Foreign Direct Investments (FDI)
-
టార్గెట్ ఎఫ్డీఐ.. విధానాల సవరణకు యోచన!
దేశంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని రంగాలలో విధానాలను సవరించాలని యోచిస్తోంది. తద్వారా మరిన్ని ఎఫ్డీఐలకు దారి చూపాలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా పేర్కొన్నారు.ఈ బాటలో వివిధ ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, పారిశ్రామిక సహచర సంస్థలు, అడ్వయిజరీ, న్యాయ సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థలు, వెంచర్స్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ తదితరాలతో అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా దేశీయంగా మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకునేందుకు అభిప్రాయాలు, సూచనలకు ఆహ్వానం పలికింది.వెరసి వివిధ శాఖలు, విభాగాలతో చర్చలు పూర్తిచేసినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. దీంతో విభిన్న సమస్యలపై సలహాలు, సూచనలు అందుకున్నట్లు తెలియజేశారు. అయితే ఇంతవరకూ ఏ అంశాలపైనా తుది నిర్ణయాలకు రాలేదని తెలియజేశారు. నిబంధనలు, విధానాలను సరళతరం చేయడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వివరించారు. కాగా.. ఏఏ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందీ వెల్లడించలేదు. -
బీమాకు 100% దన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ తాజా బడ్జెట్లో బీమా రంగానికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు)ను అనుమతించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం బీమాలో 74 శాతంవరకూ ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. ఆధునికతరం ఫైనాన్షియల్ రంగ సంస్కరణలలో భాగంగా ఇందుకు తెరతీశారు. అయితే మొత్తం ప్రీమియంను దేశీయంగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు మాత్రమే పెంచిన పరిమితి వర్తించనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. వెరసి విదేశీ పెట్టుబడుల పరిమితులను సమీక్షించడంతోపాటు సరళతరం చేసినట్లు వెల్లడించారు. ఎఫ్డీఐ పరిమితి పెంపునకు వీలుగా ప్రభుత్వం బీమా చట్టం 1938, జీవిత బీమా చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత చట్టం 1999లకు సవరణలు చేయనుంది. మరిన్ని సంస్థలు ప్రవేశించడం ద్వారా బీమా విస్తృతి పెరగడంతోపాటు భారీ ఉద్యోగ అవకాశాలకు తెరలేవనుంది. కొన్ని నిబంధనలు, విధానాలను సరళతరం చేసే ముసాయిదా బిల్లు త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఇంతక్రితం 2021లో బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం హెచ్చించింది. అంతకుముందు 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు అనుమతించింది. -
ఈవీ రంగం @ 8 రెట్లు..!
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరిశ్రమ దేశంలో ఎనిమిది రెట్లు దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్ద కాలంలో ఈవీల విక్రయాలు 640 రెట్లు పెరిగాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏటా 2,600 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయని, గత ఏడాది ఈ సంఖ్య 16.8 లక్షల యూనిట్లు దాటిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2025ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఏడాదికి 2.5 కోట్ల వాహనాల అపూర్వ అమ్మకాలను చూసిందని, కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ పరిశ్రమ 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. పర్యావరణ అనుకూల సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మొబిలిటీ రంగంలో భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చొరవ దేశ ఆటో పరిశ్రమ వృద్ధి అవకాశాలకు ఆజ్యం పోస్తోందని, ఈ రంగం అభివృద్ధిలో భారీ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తోడ్పడే మొబిలిటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారతీయ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలో రతన్ టాటా, ఒసాము సుజుకీ సహకారం ఎంతో ఉందని మోదీ అన్నారు.టాటా.. 32 కొత్త వాహనాలు టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో వేదికగా ప్యాసింజర్, కమర్షి యల్ విభాగంలో 32 కొత్త వాహనాలతోపాటు వివిధ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ను ఆవిష్కరించింది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా సియర్రా ఎస్యూవీ, హ్యారియర్ ఈవీతోపాటు అవిన్యా కాన్సెప్ట్ ఈవీ సైతం కొలువుదీరింది. అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ 2026లో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.సుజుకీ ఈ–యాక్సెస్ 95 కిలోమీటర్లు సుజుకీ తాజాగా భారత్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ ఎలక్ట్రిక్ వర్షన్ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ–యాక్సెస్ ప్రత్యేకత. 3.07 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు. చార్జింగ్ పూర్తి కావడానికి 240 వాట్ పోర్టబుల్ చార్జర్తో 6 గంటల 42 నిముషాలు, ఫాస్ట్ చార్జర్తో 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. పండుగ సీజన్ మార్కెట్లోకి రానుంది. కాగా, యాక్సెస్ 125 అప్గ్రేడెడ్ వెర్షన్తోపాటు జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.ఇక జేఎస్డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు విభిన్న రంగాల్లో ఉన్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్లో కార్స్, ట్రక్స్, బస్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేయనున్నట్టు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. సాంకేతిక భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు జిందాల్ చెప్పారు. జేఎస్డబ్ల్యూ బ్రాండ్ తొలి వాహనం 2027–2028లో రోడ్లపైకి వస్తుందన్నారు.మారుతీ ఈ–విటారా రేంజ్ 500 కి.మీమారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారా కొలువుదీరింది. 49, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్స్లో ఇది లభిస్తుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా పరుగుతీయనుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్స్, లెవెల్–2 అడాస్, ఏడు ఎయిర్బ్యాగ్స్ పొందుపరిచారు. 300 ఎన్ఎం టార్క్ అందించే ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ సైతం ఉంది. ప్రపంచ మార్కెట్కు ఈ–విటారా కార్లను మారుతీ సుజుకీ వచ్చే 10 ఏళ్లపాటు ప్రత్యేకంగా సరఫరా చేయనుండడం విశేషం. ఈ–విటారా తయారీ, ప్రత్యేకంగా ఈవీ ప్రొడక్షన్ లైన్ కోసం రూ.2,100 కోట్లకుపైగా పెట్టుబడి చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. కాగా, ‘ఈ ఫర్ మీ’ పేరుతో పూర్థిస్థాయిలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు మారుతీ శ్రీకారం చుట్టింది. టాప్–100 నగరాల్లోని డీలర్షిప్స్ వద్ద ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. అలాగే 1,000కిపైగా నగరాల్లో ఈవీల కోసం ప్రత్యేకంగా 1,500ల పైచిలుకు సరీ్వస్ సెంటర్లను నెలకొల్పుతారు. కొత్తగా 1.5 లక్షల మందికి.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం వెన్నుదన్నుగా నిలిచిందని, తద్వారా పరిశ్రమకు అదనంగా రూ.2.25 లక్షల కోట్ల అమ్మకాలు తోడయ్యాయని నరేంద్ర మోదీ అన్నారు. వాహన రంగంలో కొత్తగా 1.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ఈ పథకం తెచి్చపెట్టిందని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై దేశ వ్యయాలను తగ్గించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణ సౌలభ్యం భారత్కు అతిపెద్ద ప్రాధాన్యతగా ఉందని, గత బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. భారత ఆటోమొబైల్ రంగం గత ఏడాది 12% వృద్ధి చెందిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 22 వరకు కొనసాగనుంది. ఆటోమొబైల్, విడిభాగాలు, సాంకేతికతల్లో 100కుపైగా నూతన ఆవిష్కరణలకు ఎక్స్పో వేదిక కానుంది. -
వేగంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్ను పెట్టుబడులకు గొప్ప కేంద్రంగా మధ్య ప్రాచ్యం, జపాన్, ఐరోపా యూనియన్ (ఈయూ), యూఎస్ గుర్తిస్తున్నట్టు చెప్పారు. ఇది లక్షలాది కొత్త ఉద్యోగాలకు దారితీస్తున్నట్టు తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. దేశీ మార్కెట్ బలంగా ఉండడం, నైపుణ్య, మేధో వనరుల లభ్యత, చట్టాలకు కట్టుబడి ఉండడం, స్పష్టమైన నియంత్రణలు సానుకూల వ్యాపార వాతావరణం, వ్యాపార సులభ నిర్వహణకు వీలైన ప్రగతిశీల విధానాలు.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు మంత్రి గోయల్ చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ఒకానొక పెద్ద ఫండ్ నిర్వహణ సంస్థ సీఈవోతో గత నెలలో యూఎస్లో భేటీ అయ్యాను. అదే సంస్థ భారత్లోనూ భారీ పెట్టుబడులు కలిగి ఉంది. గడిచిన పదేళ్ల కాలంలో భారత్లోని తమ పెట్టుబడులు తమ ఫండ్స్ చేసిన పెట్టుబడుల్లో అత్యుత్తమ పనితీరు చూపించినట్టు నాతో పంచుకున్నారు. గత 20 ఏళ్ల నుంచి భారత్లో ఇన్వెస్టర్లుగా ఉన్నప్పటికీ, 80 శాతం పెట్టుబడులు ఇటీవలి సంవత్సరాల్లోనే పెట్టినట్టు చెప్పారు. భారత్లో పెట్టుబడులు పెట్టి 20 ఏళ్ల అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారత్కు వచ్చి మరో విడత పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించనున్నట్టు ప్రకటించారు’’ అని గోయల్ తను అనుభవాలను వెల్లడించారు. భారత స్టాక్ మార్కెట్ చక్కని పనితీరు భారీగా ఫ్ఐఐ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా రూ.38వేల కోట్లు.. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ ప్రతి నెలా సగటున 4.5 బిలియన్ డాలర్ల (రూ.38,000 కోట్లు) ఎఫ్డీఐలు గడిచిన ఏడాది కాలంగా భారత్లోకి వస్తుండడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ఎఫ్డీఐ 42 శాతం పెరిగి 42 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్)నూ ఎఫ్డీఐలు 45 శాతం పెరిగి 29.79 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71.28 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐని భారత్ ఆకర్షించింది. సేవల రంగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికం, ట్రేడింగ్, నిర్మాణం, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు ఎక్కువ ఎఫ్డీఐలను రాబడుతున్నాయి. -
