వాట్సాప్‌ బదులుగా 'సందేశ్'.. లోక​ సభలో కేంద్రం కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ బదులుగా 'సందేశ్'.. లోక​ సభలో కేంద్రం కీలక ప్రకటన

Published Fri, Jul 30 2021 2:19 PM

Central Government Launches Sandes App - Sakshi

వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తదితర ఫీచర్లతో కేంద్ర ప్రభుత్వం సందేశ్‌ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్‌ను డిజైన్‌ చేస్తున్నాయి. పూర్తిగా స్వదేశీగా ఈ యాప్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయం తెచ్చే పనిలో కేంద్రం నిమగ్నమైంది.

ఈ మేరకు కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేసింది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ నిబంధనల నేపథ్యంలో కేంద్రం స్వదేశీ వాట్సాప్‌ను లాంఛ్‌ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాప్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌ సభలో కీలక ప్రకటన చేశారు.

నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి డిజైన్‌ చేసిన స్వదేశీ వాట్సాప్‌ సందేశ్‌ అందరికి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత‍్వమే చూసుకుంటుందన్న ఆయన.. వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తో పాటు ప్రభుత్వ అప్లికేషన్ ఈ యాప్ లో ఉన్నట్లు తెలిపారు.
 
అంతేకాదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటంటే వాట్సాప్‌ కేవలం ఫోన్‌ నెంబర్‌తో మాత్రమే లాగిన్‌ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సందేశ్‌ యాప్‌ మాత్రం ఈమెయిల్ తో  ఓపెన్ చేసేలా రూపొందించారు. అయితే సందేశ్‌ యాప్‌ ఎంతమేరకు ఆకట్టుకుంటుంది.? సందేశ్‌ తో వాట్సాప్‌ వినియోగం ఆగిపోతుందా? లేదా కొనసాగుతుందా? అన్న అంశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement