స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి సూచనలు | Airtel Urged The TRAI To Regulate OTT Platforms Whatsapp Telegram To Combat Surge In Spam And Online Fraud, See Details | Sakshi
Sakshi News home page

స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి సూచనలు

Dec 9 2024 8:26 AM | Updated on Dec 9 2024 9:48 AM

Airtel urged the TRAI to regulate OTT platforms WhatsApp Telegram to combat surge in spam and online fraud

స్పామ్, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో స్పామ్‌ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్‌లైన్‌ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.

ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.

ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..

వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్‌ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్‌ లేదా అయాచిత వాణిజ్య కాల్స్‌ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement