-
వాట్సాప్లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మరికొన్ని కొత్త ఫీచర్స్ అందించడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ నుంచే కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ వంటివన్నీ కట్టేయొచ్చని తెలుస్తోంది.భారతదేశంలో ఆర్ధిక సేవలను ప్రారంభించడానికి మెటా యోచిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ వాట్సాప్ యాప్లోనే కరెంట్ బిల్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్లు, LPG గ్యాస్ చెల్లింపులు, నీటి బిల్లులు, ల్యాండ్లైన్ పోస్ట్పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు చేయడానికి వీలుగా తగిన ఫీచర్స్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.వాట్సాప్లో ఈ కొత్త ఫీచర్స్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత బిల్స్ చెల్లించడానికి ఇతర యాప్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్ఫోన్లో స్టోరేజ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.స్మార్ట్ఫోన్ ఉపయోగించే చాలామంది.. ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ పేమెంట్స్ లేదా బిల్లింగ్స్ కోసం ఇతర యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్లో బిల్స్ చెల్లించడానికి కావలసిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి బిల్స్ పే చేయడానికి ఉపయోగించే యాప్స్ అనవసరం అవుతాయి. కొత్త ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. వినియోగంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని సమాచారం. -
వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?
ఇజ్రాయెల్ కంపెనీ పారాగాన్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక స్పైవేర్ ద్వారా జర్నలిస్టులు, సివిల్ సొసైటీ సభ్యులతో సహా దాదాపు 100 మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వాట్సప్ సైబర్ సెక్యూరిటీ ఆరోపించింది. అయితే, భారతీయ వినియోగదారులు ఈ ఉల్లంఘన బారిన పడలేదని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ధ్రువీకరించింది. తన భారతీయ వినియోగదారులు ఈ దాడికి గురికాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.గ్రాఫైట్ అని పిలువబడే ఈ స్పైవేర్ ‘జీరో-క్లిక్’ పద్ధతిని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేశారని వాట్సప్ తెలిపింది. అంటే బాధితులు ఎలాంటి లింక్పై క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తులను టార్గెట్ చేసి హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ఈ స్పైవేర్ను అక్కడి ప్రభుత్వ క్లయింట్లు ఉపయోగిస్తున్నారని భావిస్తున్నప్పటికీ, దాడి వెనుక ఉన్న నిర్దిష్ట వ్యక్తులను వాట్సప్ గుర్తించలేకపోయింది.ముఖ్యంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)తో కంపెనీ గతంలో దాదాపు 2 మిలియన్ల డాలర్ల కాంట్రాక్టును దక్కించుకొని వార్తల్లో నిలిచింది. జాతీయ భద్రతా సమస్యల కారణంగా ఫెడరల్ ఏజెన్సీలు స్పైవేర్ వినియోగాన్ని పరిమితం చేసేలా, అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వెలువడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు అనుగుణంగా ఉండేలా ఈ ఒప్పందాన్ని సమీక్షించారు. పారగాన్ సొల్యూషన్స్ యూఎస్లోని చాంటిల్లీ, వర్జీనియాలో కార్యాలయాలను కలిగి ఉంది. యూఎస్ ప్రభుత్వ సంస్థలతో సంస్థ ఒప్పందాలపై పరిశీలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాదారులచే స్పైవేర్ను విస్తృతంగా ఉపయోగించడంపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానాపారాగాన్ సొల్యూషన్స్పై వాట్సప్ చర్యలు చేపట్టింది. చట్టవిరుద్ధమైన నిఘా కోసం కంపెనీ స్పైవేర్ను ఉపయోగించడం నిలిపివేయాలని కోరుతూ.. ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని లేఖ రాసింది. వాట్సప్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో వినియోగదారులు ప్రైవేట్గా కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని రక్షించడానికి నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. స్పైవేర్ సంస్థలను కట్టడి చేస్తూ వారి చర్యలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. -
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్
సాక్షి, అమరావతి: ప్రజలు నేరుగా ఫోన్ ద్వారానే ధృవపత్రాలు అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది. వాట్సాప్ గవర్నెన్స్పై బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలి, ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. మొదటి విడతలో దేవదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆరీ్టసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లేత వయసు.. వినని మనసు
రోజుల పరిచయానికి కన్నవారినే కాదనుకుంటున్నారు.. అంతా తమకే తెలుసునన్న భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక.. కనిపించేదంతా నిజమేమో అని రంగుల మాయలో పడుతూ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.. చేతుల్లోని సెల్ ఫోన్ ఈ మైనర్ ప్రేమ వ్యథలకు వారథి అవుతుండగా.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు ఈ విషయంలో సమిధలవుతున్నారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అడుగు బయటపెడితే ఎటు వెళ్లాలో దారులు కూడా సరిగ్గా తెలియని అమాయక మైనర్లను.. చేతిలో ఉన్న ఫోన్లు, అందులో ఉన్న పలు ఆన్లైన్ సైట్లు తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. ఆయా సైట్లలోని రంగుల ప్రపంచం మాదిరిగానే వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయనే భ్రమలో మితిమీరిన పరిచయాలను పెంచుకుంటూ.. వారి జీవితాలను వారే అంధకారంగా మార్చుకుంటున్నారు. పదిహేనేళ్ల వయస్సులోనే ‘తప్పు’టడుగులు వేసి గర్భం దాల్చడం.. బిడ్డలను కని రోడ్డున పడి.. తమ కన్నవారికి తీరని గుండె ఘోషను మిగుల్చుతున్నారు. సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మైనర్ బాలికలు, యువతులు ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ వంటి సైట్లలో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి.⇒ సింగ్నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగా అతగాడు ఆ నగ్నఫొటోలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ⇒ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్లో పోస్ట్లు, వీడియోలను చూసి ఓ యువకుడికి దగ్గరైంది. వారిళ్లల్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ బాలిక మూడు నెలల తరువాత గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ⇒ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోనే నెలలో నలభై కేసుల వరకూ బాలికలు అదృశ్యమయ్యారని, బాలికలు, యువతులపై లైంగిక దాడుల ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, చైల్డ్లైన్ వంటి విభాగాలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలో వీరికి అవగాహన సదస్సులు నిర్వహించడం, పోలీసులతో ఈ చట్టాల గురించి బాలబాలికలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ఇవి అరకొరగా జరుగుతున్నా ప్రభావం చూపడం లేదు. బాలికలపై లైంగిక దాడులు, అదృశ్య కేసులను నియంత్రించాలంటే వారిపై నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న బాలబాలికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారు స్కూల్కు, కాలేజ్కు, ట్యూషన్కు వెళ్తున్నారా.. లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తరచూ బాలికలకు సమాజంపై అవగాహన కల్పించడం, అప్రమత్తంగా ఉండి.. వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉండడం, వారితో ఎప్పుడూ స్నేహంగా నడుచుకోవడం.. ఫోన్లను దూరంగా ఉంచడం ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి.. బాల బాలికలు తప్పుడు త్రోవలో వెళ్లేందుకు ప్రధాన కారణం సెల్ఫోన్లే. చిన్నపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం, ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్, ఓటీటీ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం, చదువు, సంప్రదాయాలను తెలుసుకోకుండా రీల్స్ పేరుతో చిన్నవయస్సులోనే చెడు అలవాట్లన్ని నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం చేయకూడదు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కదలికలపై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ శాఖ తరఫున పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు, సెల్ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. – బీహెచ్ వెంకటేశ్వర్లు, సింగ్నగర్ సీఐ -
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రక్రియపై సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ తెనాలిలో సాంకేతికంగా ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి, దానికి అనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్టీజీఎస్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ కోసం ఏపీ సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పేరిట ఒక పోర్టల్ను రూపొందించినట్లు తెలిపారు. సదరన్ జోనల్ కౌన్సిల్ దృష్టికి విభజన అంశాలు రాష్ట్ర విభజన సంబంధించిన పెండింగ్ అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
వాట్సప్ పేమెంట్ను ఇక అందరూ వాడొచ్చు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ యాప్ అయిన వాట్సాప్లో ఇంతకాలం కేవలం కొద్ది మందికి మాత్రమే ఇతరులకు నగదు బదిలీ వెసులుబాటు ఉండగా ఇకపై అందరికీ ఆ అవకాశం దక్కనుంది. అతి త్వరలోనే ఈ చెల్లింపుల సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెక్స్ మెసేజ్లు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు షేర్చేసుకోవడంలో భారత్లో అగ్రగామి సోషల్మీడియా యాప్గా వర్ధిల్లుతున్న వాట్సాప్ ఇకపై పేమెంట్ యాప్గానూ ఎదిగే అవకాశాలు మెరుగయ్యాయి. దేశంలో ఆన్లైన్ చెల్లింపులపై నియంత్రణ బాధ్యతలు చూసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) గతంలో వాట్సాప్కు కేవలం భారత్లోని 10 కోట్ల మంది యూజర్లకు మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు.తాజాగా ఆ పరిమితిని ఎత్తేశారు. దీంతో ఇకపై యూజర్లు అందరూ వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపుల సేవలను వినియోగించుకోవచ్చని ‘వాట్సాప్ పే’ బహిరంగంగా అధికారికంగా స్మార్ట్ఫోన్లలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మొదట్నుంచి చూస్తే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) చెల్లింపుల సేవలు విస్తరించుకోవడంపై వాట్సాప్కు ఎన్పీసీఐ దశలవారీగా పరిమితిని పెంచుతూ వచ్చింది. 2020 సంవత్సరంలో కేవలం 4 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత రెండేళ్లకు ఆ పరిమితిని 10 కోట్ల మంది యూజర్లకు అనుమతి మంజూరు చేశారు. భారత్లో రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ నగదు చెల్లింపుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఎన్పీసీఐ తాజాగా ఈ పరిమితిని ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 13 బిలియన్ల లావాదేవీలుభారత్లో ఇప్పుడు యూపీఐ లావాదేవీలు ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయాయి. నెలకు కనీసం 1300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా గూగుల్ పే, ఫోన్పే యాప్లలోనే దాదాపు 85 శాతం లావాదేవీలను యూజర్లు పూర్తిచేస్తున్నారు. దేశంలో వాట్సాప్ యాప్ను ఏకంగా 50 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్న వాట్సాప్ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ను విస్తరిస్తే దేశంలోనే అగ్రగామి పేమెంట్ యాప్గానూ దూసుకుపోనుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దీంతో వాట్సాప్ మాతృసంస్థ మెటాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల మెటా తమ కృత్రిమేథ ఉపకరణం అయిన ‘మెటా ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది.దీనికి భారత్లో చక్కటి ప్రజాదరణ దక్కింది. గతంలో మాదిరే వాట్సాప్ పే విభాగం యూపీఐ వారి థర్ట్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ నిబంధనావళిని పాటించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ బ్యాంక్ల సమాఖ్య(ఐబీఏ)లు సంయుక్తంగా యూజర్లు అత్యంత వేగంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఎన్పీసీఐను ఏర్పాటుచేశాయి. ఎన్పీసీఐ ఆధ్వర్యంలోనే యూపీఐ చెల్లింపుల వ్యవస్థ పనిచేస్తోంది. -
నేను.. నా స్టేటస్!
మాట.. పాట.. ఆట.. ఆనందం.. ఆశ్చర్యం.. విషాదం వార్తలు.. విశేషాలు.. వింతలు శుభాకాంక్షలు.. విమర్శలు.. సూచనలు విద్య, ఉద్యోగం.. వ్యాపారం.. పుట్టుక.. పెళ్లి.. చావు.. ఆధ్యాతి్మకం..విహారం.. ఆరోగ్యం.. ఇలా.. అన్నీ ఒకే వేదికపై అందరితో స్మార్ట్గా పంచుకుంటున్నారు. ‘నా స్టేటస్.. నా ఇష్టం’.. అంటూరోజూ అందరినీ పలకరిస్తూ సాగిపోతున్నారు. కర్నూలు(హాస్పిటల్): సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సోషల్ మీడియా ఇప్పుడొక వేదికగా మారింది. అందులో ఇటీవల కాలంలో వాట్సాప్ యాప్లోని ఫీచర్ అయిన ‘స్టేటస్’ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అలవాటుపడ్డ ఈ తరుణంలో ‘స్టేటస్’లో పోస్టు పెట్టడమనేది ఒక స్టేటస్లా భావిస్తున్న వారూ ఉన్నారు. ఫేస్బుక్, (Facebook) యూ ట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ (WhatsApp status) వేదికగా వాడుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనాభా దాదాపు 50 లక్షల వరకు ఉంటుంది. అందులో పిల్లలు మినహాయిస్తే 40 లక్షల వరకు యుక్త వయస్సు నుంచి వృద్ధుల వరకు ఉంటారు. వీరిలో కనీసం 50 శాతం మందికి అంటే 20 లక్షల మందికి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా స్మార్ట్ఫోన్ (Smart Phone) ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ను ఉపయోగించే వారందరూ స్టేటస్లో వారికి నచ్చిన అంశాలను పోస్టు చేస్తూ ఉండటం లేదా చూస్తూ ఉండటం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు వాట్సాప్ యాప్ను ఉపయోగించే వారిలో 10 నుంచి 20 శాతం మాత్రమే స్టేటస్ ఫీచర్ను ఉపయోగించేవారు. ఇప్పుడు 80 శాతం మంది ఈ ఫీచర్ను చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు రోజులో నాలుగైదు సార్లైనా స్టేటస్ చూడంది నిద్రపోవడం లేదని సమాచారం. వారు పెట్టిన పోస్టును ఎవరు? ఎంత మంది చూశారు? ఎవ్వరైనా ప్రతి స్పందించారా? అని ఆతృతగా వెతికేవారూ ఉన్నారు. ఇలా వారు పెట్టిన పోస్టుకు ఎవరూ స్పందించకపోతే తీవ్ర అసంతృప్తికి గురయ్యే వారూ ఉన్నారు. ఈ క్రమంలో అందుకు అనుగుణమైన సందేశాన్ని కోట్ చేస్తూ పోస్టు చేస్తున్నారు. మొత్తంగా వాట్సాప్ స్టేటస్లో వారు పోస్టు చేసే దాన్ని బట్టి వారు ఎలాంటి వారు, వారి మనస్తత్వమేమిటో ఇట్టే చెప్పేయవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ప్రతిభ చాటడానికి...! చాలా మంది తమ వ్యక్తిగత ప్రతిభ చాటడానికి స్టేటస్ను ఉపయోగించుకుంటున్నారు. ఎందులోనైనా వారు ప్రతిభ సాధించి ఉంటే అప్పటికప్పుడు స్టేటస్లో పోస్టు చేస్తున్నారు. లేదా వారి కుటుంబసభ్యుల్లో ఎవరు ప్రతిభ సాధించినా పోస్టు చేస్తున్నారు. ఈ పోస్టును చూసిన వారు తప్పక అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మానసికానందం పొందుతున్నారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు, వ్యాపారాభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో ప్రతిభ చాటడం, క్రీడల్లో సత్తా చాటడం వంటి అంశాలను స్టేటస్లో పోస్టు చేసి వాటిని చూసిన వారి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. బిజినెస్కు వేదికగా.. వ్యాపారాభివృద్ధికి సోషల్ మీడియా కూడా ప్రచార వేదికగా మారింది. అందులో అందరూ ఎక్కువగా చూసే వాట్సాప్ స్టేటస్ను చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారం గురించి బ్రోచర్లు ముద్రించి స్టేటస్లో పోస్ట్ చేస్తున్నారు. ఆయా వస్తువుల వివరాలు, వాటిలోని ఫీచర్లు, ధర గురించి అందులోనే పోస్టు చేస్తుండటంతో చూసిన చాలా మంది వెంటనే సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి వస్తువును కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది అన్ని రకాల వ్యాపారులు వారి వ్యాపార వస్తువులను వాట్సాప్ స్టేటస్లో పోస్టు చేస్తూ వ్యాపారాభివృద్ధి చేసుకుంటున్నారు. దేవుళ్లు.. దేవతలు.. వాట్సాప్ స్టేటస్తో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ 50 శాతం మంది ఏ రోజుకు ఆ రోజు సంబంధిత దేవుళ్ల ఫొటోలు, పాటల వీడియోలు పోస్టు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిని చూసిన అదే రకమైన వారు ప్రతిస్పందిస్తూ లైక్లు, కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ప్రతిస్పందిస్తూ సంజ్ఞలు తెలిపే చిత్రాలను పోస్టు చేస్తున్నారు. హిందువులు ఆయా రోజు ప్రత్యేకతను బట్టి దేవుళ్ల గురించి పోస్టు పెడుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అయితే రోజుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వారి మత సంబంధ కోట్స్ పోస్టు చేస్తున్నారు. మనోభావాలు వ్యక్తం చేస్తూ..కొందరు వారి మనోభావాలను తెలియజేసే విషయాలు ఎంపిక చేసుకుని స్టేటస్లో పోస్టు చేస్తూ ఆనందిస్తున్నారు. ఇవి వారికి నచ్చిన వారికి మంచిగా, నచ్చని వారికి చెడుగా స్పృశించవచ్చు. ఆ కోట్స్ను పోస్టు చేసిన వ్యక్తిని బట్టి ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా కనిపిస్తాయి. ఒక విధంగా పోస్టు చేసిన వ్యక్తి మనోభావాలు ఇలా స్టేటస్ రూపంలో ప్రతి స్పందిస్తాయనడంలో సందేహం లేదు. చాలా మంది వారికి జరిగిన మంచి, చెడును ఇతరులకు చెప్పేందుకు స్టేటస్ను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేస్తున్నారు. ఇట్లు.. మేము బాగున్నాం.. ఇప్పుడున్న బిజీ లైఫ్లో బంధువులు, స్నేహితులకు కనీసం ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకునే సమయం ఉండటం లేదు. ఏదైనా కార్యక్రమంలో కలిసినప్పుడు హాయ్.. బాయ్ అన్నట్లుగా ఉంటుంది. కనీసం పిల్లలు, కుటుంబ పరిస్థితుల గుర్తించి అడిగేవారు.. చెప్పేవారు లేరు. ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్ను ప్రతి ఒక్కరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. స్టేటస్ ఒక లేఖలా మారిపోయింది. ఉదాహరణకు ఏదైనా విహార, శుభకార్యాలు, తీర్థయాత్రకు వెళ్లారంటే అందుకు సంబంధించిన ఏ రోజుకు ఆ రోజు ఫొటోలు సమయంతో సహా కుటుంబసభ్యులంతా ఉండే ఫొటోలు పోస్టు చేసి ఆనందిస్తున్నారు. ఆ పోస్టులను చూసిన వారు ఫలానా వారు ఫలానా ఊరికి యాత్రకు వెళ్లినట్లు ఉన్నారని వెంటనే గ్రహిస్తారు. మరికొందరు వారికి ఏదైనా చెడు జరిగిందంటే ఉదాహరణకు రోడ్డు ప్రమాదమో లేదా ఇతర ప్రమాదాలు, ఆరోగ్యం బాగాలేకపోయినా వారి స్థితిని తెలియజేస్తే ఇతరుల సానుభూతిని పొందేందుకు పోస్టు చేస్తూ ఉంటారు. ఆ పోస్టు చూసిన వారు అయ్యో వారికి ఆరోగ్యం బాగాలేదా అని తెలుసుకుని స్వయంగా వెళ్లడమో లేదా ఫోన్ చేసి పరామర్శించడమో చేస్తున్నారు. ఏది పడితే అది పోస్టు చేయకూడదు నేను పెట్టే పోస్టులను నా గ్రూపులో ఉన్న 60 నుంచి 70 శాతం మంది చూస్తున్నారు. ఇటీవల వరల్డ్ డయాబెటిస్ గురించి పోస్టు పెట్టాను. నాకు ఫోన్ చేసి షుగర్ గురించి వారికున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అలాగే గంటలకు పైగా సైక్లింగ్ చేసిన తర్వాత కలిగిన అనుభవం గురించి పోస్టు చేశాను.సైక్లింగ్ వల్ల లాభాల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చూస్తున్నారు కదా అని ఏది పడితే అది పోస్టు చేయకూడదు. అవగాహనతో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పోస్టు చేయాలి. – డాక్టర్ ఎం. శ్రీకాంత్రెడ్డి, డయాబెటాలజిస్టు, కర్నూలుప్రజల్లో అవగాహన పెంచడానికే.. ఇటీవల కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ లాంటి సోషల్ మీడియాల్లో కొందరు వ్యక్తులు వారికి అర్హత లేకపోయినా ఆరోగ్యం గురించి పలు రకాల పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు గాను ఒక డాక్టర్గా బాధ్యత తీసుకుని నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ‘స్టేటస్’లో పోస్టులు పెడుతున్నాను. నేను నూతన విధానాల్లో చేసిన సర్జరీలు, విదేశాల్లో ఉన్న ఆధునిక వైద్య విధానాలు, మన దేశాల్లో రావాల్సిన ఆవశ్యకత, వివిధ రకాల జబ్బుల గురించి వివరిస్తూ పోస్టులు పెడుతున్నాను. – డాక్టర్ వసీం హసన్ రాజా, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు వ్యాపార ప్రచారానికి ఉపయోగపడుతోంది నేను వ్యాపారవేత్తను. వాట్సాప్ స్టేటస్లోనూ పోస్టులు పెడుతున్నాను. దీనికి మంచి స్పందన వస్తోంది. నేను చేస్తున్న స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి పోస్టులు పెట్టాను. ఇటీవల రియల్ ఎస్టేట్ పోస్టులు స్టేటస్లో చూసి కొందరు క్లయింట్లు మావద్దకు వచ్చి కొనుగోలు చేశారు. – పి. గోవర్దన్రెడ్డి, వ్యాపారి, కర్నూలు -
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే వాట్సప్ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్ల లిస్ట్కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్పీరియా జెడ్, ఎక్స్పీరియా ఎస్పీ, ఎక్స్పీరియా టీ, ఎక్స్పీరియా వీయాపిల్ ఓఎస్లోనూ..ఆండ్రాయిడ్తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్లు వాడుతున్న డివైజ్ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్ల్లోని హార్డ్వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్లు, డివైజ్ల్లోని యాప్లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Year Ender 2024: వాట్సాప్లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే..
వాట్సాప్.. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగా 295 కోట్ల మంది వినియోగదారులు ఈ మెసేజింగ్ యాప్ను ఉపయోగిస్తున్నారు. ‘మెటా’ ఈ ఏడాది వాట్సాప్లో పలు ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా దాని ఇంటర్ఫేస్లో కూడా మార్పు చోటుచేసుకుంది. ఫలితంగా వాట్సాప్లో చాటింగ్ అనుభవం పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాది వాట్సాప్లో ప్రవేశించిన ప్రత్యేక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.మెటా ఏఐమెటా ఏఐ.. జనరేటివ్ ఏఐ చాట్బాట్ వాట్సాప్కి జోడించింది. మెటా దాని అన్ని ప్లాట్ఫారమ్లకు దాని లామా (లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్) ఆధారిత ఉత్పాదక ఏఐ సాధనాన్ని జోడించింది. వాట్సాప్ యూజర్లు మెటా ఏఐ ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చాట్బాట్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఆదేశాలకు అనుగుణంగా చిత్రాలను కూడా రూపొందిస్తుంది.వీడియో కాల్ ఫిల్టర్వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్కు ఈ ఏడాది కొత్త ఇన్నోవేటివ్ ఫిల్టర్లు జోడించారు. వీడియో కాల్ల సమయంలో వినియోగదారులు ఈ ఫిల్టర్లను ఉపయోగించి తమకు నచ్చిన నేపథ్యాన్ని మార్చుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార కాల్లు లేదా సమావేశాల సమయంలో, వినియోగదారులు ఈ వీడియో కాల్ ఫిల్టర్లను ఉపయోగించవచ్చు.కస్టమ్ చాట్ జాబితాఈ సంవత్సరం మెటా.. వాట్సాప్లో కస్టమ్ చాట్ జాబితా ఫీచర్ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వారికి ఇష్టమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల చాట్ జాబితాను సృష్టించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమకు నచ్చినవారితో నిత్యం కనెక్ట్ కాగలరు.వాయిస్ సందేశాలకు అక్షరరూపంవాట్సాప్లో వాయిస్ మెసేజ్ల కోసం ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ జోడించారు. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రిసీవ్ చేసుకునే వినియోగదారులు ఆ వాయిస్ మెసేజ్లను అక్షర రూపంలో చదవగలరు. వినియోగదారులు తమకు నచ్చిన భాషలో వాయిస్ సందేశాలను చదువుకునే అవకాశం కూడా ఉంది.ఇంటర్ఫేస్లో మార్పులుఇతర ప్రధాన అప్గ్రేడ్లతో పాటు, యాప్ వినియోగదారులు ఇంటర్ఫేస్ను కూడా మార్చుకోవచ్చు. వాట్పాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి, టైపింగ్ ఇండికేటర్ను జోడించారు. మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు, అవతలి వ్యక్తి ప్రత్యుత్తరం కోసం ఏదైనా టైప్ చేస్తే, అది చాటింగ్ విండోలో కనిపిస్తుంది.ఇది కూడా చదవండి: మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే.. -
వాట్సప్లో చాట్జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఇకపై వాట్సప్లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్లోనూ చాట్జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్తో పనిలేకుండా వాట్సప్లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్తో వాట్సప్లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్లో అడిగిన ప్రశ్నలకు చాట్జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్లో చాట్జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్బాట్ను వాట్సప్లో అందిస్తోంది. -
వాట్సాప్ హ్యాకింగ్: ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్
స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే.. సైబర్ మోసగాళ్ల ఆగడాలు మితిమీరుతున్న తరుణంలో ఆన్లైన్ స్కామ్లు పెరిగిపోతున్నాయి. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలివాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం ఉత్తమం. దీని కోసం ముందుగా వాట్సాప్ ఖాతా ఓపెన్ చేసి.. అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఒక పిన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఖాతాను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదు.వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలివాట్సాప్ ఖాతాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెటా ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది మీ భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. యాప్ అప్డేట్ పేరుతో వచ్చే సందేశాల విషయంలో కూడా యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాప్ అప్డేట్ పేరుతో ఫేక్ మెసేజ్లు వస్తుంటాయి.తెలియని కాల్స్ స్వీకరించకండితెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ (ఆడియో & వీడియో) స్వీకరించకపోవడం ఉత్తమం. కొంతమంది డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వాట్సాప్ కాల్స్ ఉపయోగించే ప్రజలను మోసం చేస్తుంటారు. కాబట్టి తెలియని కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాట్ (DoT) హెచ్చరిస్తోంది.వైఫై నెట్వర్క్లకు దూరంగా ఉండండిపబ్లిక్ వైఫై నెట్వర్క్లు.. అంత సురక్షితమైనవి కాదు. కాబట్టి హ్యాకర్లు ఎక్కువగా ఇలాంటి నెట్వర్క్లను ఉపయోగించి హ్యాక్ చేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫై ఉపయోగించడాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా ప్రైవేట్ నెట్వర్క్ను ఉపయోగించాలి. అప్పుడే మీ డేటా సేఫ్గా ఉంటుంది.స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండిమీ ఫోన్లో డేటా భద్రంగా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలి. సింపుల్ పాస్వర్డ్లను సెట్ చేసుకుంటే.. హ్యాకర్స్ సులభంగా మొబైల్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ లేదా పేస్ ఐడెంటిటీ వంటివి సెట్ చేసుకోవడం కూడా ఉత్తమం. 123456 లేదా abcdef వంటివి సెట్ చేయడం పూర్తిగా మానేయాలి. -
‘నా చావుకు భార్య, బావమరిది, అత్తలే కారణం’
శాలిగౌరారం: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో పాటు వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్(30)కు సూర్యాపేట పట్టణానికి చెందిన శివజ్యోతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రశాంత్ నకిరేకల్లో మొబైల్షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివజ్యోతి భర్త ప్రశాంత్తో తరచూ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లేది. వారం రోజుల క్రితం ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రశాంత్ శివజ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శివజ్యోతి కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. వారం రోజులు గడిచినా ఆమె కాపురానికి తిరిగి రాకపోగా వరకట్నం కోసం వేధింపులకు గరిచేస్తున్నారంటూ ప్రశాంత్, అతడి అక్కలపై సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్తో పాటు అతని బంధువులు, మంగళవారం సూర్యాపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్ను శివజ్యోతి కుటుంబ సభ్యులు తీవ్రమైన పదజాలంతోపాటూ దూషించడంతో పాటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన గురైన ప్రశాంత్ ఇంటికి వచ్చి తన ఆత్మహత్యకు భార్య, అత్త, బావమరిది కారకులని వాట్సాప్లో స్టేటస్ పెట్టి అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాదగోని యాదగిరి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రశాంత్ అంత్యక్రియల్లో అతడి భార్య శివజ్యోతి పాల్గొనకపోవడం గమనార్హం. -
