింహగర్జన చేసిన ఏడాదిగా 2025ను అభివర్ణించింది. ‘సొంతంగా ఆలోచించే యంత్రాలు మొదలుకుని ఒకప్పుడు అసాధ్యమని భావించిన వాటన్నింటినీ సుసాధ్యం చేస్తున్న సాంకేతిక అద్భుతం ఏఐ. దాన్ని స్వప్నించి, శ్రమించి చివరికి సాధించిన వ్యక్తులందరూ 2025కు గాను పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి అర్హులే‘ అని పేర్కొంది. ’వ్యక్తులు మాత్రమే కాదు, సంస్థలు, కాన్సెప్టులను కూడా ఈ పురస్కారానికి ఎంపిక చేశాం’ అని టైమ్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ వివరించారు. -
కార్పొరేట్ ‘స్వర్గం’
‘‘నేను ఎప్పుడూ స్వర్గం అనేది ఒక గ్రంథాలయంలా ఉంటుందని ఊహిస్తాను’’ అన్న అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్ ప్రసిద్ధ వ్యాఖ్యానపు స్ఫూర్తిని స్వీకరిస్తూ, పబ్లిక్ లైబ్రరీలకు శ్రీకారం చుట్టింది ‘కోఫోర్జ్’ సంస్థ. మూడు దశాబ్దాల క్రితం ‘నిట్’ పేరుతో ప్రారంభమై, 2020లో ‘కోఫోర్జ్’గా రీబ్రాండ్ అయిన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ తన ‘కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ’లో భాగంగా దేశవ్యాప్తంగా గొలుసుకట్టు గ్రంథాలయాలకు నడుం బిగించింది. 2024 ఫిబ్రవరిలో నోయిడాలో, 2025 జూన్లో గురుగ్రామ్లో ప్రారంభమైన ఈ గ్రంథాలయపు మూడో శాఖ 15,000 పుస్తకాలతో ఈ అక్టోబర్లో హైదరాబాద్లోని కొండాపూర్లో ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 దాకా సంవత్సరంలో 365 రోజులూ తెరిచి ఉండటం వీటి ప్రత్యేకత.ఫిక్షన్, హిస్టరీ, సెల్ఫ్ హెల్ప్, రెలిజియన్ అండ్ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్, పాలిటిక్స్, మేనేజ్మెంట్, రిఫరెన్స్ లాంటి విభాగాలతో ప్రధానంగా ఆంగ్ల పుస్తకాలతోపాటు కొద్దిస్థాయిలో హిందీ, తెలుగు విభాగాలను కూడా హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. ఉర్దూ విభాగానికి కూడా డిమాండ్ వస్తోందని చెబుతున్నారు. కావాల్సిన పుస్తకపు అందుబాటును అక్కడ ఏర్పాటుచేసిన రెండు పెద్ద టచ్ స్క్రీన్స్ మీద వెతుక్కోవచ్చు. ‘చిల్డ్రెన్స్ సెక్షన్’ విడిగా ఉండటం చిన్నారులను ఉత్సాహపరుస్తుంది. ది ఇల్లూమినేటెడ్ రూమి; డేనియల్స్ ఇండియా: వ్యూస్ ఫ్రమ్ ద ఎయిటీన్త్ సెంచరీ; ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా; ద లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ వాన్ గో; బిబేక్ దేబ్రాయ్ పది వాల్యూముల మహాభారతం; హాన్ కాంగ్ ‘ద వైట్ బుక్’తో పాటు ‘బిగ్ ఐడియాస్ ఎక్స్ప్లెయిన్డ్ సిరీస్’లో ద మూవీ, ద హిస్టరీ, ది ఎకనామిక్స్, ది ఆర్ట్ లాంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.‘యోచన ముఖ్యమైనదే కానీ అసలు ప్రాధాన్యం ఉన్నది ఆచరణకే’ అని సంస్థ సీఈఓ సుధీర్ సింగ్ నమ్మకం. అందుకే కాబోలు, మనకు అనుభవంలో ఉండే గ్రంథాలయాల ముతకదనానికి భిన్నంగా కార్పొరేట్స్కే సాధ్యమయ్యే ఒక సోఫిస్టికేషన్ ఇక్కడ కనబడుతుంది. చదవడానికి తగినంత నిశ్శబ్దం, తీర్చిదిద్దినట్టున్న ర్యాకులు, పుస్తకాలను గుట్టలుగా పోయకుండా తగినంత డిస్ప్లేకు ఇచ్చిన అవకాశం– బయట వేగంగా పరుగెడుతూ అద్దాల్లోంచి దూరంగా కనబడుతున్న వాహనాల హడావిడి ప్రపంచానికి భిన్నంగా, రెండు అరచేతుల్లో నెమ్మదిగా విప్పారే అక్షరాలు చూపించే లోకాలను ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘విద్య వలన వినయం పుట్టును, వినయం వలన యోగ్యత కలుగును’ అని వేమన; ‘పదవులు, సంపదలు నశించును గాని జ్ఞానమనే సంపద నశించదు’ అంటూ పోతన; ‘పుస్తకాలు చదివే అలవాటులేనివాడికి అక్షర జ్ఞానం లేనివాడిమీద అదనపు అడ్వాంటేజీ ఏమీ ఉండ’దనే మార్క్ ట్వెయిన్ కవ్వింపు, ‘ఒక పాఠకుడు చనిపోయేలోపు వెయ్యి జీవితాలు జీవిస్తాడు, అదే ఎప్పుడూ చదవనివాడు ఒక్క జీవితమే జీవిస్తాడు’ అనే ఆర్.ఆర్. మార్టిన్ ఉడికింపు బోర్డులు గ్రంథాలయ సందర్శకులను ఇట్టే పుస్తకం పట్టేలా ప్రేరేపిస్తాయి.కృత్రిమ మేధ సృష్టించిన కవర్ పేజీల వాడకం వల్ల ఈ నవంబర్లో రెండు పుస్తకాలు ఒక పోటీకి అనర్హత పొందడం సాహితీ ప్రపంచంలో సంచలనానికి కారణమైంది. 65,000 డాలర్ల నగదు బహుమతితో కూడిన న్యూజిలాండ్ ప్రతిష్ఠాత్మక ‘ఆక్హామ్ అవార్డ్’ కోసం వచ్చిన ఆబ్లిగేట్ కార్నివోర్ (స్టెఫానీ జాన్సన్ కథల సంపుటి), ఏంజిల్ ట్రెయిన్(ఎలిజబెత్ స్మితర్ నాలుగు గొలుసు నవలికలు) పుస్తకాలకు ఏఐ గీసిన ముఖచిత్రాలను వాడినట్టు గుర్తించడంతో నిర్వాహకులు వాటిని పోటీ నుంచి తప్పించారు. సాహిత్య లోకంలోకి కూడా ఏఐ చొచ్చుకువచ్చి, అంతటా డిజిటల్ జపం జరుగుతున్న కాలంలో, ప్రత్యేకించి ఒక కార్పొరేట్ సంస్థ భౌతిక పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి పూనుకోవడం అభినందనీయం. మున్ముందు ఢిల్లీ, పుణె, బెంగళూరు నగరాలకూ లైబ్రరీని విస్తరించే యోచన జరుగుతోంది. సాంకేతిక పరిణామాలు, వ్యాపార నమూనాలు మారినా ఎప్పటికీ నిలబడి ఉండే దీర్ఘకాలిక సామాజిక మౌలిక వసతులుగా ప్రజా గ్రంథాలయాలను చూస్తున్నామని ‘కోఫోర్జ్’ చెబుతోంది. శుభం. -
మేధే మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ఎ క్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తేడిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!చదవండి : ఇంటిహెల్పర్కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటివితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎడిటోరియల్ టీమ్వ్యూ పాయింట్: పాడ్కాస్ట్: పీపుల్ బై డబ్లు్య.టి.ఎఫ్.అతిథి: ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్తహోస్ట్: నిఖిల్ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్ -
ఏడాదిలోగా ఎలక్ట్రానిక్ టోల్