ఫార్మాలో విదేశీ పెట్టుబడుల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వెల్లువెత్తుతున్నాయి. 2024–25 మొదటి అర్ధభాగంలో ఎఫ్డీఐలు నాలుగురెట్లకుపైగా దూసుకెళ్లి 520 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్లో ఎఫ్డీఐ ఈక్విటీ 117 మిలియన్ డాలర్లు మాత్రమే. 2000 ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోకి వచ్చిన విదేశీ నిధులు 23.05 బిలియన్ డాలర్లు. ఇది ఈ కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3.25 శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2024 సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో విదేశీ నిధులు దాదాపు పది రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 284 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది కేవలం 27 మిలియన్ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 162 శాతం వృద్ధితో ఎఫ్డీఐలు 236 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 90 మిలియన్ డాలర్లుగా ఉంది. డీవోపీకి ఆ బాధ్యతలు..వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి 1.06 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇది 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.06 బిలియన్ డాలర్లు. 2021–22లో 1.41 బిలియన్ డాలర్లు నమోదైంది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో నూతనంగా స్థాపించే ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లో 100 శాతం వరకు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న ఫార్మాస్యూటికల్ ప్రాజెక్ట్లకు 74 శాతం దాటే విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2017 మే నెలలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ను (ఎఫ్ఐపీబీ) రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ ఆమోదం మార్గంలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్కు (డీవోపీ) ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే వైద్య పరికరాల రంగానికి సంబంధించిన ఎఫ్డీఐ ప్రతిపాదనలను సైతం ఈ డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది. -
చిన్న పారిశ్రామిక టౌన్షిప్లు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సరళీకరించడం, స్మార్ట్ పారిశ్రామిక టౌన్షిప్లు, టైర్–2, 3 పట్టణాల్లో రంగాల వారీ ప్రత్యేకమైన పారిశ్రామిక పార్క్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. దేశ పారిశ్రామికీకరణకు ఈ చర్యలు ఊతమిస్తాయన్నారు.ఫిక్కీ వార్షిక సమావేశంలో భాగంగా మాట్లాడారు. పలు శాఖల మద్దతుతో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ పారిశ్రామిక నవడా కార్యక్రమం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ), వ్యాపార సులభతర నిర్వహణ సంస్కరణలు పారిశ్రామికాభివృద్ధికి వీలు కల్పించినట్టు భాటియా తెలిపారు. విద్యుదీకరణ పారిశ్రామికీకరణను వేగవంతం చేసిందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరమ్ రిజ్వి ఇదే కార్యక్రమంలో భాగంగా అన్నారు.తయారీలో పోటీతత్వం, దేశీయ వాటాను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ప్రైవేటు పెట్టుబడులు అన్నవి దేశీయ డిమాండ్కు అనుగుణంగా ఉండాలని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ అనంత్ గోయెంకా అన్నారు. రంగాల వారీ పారిశ్రామిక పార్క్లు ఎంతో మార్పును తీసుకురాగలవన్నారు. కాకపోతే స్థానికంగా, విదేశాల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్లు) నుంచి పాఠాలను పరిగణనలోకి తీసుకోవాలని, తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచాలని సూచించారు. -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్క్రాఫ్ట్ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్లింక్కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
స్పేస్ స్టార్టప్లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్లో చైనా ఎఫ్డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