సైబర్ కేటుగాళ్ల కొత్త ఎత్తు.. వాట్సాప్ హ్యాకింగ్!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఆన్లైన్ ద్వారా అందినకాడికి దండుకొనే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటున్నారు. తాజాగా వారు వేస్తున్న ఎత్తుగడే ‘వాట్సాప్ హ్యాకింగ్’. దీనికి చిత్తవుతున్న అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నట్లు ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) గుర్తించింది. దాదాపు నెల నుంచి జోరుగా సాగుతున్న ఈ మోసాల బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్ వినియోగదారులు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీఎస్సార్సీ డైరెక్టర్ డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు స్పష్టం చేశారు. కేరళలో మొదలైన ఈ తరహా నేరాలు తమిళనాడు, తెలంగాణకు సైతం విస్తరించాయని చెప్పారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన వాట్సాప్ హ్యాకింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.సైబర్ మోసాలు చేసేది ఇలా.. » దేశవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ ద్వారా కొని వాటి ఆధారంగా ప్రధానంగా వృద్ధులు, గృహిణులనే టార్గెట్గా చేసుకొని స్కామ్లకు పాల్పడుతున్నారు. » ఓ వినియోగదారుడి ఫోన్లో ఉన్న వాట్సాప్ మరో ఫోన్లో యాక్టివేట్ కావాలంటే యాక్టివేషన్ కోడ్గా పిలిచే ఓటీపీ తప్పనిసరి. టార్గెట్ చేసిన వ్యక్తుల వాట్సాప్ను తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం కథ నడుపుతున్నారు. » తొలుత తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లో వాట్సాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్ని యాక్టివేట్ చేస్తూ టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నారు. వాట్సాప్ యాప్ నుంచి యాక్టివేషన్ ఓటీపీ అసలైన వినియోగదారుడి ఫోన్ నంబర్కు వెళ్లగానే కేటుగాళ్లు ఆ నంబర్కు కాల్ చేస్తున్నారు. తాము ఓ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పొరపాటున మీ నెంబర్ ఎంటర్ చేశామని.. అందువల్ల తమకు రావాల్సిన ఓటీపీ మీ నంబర్కు వచ్చినందున దాన్ని చెప్పాలని కోరుతున్నారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోవడంతో తేలిగ్గా నమ్ముతున్న బాధితులు ఎదుటివారు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఆ ఓటీపీ చెప్పేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు అప్పటికే సిద్ధం చేసుకున్న వాట్సాప్ యాప్లో ఎంటర్ చేస్తున్నారు. » ఈ పరిణామంతో బాధితుడి నంబర్తో పనిచేసే వాట్సాప్ అతని/ఆమె ఫోన్ నుంచి సైబర్ నేరగాడి ఫోన్లో యాక్టివేట్ అయిపోతోంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి ‘టూ స్టెప్ వెరిఫికేషన్’కు సైబర్ క్రమినిల్స్ మార్చేస్తున్నారు. దీనివల్ల బాధితుల వాట్సాప్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతోంది. అనంతరం వాట్సాప్ బ్యాకప్ నుంచి బాధితుడి కాంటాక్ట్స్, ఇతర వివరాలను తమ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. » వాట్సాప్ కాంటాక్ట్స్ ఆధారంగా స్నేహితులు, సన్ని హితులను గుర్తించి వారికి బాధితులు పంపినట్లే సందేశం పంపుతూ వైద్య అవసరాల పేరిట డబ్బు డిమాండ్ చేస్తున్నారు. బ్యాకప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేయడం ద్వారా ఆయా వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. » ఇలా సందేశాలు అందుకున్న వాళ్లు డీపీ, ఫోన్ నంబర్ చూసి తమ వారే ఆపదలో ఉన్నారని భావించి వీలైనంత మొత్తం బదిలీ చేస్తున్నారు. » కొన్ని కాంటాక్ట్స్కు వాట్సాప్ క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేయించి వాట్సాప్ను అ«దీనంలోకి తీసుకుంటున్న సైబర్ నేరస్తులు.. ఆ తర్వాత అప్పటికే సంగ్రహించిన బాధితుడి వాయిస్ ఆధారంగా ఏఐ సాంకేతికతను వినియోగించి వారి పరిచయస్తులు, బంధువులకు ఫోన్ చేసి ఆస్పత్రిలో ఉన్నామని చెప్పి డబ్బు గుంజుతున్నారు. » కొన్ని సందర్భాల్లో బాధితుడికి సంబంధించిన వ్య క్తిగత, సున్నిత సమాచారాన్ని అడ్డం పెట్టుకొని దా న్ని ఆన్లైన్లో పెడతామని భయపెట్టి వీలైనంత మేర దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. » సైబర్ నేరస్తులు కాజేసేవి చిన్న మొత్తాలే కావడంతో అనేక మంది ఫిర్యాదు చేయట్లేదు.వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..» వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ను యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల ఒకవేళ ఆ నంబర్తో కూడిన వాట్సాప్ను సైబర్ నేరస్తులు మరో ఫోన్లో యాక్టివేట్ చేసేందుకు మాయమాటలతో ఓటీపీ తెలుసుకున్నా.. వినియోగదారులు ముందే క్రియేట్ చేసి పెట్టుకున్న 6 అంకెల యాక్టివేషన్ పిన్ నంబర్ వారికి తెలియనందున మరో ఫోన్లో వాట్సాప్ యాక్టివేట్ కాదు. » డీపీలు, స్టేటస్లను ‘ఓన్లీ కాంటాక్ట్స్’కు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.» వీలైనంత వరకు చాట్ బ్యాకప్ను తగ్గించుకోవాలి. అందుక వాట్సాప్ సెట్టింగ్స్లో డౌన్లోడ్ ఆప్షన్ను ‘నన్’అని ఎంపిక చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్లోడ్ ఎంచుకోవద్దు. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ వల్ల ఒకవేళ సైబర్ నేరస్తులు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను మాల్వేర్ రూపంలో పంపితే వినియోగదారుడి ప్రమేయం లేకుండా ఆ వైరస్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే ప్రమాదముంది. -
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్లు, కాల్స్తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఇదిగో రికవరీ టిప్స్..
స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు తెలిసో.. తెలియకో చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన విషయాలు ఉండవచ్చు లేదా ఇష్టమైనవారితో చేసిన చాటింగ్ కూడా ఉండొచ్చు. అలాంటిప్పుడు బాధపడటం మానేసి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే డిలీట్ అయిన చాట్ మొత్తం తిరిగి పొందవచ్చు.వాట్సాప్ చాటింగ్ రికవరీ➤ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత అక్కడ కనిపించే ఆప్షన్లలో 'సెట్టింగ్స్' ఆప్షన్ ఎంచుకోవాలి.➤సెటింగ్స్ మీద క్లిక్ చేసిన తరువాత 'చాట్స్'పైన క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే పేజీని.. కొంచెం స్క్రోల్ చేస్తే.. అక్కడ 'చాట్ బ్యాకప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.➤చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేసిన తరువాత బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్స్ వెనక్కి వస్తాయి.ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు వినియోగదారులు తమ చాట్లను గూగుల్ డ్రైవ్కు బ్యాకప్ చేయవచ్చు. ఐఫోన్ వినియోగదారులు బ్యాకప్ల కోసం ఐక్లౌడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాకప్ స్టార్ట్ చేయడానికి ముందే.. గూగుల్ డిస్క్లో తగినంత స్టోరేజ్ ఉందా? లేదా అని నిర్థారించుకోండి. -
దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్
నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి గ్రామ, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికీ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆస్పత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వారి కుట్రలను తిప్పికొట్టాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అరాచక పాలనపై పోరాటం చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గ నిర్దేశం చేశారు. ‘మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది కలిసి చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పని చేయాలి’ అంటూ దిశా నిర్దేశం చేశారు. ‘మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్లు ఎంత దూరంలో పడతారంటే.. టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అంతలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేప«థ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇవ్వాళ్టికి కూడా మన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలరు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగుల కాగితాలు ఇచ్చి.. దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి... తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తూ... అందులో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే చెప్పడంతో పాటు సంక్షేమ కేలండర్ను విడుదల చేశాం. ఆ మేరకు క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ రకమైన మంచి మనం చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. పొరపాటున చేయి అటువైపు వెళ్లింది ప్రతి ఇంటికీ మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కన పెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు.. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా ఇవ్వాళ చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు.. అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది. ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రంగా ప్రచారం చేశారు. ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు. అతి మంచితనం.. అతి నిజాయితీతో మళ్లీ అధికారంలోకి..ఇవ్వాళ్టికీ నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ.. ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మళ్లీ మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలు నా రూ.15 వేలు ఏమైందని.. రైతులు నా రూ.20 వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. ఈ బడులు మాకొద్దు అనే పరిస్థితిలోకి నెట్టేశారు స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవ్వాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరో తరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడతాయా అన్న పరిస్థితి నుంచి.. ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు.. అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు.ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చే వాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు పెట్టారు. ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని కాలేజీల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి.జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా..రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేపడతాను. పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. విప్లవ స్ఫూర్తితో పని చేసి మనం మరింత బలంగా తయారవ్వాలి. గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయ్యాక ప్రతి సభ్యుడి ట్విటర్ (ఎక్స్), ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర అన్ని అకౌంట్లు ఉండాలి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టాలి.దయనీయంగా వైద్య రంగంవైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి నుంచి ఇంత వరకు బిల్లుల చెల్లింపు లేదు. మార్చి నుంచి నవంబర్ వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104, 108కు సంబంధించి ఆగస్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్.. కుయ్.. మంటూ రావాల్సిన అంబులెన్స్లు చతికిల పడుతున్నాయి. మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 3,350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు చికిత్స అందించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.కుదేలైన వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే.. ఈ రోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాప్ గాలికెగిరిపోయింది.పారదర్శకత పక్కకు పోయింది. వ్యవసాయం తిరోగమనంలో ఉంది. డోర్ డెలివరీతో ప్రతి ప«థకాన్ని ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులున్నాయి. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు. అసలు పథకాలుంటే కదా!దోచుకోవడం.. పంచుకోవడం రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే.. మన కన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2 లక్షలు, రూ.3 లక్షలకు బెల్టుషాపులు ఇచ్చేస్తున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా, ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కు ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతోంది. అందుకే కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు.అందరం చురుగ్గా ప్రజల తరఫున పని చేయాలి. ప్రజల తరఫున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రతిఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. -
సాయం కోరితే.. సరసాలాడమంటూ సీఐ బలవంతం!
ఖలీల్వాడి: సాయం కోసం వచ్చిన యువతితో ఓ సీఐ చనువు పెంచుకుని వాట్సాప్ చాటింగ్ చేయడంతోపాటు అడ్డువచ్చిన యువకుడిపై కేసు నమో దు చేయించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ యువతి లెక్చరర్కు రూ.లక్షన్నర వరకు డబ్బులు ఇచ్చింది. లెక్చరర్ తన డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో ఓ యువకుడి ద్వారా యువతి సీఐని కలిసి తన సమస్యను తెలిపింది. సీఐ సదరు లెక్చరర్ను పలుమార్లు పిలిపించి యువతి ముందే బెదిరించడంతోపాటు కొంత డబ్బును తిరిగి ఇప్పించాడు. ఈ క్రమంలో యువతితో చనువు పెంచుకున్న సీఐ ఆమె మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. తాను ఉదయం లేచింది మొదలు ఇంట్లో, కార్యాలయంలో ఏం చేస్తున్నది, డ్యూటీలో ఏం చేస్తున్నది ఇలా అన్ని విషయాలు, ఫొటోలు యువతితో షేర్ చేసుకున్నాడు. కూతురు వయస్సున్న యువతితో సీఐ వాట్సాప్ చాటింగ్ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. డిగ్రీ పూర్తి చేసిన యువతి విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, సీఐ దగ్గరుండి ఎంక్వైరీ పూర్తి చేయించినట్లు ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారం తెలిసిన యువకుడు ఎస్బీ కానిస్టేబుల్ సాయంతో అప్పటి సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీఐని అప్పటి సీపీ హెచ్చరించారు. సీపీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన యువకుడి వద్ద నుంచి ఎస్బీ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ చాటింగ్, వీడియోలను డిలీట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని సూచించాడు. అయితే తనపై సీపీకి ఫిర్యాదు చేసిన యువకుడిపై కక్ష పెంచుకున్న సీఐ ఓ కేసులో అతడిని ఇరికించాడు. ఆ త రువాత బదిలీపై వెళ్లిపోయిన సదరు సీఐ ఇటీ వల తిరిగి జిల్లాకు వచ్చాడు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని యువకుడు సీఐతోపాటు ఎస్సై, ఓ కానిస్టేబుల్పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. -
వాట్సాప్ గ్రూప్లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి
టెక్నాలజీ పెరుగుతోంది.. స్కామర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతోమంది బాధితులు మోసపోయి లెక్కకు మించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరో సంఘటనే తెరమీదకు వచ్చింది.ముంబైలోని కోలాబాకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ షిప్ కెప్టెన్ను.. మొదట గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో చేర్చాడు. అతడు పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తూ.. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలను వెల్లడించాడు. దీనికోసం ఒక యాప్లో పెట్టుబడి పెట్టమని సూచించారు. అప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని కెప్టెన్ నమ్మేశాడు. దీంతో స్కామర్ బాధితున్ని మరో వాట్సాప్ గ్రూప్లో చేర్చాడు. కంపెనీ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ను షేర్ చేశాడు. బాధితుడు యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత.. ట్రేడింగ్, ఐపీఓ వంటి వాటికి సంబంధించిన మెసేజ్లను అందుకుంటాడు. అదే సమయంలో స్కామర్.. బాధితుని ఇంకొక వ్యక్తిని పరిచయం చేసాడు. ఆ వ్యక్తి.. బాధితుడు సిఫార్సు చేసిన స్టాక్లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని ఒప్పించాడు.లావాదేవీలన్నీ సెప్టెంబర్ 5, అక్టోబర్ 19 మధ్య జరిగాయి. బాధితుడు 22 సార్లు.. మొత్తం రూ. 11.16 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసాడు. వేరు వేరు ఖాతాకు ఎందుకు డబ్బు బదిలీ చేయాలని బాధితుడు స్కామర్లను అడిగినప్పుడు.. ట్యాక్స్ ఆదా చేయడానికి అని అతన్ని నమ్మించారు.కొన్ని రోజుల తరువాత తన నిధులలో కొంత తీసుకోవాలనుకుంటున్నానని.. స్కామర్లు అడిగినప్పుడు, సర్వీస్ ట్యాక్స్ కింద పెట్టుబడులపై 20 శాతం చెల్లించాలని కోరారు. ఇది చెల్లించిన తరువాత కూడా.. మళ్ళీ మళ్ళీ ఏదేది సాకులు చెబుతూ.. మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు బాధితుడు మోసపోయామని గ్రహించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.ఇలాంటి మోసాల నుంచి బయటపడటం ఎలా?👉గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను స్పందించకపోవడం మంచిది.👉ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించడానికి ప్రయత్నించడం, లేదా లింకులు పంపించి వాటిపై క్లిక్ చేయండి.. మీకు డబ్బు వస్తుంది అని ఎవరైనా చెబితే.. నమ్మకూడదు.👉స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయాలను చెబుతూ.. ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. 👉షేర్ మార్కెట్కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. నిపుణలను సందర్శించి తెలుసుకోవాలి. లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి.👉స్కామర్లు రోజుకో పేరుతో మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. -
వామ్మో...వెడ్డింగ్ ఇన్విటేషన్లు!
పలమనేరు: గతంలో ఎవరిదైనా వివాహ శుభకార్యమైతే ఇళ్లకు వెళ్లి పెళ్లిపత్రికలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. అన్నింటికీ స్మార్ట్ ఫోనే దిక్కుగా మారింది. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులకు పంపుతున్నారు. వెడ్డింగ్ కార్డు కాబట్టి తప్పకుండా వాట్సాప్లో వచ్చిన మెసేజీని టచ్ చేసి చూడాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంలా మారింది. ఆయా ప్రాంతాల్లో బాగా తెలిసిన వారి పెళ్లి డిటిటల్ కార్డును హ్యాకర్లు డౌన్లోడ్ చేసుకుని దాన్ని డాట్ ఏపీకే ఫైల్గా మార్చి వేలాదిమందికి వాట్సాప్లో పంపుతున్నారు. కచ్చితంగా చూడాలి కాబట్టి మనం ఆ మెసేజ్ను టచ్ చేశామో అంతే సంగతులు. మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లి మన వ్యక్తిగత డేటా, మన బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు స్కామర్లకు చేరిపోతోంది.వెలుగు చూసిందిలా...చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని నంగిళిలో ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కార్డులను మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయించి దాన్ని బంధువులకు, స్నేహితులకు వాట్సాప్కు పంపారు. దీన్నే కొందరు హ్యాకర్లు కాపీ చేసి అందులో డాట్ ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) ఫైల్ను సెట్చేసి పలువురి మొబైళ్లకు పంపారు. దీన్ని ఓపెన్ చేసినవారి ఫోన్లలోకి డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయి వారి మొబైళ్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు మొబైల్లో డాట్ ఏపీకే ఫైల్ను రీసెట్ చేయడం ద్వారా మెయిల్, పాస్వర్డ్ మార్చుకుని టూస్టెప్ వ్యాలిడేషన్ చేసుకుని ఆపై డిలీట్ చేసుకున్నారు. మరికొందరి ఖాతాల్లోంచి దాదాపు 1.60లక్షల దాకా పోగొట్టుకున్నట్టు తెలిసింది. దీంతో కొందరు బాధితులు మాత్రం సైబర్సెల్కు సెల్ఫోన్ ద్వారానే ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పోయిన నగదు వారికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
వాట్సప్ కొత్త ఫీచర్: దీని గురించి తెలిస్తే..
స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు అందరూ వాట్సప్ వినియోగిస్తున్నారు. కంపెనీ కూడా యూజర్ల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్' అనే ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.వాట్సప్ పరిచయం చేసిన కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్.. వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని పలువురు చెబుతున్నారు.నిజానికి వాయిస్ మెసేజ్ అనేది నలుగురిలో వినడానికి బహుశా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్.. ఉపయోగించి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఇది ట్రాన్స్లేటర్ కాదు, వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో.. ఆ భాషకు టెక్స్ట్ రూపం ఇస్తుంది.మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే.. దీనిని వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలో మార్చుకోగలడు. కానీ పంపిన వ్యక్తికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ వంటి భాషలకు సపోర్ట్ చేస్తాయి. ఐఓఎస్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే కాకుండా.. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. రాబోయే రోజుల్లో.. మరిన్ని భాషలకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్లో చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా.. భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే సపోర్ట్ చేయని భాషలను ఎంచుకుంటే.. ఎర్రర్ వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. -
సైబర్ నేరగాళ్ల ‘పెళ్లి పిలుపులు’!
సాక్షి, హైదరాబాద్: సీజన్కు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరదీస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇదే అంశాన్ని వారికి అనుగుణంగా మల్చుకుని కొత్త దందా మొదలుపెట్టారు. వాట్సాప్ మెసేజ్లలో పెళ్లి పత్రికల పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్స్ను క్రియేట్ చేసి పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి ఆహ్వాన పత్రికల పేరిట ఇలాంటి మెసేజ్లు వస్తే వాటిలోని లింక్లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి ఫైల్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవడంతోపాటు మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల జాబితా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. దీంతో ఫోన్ను హ్యాక్ చేసి వారి చేతుల్లోకి తీసుకుంటారని, తర్వాత మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టడం..డబ్బుల కోసం డిమాండ్ చేయడం వంటి ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. వాట్సాప్తోపాటు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఏపీకే ఫైల్స్ వేటిపైనా క్లిక్ చేయవద్దని సూచించారు. ఒక వేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. -
అయ్యప్పభక్తులకు గుడ్న్యూస్ : వాట్సాప్లో శబరిమల సమాచారం
ఇకపై శబరిమల వెళ్లే యాత్రికులు ఆలయ సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయాస పడనక్కరలేదు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్లో 6238998000 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు... క్షణాల్లో శబరిమల ఆలయ సమాచారం అందుతుంది.‘స్వామి చాట్బాట్’ పేరిట అందించే ఈ సేవలను ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఇంగ్లిష్, హిందీ, మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అందించనున్నట్టు పథానంతిట్ట జిల్లా అధికార యంత్రాంగం తెలియజేసింది. ఆలయ వేళలు, ప్రసాద లభ్యత, పూజ వేళలు, శబరిమల చుట్టుపక్కల ఉండే ఇతర ఆలయాల వివరాలు, దగ్గరలో ఉండే రైళ్లు, బస్సులు, ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ చాట్బోట్ ద్వారా తెలుసుకోవచ్చునని దేవస్థానం అధికారులు తెలియజేశారు -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్ఫామ్గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
డయాబెటిస్ వాట్సాప్ చానల్
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకూ మధుమేహం సమస్య పెరుగుతోందని, అదే విధంగా ఈ వ్యాధిపై అపోహలు కూడా పెరుగుతున్నాయని కాంటినెంటల్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అపోహలను దూరం చేసేందుకు, డయాబెటిస్పై అవగాహన కలి్పంచేందుకు.. కాంటినెంటల్ ఆస్పత్రి దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ప్రత్యేక చానల్ రూపొందించినట్టు తెలిపారు. గురువారం ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా ఈ చానల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చానల్ ద్వారా వ్యక్తిగతంగా పౌష్టికాహార చిట్కాలు, నిపుణుల సూచనలు, డయాబెటిస్ కేర్కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని గురు ఎన్ రెడ్డి చెప్పారు.30 ఏళ్ల క్రితం మహిళల్లో 12 శాతం ఉన్న డయాబెటిస్ ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని, పురుషుల్లో 11 శాతం ఉండగా 23 శాతానికి పెరిగిందని వివరించారు. చాలామందికి కనీసం డయాబెటిస్ వచి్చనట్టు (సైలెంట్ డయాబెటిస్) తెలియట్లేదని వెల్లడించారు. దీన్ని సరిగ్గా అంచనా వేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే ఆరోగ్యకరమైన జీవన విధానంతో దీనిని అధిగమించవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చని గురు ఎన్ రెడ్డి చెప్పారు. వాట్సాప్ చానల్లో డయాబెటాలజిస్టుతో పాటు న్యూట్రిషనిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు సహా అనేక మంది వైద్య నిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. -
85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయం
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సెప్టెంబర్ నెలలో భారతదేశంలోని 85 లక్షల కంటే ఎక్కువ ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. ఇందులో సుమారు 16,58,000 ఖాతాలపైన ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఐటీ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకుంది.భారతదేశంలో సుమారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నియమాలకు ఉల్లంఘించిన ఖాతాదారుల అకౌంట్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు నిషేధిస్తూ ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో భారీగా సంఖ్యలో ఖాతాలను నిషేధించింది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేయడం.. వంటి చర్యలకు పాల్పడిన యూజర్లపైన వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. గత ఆగస్టు నెలలో కూడా వాట్సాప్ 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేదించింది. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కూడా నియమాలను అతిక్రమించిన వారి ఖాతాలను వాట్సాప్ తొలగించనున్నట్లు స్పష్టమవుతోంది. -
లింక్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్ఫోన్లోని వాట్సాప్కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్వర్డ్ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్లు వస్తున్నాయి.హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్ల లింక్లను వాట్సాప్కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్ల కింద ఉన్న బగ్ లింక్ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరుఎక్కువగా గ్రూపులకు... మన మొబైల్ నంబర్కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్నెట్, డార్క్నెట్ ఆధారంగా వాట్సాప్లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ తరహా మెసేజ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు. అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్లు, బగ్స్ లింక్లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు... మన సెల్ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్ను రీసెట్ కొట్టాలి. ఫోన్లోని ఈ–మెయిల్, పాస్వర్డ్లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. ఫోన్పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్లు అన్ ఇన్స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్కు ఎటువంటి మెసేజ్లు, లింక్లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్కు సంబంధించి పత్తి పంట మార్కెట్లోకి వస్తోంది. రైతులు పత్తిని విక్రయించాలంటే గతంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించేవారు. అయితే ఈ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీసీఐ అధికారులు తాజాగా ‘వాట్సాప్ టాప్ యాప్’ను రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు దీనిని అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీఐ కేంద్రాల కొనుగోళ్ల తాజా వివరాలను యాప్లో అందుబాటులో ఉంచుతారు. దీంతో రైతు ఎప్పు డు సరుకు తీసుకెళ్లాలనే సమాచారం నుంచి నగదు జమ వరకు సకల వివరాలు తెలుసుకోవచ్చు. ఏ రోజు, ఎప్పుడు మార్కెట్కు వెళ్లాలో నిర్ణయించుకుని, రైతులు దీని ద్వారానే స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది.మార్కెట్, తేదీ, సమయం నిర్దేశించుకొని స్లాట్ను బుక్ చేసుకొని ఆ ప్రకారం మార్కెట్కు వెళితే సరిపోతుంది. కాగా, స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని మాత్రం తొలుత పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ మార్కెట్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్లాట్ బుకింగ్ సదుపాయం లేని జిల్లాల్లోని మార్కెట్లలో కొనుగోలు ప్రక్రియ, రద్దీ తదితర వివరాలను రైతులు తెలుసుకునేందుకు వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 8897281111 నంబర్ వాట్సాప్ ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ పెడితే సమగ్ర సమాచారం మనముందు ఉంటుంది. అలాగే అత్యంత ముఖ్యమైనది.. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అమ్మిన పంట మొత్తం రైతు ఖాతాలో జమ అయ్యేవరకు దీని ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం కల్పించారు. 21.46 లక్షల మంది రైతుల వివరాలు నిక్షిప్తంవాట్సాప్ యాప్లో రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఆ యాప్లో 21,46,263 మంది పత్తి రైతుల వివరాలు ఉన్నాయి. కాగా, వ్యవసాయ శాఖ వద్ద వివరాలు నమోదు చేసుకున్న రైతులకే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. రైతులు తమ వద్ద ఎంత పత్తి నిల్వ ఉంది? అనే వివరాలను తొలుత యాప్లో నమోదు చేయాలి. అప్పుడు స్థానిక సీసీఐ/జిన్నింగు మిల్లు పరిధిలో కొనుగోలుకు ఎంత సమయం పడుతుందో సమాచారం అందుతుంది. సీరియల్లో ఉన్న వాహనాల సంఖ్య, లోడింగ్, అన్లోడింగ్ వివరాలు కనిపిస్తాయి. పంటను విక్రయించిన తర్వాత తక్పట్టీ వివరాలు, ధరల వివరాలు, నగదు ఎన్ని రోజుల్లో జమ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ‘యాప్’లో వివరాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో రైతు తన పంటను ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకుని వెంటనే అమ్ముకునే సౌలభ్యం కలుగుతుంది.వాట్సాప్ యాప్తో రైతులకు ప్రయోజనంవాట్సాప్ యాప్ ద్వారా పత్తి రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. దీనిని ఈ ఏడాదే అందుబాటులోకి తీసుకువచ్చాం. నిర్మల్ మార్కెట్లోనైతే స్లాట్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించాం. దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. రైతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. – లక్ష్మణుడు, అడిషనల్ డైరెక్టర్, మార్కెటింగ్శాఖ -
ఉద్యోగులను తొలగిస్తున్న మెటా
టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్కు ప్రత్యర్థి కాదా?కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది. -
కి‘లేడీ’ పనిమనిషి.. చోరీ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి..
ముంబై: ఓ పని మనిషి.. తాను పనిచేసే ఓనర్లో ఇంట్లో చోరీ చేసి పరార్ అయ్యారు. దొంగిలించిన కొత్త వాచ్, చీర ధరించిన ఫొటోలు సదరు పని మనిషి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోగా. ఓనర్ దంపతులకు తెలిసిపోయింది. దీంతో పనిమనిషి రూపాలి సింగ్పై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కండివ్లిలోని ఓ దంపతుల ఇంట్లో.. రూపాలి సింగ్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ జంట ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారం చేస్తున్నారు. వారి ఇంట్లో రూపాలి పనిమనిషిగా చేరారు.ఇక.. ఇంటిని శుభ్రం చేయటం, వారి పిల్లలను చూసుకోవడం ఆమె పని. అక్టోబరు 7న రూపాలి.. తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారని పని మానేసి.. తన సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు.అయితే.. ఓనర్ భార్య దసరాకు కొత్త చీర కట్టుకోవాలని భావించించారు. ఆమెకు కొత్త చీర అల్మారాలో కనిపించలేదు. చీర ఎక్కడ ఉందని.. ఆమె పనిమనిషి రూపాలికి ఫోన్ చేసి కనుకున్నారు. తాను ఇస్త్రీ చేసి అల్మారాలో ఉంచానని రూపాలి చెప్పారు. ఇంట్లో ఎక్కడ చూసినా ఓనర్ భార్యకు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఓనర్ దంపతులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యజమాని ఇంటి నుంచి పనిమనిషి రూపాలి.. బ్యాగుల్లో ఏదో తీసుకుని వెళ్తున్నట్లు కనిపించారు. యజమాని భార్య తన వాట్సాప్ను తనిఖీ చేస్తుండగా.. సింగ్ స్టేటస్ చూసి అవాక్కయ్యారు.వాట్సాప్లో స్టేటస్లో పనిమనిషి తన యజమానికి సంబంధించిన వాచ్, దుస్తులను ధరించి కనిపించారు. కొత్త చీర, వాచ్ కాకుండా ఇంట్లో పలు విలువైన వస్తువులు కనిపించలేదు. ఆభరణాలు, వాచ్, చీరలు, సన్ గ్లాసెస్, శాలువా, మేకప్ కిట్, పెర్ఫ్యూమ్లు, పిల్లల బ్యాగ్ కనిపించలేదు. వీటి విలువ సమారు 2.4 లక్షల ఉంటుందని ఓనర్ జంట తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ పనిమనిషి కోసం వెతుకుతున్నారు. -
నచ్చినట్లు చాట్పేజ్.. వాట్సాప్లో కొత్త ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'.. వివిధ డిజైన్లతో కొత్త చాట్ థీమ్లను పొందనుంది. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.వాటప్స్ పరిచయం చేస్తున్న 'థీమ్ చాట్' అనే ఫీచర్ సాయంతో యూజర్లు చాటింగ్కు నచ్చిన థీమ్లను ఎంచుకోవచ్చు. థీమ్ మాత్రమే కాకుండా చాట్ పేజీని కూడా నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలుస్తోంది. చాట్ బబుల్స్, వాల్పేపర్ల రంగులు ఎంచుకున్న థీమ్ను బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్కి మెసేజ్లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్లకు నేరుగా మెసేజ్లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్ల మెసేజ్లు ఒకే ఇన్బాక్స్లో కనిపించే లేదా విడివిడి ఇన్బాక్స్లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
సామాజిక సంక్షేమానికి వాట్సప్ సాయం
భారతీయ వినియోగదారుల జీవితాల్లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తూ నివేదిక విడుదలైంది. ‘ఫాస్ట్ లేన్ టు సోషల్ ఇంపాక్ట్’ పేరుతో వాట్సప్ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సహాయంతో ఈ రిపోర్ట్ను తయారు చేసింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్న చిన్న వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలకు వాట్సప్ ఎలా దోహదపడుతోందో తెలిపింది.ఈ నివేదికపై మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ స్పందిస్తూ..‘వ్యక్తులు, వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించేందుకు వాట్సాప్ కీలక సాధనంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం నుంచి నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిని అందించడం, తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యపై ఆసక్తి పెంచేలా చేయడం వరకు ఎన్నో విధాలుగా వాట్సప్ను వినియోగిస్తున్నారు. సానుకూల సామాజిక మార్పు కోసం ఇదో వేదికగా మారింది. టెక్నాలజీ పరంగా దేశం ఎంతో వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. వాట్సప్ బిజినెస్ యాప్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు జరుగుతోంది. సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇదో సాధనంగా మారింది. చిన్న వ్యాపారులకు గుర్తింపు లభించడంలో వాట్సప్ పాత్ర కీలకం’ అన్నారు.నివేదికలోని వివరాల ప్రకారం.. చిన్న వ్యాపారాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఆన్లైన్లో ఆర్డర్లను సులభంగా స్వీకరించడానికి వాట్సప్ వీలు కల్పిస్తోంది. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతోంది. వ్యాపార పరిధిని విస్తరించడంలో సహాయపడుతోంది. రానున్న రోజుల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ), మెటా సంయుక్తంగా ‘వాట్సప్ సే వ్యాపార్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా వాట్సప్ బిజినెస్ యాప్లో ఒక కోటి మంది వ్యాపారులకు డిజిటల్ శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ మొత్తం 29 రాష్ట్రాల్లో 11 భారతీయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్లో చేరిన 25,000 మంది ప్రతిభ ఉన్న వ్యాపారులకు మెటా స్మాల్ బిజినెస్ అకాడమీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ధ్రువీకరణను అందిస్తారు. ఇది తమ వ్యాపార విస్తరణ కోసం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్టెక్ కంపెనీదేశంలోని అనేక సామాజిక సంక్షేమ సంస్థలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, సానుకూల సామాజిక మార్పు వంటి విభాగాల్లో సమస్యల పరిష్కారాలను అందించడానికి వాట్సాప్ వీలు కల్పించింది. ‘మన్ దేశీ ఫౌండేషన్’ అనే సంస్థ తన వాట్సప్ చాట్బాట్ ద్వారా లక్ష మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక అక్షరాస్యతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా ఆ సంస్థ 15,000 మంది మహిళలకు డిజిటల్ శిక్షణ ఇచ్చింది. వారిలో 85% మంది గ్రామీణ లబ్ధిదారులే కావడం విశేషం. వాట్సప్ గ్రూప్ల్లో సమాచారం అందించి పేదరికాన్ని తగ్గించడం, గర్భిణీ స్త్రీలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ, మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, సమగ్ర పౌర సేవలపై అవగాహన, డిజిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం..వంటి ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నట్లు నివేదిక తెలియజేసింది. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్ఫోన్కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్లతో బ్లాక్మెయిలింగ్లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి. -
క్లిక్ చేయొద్దు.. బ్లాక్ చేయండి
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడు తప్పక వాడే మొబైల్ యాప్ వాట్సాప్. ఇప్పుడు ఈ యాప్ను వేదికగా చేసుకుని సైబర్నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ వాట్సాప్లకు కొన్ని సందేశాలు పంపుతున్నారు. అందులోని లింక్పై క్లిక్ చేసి, తాము చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తిని రూ.5.4 కోట్లు మోసగించిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇటీవలే అరెస్టు చేశారు. అయితే, పెట్టుబడుల పేరిట వాట్సాప్లో వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. షేర్మార్కెట్ పెట్టుబడులతోపాటు ఇతర యాప్లకు సంబంధించి వచ్చే లింక్లపైనా క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.అనుమానాస్పద మెసేజ్లు వాట్సాప్కు వస్తే వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేయాలని తెలిపారు. సైబర్నేరగాళ్ల నుంచి తరచూ ఈ తరహా మెసేజ్లు వస్తుంటే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టికి ఆ నంబర్లు తీసుకురావాలని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ నంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, సైబర్ నేరగాళ్ల చేతిలో మరికొందరు మోసపోకుండా కాపాడవచ్చని వారు వెల్లడించారు. -
‘సాయం చేయరూ’... వాట్సప్పై దర్శన్?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్ ఏం చేయాలో దిక్కుతోచక అనేక తప్పులు చేశాడు. అవన్నీ విచారణలో వెలుగు చూస్తున్నాయి. కేసు తనపైకి ఉండేందుకు ముగ్గురు రౌడీలకు రూ.30 లక్షలు ఇవ్వడం మొదలుకుని అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలుగా మారి ఆయన మెడకు చుట్టుకున్నాయి. రేణుకాస్వామి హత్య అనంతరం... కేసు నుంచి బయటపడేయాలని దర్శన్ పలువురు రాజకీయ నేతలను వాట్సాప్ ద్వారా కోరినట్టు పోలీసులు గుర్తించారు. దర్శన్ను అరెస్టు చేశాక అతని మొబైల్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ కాల్స్మెసేజెస్ రిట్రీవ్ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. -
భారత్లో వాట్సాప్ నిలిచిపోతుందా? ఐటీ మంత్రి ఏమన్నారంటే
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ భారతదేశంలో తన కార్యాలపాలను నిలిపి వేస్తుందా? అని కాంగ్రెస్ సభ్యుడు 'వివేక్ తంఖా' అడిగిన ప్రశ్నకు.. సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' సమాధానమిచ్చారు.వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా దేశంలో తమ సేవలను మూసివేసే యోచనల గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయలేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల కారణంగా వాట్సాప్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోందా అనే ప్రశ్నకు వివరణాత్మక సమాధానం ఇచ్చారు.ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ తన సేవలను భారతదేశంలో నిలిపివేయనున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం చెప్పినట్లు ఎన్క్రిప్షన్ను ఉల్లంఘిస్తే యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని, ఇది యాప్ మీద ప్రజలకున్న నమ్మకం పోతుందని వాట్సాప్ తరపు న్యాయవాది తేజస్ కరియా కోర్టుకు తెలిపారు.కొత్త నియమాలు గోప్యతకు భంగం కలిగిస్తాయని ఇప్పటికే వాట్సాప్, మెటా సంస్థలు పలుమార్లు ఆరోపించాయి. ఫిబ్రవరి 2021లో ప్రవేశపెట్టిన ఈ నియమాలు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ను కలిగి ఉంటాయి. హానికరమైన కంటెంట్ను ఎదుర్కోవడానికి ఈ నియమాలు అవసరమైనవని పేర్కొంటూ భారత ప్రభుత్వం ఈ నిబంధనలను సమర్థిస్తుంది.వాట్సాప్ భారతదేశాన్ని విడిచిపెట్టినట్లయితే అది కంపెనీని.. దాని 400 మిలియన్ల మంది వినియోగదారులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో చాలా మంది వ్యక్తులు మరియు వ్యాపారాలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్పై ఆధారపడి ఉన్నాయి. వాట్సాప్ ఇండియాను వీడితే ఇలాంటి కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించవచ్చు.. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని పలువురు భావిస్తున్నారు. -
వాట్సాప్ ద్వారా ఐటీ రిటర్న్స్!! ఎలాగో చూడండి..
ITR Filing 2024: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలో హడావుడిగా ఉన్నారు. అయితే ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీస్ను అందించే ‘క్లియర్ ట్యాక్స్’ (ClearTax) వాట్సాప్ని ఉపయోగించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టింది.ఈ కొత్త సర్వీస్ సరళమైన, చాట్-ఆధారిత అనుభవాన్ని అందించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. తక్కువ-ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఐటీఆర్1, ఐటీఆర్4 ఫారమ్లకు మద్దతు ఇస్తుంది. ఇది పన్ను దాఖలును సులభతరం చేస్తుంది. ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది.ఈ సర్వీస్ ముఖ్యమైన ఫీచర్లు» ఇది ప్రస్తుతం ఐటీఆర్1, ఐటీఆర్4 ఫారమ్లకు మద్దతు ఇస్తోంది.» ఇంగ్లీష్, హిందీ, కన్నడతో సహా 10 భాషల్లో అందుబాటులో ఉంది.» ప్రతిదీ వాట్సాప్లోనే పూర్తి చేసేలా భద్రతతో కూడిన చెల్లింపు వ్యవస్థ.» అవసరమైన సమాచారాన్ని ఇమేజ్లు, ఆడియో, టెక్ట్స్ ద్వారా సమర్పించవచ్చు.» ఏఐ వ్యవస్థ ప్రతి యాజర్కు ఉత్తమమైన పన్ను విధానాన్ని ఎంపిక చేస్తుంది. వారికి మరింత ఆదా చేయడంలో సహాయపడుతుంది.ఉపయోగించండి ఇలా..» క్లియర్ ట్యాక్స్ వాట్సాప్ నంబర్ను సేవ్ చేసి, "హాయ్" అని టైప్ చేయడం ద్వారా సంభాషణను ప్రారంభించండి.» మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.» అడిగినప్పుడు మీ పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.» అవసరమైన పత్రాలను సులభంగా సమర్పించడానికి చిత్రాలను అప్లోడ్ చేయండి లేదా ఆడియో/టెక్స్ట్ సందేశాలను పంపండి.» ఐటీఆర్1 లేదా ఐటీఆర్4 ఫారమ్లను దశల వారీగా పూరించడానికి ఏఐ బాట్ సూచనలను అనుసరించండి.» ముందుగా నింపిన ఫారమ్ను సమీక్షించండి, ఏవైనా అవసరమైన మార్పులు చేయండి. మీ వివరాలను నిర్ధారించండి.» వాట్సాప్ ద్వారా నేరుగా సురక్షిత చెల్లింపుతో ప్రక్రియను పూర్తి చేయండి.» సబ్మిట్ తర్వాత, మీరు మీ రసీదు సంఖ్యతో నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు. -
+92 నంబర్తో కాలింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు దారులు వెతుకుతున్నారు. వాట్సాప్ డీపీగా పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలను పెట్టుకుని, ఆ నంబర్ల నుంచి పలువురికి వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపుల వీడియో ఒకటి డీజీపీ జితేందర్ తన అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే నమ్మి మోస పోకుండా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.తెలంగాణ సీఎస్, డీజీపీ పేరిట గతంలోనూ వాట్సాప్ డీపీలతో డబ్బులు డిమాండ్⇒ ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫొటోను వాట్సాప్డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు..సీఎస్ పేరిట నలుగురు వ్యక్తులకు మెసేజ్లు పెట్టారు. అందులో రంజాన్ గిప్ట్ కూపన్లు పంపాలని కోరడంతో అనుమానాస్పదంగా భావించిన సదరు వ్యక్తులు సీఎస్ దృష్టికి తెచ్చారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.⇒ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా డీజీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఫొటోను డీపీగా పెట్టిన నంబర్తో ఈ ఏడాది మే 21న ఓ వ్యాపారికి వాట్సాప్ కాల్ వెళ్లింది. ‘మీ అమ్మాయిని నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఆమెను విడుదల చేయాలంటే రూ.50 వేలు మొబైల్ పేమెంట్ ద్వారా పంపండి అని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.⇒ ఈ ఏడాది మే 23న వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి కొందరు సైబర్నేరగాళ్లు ఆమె పేరిట డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ సిబ్బందితో పాటు కొందరు ప్రజలకు వాట్సాప్ మెసేజ్లు పంపారు. విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు..ప్రజలు, అధికారులు ఎవరూ అలాంటి మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు.+92 నంబర్తో వస్తే అది మోసం.. మీ వాట్సాప్కు పోలీసుల పేరిట బెదిరింపు కాల్స్ వస్తే అందులో ఉన్న నంబర్ ఏ సంఖ్యతో మొదలైందో గమనించాలి. ఒకవేళ అది +92 నంబర్తో వస్తే.. పక్కాగా అది సైబర్ నేరగాళ్లపనే అని గుర్తించాలి. వాస్తవానికి +92 కోడ్ పాకి స్తాన్ది. చాలావరకు ఈ నంబర్తో కాల్స్ పాకి స్తాన్ నుంచే వస్తాయని, కొన్నిసార్లు కంప్యూటర్ ప్రోగ్రామ్లతోనూ ఇలాంటికాల్స్ జనరేట్ చేయవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. అనుమానం వస్తే సంచార్ సాథీ పోర్టల్ దృష్టికి తేవాలి.. మీకు తెలియని నంబర్ నుంచి +92తో ప్రారంభమయ్యే కాల్ వచి్చ.. అందులో అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత వివరాలు.. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ లాగిన్ వివరాలు లేదా ఓటీపీలు.. ఏవైనా అడిగితే చెప్పవద్దు. అలాంటి అనుమానాస్పద నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్ (ఠీఠీఠీ. ట్చnఛిజ్చిట ట్చ్చ్టజిజీ.జౌఠి.జీn)‘చక్షు–రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్’లో మోసపూరిత సమాచారాన్ని తెలియజేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రజలకు సూచించింది. ఫేక్ వాట్సాప్కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ అధికారుల ఫొటోలను డీపీగా పెట్టుకు న్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించి న వాళ్లు పోలీసులకు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – జితేందర్, డీజీపీ, తెలంగాణ -