న్యూఢిల్లీ: దేశంలో రహదారులపై అత్యాధునిక ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ అందుబాటులోకి రాబోతోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమల్లోకి ఉన్న వ్యవస్థ ఏడాదిలోగా ముగిసిపోనుందని తెలిపారు. మల్టీ–లేన్ ఫ్రీ ఫ్లో ఎలక్ట్రానిక్ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగకుండా ముందుకు దూసుకెళ్లొచ్చని వెల్లడించారు. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత పరిజ్ఞానం ఉంటాయని వివరించారు. ఆయన గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన టోల్ వసూలు వ్యవస్థ ఇప్పటికే పది చోట్ల అమల్లో ఉందని, ఏడాదిలోగా దేశమంతటా విస్తరింపజేయబోతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ రాకతో టోల్ ఫీజుల కోసం ఎవరూ ఆపబోరని, రోడ్లపై ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదని అన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని, రుసుముల చెల్లింపుల్లో ఆలస్యాన్ని నివారించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని నితిన్ గడ్కరీ వివరించారు. హైడ్రోజన్ కారు వాడుతున్నాదేశంలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. కాలుష్య నివారణలో భాగంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే టయోటా ‘మిరాయ్’ వాహనాన్ని తాను ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఆయన గురువారం లోక్సభలో మాట్లాడారు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కారు తరహాలోనే అంతే సౌలభ్యాన్ని ఇస్తోందని అన్నారు. మిరాయ్ అంటే జపాన్ భాషలో భవిష్యత్తు అని వెల్లడించారు. భవిష్యత్తు ఇంధనం హైడ్రోజన్ కాబోతోందని స్పష్టంచేశారు. శిలాజ ఇంధనాల దిగుమతి విలువ రూ.22 లక్షల కోట్లకు చేరిందని గడ్కరీ చెప్పారు. ఇలాంటి ఇంధనాలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టక తప్పదని వివరించారు. ఆధునిక ఇంధనాల ఎగుమతి విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవ ఇంధనాలను ఉపయోగించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. -
చాట్జీపీటీ సాయంతో స్కామర్నే బోల్తా కొట్టించి..
డిజిటల్ అరెస్టులు.. ఆన్లైన్ స్కాములు నిత్యం వింటున్నాం. ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తారు? ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారు లేదా ఆ సైట్లోకి వెళ్లడం మానేస్తారు. అయితే ఒక యువకుడు ఈ తరహా స్కామ్ను ఏఐ చాట్ జీపీటీ పవర్తో తిప్పికొట్టాడు. తనను మోసం చేయాలని చూసిన స్కామర్ను ట్రాక్ చేసి, అతని వివరాలు సేకరించి, చివరకు ‘నన్ను వదిలేయండి.. మహా ప్రభో’ అని వేడుకునేలా చేశాడు. ఈ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఆన్లైన్ మోసగాడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తన కాలేజీ సీనియర్గా, ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్న ఒక స్కామర్ తక్కువ ధరలకు ఫర్నిచర్ అమ్ముతున్నానని చెబుతూ, డబ్బు కొట్టేయాలని ప్రయత్నించాడు. ఈ మెసేజ్లో ఏదో తేడా ఉందని గ్రహించిన బాధితుడు, ఈ స్కామర్ను టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని ఒక ఏఐ ఆధారిత ఆపరేషన్గా మార్చి, చివరకు ఆ స్కామర్ను తన ట్రాప్లో పడేలా చేశాడు. ఇందుకోసం ఆ యువకుడు చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. స్కామర్కు నగదు పంపడానికి వీలుగా, చెల్లుబాటు అయ్యే విధంగా ఒక నకిలీ చెల్లింపు పోర్టల్ను రూపొందించాలని ఏఐకి ఆదేశించాడు. అయితే, ఈ వెబ్పేజీ ముఖ్య ఉద్దేశ్యం డబ్బు స్వీకరించడం కాదు.. అది క్లిక్ చేసిన వారి జియో లొకేషన్, ఐపీ అడ్రస్, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాతో వారి ఫొటోను రహస్యంగా సంగ్రహించడం. ఏఐ కొద్ది నిమిషాల్లోనే ఈ మోడల్కు అవసరమైన కోడ్ను రూపొందించింది. ఇది ఆన్లైన్ దొంగను పట్టుకోవడానికి వేసిన ఒక తెలివైన డిజిటల్ వలగా మారింది.ట్రాకర్ పేజీ సిద్ధమైన తర్వాత బాధితుడు స్కామర్కు ఆ లింక్ను పంపాడు. క్యూఆర్ కోడ్ను అప్లోడ్ చేయడం ద్వారా చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని నమ్మబలికాడు. అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో స్కామర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ లింక్పై క్లిక్ చేశాడు. అంతే ఆ నకిలీ పోర్టల్కు స్కామర్ ఉంటున్న ఖచ్చితమైన స్థానం, ఐపీ అడ్రస్, స్పష్టంగా' ఉన్న అతని సెల్ఫీ అందాయి. వెంటనే బాధితుడు ఆ వివరాలను తిరిగి స్కామర్కే పంపడంతో కథ ఊహించని మలుపు తిరిగింది.తన వివరాలు బయటపడటంతో స్కామర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే, వేర్వేరు నంబర్ల నుండి బాధితుడికి పదేపదే కాల్స్ చేసి.. ఈ పనిని ఇకపై చేయను అంటూ క్షమాపణలు కోరడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు షేర్ చేసిన స్క్రీన్షాట్లు చూసి స్కామర్ వణికిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం గురించి సదరు యువకుడు ‘రెడిట్’లో పోస్ట్ చేస్తూ, చివర్లో.. ‘దొంగను బోల్తా కొట్టించడంలో ఆ తృప్తే వేరు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటన సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించింది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే! -
పుతిన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: స్నైపర్లు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతా వ్యవస్థ. ఇవన్నీ ఏమిటో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! రష్యా నుంచి పుతిన్తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్విస్కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమెండోలు ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తమ్మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి! ముందే రంగంలోకి 40 మంది ఉన్నతాధికారులు → పుతిన్ పర్యటన తాలూకు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు. → వారు ఢిల్లీ చేరుకుని తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్నీ భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు. → పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్నీ ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. → అంతేగాక కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ కార్యాలయమే తెరిచారు! → పుతిన్ వెళ్లే మార్గాలన్నింటినీ ప్రత్యేక శిక్షణ పొందిన రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. → ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు. → కృత్రిమ మేధ(ఏఐ), ఫేషియల్ రికగి్నషన్ కెమెరాలు అంగుళం అంగుళాన్నీ వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి. → మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జీ కమెండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతారు. → మిగతా నాలుగు లోపలి అంచెలనూ రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. → పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. → పుతిన్ బస చేసే హోటల్ను రష్యా వేగులు ఇప్పటికే జల్లెడ పట్టేశారు. → ఆయన వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. బిజీ బిజీ! ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ గురువారం మన దేశానికి రానున్నారు. సాయంత్రం కల్లా ఆయన ఢిల్లీలో భేటీ అవకాశముంది. రాత్రి మోదీ ఆయనకు విందు ఇస్తారని సమాచారం. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో పుతిన్కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ హౌస్లో శిఖరాగ్రంలో పాల్గొంటారు. రాత్రి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు. అసలు హైలెట్ ఆ కారే! ఆరస్ సెనట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలెట్ అదే. ఎలాంటి పెను దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకు ఉంది. వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇది అన్ని విధాలా శత్రు దుర్భేద్యం. అందుకే దీన్ని ముద్దుగా ‘నడిచే దుర్గం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లిమోజిన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్తో కలిసి విహరించడం విశేషం. → ఆరస్ సెనట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్లో చేర్చారు. → నాటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. → ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్ను తయారు చేశారు.రక్షణ మంత్రుల భేటీ నేడు భారత, రష్యా రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఆండ్రే బెలెసోవ్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మరిన్ని ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధ విమానాల ఆధునీకరణలతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెలోసోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్, మోదీ శిఖరాగ్రానికి ఒక రోజు ముందు రక్షణ మంత్రుల కీలక భేటీ జరుగుతోంది. అత్యంత అధునాతనమైన ఎస్–500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉంచవచ్చని సమాచారం. సుఖోయ్–57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారమే తెలిపారు. ఐదో తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయతి్నస్తున్న నేపథ్యంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..!
టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. “When truth can be manufactured, discernment becomes our greatest defence.”AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025 -
పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: టింగ్ మంటూ వాట్సాప్ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్కు వచ్చే మెసేజ్ను క్లిక్ చేస్తే యూట్యూబ్కో, ఇన్స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైక్లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు. పెరుగుతున్న యాప్ల వాడకం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్లో ఏఐ యాప్లు డౌన్లోడ్, సబ్ప్క్రైబ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్ల వాడకం పెరిగిందని డిజిటల్ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్ సింక్ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్ కనెక్షన్కు లింక్ అవుతున్నారు. పార్లమెంట్ దాకా ఇదే ట్రెండ్! ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్ క్యాపిటల్ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ పరిశీలనలో తెలిపింది. ఇదో రకమైన ఇంటర్న్షిప్హైదరాబాద్లో ఏఐ ఎంఎల్ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్షిప్గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. – మద్దిని తేజాకుమార్ (ఏఐఎంఎల్ విద్యార్థి) కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి. – విష్ణువర్థన్ రెడ్డి (వరంగల్ డిజిటల్ స్టూడియో) -
పరిశోధకులకూ ఏఐ
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల దైనందిన అభ్యాసంలో ఈ నూతన సాంకేతికత ఒక భాగమైంది. పరిశోధకులకూ కృత్రిమ మేధ ఆయుధం కావడం విభిన్న రంగాల్లో వేగవంతమైన పురోగతికి జీవం పోసినట్టయింది. వేగంగా పరుగుతీస్తున్న ప్రస్తుత యుగంలో పరిశోధకులు, సంస్థలు కృత్రిమ మేధను ఎంత సమర్థవంతంగా స్వీకరిస్తాయి, సహకారాన్ని పెంపొందించుకుంటాయి, స్థితిస్థాపకతను ఎలా నిర్మిస్తాయి అనే అంశాలపై విజయం ఆధారపడి ఉంటుందని ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్ చెబుతోంది.నెదర్లాండ్స్కు చెందిన ఈ సంస్థ రీసర్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ పేరుతో 113 దేశాల్లో సర్వే చేపట్టింది. 3,234 మంది రీసర్చర్స్ ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సాంకేతికత సామర్థ్యంపై సానుకూల ధోరణి, పెరుగుతున్న వినియోగంతో పరిశోధనా వ్యవస్థను ఏఐ పునర్నిర్మిస్తోందని నివేదిక తెలిపింది. ‘పరిశోధకులు ఏఐని ఒక పరివర్తన సాధనంగా గుర్తించారు. ఇది వారి సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంచుతోంది. డేటా విశ్లేషణకు సాయపడుతోంది. కృత్రిమ మేధ ప్రయోజనాలను ఇప్పటికే వీరు అందుకున్నారు’ అని వివరించింది.సగం కంటే ఎక్కువగా..పనులను ఆటోమేట్ చేయడానికి ఒక సాధనంగా మాత్రమే కాకుండా.. మానవ మేధస్సును పెంపొందించడానికి, అపూర్వమైన వేగంతో వాస్తవ జ్ఞానాన్ని సృష్టించడానికి వీలు కల్పించే సృజనాత్మక భాగస్వామిగా కూడా కృత్రిమ మేధ మారుతోందని నివేదిక వివరించింది. పరిశోధనలో ఏఐ స్వీకరణ పెరిగింది. సర్వేలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో 58% మంది రీసర్చ్కు సంబంధించిన పనుల్లో ఏఐ సాధనాలను ఉపయోగించారు. 2024లో ఈ సంఖ్య 37% మాత్రమే. ఈ ఏఐ యూజర్లలో 61% మంది తాజా పరిశోధనలను కనుగొని, సంగ్రహించడానికి, 51% మంది సాహిత్య సమీక్షల కోసం నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పారదర్శకత, వేగం.. ఈ రెండు ప్రత్యేకతలు ఏఐ పట్ల విశ్వాసాన్ని పెంచుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఏఐ ఆటోమేటిక్గా సూచనలను ఉదహరిస్తున్నప్పుడు పారదర్శకత ఉండాలని 59%, ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందించాలని 55% పరిశోధకులు అభిప్రాయపడ్డారు.సానుకూల ఫలితాలుసామర్థ్యాన్ని పెంచగలిగే శక్తి ఏఐకి ఉందన్న అంశంపై పరిశోధకుల్లో అత్యధికులు సానుకూలంగా ఉన్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే తమ సమయాన్ని ఆదా చేస్తోందని 58% మంది తెలిపారు. రాబోయే 2–3 సంవత్సరాలలో తమ సమయాన్ని ఆదా చేస్తుందని మూడింట రెండువంతులకుపైగా రీసర్చర్స్ ఆశిస్తున్నారు. రాబోయే 2–3 ఏళ్లలో నూతన జ్ఞానాన్ని నడిపించే సృజనాత్మక శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని 61% పరిశోధకులు నమ్ముతున్నారు. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో తగినంత సిద్ధంగా లేమని అత్యధికులు భావిస్తున్నారు. ఏఐలో తక్కువ శిక్షణ పొందామని 45% రీసర్చర్స్ భావిస్తున్నారు. మూడింట ఒక వంతు పరిశోధకులు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, సిబ్బందికి శిక్షణలో తమ కంపెనీ విధానం బాగుందని అంగీకరిస్తున్నారు.ఏఐ సాధనాలను అస్సలు ⇒ ఉపయోగించని పరిశోధకుల్లో అమెరికా నుంచి 25%, భారత్ నుంచి 26%, చైనా నుంచి 4% ఉన్నారు. ⇒ ఏడేళ్లలోపు అనుభవం ఉన్న రీసర్చర్స్లో 83%, 20 ఏళ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారిలో 65% ఏఐ టూల్స్ వాడుతున్నారు.⇒ సర్వేఈ–మెయిల్ ఇన్విటేషన్ ద్వారా ఆన్లైన్లో..⇒ చేపట్టింది ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్⇒ టైటిల్ రీసర్చర్ ఆఫ్ ధ ఫ్యూచర్⇒ ఎప్పుడు: 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య ఎంత మంది: 113 దేశాల నుంచి 3,234 మంది పాల్గొన్నవారు: పరిశోధకులు, విద్యా, పరిశోధన సంస్థల ముఖ్యులుఏఐ టూల్స్ వినియోగం ఇలా..⇒ రీసెర్చ్ పనుల్లో భాగంగా.. 58%⇒ ఇతర అవసరాలకు 26%⇒ అసలు వినియోగించలేదు 16% -
అత్యవసరంగా ఏఐ స్కిల్స్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న కొత్త టెక్నాలజీ. కంపెనీలూ ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. జాబ్ మార్కెట్లో ఉద్యోగులు నిలదొక్కుకోవాలంటే కృత్రిమ మేధ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. అది కూడా ఇప్పటికిప్పుడే. ప్రధానంగా టెక్ రంగంలోని సిబ్బందికి ఈ ఆవశ్యకత ఏర్పడింది. ఏఐ స్కిల్స్ ఉన్నఫళంగా నేర్చుకోవాల్సిందేనా? జీసీసీ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆన్సర్’.. తన గ్లోబల్ టాలెంట్ ప్లాట్ఫామ్ ‘టాలెంట్500’తో కలిసి రూపొందించిన ‘ఏఐ అడ్వాంటేజ్ సర్వే రిపోర్ట్–2025’ అవుననే చెబుతోంది.కృత్రిమ మేధ నైపుణ్యాలు తమ భవిష్యత్తుకు అనివార్యమైనవిగా టెక్ నిపుణులు భావిస్తున్నారని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 70% కంటే ఎక్కువ మంది నిపుణులు రాబోయే మూడు నెలల్లో ఏఐ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేగంగా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోందని నివేదిక వివరించింది. సొంతంగా చొరవ.. పనిచేస్తున్న సంస్థలు అధికారికంగా ఇచ్చే శిక్షణ కోసం ఉద్యోగులు వేచిచూడటం లేదని నివేదిక తెలిపింది. చాలామంది టెకీలు యూట్యూబ్, సొంతంగా అభ్యాసం, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకుంటున్నారు. 53.7% మంది సొంత డబ్బు వెచి్చంచి నేర్చుకుంటున్నారు. అయితే, నాలుగింట ఒకవంతు మంది రూ.10 వేల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తుండడం విశేషం. ‘ఏఐ నైపుణ్యాలు కెరీర్ను రూపొందిస్తాయని ఉద్యోగులకు తెలుసు. కాబట్టే వేగంగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సొంతంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రధానంగా జీసీసీలకు ఈ ఆవశ్యకత అసలైన ప్రయోజనం చేకూర్చనుంది. నేర్చుకోవడానికి ఆసక్తిగా, సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి ఏఐ సామర్థ్యాలను ఉన్నతంగా నిర్మించడానికి సరైన పునాదిని సృష్టిస్తుంది. ఈ శక్తికి వెన్నంటి నిలిచినప్పుడు అది సంస్థకు నిజమైన బలంగా మారుతుంది’.. అని నివేదిక స్పష్టం చేసింది.ఎవరెవరు ఉన్నారంటే..భారత్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో (జీసీసీ) ఇంజనీరింగ్, ప్రోడక్ట్, క్యూఏ, డేటా, ఆపరేషన్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న 3,000 మందికి పైగా వృత్తి నిపుణులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో బెంగళూరు నుంచి 48.5%, హైదరాబాద్ 22.2%, ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి 14.3% మంది ఉన్నారు. మిగిలినవారు పుణే, ముంబై, చెన్నైకి చెందినవారు. సర్వేలో పాల్గొన్న వారిలో 35 ఏళ్లలోపు వారు 71% మంది ఉన్నారు. అయితే కోడింగ్, రీసెర్చ్, డేటా అనాలిసిస్ రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంది. 1–2 ఏళ్లలో తమ ఉద్యోగాల్లో ఏఐ చాలా మార్పులు తెస్తుందని అత్యధికుల భావన. -
ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది
న్యూఢిల్లీ: కంపెనీలు మరిన్ని లాభాల కోసమే కృత్రిమ మేథ (ఏఐ) జపం చేస్తున్నాయనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని సేల్స్ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనితో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వైద్యం..విద్యలాంటి సేవలను గణనీయంగా విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏజెంటిక్ ఏఐ వల్ల ఉద్యోగాల తొలగింపు కన్నా ఉద్యోగులకు మరింత సాధికారత లభిస్తుందని వివరించారు. ఏఐ శకంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని .. అలాంటి పరిస్థితుల్లో ఏజెంటిక్ ఏఐ, డిజిటల్పరమైన మద్దతుతో వాటిపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ వ్యవస్థ విషయానికొస్తే రోగ లక్షణాలను రికార్డ్ చేసేందుకు, పేషంటును చూడటానికి ముందే డాక్టరుకు ప్రాథమిక విశ్లేషణ ఇచ్చేందుకు ఏజెంటిక్ ఏఐ ఉపయోగపడుతుందని భట్టాచార్య చెప్పారు. టెక్నాలజీ, యూపీఐలాంటి ప్లాట్ఫాంల వల్లే బ్యాంకింగ్ పరిధిలోని వారికి కూడా సరీ్వసులను విస్తరించేందుకు వీలయ్యిందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా సేల్స్ఫోర్స్కి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా కొనసాగుతోందని ఆమె చెప్పారు. -
హీరోయిన్ మెసేజ్ చేసిందా? అయితే జాగ్రత్త
-
ఏఐ వ్యూహంలో భారత్ కీలకం
టోక్యో: గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం ఎన్టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్ అత్యంత కీలక మార్కెట్గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వపర్మ్యాన్ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్ మాకు హబ్గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్కి మా ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుబంధంగా పని చేస్తోంది. భారత్లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్ తెలిపారు. దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్ చేశామని జాన్ వివరించారు. నవంబర్ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్టీటీ ఆర్అండ్డీ ఫోరమ్లో ఎన్టీటీ గ్రూప్ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్ వీటిలో ఉన్నాయి. -
ఏఐ హైప్ కాదు.. ఎంతో సమయం ఆదా!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు. -
ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిందే
జోహన్నెస్బర్గ్: ఆధునిక యుగంలో అవసరాల సృష్టించుకున్న కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే మానవ కేంద్రీకృతగా ఉండాలి తప్ప ఆర్థిక కేంద్రీకృతంగా ఉండరాదని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలని సూచించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలని తెలిపారు. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఐఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏఐ వాడకంలో జవాబుదారీతనం కృత్రిమ మేధ అనేది ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం చేస్తే భారీ నష్టం జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా పారదర్శకత కోసం పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐ డిజైన్లోని భద్రతాపరమైన ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మానవ జీవితాన్ని, భద్రతను, ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుచేశారు. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వాడకానికి పెద్దపీట వేయాలన్నారు. ఇందులో జవాబుదారీతనం ఉండాలన్నారు. కృత్రిమ మేధ మానవ శక్తి సామర్థ్యాలను పెంచే మాట వాస్తవమే అయినప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత మనుషులపైనే ఉండాలని తేలి్చచెప్పారు. ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయాణం ఆరంభించాలని, శిలాజేతర ఇంధనాల వినియోగం పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్ను మరింత వేగవంతం చేయాలని, సప్లై చైన్పై ఒత్తిడి తగ్గించాలని, అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, వినియోగం విషయంలో ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సహా కీలక రంగాల్లో సహకారం కోసం జీ20 దేశాల శాటిలైట్ డేటాను అందరూ సులువుగా ఉపయోగించుకొనేలా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యాన్ని’మోదీ ప్రతిపాదించారు. వ్యవసాయం, మత్స్య సంపద, విపత్తుల నిర్వహణకు జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ఆధుని కాలంలో ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదని, అందుకోసం ఉమ్మడి కృషి అవసరమని ఉద్ఘాటించారు. విపత్తుల సన్నద్ధత, సుస్థిర వ్యవసాయం, ప్రజారోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలను అనుసంధానించాలని, దీనిపై సమగ్ర వ్యూహాలు రూపొందించాలని జీ20 దేశాలకు నరేంద్రమోదీ సూచించారు. ఇండియాలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్–లైఫ్ బ్యాటరీస్తోపాటు సంబంధిత రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ‘జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ కార్యక్రమం’ప్రారంభించాలని ప్రతిపాదించారు. ప్రమాదంలో ఆహార భద్రత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇండియాలో అతిపెద్ద ఆహార భద్రత, పోషకాహార కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి తృణ ధాన్యాల సాగు, విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
