
పిండం ఎంపికలో కచ్చితత్వం, గర్భస్థ ఫలితాల్లో మెరుగుదలకు ఏఐ ఉపయుక్తం
హైదరాబాద్: అత్యుత్తమ పిండాలను ఎంపిక చేసుకోవడం, తద్వారా గర్భస్థ ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ తమ ఐవీఎఫ్ ల్యాబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ పరిశోధనల ఫలితాల ప్రకారం, వీటా ఎంబ్రియో అనే ఈ టూల్ ఫలితంగా గర్భస్థ ఫలితాలు 12% మెరుగుపడ్డాయని తేలింది. బంజారాహిల్స్, కూకట్పల్లి ప్రాంతాల్లోని తమ కేంద్రాల్లో ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్స్లో నోవా ఈ ఏఐని ప్రవేశపెట్టింది.
ఐవీఎఫ్ ల్యాబ్స్లో అత్యుత్తమ పిండాన్ని ఎంపిక చేయడం అనేది ఎంబ్రియాలజిస్టులు చేస్తారు. ప్రతి పిండాన్నీ డబుల్ చెక్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. సాధారణంగా మనుషులు చూసినప్పుడు కనిపెట్టలేని అనేక అంశాలను అది గుర్తిస్తుంది. తద్వారా కచ్చితత్వాన్ని పెంచి, ఐవీఎఫ్ సైకిల్ టైంలైన్లను తగ్గిస్తుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రం క్లినికల్ డైరెక్టర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “ప్రస్తుతం మన దేశంలో ప్రతి నాలుగు జంటల్లో ఒకరికి సంతానరాహిత్య సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ఫెర్టిలిటీ చికిత్సల్లో మరింత కచ్చితత్వం అవసరం. పిండం ఎంపిక కోసం మా ఐవీఎఫ్ ల్యాబ్స్లో ఏఐని సమకూర్చుకున్నాం. మా ఎంబ్రియాలజిస్టులు ఒక పిండాన్ని విశ్లేషించిన తర్వాత ఆ పిండం ఎదుగుదల, నాణ్యత ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వారు ఏఐ టూల్ ఉపయోగిస్తారు. ఇది మరింత కచ్చితంగా అంచనా వేయడం ద్వారా ల్యాబ్ శాస్త్రవేత్తలు (ఎంబ్రియాలజిస్టులు) పిండాన్ని ఎంచుకోగలరు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో, 90% ఐవీఎఫ్ సైకిళ్లను ఆ జంట సొంత అండాలు, శుక్రకణాలతోనే చేస్తాం. తద్వారా పిండం ఎంపికలో కచ్చితత్వాన్ని పెంచుతాం.
ఐవీఎఫ్ లాంటి చికిత్సలతో టెక్నాలజీ ఉపయోగం, వైద్యపరిజ్ఞానం వల్ల రోగులకు మరింత పారదర్శకత, విశ్వాసం కలుగుతాయి. తమ సొంత అండాలు, శుక్రకణాలే వాడుతున్నారా అని కనీసం 30% మంది జంటలు అడుగుతారని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు గుర్తించారు. మా దగ్గర ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తాం. దీనిద్వారా అన్ని పిండాలను ట్రాక్ చేయొచ్చు. దీనిద్వారా ప్రతి శాంపిల్కు ఒక విభిన్నమైన బార్కోడ్ లేదా చిప్ ఉంటుంది. ఏ ప్రొసీజర్ చేసేముందైనా సిస్టమ్ వీటిని డబుల్ చెక్ చేస్తుంది. ఏదైనా మ్యాచ్ కాకపోతే వెంటనే ఐవీఎఫ్ ల్యాబ్లో ఉన్న ఎంబ్రియాలజిస్టులను అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ప్రతి దశలోనూ రియల్టైంలో పరీక్షించడానికి అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రంలోసీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గ వైట్ల మాట్లాడుతూ, “మహిళలు 30లు, 40ల చివర్లో వస్తున్నారు. వాళ్లలో సహజంగానే వయసు కారణంగా అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోయి ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. మొత్తం ఫెర్టిలిటీ కేసుల్లో మగవారి వల్ల వచ్చే సమస్యలు 30-40% ఉంటున్నాయి. అవి ప్రధానంగా ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు, స్టెరాయిడ్ల వాడకం ఎక్కువ కావడం వల్ల వస్తున్నాయి. మహిళల్లో 25-30% మందికి పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, అండాలు తక్కువగా విడుదల కావడం లాంటివి ఉంటున్నాయి.
20ల చివర్లో ఉన్నవారికీ ఇలాంటి సమస్యలు రావడంతో వారికీ చికిత్సలు అవసరం పడుతున్నాయి. జంటలు తప్పనిసరిగా తమ ఫెర్టిలిటీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి, చికిత్సలకు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఫెర్టిలిటీ చికిత్సలు విజయవంతం కావడంలో వయసుదే చాలా కీలకపాత్ర. గతం కంటే ఫెర్టిలిటీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏడాదికి కనీసం 50-100 మంది ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడుగుతున్నారు. పెళ్లికాని మహిళలే దీనికి వస్తున్నారు. వీరిలో వాణిజ్యవేత్తలు, ఐటీ, వైద్యరంగం, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఉంటున్నారు. క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు” అని చెప్పారు.