వాట్సాప్ బిజినెస్ కోసం ఏఐ ఫీచర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న వ్యాపారాలను కొనుగోలుదారులకు మరింత చేరువ చేసే దిశగా వాట్సాప్ బిజినెస్ యాప్లో కృత్రిమ మేథ (ఏఐ) ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు మెటా బిజినెస్ మెసేజింగ్ విభాగం డైరెక్టర్ రవి గర్గ్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరులోగా ఏఐ ఏజెంట్, అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి రాగలవని ఆయన వివరించారు. వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు .. కంటెంట్, యాడ్స్ మొదలైనవి క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. క్యాటలాగ్ రూపకల్పన నుంచి ఆర్డర్లు, చెల్లింపుల వరకు వాట్సాప్ ద్వారా లావాదేవీల నిర్వహణను సులభతరం చేసేందుకు పలు సంస్థలతో చేతులు కలుపుతున్నట్లు గర్గ్ చెప్పారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 6 మెట్రోలతో జట్టు కట్టామని, ప్రస్తుతం నెలకు సుమారు 20 లక్షల మెట్రో రైలు టికెట్ల కొనుగోలు వాట్సాప్ ద్వారా జరుగుతోందని తెలిపారు. బస్సు టికెట్లకు సంబంధించి టీఎస్ఆర్టీసీ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నామని వివరించారు. వాట్సాప్ బిజినెస్పై అవగాహన కలి్పంచేందుకు ప్రచారం, సీఏఐటీ వంటి పరిశ్రమ సమాఖ్యలతో శిక్షణ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహిస్తున్నట్లు గర్గ్ చెప్పారు. -
నారా లోకేష్ వాట్సాప్ నెంబర్ బ్లాక్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బాబు వాట్సాప్ బ్లాక్ అయ్యింది. దీంతో.. సమస్యలు ఏవైనా ఉంటే తనకు వాట్సాప్ చేయొద్దని.. ఒకవేళ తనదాకా తీసుకురావాలనుకుంటే మాత్రం మెయిల్ చేయాలని కోరుతున్నారాయన.నారా లోకేష్కు వాట్సాప్ చేస్తే చాటూ.. మీ సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే హఠాత్తుగా ఇవాళ ఆయన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. మీ సమస్యలు వాట్సప్ చేయొద్దంటూ మెసేజ్ ఉంచారు. అయితే.. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన "హలో లోకేష్"…— Lokesh Nara (@naralokesh) July 11, 2024జనం కంటే.. టీడీపీ శ్రేణుల నుంచే ఎక్కువగా సందేశాలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో విసుగుచెంది ఆయన ఆ నెంబర్ను బ్లాక్ చేసి ఉండొచ్చనే చర్చా నెట్టింట నడుస్తోంది. బ్లాక్ చేశాక ఆ నెంబర్కు వాట్సాప్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం, ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కితే నవ్వులపాలు అవ్వొచ్చనే ఉద్దేశంతో లోకేష్ ఎక్స్లో సదరు సందేశం ఉంచినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. -
రంగు మారనున్న వాట్సాప్! త్వరలో అప్డేట్
వాట్సాప్ (WhatsApp) ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్లు త్వరలో ఆండ్రాయిడ్లో రంగు మారనున్నాయి. వాట్సాప్ ఇటీవలి బీటా వెర్షన్లో దీనికి సంబంధించిన మార్పును ఓ ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ఇది యూజర్లందరికీ త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.వాట్సాప్ ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్లు మెటాకు చెందిన ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ యాప్లైన ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్బుక్ (Facebook)లో ఉండే చెక్ మార్క్లను పోలి ఉండనున్నాయి. ఫీచర్ ట్రాకర్ WABetaInfo పోస్ట్లో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా వెర్షన్ను డౌన్లోడ్ చేసిన టెస్టర్లకు ఇప్పటికే కొత్త బ్లూ చెక్మార్క్ అందుబాటులో ఉందని పేర్కొంది .వాట్సాప్లో రానున్న కొత్త కలర్ స్కీమ్ కంపెనీ యాప్లలో ఏకరూపతను మెరుగుపరుస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసిన యూజర్లకు వారు ఎంగేజ్ చేస్తున్న ఎంటిటీ ప్రామాణికమైనదో కాదో సులభంగా గుర్తించేలా చేస్తుంది.రీడిజైన్ చేసిన వెరిఫికేషన్ టిక్ ప్రస్తుతం ఆండ్రాయిడ్లోని వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో iOSలోని టెస్టర్లకు కూడా అందుబాటులోకి రావచ్చు. అంతిమంగా వాట్సాప్ వెబ్, డెస్క్టాప్తో సహా అన్ని ప్లాట్ఫామ్ల కోసం స్థిరమైన అప్డేట్ ఛానెల్లోకి వస్తుంది. -
ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వాట్సాప్ ప్రజల జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా వ్యక్తిగత అవసరాల కోసం, వ్యాపార కార్యకలాపాల కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలో 35 మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. దీనికి కారణం ఏంటి? జాబితాలో ఏఏ ఫోన్లు ఉన్నాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. అయితే కొన్ని స్మార్ట్ఫోన్స్ మాత్రం ఈ అప్డేట్స్ పొందలేవు. ఇందులో ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్, యాపిల్ ఐఫోన్ ఐఓఎస్ 12 వెర్షన్ మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది.జాబితాలోని ఫోన్లు►శాంసంగ్: గ్యాలక్సీ ఏస్ ప్లస్, గ్యాలక్సీ కోర్, గ్యాలక్సీ ఎక్స్ప్రెస్2, గ్యాలక్సీ గ్రాండ్, గ్యాలక్సీ నోట్ 3, గ్యాలక్సీ ఎస్3 మినీ, గ్యాలక్సీ ఎస్4 యాక్టీవ్, గ్యాలక్సీ ఎస్4 మినీ, గ్యాలక్సీ ఎస్4 జూమ్►మోటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్►యాపిల్: ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ►హువావే: అసెండ్ పీ6 ఎస్, అసెండ్ పీ6 ఎస్, అసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625►లెనోవో: లెనోవా 46600, లెనోవా ఏ8580, హువావే ఏ85870►సోనీ: ఎక్స్పీరియా జెడ్1, ఎక్స్పీరియా ఈ3►ఎల్జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7 -
వాట్సాప్లో మెట్రో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఈజీగా..!
వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని నాగపూర్కు విస్తరిస్తోంది. ప్రయాణికులకు మెట్రో టికెట్లను ఎక్కడి నుంచైనా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని ఇస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణేలోని మెట్రోలకు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది.వాట్సప్లో మెట్రో టికెట్ బుక్ చేసుకోండిలా..వాట్సప్లో మెట్రో టికెట్ బుకింగ్ సేవలు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు 8624888568 (నాగపూర్ మెట్రో), 8341146468 (హైదరాబాద్ మెట్రో) నంబర్కు 'Hi' అని పంపాలి లేదా ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఈ సులభమైన చాట్బాట్ టికెట్ బుకింగ్ను సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తుంది. అవసరమైన ప్రయాణ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ ఇంటర్ఫేస్ ద్వారా అందిస్తుంది.ఇందులో క్విక్ పర్చేజ్ ఆప్షన్ కూడా ఉంది. తరచుగా ప్రయాణం చేసేవారి కోసం దీన్ని రూపొందించారు. ఈ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే రూట్లను సేవ్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను ఎంచుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. -
వాట్సాప్లో మూడు అదిరిపోయే ఫీచర్లు
వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అప్డేటెడ్ ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా ఆడియోతో స్క్రీన్ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ అనే మూడు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది.ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా తమ స్క్రీన్ & ఆడియోను ఏకకాలంలో పంచుకునేందుకు వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ అనేది గతంలోనే వాట్సాప్ పరిచయం చేసినప్పటికీ.. ఇప్పుడు మెరుగైన ఆడియో సఫోర్ట్ జోడించింది.వీడియో కాల్లలో పెరిగిన పార్టిసిపెంట్ కెపాసిటీ: ఇప్పటి వరకు ఒక మీటింగ్ అంటే జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ఉపయోగించి ఉంటారు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది వీడియో కాల్లో పాల్గొనవచ్చు.స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్: కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయడం కోసం స్మార్ట్ఫోన్ యాప్లో కష్టంగా అనిపించినప్పటికీ, మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్ ఫీచర్ను కూడా జోడించింది.వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరచడం మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్స్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ తప్పకుండా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. -
వాట్సప్లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
వాట్సప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్ ఓపెన్ చేయగానే వాట్సప్ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్ యాజమాన్యం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ను ఎంపిక చేసిన బీటా వెర్షన్ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్గా వాట్సప్కు వచ్చే మెసేజ్లకు నోటిఫికేషన్ వస్తుంది. చదవని వాట్సప్ మెసేజ్లు వాటంతట అవే డిలీట్ అవ్వనున్నాయి. -
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు. -
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో అప్డేట్తో యూజర్లను అలరించింది. నిన్న మొన్నటి వరకు వాట్సప్ యాప్ మొత్తం బ్లూ కలర్ థీమ్లో ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో గ్రీన్ ఇంటర్ ఫేస్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రశాంతత, స్థిరత్వం, ఇన్ప్పిరేషన్కు మారుపేరైన బ్లూ కలర్ను స్థానంలో గ్రీన్ కలర్ ఇంటర్ ఫేస్ను ఎందుకు అందుబాటులోకి తెచ్చిందా అని యూజర్లు చర్చించుకుంటున్నారు.వాట్సప్ గ్రీన్ కలర్లోకి ఎందుకు మారింది?వాట్సప్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ యూజర్లకు ఆధునిక, కొత్త అనుభవాన్నిఅందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా వినియోగం సైతం మరింత సులభతరం కానుందన్నారు. ఇక, ఇంటర్ పేస్, రంగులు, చిహ్నాల రంగుల్ని సైతం మార్చినట్లు వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. రంగులు మార్చడానికి కారణం?రంగు మార్పు కంటే వాట్సప్ వినియోగించే యూజర్ ఎక్స్పీరియన్స్ను మరింత మెరుగు పరిచేందుకు యాప్లో మార్పులు చేపట్టినట్లు వాట్సప్ వెల్లడించింది. దీంతో పాటు వాట్సప్ తన మెసేజ్ కీబోర్డ్లలో కొన్ని పదాలను క్యాపిటలైజ్ చేసింది. కొంతమంది వినియోగదారులు ఆన్లైన్, టైపింగ్ మొదటి అక్షరాలను క్యాపిటలైజ్ చేసిన మార్పును గమనించారు. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ గమనించిన ఈ మార్పు ఆన్లైన్లో ముఖ్యమైన చర్చలకు దారితీసింది. -
ఒత్తిడి చేస్తే భారత్ నుండి వెళ్ళిపోతాం !..వాట్సా ప్ వార్నింగ్
-
భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.ఈ సందర్భంగా వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ ప్లాట్ఫాంలో మెసేజ్లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.ఎన్క్రిప్షన్ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్,మెటా ఆరోపించాయి.ముఖ్యంగా మెసేజ్ సెండర్ వివరాలను ట్రేస్ చేసే నిబంధనను సవరించాలని కోరాయి. విచారణ సందర్భంగా వాట్సాప్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మెసేజ్ల గోప్యత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని మేం అమలు చేస్తున్నాం.సీక్రెసీ(రహస్యభద్రత) ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల్లోని 4(2) సెక్షన్తో మేం ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు గనుక చెబితే మేం ఇండియా నుంచి వెళ్లిపోతాం’అని కోర్టుకు స్పష్టం చేశారు. -
కేంద్రం నిబంధనలకు ‘నో’ చెప్పిన వాట్సప్
మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ మెసేజ్లకు సంబంధించి ఎన్క్రిప్షన్ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని బ్రేక్ చేయాలని ఒత్తిడిచేస్తే భారత్లో కార్యకలాపాలను రద్దు చేసేందుకైనా వెనుకాడబోదని సంస్థ తరఫు న్యాయవాది తేజస్ కరియా దిల్లీ హైకోర్టుకు తెలిపారు. వినియోగదారుల గోప్యతకు పెద్దపీటవేస్తూ మెసేజ్లను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ చేస్తున్నందునే ప్రజలు ఈ యాప్ను ఉపయోగిస్తున్నారని కరియా తెలిపారు.2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనల ప్రకారం.. మెసేజింగ్ యాప్ చాట్లను ట్రేస్ చేసేలా, వాటిని మొదటగా ఎవరు పంపించారో గుర్తించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సప్ మాతృసంస్థ అయిన ఫేస్బుక్ ఇంక్ చేసిన పిటిషన్లను హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనానికి కరియా తన వాదనలు వినిపించారు. కొత్త ఐటీ నిబంధనలు పాటించేలా వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లేలా ఒత్తిడి చేస్తే వాట్సప్ ఇండియా నుంచి వైదొలుగుతుందన్నారు. ప్రస్తుతం యూజర్లు పంపుతున్న మెసేజ్ల్లో ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్ట్ విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా కొన్నిమెసేజ్లు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియేజేసేలా ప్రభుత్వ నిబంధనలున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ కోర్టులో వాట్సప్ తరఫు వాదనలు వినిపించారు.వైరల్ అవుతున్న మెసేజ్లతోపాటు వ్యక్తిగతంగా, గ్రూప్లో షేర్ చేస్తున్న మెసేజ్ల మూలకర్తలను గుర్తించాలంటే సందేశాలను డీక్రిప్ట్ చేయాల్సి ఉంటుందని కరియా అన్నారు. లక్షల సందేశాలను చాలా ఏళ్లపాటు డేటాబేస్లో అట్టేపెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించాలని గమనించిన ధర్మాసనం..ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అని ప్రశ్నించింది. దాంతో కరియా స్పందిస్తూ ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి నియమం లేదని బదులిచ్చారు.ఇదిలావుండగా, మతపరమైన హింస వంటి కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన కంటెంట్ ప్రసారం అవుతున్నపుడు ప్రభుత్వ నియమం చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్రం తరఫు న్యాయవాది అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. ఐటీ నిబంధనల్లో పలు అంశాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని ఇతర పిటిషన్ల విచారణను ఆగస్టు 14కు షెడ్యుల్ చేయాలని బెంచ్ ఆదేశించింది.ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ని కేంద్రం ఫిబ్రవరి 25, 2021న ప్రకటించింది. ఈ నిబంధనల వల్ల ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!మార్చి 22న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ని సవాలు చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కర్ణాటక, మద్రాస్, కలకత్తా, కేరళ, ముంబయి సహా వివిధ హైకోర్టుల్లో ఈ సమస్యపై అనేక పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. -
నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్
మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ తన వినియోగదారులకు నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్ ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్, ఇన్-యాప్ డయలర్తో సహా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్కు సంబంధించి ఇప్పటికే బీటా వెర్షన్లో పరీక్షలు నిర్వహిస్తోంది.యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ప్రస్తుతం వాట్సప్లో ఫైల్ షేర్ చేయడం కుదరదు. కానీ కొత్తగా తీసుకురాబోతున్న ఫీచర్తో ఇది సాధ్యం అవుతుంది. సమీపంలోని వాట్సప్ యూజర్లతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్లను షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు. ఫైల్ షేరింగ్ సేవలకు అవసరమైన డిస్కవరీ సెర్చ్ని ప్రారంభించడానికి వినియోగదారులు వాట్సప్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ గూగుల్కు చెందిన క్విక్ షేర్, యాపిల్లోని ఎయిర్డ్రాప్ మాదిరి పనిచేయనుంది. లోకల్ నెట్వర్క్ ద్వారా ఫైల్లను పంపవచ్చు. ఇందులో ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేపుడు భద్రత కారణంగా సందేశాల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతాయి. ఇన్-యాప్ డయలర్వాట్సప్ ఇన్-యాప్ కాల్ డయలర్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంటాక్ట్ లిస్ట్లో సేవ్చేయని నంబర్కు నేరుగా వాట్సప్కాల్ చేయడం కుదరదు. కానీ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్తో నంబర్ సేవ్లో లేకపోయినా నేరుగా వాట్సప్లో కాల్ చేసేలా, మెసేజ్ చేసేలా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫీచర్కు సంబంధించి కంపెనీ చేస్తున్న కార్యకలాపాలు ఏ దశలో ఉన్నాయో స్పష్టంగా తెలియరాలేదు. -
WhatsApp Chat Filters: వాట్సాప్లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి.తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇదే ఫీచర్ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్లో యాక్టివ్గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఒకేనెలలో 76 లక్షల ఖాతాలు తొలగించిన వాట్సప్.. కారణం..
