
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తాజాగా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకూ ఎల్ఐసీలో ఎఫ్డీఐలను అనుమతిస్తూ నోటిఫై చేసింది. గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు
Comments
Please login to add a commentAdd a comment