సరిహద్దు దేశాల నుంచి ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: భూ సంబంధ సరిహద్దు దేశాల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ రూ. లక్ష కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర లభించింది. మిగిలిన సగం ప్రతిపాదనల్లో పెండింగ్ లేదా ఉపసంహరణ లేదా తిరస్కరణకు గురై ఉండవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా భూ సరిహద్దు దేశాల నుంచి లభించే ఎఫ్డీఐలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2020 ఏప్రిల్లో పత్రికా ప్రకటన విడుదల చేసింది. తద్వారా దేశీ కంపెనీల టేకోవర్ అవకాశాలకు చెక్ పెట్టింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లతో దేశానికి భూ సంబంధ సరిహద్దులున్న సంగతి తెలిసిందే. వెరసి ఈ దేశాల నుంచి తరలివచ్చే ఎఫ్డీఐల ద్వారా దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు అనుమతులు తప్పనిసరిగా మారాయి. ఈ నిబంధనల తదుపరి రూ. లక్ష కోట్ల ప్రతిపాదనలురాగా.. 50 శాతం పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భారీ మెషీనరీ తయారీ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ట్రేడింగ్, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలలో అత్యధిక ఎఫ్డీఐ ప్రతిపాదనలు నమోదయ్యాయి. సమీక్షా కాలంలో చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్డీఐ ఈక్విటీ ప్రతిపాదనలురాగా.. నేపాల్ నుంచి 4.5 మిలియన్ డాలర్లు, మయన్మార్ నుంచి 9 మిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. -
తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి ఆరు నెలలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 24 శాతం వెనకడుగు వేశాయి. వెరసి ఏప్రిల్–సెప్టెంబర్లో 20.48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలలో పెట్టుబడులు తగ్గడం ఇందుకు కారణమైనట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2022–23) తొలి అర్ధభాగంలో 26.91 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు లభించాయి. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లోనూ ఎఫ్డీఐలు దాదాపు 41 శాతం క్షీణించి 9.28 బిలియన్ డాలర్లను తాకాయి. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్ట్లలో పెట్టుబడులు నీరసించగా.. సెప్టెంబర్లో మాత్రం పుంజుకుని 4.08 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్లో ఇవి 2.97 బిలియన్ డాలర్లు మాత్రమే. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాలివి. పెట్టుబడుల తీరిలా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈక్విటీ, ఆర్జనను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధన పెట్టుబడులు 16 శాతం తగ్గి 32.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్లో 38.94 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు నమోదయ్యాయి. తాజా సమీక్షా కాలంలో సింగపూర్, మారిషస్, యూఎస్, యూకే, యూఏఈ నుంచి ఈక్విటీ పెట్టుబడులు డీలా పడ్డాయి. అయితే నెదర్లాండ్స్, జపాన్, జర్మనీ నుంచి పెట్టుబడులు పుంజుకోగా.. నిర్మాణ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, మెటలర్జికల్ ఇండస్ట్రీలకు ఎఫ్డీఐలు పెరిగాయి. రాష్ట్రాలవారీగా చూస్తే తొలి 6 నెలల్లో మహారాష్ట్రకు అత్యధికంగా 7.95 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. గతేడాది ఇదే కాలంలో లభించిన 8 బిలియన్ డాలర్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కర్ణాటకకు పెట్టుబడులు 5.32 బిలియన్ డాలర్ల నుంచి 2.84 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. -
అంతరిక్ష రంగంలోకి సులభతరంగా ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపగ్రహాల సంబంధ కార్యకలాపాల విభాగంలో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉన్నప్పటికీ అది ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటోంది. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జీ–20 కూటమిలోని మూడు దేశాలు .. అంతరిక్ష రంగంలో భారత్తో కలిసి పని చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం ఉపయోగించే ఉపకరణాల తయారీ మొదలుకుని స్పేస్ హార్డ్వేర్, టెక్నాలజీ సేవలు మొదలైన వాటి దాకా అనేక అంశాలు అంతరిక్ష రంగ అవసరాల్లో ఉంటాయి. వివిధ నివేదికల ప్రకారం అంతర్జాతీయంగా అంతరిక్ష రంగం పరిమాణం 546 బిలియన్ డాలర్లుగా ఉంది. 2040 నాటికి ఇది 1 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. సాంకేతిక పురోగతి, వ్యయ నియంత్రణ చర్యలు మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. -
Canada-India relations: కెనడా పెట్టుబడులు ఎక్కువే