డిగ్రీ కోర్సులు మార్చాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల రీడిజైన్ మొదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఈ దిశగా స్పీడ్ పెంచారు. అకడమిక్ ఆడిట్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కోర్సులపై సమగ్ర వివరాలు పంపాలని లేఖలు రాయబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులతోపాటు కొన్ని కోర్సులకు ఉద్వాసన పలికే అవకాశముందని మండలి వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా డిగ్రీ కోర్సుల ద్వారా ఉపాధి లభించే విధంగా కొత్తదనాన్ని మేళవించే ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ సహా కొత్త అప్లికేషన్స్ పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రతీ సబ్జెక్టులోనూ 20% మేర ఆధునిక సాంకేతిక చాప్టర్లకు రంగం సిద్ధం చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా సిలబస్ రూపకల్పనలో ఉన్నారు. త్వరలో కోర్సులపై సీఎం రేవంత్రెడ్డికి బాలకిష్టారెడ్డి నివేదిక ఇవ్వబోతున్నారు.సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు డిగ్రీ కోర్సులకు అరకొర స్పందనే వస్తోంది. రాష్ట్రంలో 957 డిగ్రీ కాలేజీల్లో 4,36,947 సీట్లు అందుబాటులో ఉంటే, మూడు విడతల దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత కూడా చేరిన విద్యార్థుల సంఖ్య 2.15 లక్షలే. ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి కొన్నేళ్లుగా గరిష్టంగా 2.20 లక్షల మంది మాత్రమే చేరుతున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారి సంఖ్య 37 శాతం మించడం లేదు.గ్రామీణ ప్రాంత కాలేజీల్లో అతి తక్కువమంది చేరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో ఉన్న కాలేజీల్లో కొంతమేర సీట్లు భర్తీ అవుతున్నాయి. డిగ్రీ చదివే విద్యార్థులు పార్ట్ టైం పనిచేసుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అవకాశాలుంటున్నాయి. దీంతోపాటు డిగ్రీ తర్వాత ఉపాధి పొందే స్కిల్ కోర్సులు నేర్చుకునేందుకు రాజధాని వేదికగా మారింది. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో విద్యార్థుల చేరికలు పెద్దగా ఉండటం లేదు. ఒకవేళ డిగ్రీలో చేరాల్సి వస్తే ప్రభుత్వ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు.⇒ఇప్పటి వరకూ దోస్త్ ద్వారా ఎక్కువ మంది బీకాం కోర్సులోనే చేరారు.⇒1,41,590 మంది వివిధ కోర్సుల్లో చేరితే, ఇందులో అత్యధికంగా బీకాంలో 54,771 మంది చేరారు.⇒ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో 27,059 మంది చేరారు⇒బీఏ కోర్సులో 60,414 సీట్లు ఉంటే, చేరిన విద్యార్థులు మాత్రం 19,104 మాత్రమే⇒ఇటీవల కాలంలో బీబీఏ కోర్సుకు కొంత ఆదరణ పెరిగింది. ఈ కోర్సులో 11,462 మంది చేరారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న కోర్సులను మాత్రం విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కోర్సులుంటేనే అనుమతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ కూడా సీట్ల కుదింపు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు. మార్కెట్ అవసరాలు తీర్చే కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తేనే అనుమతులు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. అకడమిక్ ఆడిట్ను ఈ దిశగానే రూపొందిస్తున్నారు. కనీసం ఐదేళ్లుగా ఏఏ కోర్సుల్లో, ఏఏ కాలేజీల్లో ఎంతమంది చేరుతున్నారనే డేటా తీస్తున్నారు. విద్యార్థులు ఇష్టపడని కాలేజీలు, కోర్సులను ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు.వీటిస్థానంలో టెక్నాలజీతో మిళితమైన కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే డిగ్రీ కోర్సుల స్వభావం మారింది. డేటాసైన్స్ సహా పాలనపరమైన మెళకువలు ఉండే కొత్త కోర్సుల కాంబినేషన్ తీసుకొచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఈ దిశగా మార్పులు సూచించింది. ఫ్యాకల్టీ సమస్య ఉన్న కాలేజీలు ఆన్లైన్లో ఇతర విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకుల సేవలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోనూ ఈ దిశగా జరుగుతున్న కసరత్తుపై వచ్చేవారం స్పష్టత వస్తుంది. అకడమిక్ ఆడిట్ చేస్తాం డిగ్రీ కోర్సులను పూర్తిగా మార్చబోతున్నాం. పారిశ్రామిక భాగస్వామ్యంతో స్కిల్ ఉండేలా, ఇతర దేశాల్లోనూ ఉపాధికి బాటలు వేసేలా వీటిని రూపొందించాలనే ఆలోచేన చేస్తున్నాం. కోర్సులు, సీట్ల పరిస్థితిపై అకడమిక్ ఆడిట్ చేపడుతున్నాం. అన్ని విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుంటున్నాం. త్వరలోనే కొత్త విధానంపై స్పష్టత ఇస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్తో కూడిన ఏఐ మోడల్స్ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్ఫామ్ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
నా ఫోటోలు అలా చూస్తుంటే చాలా బాధేస్తోంది: కీర్తి సురేశ్
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వరీ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ప్రస్తుతం చెన్నైలో రివాల్వర్ రీటా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగంపై కీర్తి సురేశ్ మాట్లాడారు. ఏఐతో సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తన ఏఐ మార్ఫింగ్ ఫోటోలను చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో ఏఐ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఒక వరమే కానీ..ఒక రకంగా శాపం కూడా. మానవులు సాంకేతికతను కనుగొన్నారు. కానీ ఇక్కడ మనం నియంత్రణ కోల్పోతున్నాం. సోషల్ మీడియాలో అసహ్యకరమైన దుస్తుల్లో నా చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంటా. నేను ఎప్పుడైనా నిజంగానే ఇలాంటివీ ధరించానా అని షాకవుతుంటా. ఇటీవల నేను సినిమా పూజ కోసం ధరించిన దుస్తులను వేరే కోణంలోకి మార్చి చూపించారు. అది చూసిన క్షణం నేను షాకయ్యా. ఆ తర్వాత నేను అలా పోజు ఇవ్వలేదని గ్రహించా. ఇలాంటివి చూసినప్పుడు చిరాకు తెప్పిస్తుంది. అంతేకాదు బాధగా కూడా అనిపిస్తుంది" అని పంచుకుంది.ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాదని.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లకు గురైన ఎవరినైనా ప్రభావితం చేస్తుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఏఐ వినియోగం పెరిగాక పలువురు సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి ఆండ్రియా జెరెమియా కూడా ఏఐతో సంబంధం ఉన్న నష్టాల గురించి ప్రస్తావించారు, ఈ సాంకేతికత వినోద రంగానికి సవాల్గా మారిందన్నారు. కేవలం నటులకే కాదు ప్రజలకు కూడా ఏఐ సమస్యగా మారుతోందని.. ఏఐ మన కోసం పనిచేయాలి.. మరోలా కాదన్నారు. -