మెటా ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారులకు చెందిన కొన్ని ఖాతాలను తొలగించినట్లు ప్రకటించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన, వాట్సప్ దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఏకంగా 76 లక్షల ఖాతాలను రద్దు చేసినట్లు చెప్పింది. నెలవారీ నివేదికలో భాగంగా ఫిబ్రవరిలో పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ తెలిపింది. ఫిబ్రవరి 1-29 మధ్య 76,28,000 ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. వీటిలో 14,24,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దేశంలో వాట్సప్ యూజర్లు 50 కోట్లకు పైగా ఉన్నారు. ప్రతినెల వాట్సప్కు కొన్ని ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఫిబ్రవరిలో మాత్ర రికార్డు స్థాయిలో 16,618 వినతులు వచ్చాయి. వాటిలో 22 ఖాతాలపై మాత్రమే వాట్సప్ యాక్షన్ తీసుకుంది. మిగతా అకౌంట్లను మాత్రం సమాచార నిబంధనలు ఉల్లఘించిన కారణంగా తొలగించినట్లు చెప్పింది. ఇదిలాఉండగా.. వాట్సప్ జనవరి నెలలో 67,28,000 ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిలో కూడా 13,58,000 ఖాతాలకు యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ అందకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..? -
‘కేజ్రీవాల్కు సంఘీభావం తెలపండి’.. ఇదే హెల్ప్లైన్ నంబర్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు గురువారం కోర్టు మరో నాలుగు రోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్(8297324624)ను ప్రారంభించారు. లిక్కర్ స్కామ్లో అరెస్టైన సీఎం కేజ్రీవాల్కు తమ సందేశం తెలియజేయాలనుకునే కార్యకర్తలు, అభిమానుల కోసం ఈ హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చామని శుక్రవారం తెలిపారు. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా వందల సంఖ్యలో అభిమానాలు కేజ్రీవాల్ కోసం సందేశాలు పంపుతున్నారని అన్నారు. ‘సీఎం కేజ్రీవాల్ను ఎంత ప్రేమిస్తున్నారో మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ సంఘీభావ సందేశం సీఎం కేజ్రీవాల్ వరకు చేరుతుంది. ఆయన వాటన్నింటిని ప్రేమతో చదువుతారు. మీరు ఆప్ పార్టీకి చెందినవారే కానవసరం లేదు. మీరంతా ఆయన త్వరగా బయటకు రావాలని ఆశీర్వదించండి’ అని సునీతా కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. గురువారం వరకు సీఎం కేజ్రీవాల్ ఆరురోజుల కస్టడీ ముగియగా.. రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారన్నారు. వారికి ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. కోర్టు కస్టడీ పొడగించిన అనంతరం.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరోగ్యం సరిగా ఉండటం లేదు. మీ సీఎం అక్కడ వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలి’అని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. ఇక.. మర్చి 21న అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. ఏప్రిల్ 1 వరకు కొనసాగనుంది. -
వాట్సాప్లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యాప్లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్ను అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్లో టైప్చేసి నేరుగా ఏఐ సర్వీస్తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. -
వాట్సప్లో అదిరిపోయే ఫీచర్లు.. ఫీదా అవ్వాల్సిందే
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్.. తాజాగా ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సప్ సమాచారం అందించే ‘వీ బీటా ఇన్ఫో’ తెలిపింది. యూజర్లు ఈ ఏఐ ఫీచర్లను ఉపయోగించి వాట్సప్లో ఇమేజెస్ను ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మార్చడం,రీస్టైల్ చేయడం, ఎక్స్పాండ్ లాంటి పనులన్నీ వాట్సప్ ఇంటర్ ఫేస్ నుంచి చేయొచ్చు. వాట్సప్ పనిచేస్తున్న రెండో ఏఐ టూల్స్ సాయంతో వాట్సప్ సెర్చ్ బార్లో ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవచ్చు. ఆ సమాచారం అంతా ‘మెటా ఏఐ’ అందిస్తుంది. చాట్జీపీటీకి పోటీగా మెసేజింగ్ యాప్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకముందే వాటి గురించి ఫీచర్ ట్రాకర్ వీ బీటా ఇన్ఫో అందిస్తుంది. తాజా వాట్సప్ బీటా అప్డేట్ ఏఐ- పవర్డ్ ఇమేజ్ ఫీచర్తో పాటు ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీటీపీకి పోటీగా వాట్సప్లో మెటా ఏఐని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. -
‘వికసిత్ భారత్’ సందేశాలను ఆపండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. వెంటనే ‘వికసిత్ భారత్’ గంపగుత్త మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపడం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనడమే తమ ఉద్దేశమని ఈసీ పేర్కొంది. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రచారం చేయడం నిషేధమని ఈసీ పేర్కొంది. -
కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ‘వికసిత్ భారత్’ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్కు వికసిత్ భారత్ మెసెజ్లు పంపడం తక్షణమే పేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇకనుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల సందేశాలు పౌరుల ఫోన్లకు వస్తుండటంతో అనేక ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్కు ముందుగానే మెసెజ్లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్వర్క్ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది. కాగా వచ్చే లోక్సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడుతల్లో పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. చదవండి: డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన -
వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే!
మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ తన వినియోగదారులకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఆ కథనాల ప్రకారం..ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం వాట్సప్ స్టేటస్లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. వాట్సప్ స్టేటస్లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను మాత్రమే పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ నిడివిఉన్న వీడియోలను నేరుగా పంపించాల్సిందే. స్టేటస్లో పెట్టుకునేందుకు అవకాశంలేదు. ఒకవేళ అలా స్టేటస్లో పెట్టాలంటే మరో వీడియో కింద మార్చిపెట్టాలి. వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్ అప్డేట్ల సంఖ్య పెరుగుతుంది. దీన్ని పరిష్కరించేందుకు వాట్సప్ తాజా అప్డేట్ను తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఒక నిమిషం నిడివితో ఉన్న వీడియోలను స్టేటస్లో అప్లోడ్ చేసే అవకాశం ఉండబోతుందంటూ సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: 23 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక వడ్డీరేట్లు.. తగ్గింపు ఎప్పుడంటే.. ఇదిలాఉండగా, పేమెంట్స్కు సంబంధించి వాట్సప్ మార్పు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాట్సప్లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్ మెనూలో పేమెంట్స్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్ చాట్లోనే పై భాగంలో క్యూఆర్ కోడ్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
తమ దగ్గర ఉన్నదే...
మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు. ‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’ నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే. ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని! ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం. ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
వాట్సాప్ నుంచి వేరే యాప్లకూ మెసేజ్లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకూ మెసేజ్లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్ను వాట్సాప్లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్తో మెసేజ్ల షేరింగ్లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
వాట్సాప్లో కీలక మార్పు.. ఇక ఆ పని చేయడానికి నో ఛాన్స్
వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేమస్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) ఓ కీలకమైన మార్పుకు సిద్ధమైంది. వినియోగదారు అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నిరోధించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల కాల్ బ్లాకింగ్, చాట్లాక్ వంటి ఫీచర్స్ మాదిరిగానే డిస్ప్లే పిక్చర్ లాక్ అనే ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఇది మనకు తెలియని వ్యక్తులు మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలు వెల్లడి కాలేదు. ఇదీ చదవండి: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? రాబోయే రోజుల్లో మనకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల మనకు నచ్చని వారికి ఫోటో కూడా కనిపించకుండా చేయొచ్చని తెలుస్తోంది. కాబట్టి మనకు నచ్చని వారు మన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోలేరు. డీప్ ఫేక్లు చెలరేగుతున్న సమయంలో కంపెనీ తీసుకువస్తున్న ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
డీప్ఫేక్స్పై పోరు
న్యూఢిల్లీ: డీప్ ఫేక్స్ వంటి కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం మెటా, మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ) జట్టు కట్టాయి. వాస్తవాలను చెక్ చేసేందుకు ఉపయోగపడేలా వాట్సాప్లో ప్రత్యేక హెల్ప్లైన్ను ప్రవేశపెడుతున్నాయి. ఇది 2024 మార్చి నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన చాట్బాట్కు ప్రజలు డీప్ఫేక్ల గురించిన సమాచారాన్ని పంపవచ్చు. ఆ మెసేజీలను విశ్లేíÙంచేందుకు ఎంసీఏ ప్రత్యేక యూనిట్ను (డీఏయూ) ఏర్పాటు చేస్తుంది. ఈ వాట్సాప్ చాట్బాట్ ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరిశ్రమ కూటమి అయిన ఎంసీఏలో 16 సంస్థలకు సభ్యత్వం ఉంది. -
వాట్సప్లో అందరికీ ఉపయోగపడే కొత్త ఫీచర్ వచ్చేసింది!
కోల్కతా కాళీఘాట్లో నివాసం ఉండే ఓ వ్యక్తికి అగంతకుడు ఫోన్ చేశాడు. ‘సార్.. సార్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్యు..థ్యాంక్యు..ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు. ఏం లేదు సార్ మీరు గతంలో ఓ సంస్థలో పెట్టుబడి పెట్టారు కదా . ఆ సంస్థ దివాళా తీసింది. ఆ విషయం మీ క్కూడా తెలుసు. తాజాగా కోర్టు మీ పెట్టుబడిని తిరిగి ఇచ్చేయమని తీర్పిచ్చింది. కోర్టు తీర్పు ఉత్తర్వుల తాలుకూ న్యూస్ పేపర్లలో, టీవీల్లో కూడా వచ్చింది. కావాలంటే మీరే చూడండి.ఈ విషయం చెప్పాలనే మీకు ఫోన్ చేశాను. త్వరలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో జమవుతుంది’ అని ఊరించాడు. కాకపోతే మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాల్ని చెప్పాల్సి ఉంటుందని కోరారు. నమ్మితేనే కదా మోసం చేసేది దీంతో సదరు వ్యక్తి ముందుగా అగంతకుడికి తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాలా? వద్దా? అని కాస్త సంశయించాడు. ఆ తర్వాత.. ఆ ఇస్తే ఏముందిలే మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని మనుసులో అనుకున్నాడు. మొత్తం వివరాల్ని అందించాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. వారం రోజుల తర్వాత సదరు పెట్టుబడి దారుడి అకౌంట్ నుంచి రూ.8లక్షలు మాయమయ్యాయి. పోలీసులు కొంత మొత్తాన్ని రికవరీ చేశారు. ఇదిగో ఈయన 8లక్షలు మోసపోతే గత ఏడాది వాటి విలువ వేల కోట్లకు చేరింది. వేల కోట్లకు సైబర్ నేరాలు నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నివేదిక ప్రకారం..2023 ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు సుమారు రూ.5,574 కోట్ల సైబర్ నేరాలు జరిగాయి. 2022లో ఈ మొత్తం రూ.2,296 కోట్లుగా ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. సైబర్ నేరాల నుంచి సంరక్షించేందుకు ఈ తరుణంలో సైబర్ నేరాల నుంచి యూజర్లను సంరక్షించేందుకు ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో టూల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ల లాక్ స్క్రీన్ నుంచి అనుమానిత ఫోన్ నెంబర్లను నేరుగా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ వాట్సప్ వెసులుబాటు కల్పిస్తుంది. బ్లాక్ చేస్తే వాటి నుంచి మీకు ఫోన్ కాల్స్, మెసేజ్లు రావు. మీరు కావాలనుకుంటే వాట్సప్కు రిపోర్ట్ చేయొచ్చు. -
వాట్సప్లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సప్కాల్స్తో జాగ్రత్త.. తెలియని నంబర్ల నుంచి సైబర్ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్లో మిస్డ్ కాల్ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేసేంతవరకు రింగ్ అవుతుంది కదా. ఈ స్పామ్ కాల్స్ రెండు మూడు రింగ్ల తరువాత కాల్ కట్ అవుతుంది. అన్నోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రిసెర్చ్(బీపీఆర్డీ) పేర్కొంది. నిరుద్యోగులకు ఎర.. ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్ నేరస్థులు ట్రాప్ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్లో మెసేజ్లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్లోని వివరాలు వారికి చేరుతున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు చోరీ.. వాట్సప్లో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్లో భాగంగా తమ స్క్రీన్ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ట్రేడింగ్ సలహాలతో.. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్లో మెసేజ్లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో లేని అనధికారిక అప్లికేషన్ లింక్లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు. -
Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్
వాట్సాప్ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్ చేయాల్సిన పనే లేదు. మీ ఛాయిస్ .. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ అంటే మెసెజ్లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్ ఛానెల్. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. సాక్షి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్ వివరణలు, లేటేస్ట్ అప్డేట్స్ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్ ఛానల్ మీకందిస్తోంది. ఫాలో అవ్వండిలా.. వాట్సప్లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్ చేయండి. స్టేటస్లు దాని దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానెల్ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా చేరొచ్చు. ప్రయోజనాలేంటీ? ఒక సారి ఫాలో అయితే అప్డేట్స్ వాటంతటే అవి కనిపిస్తాయి నోటిఫికేషన్స్ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్ చేసి చూడొచ్చు లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో అందుకోవచ్చు వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు మీ ఫోటో, నెంబర్ కూడా కనిపించవు -
వాట్సప్ లేకున్నా లొకేషన్ షేర్ చేయండిలా..
మనం వెళుతున్న ప్రాంతాలకు రూట్ తెలియకపోతే వెంటనే అప్పటికే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్ షేర్ చేయమని అడుగుతూంటాం. వారు వెంటనే వాట్సప్లో లొకేషన్ షేర్ చేస్తారు. దాని ఆసరాగా చేసుకుని గమ్యం చేరుతాం. కానీ కొన్నిసార్లు వాట్సప్తోపాటు ఇతర లొకేషన్ షేరింగ్ యాప్లు పనిచేయకపోతే ఎలా.. అసలు వాట్సప్ వాడని వారు ఎలా వారి లొకేషన్ షేర్ చేయాలి.. అనే అనుమానం వచ్చిందా. అయితే అలాంటి వారికోసం గూగుల్ మనం వెళ్లే రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి తన గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. రూట్ మ్యాప్పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇదీ చదవండి: మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ ఈ ఫీచర్ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్లో లాగిన్ అవ్వాలి. ఫ్రొఫైల్ అకౌంట్పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్పై కనిపిస్తున్న న్యూ షేర్పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పంపించాలి. -
భారత్లో 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ - కారణం ఇదే!
2023 నవంబర్ నెలలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ నిషేధించింది. పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2021 కొత్త ఐటీ రూల్స్ని దృష్టిలో ఉంచుకుని యూజర్స్ నుంచి స్వీకరించిన వినతుల కారణంగా వాట్సాప్ 71 లక్షల అకౌంట్స్ మీద నిషేధం విధించింది. యూజర్ రిపోర్ట్లు రాకముందే కంపెనీ నవంబర్ 1 నుంచి 30 వరకు 19,54,000 ఖాతాలను ముందస్తుగా నిషేధించింది. దీనికి ప్రధాన కారణం సంస్థ నిబంధనలను అతిక్రమించడమే. గత నవంబర్లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది. ఇందులో స్పామ్ ఖాతాలకు సంబంధించిన కంప్లైంట్స్ వంటివి ఉన్నాయి. 'అకౌంట్స్ యాక్షన్డ్' కింద వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేయడం లేదా పునరుద్ధరించడం వంటివి చేస్తుంది. దీనితో పాటు, మిలియన్ల మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. వాట్సాప్ తప్పుడు సమాచార వ్యాప్తిని, వ్యక్తిగత డేటాకు భంగం కలగకుండా మెటా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ నిషేధిస్తోంది, రానున్న రోజుల్లో మరింత పటిష్టమైన భద్రతను అందించడానికి ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీతో పనిచేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్భవన్కు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా సోమవారం రాజ్భవన్కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) ఆయన వెంట ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాజ్భవన్కు వెళ్లిన రేవంత్రెడ్డి. గవర్నర్ దంపతులకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం గవర్నర్తో దాదాపుగా 15 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తామని గవర్నర్ను సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పాలన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నామని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని, వెంటనే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, ప్రణాళికలను రేవంత్ వివరించినట్టు సమాచారం. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నూతన సంవత్సర ఆరంభం పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో కేక్ కట్ చేశారు. ఓపెన్హౌస్ నిర్వహించి అతిథుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర సీనియర్ అధికారులు, 2,500 మంది సాధారణ ప్రజలు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ పిలుపు మేరకు పూలబోకేలకు బదులుగా చాలామంది అతిథులు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను కానుకలుగా ఇచ్చారు. దీంతో 25,000 నోట్బుక్స్ రాజ్భవన్కు అందాయి. ఈ పుస్తకాలను జీహెచ్ఎంసీ, గిరిజన ప్రాంత మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ రాజ్భవన్కు సంబంధించిన వాట్సాప్ చానల్ ( https:// whatsapp. com/ channel/0029VaIxdrC4 NVicOQDVvY3 L)ను కూడా ఆవిష్కరించారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమాల వార్తలు, ఫొటోలను దీనిద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి: గవర్నర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, వర్సిటీల్లో తక్షణమే బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. రాజ్భవన్ తరఫున కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తమిళిసై హామీ ఇచ్చింనట్టు సమాచారం. -
వాట్సాప్ స్టేటస్.. ఇద్దర్ని బలిగొంది
మైసూరు: సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలే పోతాయని అనేకసార్లు రుజువైంది. సామాజిక మాధ్యమాల్లో తమ ఇద్దరి ఫోటో వైరల్గా మారడంతో ఇరు కుటుంబాల ఘర్షణ పడగా, మనస్తాపానికి గురై గృహిణి, మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. హుణసూరులోని కల్కుణి నివాసి వివాహిత శృతి (28), మురళి (20) ఆత్మహత్య చేసుకున్నవారు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరు కలసి ఉన్న ఫోటోను మురళి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోగా ఊళ్లో చాలామంది అది చూశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో భయపడిపోయిన శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసి మురళి కూడా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. -
వాట్సప్ యూజర్లకు శుభవార్త!
వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రతి రోజూ వాట్సప్కు వచ్చే బండిళ్ల కొద్ది మెసేజ్లు వస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైన నెంబర్లను వచ్చే మెసేజ్లు గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. అయితే, ఈ సమస్యను పరిష్కరించేలా వాట్సప్ సంస్థ ‘పిన్’ ఫీచర్ను తెచ్చింది. ఈ ఫీచర్ కేవలం ఆయా గ్రూపుల అడ్మిన్లు ఉపయోగించాల్సి ఉంటుంది. టెక్ట్స్ మాత్రమే కాకుండా వీడియోలు, పోల్స్, ఫోటోలు ఇలా వాట్సప్కు వచ్చే మెసేజ్లను పిన్ చేసే సౌకర్యం ఉంటుంది. ఇలా పిన్ చేసిన మెసేజ్లు ఏడు రోజుల పాటు డిఫాల్ట్గా ఉంటాయి. అవసరం అనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. గ్రూప్ సభ్యులకు మెసేజ్లు పిన్ చేసి పంపడం అడ్మిన్ల చేతిలోనే ఉంటుంది. -
వాట్సప్లో మరో అదిరిపోయే ఫీచర్, అదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం మరో కొత్త ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. 2021లో వాట్సాప్ ఫొటోలు, వీడియోల కోసం వ్యూ వన్స్ అనే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచర్ సాయంతో వీడియోలు, ఫోటోలు చూసిన వెంటనే వాటికంతట అవే అదృశ్యమవుతాయి. తాజాగా, అదే తరహాలో ఆడియో ఫైల్స్ అదృశ్యమయ్యేలా ఫీచర్ను వినియోగదారులకు అందించింది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా వాట్సప్లో కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితుల మధ్య జరిపిన వాయిస్ నోట్ను మీకు తెలియకుండా వేరే వాళ్లకు పంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. తద్వారా మీరు పంపిన వాయిస్ మెసేజ్లు మూడు వ్యక్తికి చేరుతాయనే భయం పోనుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా ఓ వాయిస్ మెసేజ్ పంపారు. అది అక్కడితోనే ఆగిపోవాలి. వేరే వాళ్లకు షేర్ కాకూడదు అంటే ఈ వ్యూవన్స్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. -
వాట్సాప్ యూజర్లకు షాక్.. 75 లక్షల అకౌంట్స్ బ్యాన్
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం.. భారతదేశంలో సుమారు 75 లక్షల కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్ నిషేదించింది. 2023 అక్టోబర్ 01 నుంచి 31 మధ్య 7548000 ఖాతాలను నిషేదించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సాప్ నెలవారీ నివేదికలో వివరించిన విధంగా.. 19,19,000 వినియోగదారు నివేదికల కంటే ముందుగానే నిషేధించడం జరిగింది. అక్టోబర్లో దేశంలో రికార్డు స్థాయిలో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం. ఇందులో ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. దేశంలో 500 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న వాట్సాప్ అక్టోబర్లో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు.. వీటిపైన 12 చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వాట్సాప్ ఒక ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించిన దాన్ని పునరుద్ధరించడం వంటి పరిష్కార చర్యలను సూచిస్తుంది. వినియోగదారు ఫిర్యాదులకు సంబంధించిన సమగ్ర వివరాలను పరిగణలోకి తీసుకుని, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే? వాట్సాప్ సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 7,111,000 ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో వినియోగదారు నివేదికలను స్వీకరించడానికి ముందు 2,571,000 ఖాతాలు ముందస్తుగా నిషేధించారు. అప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో అకౌంట్ సపోర్ట్ (1,031), బ్యాన్ అప్పీల్ (7,396), అదర్ సపోర్ట్ (1,518), ప్రొడక్ట్ సపోర్ట్ (370), సేఫ్టీ (127) వంటి కేటగిరీల్లో 10,442 యూజర్ రిపోర్ట్లను స్వీకరించినట్లు సమాచారం. -
వాట్సాప్ స్టేటస్గా గర్ల్ ఫ్రెండ్ డెడ్బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే?
యాప్లను వాడాలంటే ప్రైవసీ ఎంతో కీలకం. యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత యాప్ నిర్వాహకులపై ఉంటుంది. గతంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై తీవ్రంగా చర్చ జరిగింది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్రానికి వాట్సాప్ స్పష్టం చేసింది. అందులో భాగంగానే యూజర్ల ప్రైవసీకి వాట్సాప్ మేజర్ అప్డేట్తో ముందుకొచ్చింది. చాట్స్ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్లో ఇప్పటికే తమ వ్యక్తిగత చాట్స్ను యూజర్లు లాక్ చేసుకునే సదుపాయం ఉన్నా అందులో లోటుపాట్లు ఉండటంతో వాట్సప్ నూతన ఫీచర్ను ప్రవేశపెట్టింది. దానివల్ల యూజర్లందరి సమాచార భద్రతను అప్గ్రేడ్ చేసింది. న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్తో యూజర్లు తమ చాట్స్కు వర్డ్స్, ఎమోజీలతో యూనిక్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లో కేవలం సీక్రెట్ కోడ్ను టైప్ చేసి లాక్ అయిన చాట్ను యాక్సెస్ చేసేలా సెట్టింగ్స్ను తీసుకొచ్చారు. ఇదీ చదవండి: యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా? వాట్సాప్లో చాట్ లాక్ సీక్రెట్ కోడ్ ఫీచర్తో యూజర్లు యూనిక్ పాస్వర్డ్తో వారి చాట్స్ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చని మెటా కంపెనీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ బార్లో సీక్రెట్ కోడ్ టైప్ చేసినప్పుడే లాక్డ్ చాట్స్ కనిపించేలా యూజర్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్తో ఏ ఒక్కరూ యూజర్ల ప్రైవేట్ సంభాషణలను గుర్తించలేరని వాట్సాప్ పేర్కొంది. ఇలా సెట్ చేసుకోండి.. వాట్సప్ను ముందుగా అప్డేట్ చేసుకోవాలి. లాక్డ్చాట్ విభాగానికి వెళ్లి అందులో పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో ‘హైడ్ లాక్డ్ చాట్స్’ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవాలి. లాక్ చేయాల్సిన చాట్లకు మళ్లీ యాక్సెస్ చేసుకోవడానికి రహస్య కోడ్ని ఎంటర్ చేయాలి. లాక్ చేసిన చాట్లు ప్రాథమిక చాట్ విండోలో కనిపించవు. హైడ్ చేసిన లాక్డ్చాట్లను ఓపెన్ చేయడానికి రహస్య కోడ్ ఎంటర్చేసి చూడాల్సి ఉంటుంది. -
వారెవ్వా! వాట్సప్లో ఇకపై అన్నీ ఇన్స్టంట్గానే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. వాట్సప్లో మరో ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలగనుంది. గతంలో మీ వాట్సప్ నెంబర్ నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఓ మెసేజ్ పంపి ఉంటారు. అత్యవసరంగా ఆ మెసెజ్ ఇప్పుడు కావాలి. వెతకాలంటే సమయం పడుతుంది. మరి ఇప్పుడు దానిని సెకన్లలో గుర్తించడం ఎలా? దీనికే వాట్సప్ మాతృ సంస్థ మెటా పరిష్కారం కనిపెట్టింది. ఇందుకోసం వాట్సప్ వెబ్లో ‘సెర్చ్ బై డేట్’ ఫీచర్పై పనిచేస్తుంది. దీని సాయంతో వాట్సప్లో వీడియోలు, టెక్ట్స్ ఇతర ఆడియో ఫైల్స్ని మీరు ఎప్పుడు, ఎవరికి ఏం పంపారో ఈజీగా తెలుస్తుంది. అవతలి వారు మీకు పంపిన మెసేజ్లను సైతం గుర్తించవచ్చు. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. వాట్సప్ వెబ్ కోసం కొత్త సెర్చ్ బై డేట్ ఫీచర్తో యూజర్లు పంపిన మెసేజ్లను లేదంటే రిసీవ్ చేసుకున్న వాటిని సులభంగా చూసేందుకు పైన ఇమేజ్లో పేర్కొన్నట్లుగా క్యాలెండర్ను ఓపెన్ చేసింది. అందులో తారీఖు, సంవత్సరం, నెలను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఎంచుకున్న తేదీని బట్టి మీ వాట్సప్ డేటా డిస్ప్లే అవుతుంది. అయితే, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే మరికొన్ని ఆగాల్సిందే. -
ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్
రద్దు చేసుకున్న, పనిచేయని మొబైల్ నంబర్లను కనీసం మూడు నెలల తర్వాతే వేరేవారికి కేటాయిస్తామని భారత టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్ తెలిపింది. డియాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ చేసిన మొబైల్ నంబర్లు వాడిన వారి సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు చెప్పింది. మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్, డీయాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అందుకు ప్రతిగా ట్రాయ్ స్పందించింది. ఇదీ చదవండి: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు ఈ రిట్పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్ తన స్పందనను తెలియజేసింది. గతంలో ఫోన్ నంబరు వాడిన చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు చెప్పింది. సబ్స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు వాడకంలోలేని ఫోన్నంబర్లు ఆ తర్వాత కొత్త డివైజ్లో యాక్టివేట్ అయితే అందులోని డేటా మొత్తం తొలగిపోతుందని తెలిపింది. దాంతో గతంలో ఫోన్నంబర్తో వాట్సాప్ వాడిన వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని వివరించింది. -
వాట్సాప్ యూజర్లకు షాక్! 71.1 లక్షల అకౌంట్లపై నిషేధం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) గత సెప్టెంబర్ నెలలో భారత్కు చెందిన 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ విడుదల చేసిన తాజా ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం.. వాట్సాప్ సెప్టెంబర్లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా 71.1 లక్షల ఖాతాలను నిషేధించింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీల మధ్య 71,11,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. వీటిలో 25,71,000 అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్లు వివరించింది. ఇదీ చదవండి: బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు! వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్కు ఆరు ఆర్డర్లు రాగా అన్నింటినీ పరిష్కరించింది. కాగా వాట్సాప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 35 లక్షల ఖాతాలను ముందస్తుగా బ్యాన్ చేసింది.