ఏఐ వినియోగంలో వెనుకబడ్డ భారత్
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం మన కంపెనీలు గణనీయంగా వెనుకబడ్డాయి. ఇప్పటికీ 45 శాతం సంస్థలు ఏఐ వినియోగానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నాయి. చాలా మటుకు సంస్థలు ఏఐ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఇతర గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. హెచ్ఆర్ ప్లాట్ఫాం ’డీల్’ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 45 శాతం భారతీయ సంస్థలు ఏఐ వినియోగం విషయంలో ప్రారంభ దశలో ఉండగా, 38 శాతం కంపెనీలు మధ్య స్థాయిలో ఉన్నాయి. కేవలం 17 శాతమే అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయి. తమ ప్రధాన వ్యాపార ప్రక్రియలు, ఆవిష్కరణల్లో ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 22 మార్కెట్లకు చెందిన 5,500 వ్యాపార దిగ్గజాలతో సెపె్టంబర్లో డీల్ ఈ సర్వే నిర్వహించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు .. → ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ 54 శాతం కంపెనీల్లో మాత్రమే అధికారికంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది 67 శాతంగా ఉంది. సాంకేతిక పురోగతి, సిబ్బంది సన్నద్ధత మధ్య పెరుగుతున్న అంతరాన్ని, శిక్షణపై తక్షణం మరింతగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది. → మానవ వనరుల (హెచ్ఆర్) కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగుల నిర్వహణ (66 శాతం), ఉద్యోగుల నియామకాల్లో (57 శాతం) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. → పని విధానాలను, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను ఏఐ సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు మారుతున్నాయి. అలాగే కంపెనీలు పరిగణనలోకి తీసుకునే నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపార సంస్థలు దీనికి వేగంగా అలవాటు పడాలి. → ఏఐ వల్ల అంతర్జాతీయంగా 91 శాతం కంపెనీల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన విధుల స్వరూపం మారింది. ఏఐని అనుసంధానించేందుకు మూడో వంతు సంస్థలు (34 శాతం)గణనీయ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. → వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగ విధుల్లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు 43 శాతం కంపెనీలు వెల్లడించాయి. → వచ్చే 1–3 ఏళ్ల వ్యవధిలో ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ నియామకాలు తగ్గుతాయని 70 శాతం దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకోవడంలో అకడమిక్ డిగ్రీల కన్నా 66 శాతం కంపెనీలు సాంకేతిక సరి్టఫికేషన్లకు, 58 శాతం కంపెనీలు సమస్యల పరిష్కార సామర్థ్యాలకు, 52 శాతం సంస్థలు కమ్యూనికేషన్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. → కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచే విషయంలో భారత సంస్థలు వెనుకబడి ఉన్నాయి. 54 శాతం సంస్థలు మాత్రమే రీస్కిలింగ్పై స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోకెల్లా ఇదే అత్యల్పం. ఈ విషయంలో కెనడా (77 శాతం), బ్రెజిల్ (76 శాతం), సింగపూర్ (74 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి. → 45 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి రీస్కిలింగ్ కార్యక్రమాలు ప్రారంభించలేదు. వచ్చే 12 నెలల్లో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి. ఏఐ నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకోవడంలో 63 శాతం సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటుకున్నాయి. -
పంజరం లేని పెంపుడు చిలక
వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొస్తున్న వేళ... సురక్షితంగా, బాధ్యతాయుతంగా దాన్ని వినియోగించేందుకు వీలుగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల ‘భారత ఏఐ గవర్నన్స్ గైడ్లైన్స్’ను ప్రకటించింది. ఇంతకీ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే ఏఐతో వచ్చే ఇక్కట్లను సైతం ఎదుర్కోవాలని చూస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏఐని మరీ పంజరంలో చిలకగా చేయకూడదన్న మాట నిజమే కానీ, డేటా ప్రైవసీ సహా అనేకఅంశాలపై ఆందోళన తీరేదెలా?ఇప్పుడేం జరిగింది?శరవేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీల విష యంలో ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా చట్టాలు చేసేస్తుంటే, మన దేశంలో ప్రత్యేకమైన చట్టమంటూ ఇంకా ఏమీ లేదు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ పరిస్థి తుల్లో ఆచరణాత్మక దృక్పథంతో ఒక అడుగు వేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ‘ఇండియా ఏఐ గవర్నన్స్ గైడ్లైన్స్’ నివేదికను తయారుచేసి, అందించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయా నికి ప్రాధాన్యమివ్వడం 66 పేజీల ఈ బ్లూ ప్రింట్ ప్రత్యేకత.ఏఐతో ఒనగూడే లాభాలనూ, ఎదురయ్యే కష్టనష్టాలనూ సమతూకం చేస్తూ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఇందులో మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఏఐపై అతిగా కట్టుదిట్టాలు పెట్టి, సృజనశీలురనూ, మదుపరులనూ ఇరుకునపెట్టరాదనే భావనతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. నిజానికి, గతంలోనే ఓ సబ్ కమిటీ ఒక ముసాయిదా సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత సదరు సబ్ కమిటీతో సంబంధం లేకుండా మొన్న జూలైలో మంత్రిత్వ శాఖ వేసిన కమిటీ తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ పత్రం ఏం చెబుతోంది?ఇవాళ ప్రపంచంలోనే ఛాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు)ను అమెరికా తర్వాత అత్యధికంగా వాడుతున్న దేశం మనదే. ఏఐలో ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలని అమె రికా, చైనాలు తహతహలాడుతుంటే, భారత్ మాత్రం సమూల మార్పు తెచ్చే ఈ టెక్నాలజీలను ప్రజల జీవితాలను మార్చేందుకు ఎలా వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘ఏఐ గవ ర్నెన్స్ గూపు’ను ఏర్పాటు చేయాలన్నది ఈ మార్గ దర్శకాల్లో ఓ సూచన.ఆ గ్రూపునకు అండగా ‘టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ’, అలాగే ‘ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ ఉంటాయి. అయితే, ప్రభుత్వ అధికారులు ఏఐ సిస్టమ్స్ను వాడినప్పుడు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం సంగతి అటుంచితే, ప్రైవేట్ రంగం భారతీయ చట్టాలన్నిటినీ పాటిస్తూ, స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకొని, పారదర్శకంగా వ్యవహరించాలనీ, బాధితుల సమస్యను పరిష్కరించే వ్యవ స్థలు ఏర్పాటు చేసుకోవాలనీ మార్గదర్శకాలు సూచించాయి. ఏఐతో చేసిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్స్టా లాంటివి ఇకపై ఆ మాట స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్లో ఇప్పటికే ఈ సవరణ ముసాయిదా తెచ్చారు.రానున్న రోజుల్లో ఏం జరగనుంది?ఏఐ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే వరుసగా ప్రపంచ సదస్సులు జరుగుతున్నాయి. బ్లెట్చెలీ పార్క్ (బ్రిటన్), సియోల్, ప్యారిస్లలో జరిగిన గత సదస్సుల అనంతరం రానున్న నాలుగో సదస్సు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాల రూపకల్పన కీలకమైంది. ఏఐని నియంత్రించడం కష్టమైపోతోందని ప్రపంచ దేశా లన్నీ కిందా మీదా అవుతున్న పరిస్థితుల్లో మన దేశం ఇలా ఆగి, ఆలోచించే వైఖరిని అవలంబించడం మంచిదే. అర్థం చేసుకోదగినదే. భవిష్యత్తులో అవస రాన్ని బట్టి ఏఐపై నియంత్రణ, లేదా చట్టాన్ని చేస్తా మంటూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి సైతం చెప్పడాన్ని ఆ కోణం నుంచి చూడాలి.అయితే, ఏఐ సృష్టి వీడి యోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ నేతల మొదలు రంగుల లోకపు తారల దాకా అందరినీ బాధితుల్ని చేస్తున్న డీప్ ఫేక్ మహ మ్మారిపై చర్యలు తక్షణావసరం. ఈ విషయంలో విధాన నిర్ణేతలపై ఇప్పటికే చాలా ఒత్తిడి వస్తోందని మర్చిపోలేం. ఏఐపై అతిగా రూల్స్ పెట్టిన యూరో పియన్ యూనియన్, మార్కెట్ శక్తులకే అంతా వది లేసి స్వచ్ఛంద నియమాలతో ఈ రంగం పెంపొందా లని భావిస్తున్న అమెరికా... ఈ రెంటితో పోలిస్తే, భారత మధ్యేమార్గ ధోరణి ప్రశంసనీయమే కానీ ఫలితాలిస్తుందా అన్నది చూడాలి. -
ఏఐ.. నమ్మించి, నట్టేట ముంచుతోందిలా..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ చాట్బాట్లు తప్పుదారి పట్టించే సమాచారాన్ని అధికారిక రూపంలో వెల్లడిస్తున్నాయన్నారు. ఏఐలోని ఈ అంతర్గత లోపాలను సరిదిద్దకపోతే అవి వినియోగదారుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏఐ శిక్షణ పొందిన తన డేటాలోని నమూనాల ఆధారంగా తదుపరి పరిణామాలను అంచనా వేసి, ఫలితాలను అందిస్తుంది. అయితే ఈ క్రమంలో పలు తప్పిదాలు దొర్లుతుంటాయి.కల్పిత అవుట్పుట్లు: కృత్రిమ మేథ(ఏఐ) దాని వినియోగదారునికి నమ్మకం కల్పిందేందుకు కల్పిత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది.తప్పులను ఒప్పులుగా: ఏఐ తనలోని లోపాన్ని అంగీకరించే బదులు.. తప్పులను కూడా నమ్మించేలా చేస్తుంది.అస్పష్టమైన ప్రాంప్ట్లు: వినియోగదారు అడిగిన ప్రశ్నపై స్పష్టత లేనప్పుడు, ఏఐ ఆ అనిశ్చితిని అంగీకరించకుండా, ఏదో ఒక సమాధానాన్ని ఊహించి ఇస్తుంది.ఇటువంటి సమస్యలు ఉద్దేశపూర్వక అబద్ధాలు కావని, ఏఐ చాట్బాల్లోని నిర్మాణాత్మక లోపాలని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు.ఇటీవలి ఏఐ తప్పిదాలుగూగుల్ జెమిని(2025): ఈ ఏఐ మోడల్ యూఎస్ వ్యవస్థాపక పితామహుల చిత్రాలను వారి జాతిపరంగా తప్పుగా రూపొందించింది. ఇది పక్షపాత ధోరణితో చేసినదంటూ చర్చకు తావిచ్చింది.చాట్ జీపీటీ లీగల్ కేసు (2023–2024): న్యూయార్క్లోని న్యాయవాదులు చాట్బాట్ను నమ్మి.. అది అందించిన ఉనికిలో లేని కోర్టు కేసులను తమ న్యాయ పత్రాలలో పాటు సమర్పించారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, సదరు న్యాయవాదులపై ఆంక్షలు విధించింది.మైక్రోసాఫ్ట్ కాపీలాట్(2024): ప్రత్యక్ష పరిశోధనకు కనెక్ట్ కాని సందర్భాలలో పాత ఆర్థిక డేటాను తయారు చేసింది. ఇది ఆర్థిక విశ్వసనీయతపై ఆందోళనలను పెంచింది.మెటా ఏఐ అసిస్టెంట్లు (2024): తప్పుడు కెరీర్ విజయాలతో ప్రముఖుల గురించి కల్పిత జీవిత చరిత్రలను సృష్టించాయి. తద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించాయి.ఈ విధమైన సమస్యల ను పరిష్కరించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. గూగుల్ తన జెమినిని మెరుగుపరుస్తోంది. అలాగే ఓపెన్ ఏఐ.. కల్పిత సూచనలను తగ్గించేందుకు సైటేషన్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ రియల్-టైమ్ సెర్చ్ ఇంటిగ్రేషన్ను మెరుగుపరుస్తోంది. పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వ్యవస్థలను రూపొందించేందుకు ఏఐ కంపెనీలు కృషి చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..