న్యూఢిల్లీ: ఇటీవల కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో పెట్టుబడుల రాకపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో వెనువెంటనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడకపోవచ్చని ఇన్వెస్టర్ల ఫోరమ్.. సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్(ఎస్డబ్ల్యూఎఫ్ఐ) పేర్కొంది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) వంటి అంశాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చని అభిప్రాయపడింది. నిజానికి 2000 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కాలంలో కెనడా నుంచి దేశీయంగా 3.64 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,212 కోట్లు) ఎఫ్డీఐలు ప్రవహించాయి. వెరసి ఎఫ్డీఐల రాకలో కెనడా 17వ ర్యాంకులో నిలిచినట్లు ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. కెనడియన్ పెట్టుబడుల్లో సరీ్వసులు, మౌలికసదుపాయాల పెట్టుబడులు 40.63 శాతంకాగా.. దేశీయంగా 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కలిగి ఉన్నాయి. ఇంతకంటే అధికస్థాయిలో కెనడా కంపెనీలు దేశీయంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం కెనడియన్ పెన్షన్ ఫండ్స్ 2022 చివరికల్లా దేశీయంగా 45 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎఫ్డీఐగా కెనడా నిలిచింది. ఫండ్ పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసులున్నాయి. భారీ మార్కెట్ కావడం, పెట్టుబడులపై అత్యధిక రిటర్నులు కారణంగా కెనడా పెన్షన్ ఫండ్స్ దేశీయంగా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు జీటీఆర్ఐ అభిప్రాయపడింది. లక్ష కోట్లకుపైగా దేశీయంగా రియలీ్ట, ఎనర్జీ, హెల్త్కేర్, ఐటీ తదితర రంగాలలో కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. సీపీపీఐబీ తాజా గణాంకాల ప్రకారం ఏడాదిక్రితంవరకూ దేశంలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ స్వతంత్ర బోర్డు నిర్వహణలో ఉంటుందని ఎస్డబ్ల్యూఎఫ్ఐ చైర్మన్ లక్ష్మీ నారాయణన్ పేర్కొన్నారు. ప్రధానంగా వాటాదారులకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఇన్వెస్ట్ చేస్తుందని తెలియజేశారు. దేశీ స్టార్టప్లలో సీపీపీఐబీ పెట్టుబడులు చేపడుతోంది. డెల్హివరీలో 6 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్లో 2.68 శాతం, జొమాటోలో 2.42 శాతం, ఇండస్టవర్లో 2.18 శాతం, పేటీఎమ్లో 1.76 శాతం, నైకాలో 1.47 శాతం చొప్పున వాటాలు కలిగి ఉంది. ఈ బాటలో విదేశాలలో లిస్టయిన దేశీ కంపెనీలలోనూ ఇన్వెస్ట్ చేసింది. యూఎస్ లిస్టెడ్ విప్రో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో పెట్టుబడులు కలిగి ఉంది. మరికొన్ని ఇతర అన్లిస్టెడ్ కంపెనీలోనూ వాటాలు పొందినట్లు నారాయణన్ తెలియజేశారు. రెండింటికీ మేలే భారత్, కెనడా సంబంధాలు రెండింటి లబ్ది ఆధారితమై ఉన్నట్లు స్వతంత్ర రీసెర్చర్, కన్సల్టెంట్ ప్రతీమ్ రంజన్ బోస్ పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులపై వెనువెంటనే ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని అంచనా వేశారు. రెండు ఆర్థిక వ్యవస్థలకూ నష్టదాయకం కావడంతో ప్రస్తుత వివాదాలు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దౌత్య మార్గంలో సమస్యలు సర్దుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. దశాబ్దకాలం తదుపరి ఇటీవలే రెండు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పంద చర్చలకు తెరతీసినట్లు తెలియజేశారు. అయితే రాజకీయ వివాదాలు తలెత్తడంతో తిరిగి నిలిచిపోయినట్లు తెలియజేశారు. 2022లో కెనడాకు తొమ్మిదో ర్యాంకు విదేశీ వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధిక రిటర్నులు దౌత్యపరమైన ప్రస్తుత ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య పెట్టుబడులను దెబ్బతీయకపోవచ్చని ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దేశీయంగా అత్యధిక రిటర్నులు లభిస్తుండటంతో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ మౌలిక సదుపాయాల రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. అధిక లాభాలను పొందుతున్నందునే దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు వెనక్కి మళ్లేందుకు కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే వివాదాలు పరిష్కారంకావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫండ్స్ పెట్టుబడులపై ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి రిటర్నులు పొందలేకపోవచ్చని స్పష్టం చేశారు. -
అంతరిక్ష రంగానికి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: అంతరిక్ష(స్పేస్) సంబంధ రంగాలకు దన్నునిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) నిబంధనలను మరింత సరళీకరించింది. తద్వారా స్పేస్ విభాగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలు చిక్కనుంది. తాజా సవరణలతో స్పేస్ సంబంధ పరిశ్రమల్లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రధానంగా సౌదీ అరేబియా కంపెనీలు ఏవియేషన్, ఫార్మా, బల్క్ డ్రగ్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ తదితర రంగాలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ తదితర విభాగాలలో భారీస్థాయిలో సాంకేతిక సహకారాలకు తెరలేవనున్నట్లు అభిప్రాయపడ్డారు. స్పేస్ రంగంలో ప్రయివేట్ పెట్టుబడులతోపాటు.. విదేశీ పెట్టుబడులకూ అవకాశం కలి్పంచేలా నిబంధనలను మరింత సరళీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ సదస్సు సందర్భంగా సింగ్ ఇంకా పలు అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం స్పేస్ రంగంలో శాటిలైట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో ప్రభుత్వ అనుమతి ద్వారా 100 శాతం ఎఫ్డీఐలకు వీలుంది. కాగా.. ఇప్పటికే సౌదీ కంపెనీలు సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు తీసుకువచి్చనట్లు సింగ్ ప్రస్తావించారు. ప్రభుత్వం సౌదీ కంపెనీలతో చేతులు కలిపేందుకు చూస్తున్నట్లు తెలియజేశారు. సౌదీ మిలటరీ పరిశ్రమలు, మేకిన్ ఇండియా కార్యక్రమాలు కలిసి సంయుక్తంగా రక్షణ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశమున్నదని వివరించారు. 2022–23కల్లా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 52.8 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. -
మూడు రష్యా సంస్థలకు ఎఫ్పీఐ లైసెన్సులు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఇకపై ఎఫ్డీఐలు పుంజుకుంటాయ్
న్యూఢిల్లీ: గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యలోనూ రానున్న కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) పుంజుకోనున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తాజాగా అంచనా వేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో పెట్టుబడులు, ఈక్విటీలకు నిధులు తరలి వస్తుంటాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి మన్మీత్ కె.నందా పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది(2022–23) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఎఫ్డీఐ ఈక్విటీ నిధులు 14 శాతం క్షీణించి 26.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఈక్విటీ పెట్టుబడులు, రాబడులను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధనం కలసిన మొత్తం ఎఫ్డీఐలు సైతం ఈ కాలంలో 9 శాతం నీరసించి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది(2021–22) తొలి అర్ధభాగంలో ఇవి 42.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమనం కారణంగా 18 నెలలుగా విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడుతున్నట్లు మన్మీత్ తెలియజేశారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఇకపై ఊపందుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
స్టార్టప్స్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో దేశీ అంకుర సంస్థల్లోకి కొత్త ఏడాది (2023)లో భారీగా విదేశీ పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, మన అంకుర సంస్థల పనితీరును బట్టి చూస్తే త్వరలోనే అంతర్జాతీయంగా అగ్ర స్థానానికి చేరుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘గుర్తింపు పొందిన స్టార్టప్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్టార్టప్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాలకు మంచి ఆదరణ ఉంటోంది’’ అని జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వం సరళతరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని పాటిస్తుండటం కూడా అంకుర సంస్థల్లోకి మరిన్ని పెట్టుబడుల రావడానికి దోహదపడనుందని ఆయన చెప్పారు. మరోవైపు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) వినియోగించుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయని జైన్ తెలిపారు. పలు గ్లోబల్ సంస్థలు తమ తయారీ కార్యకలాపాలను భారత్కు మార్చుకునే యోచనలో ఉన్నాయని ఆయన వివరించారు. 14 రంగాల్లో పీఎల్ఐ స్కీములతో రూ. 2.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాలు పెట్టుబడులు, ఉత్పత్తి/విక్రయాలు, ఉద్యోగాల కల్పనలో కీలకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. పథకాల దన్ను దేశీయంగా నవకల్పనలు, అంకుర సంస్థలు, స్టార్టప్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా ప్రణాళికను ఆవిష్కరించింది. గణాంకాల ప్రకారం నవంబర్ 30 వరకూ దీని కింద 84,000 పైగా అంకుర సంస్థలు గుర్తింపు పొందాయి. ఇక, స్టార్టప్లకు వివిధ దశల్లో అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కేంద్రం ఎఫ్ఎఫ్ఎస్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్), రుణ హామీ పథకం (సీజీఎస్ఎస్) మొదలైనవి అమలు చేస్తోంది. ఎఫ్ఎఫ్ఎస్ కింద 93 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) 773 స్టార్టప్స్లోకి పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే, 2021–22లో ప్రవేశపెట్టిన ఎస్ఐఎస్ఎఫ్ఎస్ కింద 126 ఇన్క్యుబేటర్స్లోకి రూ. 455 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. నవంబర్ 30 వరకూ ఈ ఇన్క్యుబేటర్స్ ద్వారా ఆర్థిక తోడ్పాటు పొందేందుకు 650 స్టార్టప్స్ ఆమోదం పొందాయి. ఇక సీజీఎస్ఎస్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నోటిఫై చేయగా, పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గాయి. ఈ కాలంలో 26.9 బిలియన్ డాలర్ల (రూ.2.2 లక్షల కోట్లు) ఎఫ్డీఐ మన దేశంలోకి వచ్చినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగపూర్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది. ఆ తర్వాత మారిషస్ 3.32 బిలియన్ డాలర్లు, యూఏఈ 2.95 బిలియన్ డాలర్లు, యూఎస్ఏ 2.6 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 1.76 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.18 బిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్డీఐ మన దేశంలోకి వచ్చింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐని ఆకర్షించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లోకి 4.16 బిలియన్ డాలర్లు రాగా, ట్రేడింగ్ 3.28 బిలియన్ డాలర్లు, కెమికల్స్ 1.3 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ పరిశ్రమ 932 మిలియన్ డాలర్లు, నిర్మాణ రంగం 990 మిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్డీఐని రాబట్టాయి. -
తయారీ రంగంలోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ తయారీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,70,720 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్శించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 76 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘తయారీలో భారత్కు వెల్లువెత్తిన నిధుల్లో 27.01 శాతం వాటాతో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. 17.94 శాతం వాటాతో యూఎస్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వరుసలో మారిషస్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నిలిచాయి.కోవిడ్ మహమ్మారి, ప్రపంచ పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ 2021–22లో భారత్ అత్యధికంగా రూ.6.78 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది’ అని వివరించింది. చదవండి: Zomato Stock Crash Prediction: జొమాటో షేర్లలో అల్లకల్లోలం, రాకేష్ ఝున్ఝున్ వాలా మాట వింటే బాగుండేదే! -
'మెట్రో'కు భారీ షాక్, వేలకోట్ల లాభాలే లక్ష్యంగా!
న్యూఢిల్లీ: మెట్రో ఏజీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిధులు మళ్లించుకునే క్రమంలో ఉందని అఖిల భారత రిటైలర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రో ఆరోపణలు చేసింది. మెట్రో ఏజీ భారత వ్యాపార విభాగం మెట్రో క్యాష్ అండ్ క్యారీ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఇవి తప్పుడు ఆరోపణలు అని, హాని కలిగించే ఉద్దేశ్యంతో చేస్తున్నవిగా మెట్రో ఏజీ ఖండించింది. మెట్రో ఏజీ 2003లో భారత్లోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 31 మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్లో వ్యాపారాన్ని విక్రయించి వెళ్లిపోయే సన్నాహాల్లో ఉంది. అమెజాన్, రిలయన్స్ రిటైల్, సీపీ గ్రూపు తదితర సంస్థలు బిడ్ వేసే యోచనతో ఉన్నాయి. ఈ క్రమంలో సీఏఐటీ ఆరోపణలు, అభ్యంతరాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘మీడియా కథనాల ప్రకారం మెట్రో జర్మనీ భారత వ్యాపారాన్ని విక్రయించి, తన పెట్టుబడులపై రూ.10,000 కోట్లకు పైగా లాభాలను పొందాలనుకుటోంది. భారత్లో గత సంవత్సరాల్లో భారీ లాభాలను సమకూర్చుకున్న మొత్తాన్ని దారి మళ్లించడమే ఇది. మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీ (హోల్సేల్) రూపంలో బీటుసీ (బిజినెస్ టు కస్టమర్/రిటైల్) వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది ఫెమా, జీఎస్టీ చట్టాలను ఉల్లంఘించడమే. వ్యవస్థలను అపహాస్యం చేయడం. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే సంస్థలు కస్టమర్ల నుంచి పన్ను రిజిస్ట్రేషన్ ఆధారాన్ని తీసుకోవాలి. కానీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా బోగస్ పన్ను రిజిస్ట్రేషన్ కార్డులను తన స్టోర్లకు వచ్చే కస్టమర్లకు జారీ చేసి నిబంధనలను పాతరేసింది’’అని సీఏఐటీ ప్రకటన విడుదల చేసింది. ఈడీ దర్యాప్తు దీనిపై మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేసినట్టు సీఏఐటీ ప్రకటించింది. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఉల్లంఘనలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈడీ త్వరలోనే తన దర్యాప్తు పూర్తి చేసి కనీసం మెట్రో ఇండియాపై రూ.12,000 కోట్ల వరకు జరిమానా విధించొచ్చని పేర్కొంది. సీఏఐటీ ఆరోపణలను మెట్రో ఏజీ ఖండించింది. సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘గత 19 ఏళ్ల భారత కార్యకలాపాల్లో నియంత్రణపరమైన నిబంధనల అమలు, ఎఫ్డీఐ, భారత చట్టాలను అనుసరించడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు ఉంది. కనుక స్వార్థ ప్రయోజనాల కోణంలో చేసిన తప్పుడు, హానికారక ఆరోపణలను ఖండిస్తున్నాం’’అని పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్లో కార్లయిల్ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజం కార్లయిల్ గ్రూప్.. ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల మార్గంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్ 2023 మార్చివరకూ 26 శాతం వాటాను కొనసాగించనున్న నేపథ్యంలో మార్పిడికి వీలయ్యే రుణ సెక్యూరిటీల జారీపై యూఎస్ పీఈ దిగ్గజం కార్లయిల్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎఫ్డీఐ మార్గంలో విదేశీ పోర్ట్ఫోలియో(ఎఫ్పీఐ) విధానంలో కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ గ్రూప్ ప్రణాళికలు వేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఎఫ్డీఐగా అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల(జూలై) మధ్యలో యస్ బ్యాంక్ బోర్డు సమావేశంకానుంది. ఈ సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు అంచనా. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బ్యాంకులో 4.9 శాతానికి మించి వాటాను సొంతం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దీనికితోడు బ్యాంకులో వ్యక్తిగత వాటా విషయంలో 10 శాతం, ఫైనాన్షియల్ సంస్థలైతే 15 శాతంవరకూ పెట్టుబడులపై ఆర్బీఐ పరిమితులు విధించింది. చర్చల దశలో యస్ బ్యాంకులో 50–60 కోట్ల డాలర్లు(రూ. 3,750–4,500 కోట్లు) వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క బ్యాలన్స్షీట్ పటిష్టతకు పీఈ ఇన్వెస్టర్ల నుంచి 1–1.5 బిలియన్ డాలర్లు(రూ. 7,800–11,700 కోట్లు) సమీకరించేందుకు యస్ బ్యాంక్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్లయిల్ వాటా కొనుగోలు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్లోగల మొత్తం వాటాను విక్రయించేందుకు కార్లయిల్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్కల్లా ఎస్బీఐ కార్డ్స్లో కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏ రోవర్ హోల్డింగ్స్ 3.09 శాతం వాటాను కలిగి ఉంది. -
ఎల్ఐసీలో ఎఫ్డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
రూ.7.5 లక్షల కోట్ల ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి బలోపేతానికి, వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు పది అంచెల విధానాన్ని సూచించింది. మౌలిక రంగంలో పెట్టుబడులను వేగవంతం చేయడం, పీఎల్ఐ కిందకు మరిన్ని రంగాలను తీసుకురావడం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచడం, అధిక కమోడిటీ ధరలను పరిష్కరించడం, ముడిసరుకులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. -
అంతా మోదీ చలవే!, దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం!
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఐ పాలనాకాలంతో పోల్చిచూస్తే, మోడీ పాలనా కాలంలో దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహం 65 శాతం పెరిగి, 500.5 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లు 2022, అప్రాప్రియేషన్ బిల్లు, 2022పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈ మేరకు సమాధానం ఇస్తూ, యూఎన్సీటీఏడీ (వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదిక) నివేదిక ప్రకారం, ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించే ఐదు దేశాల్లో భారతదేశం ఒకటిగా కొనసాగుతోందని అన్నారు.2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ఎఫ్డీఐల ప్రవాహం 81.72 బిలియన్ డాలర్లయితే, 2019–20లో ఈ విలువ 74.9 బిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు. మహమ్మారి సమయంలోనూ ఎఫ్డీఐల ప్రవాహం దేశంలోకి కొనసాగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం పన్నుల పెంపు దిశగా ఆలోచించలేదని, ఆర్థిక పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి ఎటువంటి పన్నును పెంచలేదని ఆమె అన్నారు. ఓఈసీడీ నివేదిక ప్రకారం, 32 దేశాలు తమ ఆర్థిక పునరుద్ధరణలకు నిధులు సమకూర్చడానికి తమ పన్ను రేట్ల పెంపువైపే మొగ్గుచూపాయని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం మహమ్మారి తరహాలోనే అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల నుండి రాష్ట్రాలకు రూ. 8.35 లక్షల కోట్లు కేటాయించామని ఆర్థికమంత్రి పేర్కొంటూ, ఇది 2021–22కి సవరించిన అంచనా రూ. 7.45 లక్షల కోట్ల కంటే అధికమని అన్నారు. -
భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు!
భారత్కు సరిహద్దు దేశాల నుంచి 2020 ఏప్రిల్ 18 నుంచి దాదాపు 347 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రతిపాదనలు వచ్చినట్లు వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ లోక్సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. వీటి విలువ రూ.75,951 కోట్లని తెలిపారు. వీటిలో 13,625 కోట్ల విలువైన 66 ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. భారత్ ఆమోదించిన 66 ప్రతిపాదనల్లో ఆటోమొబైల్ (7), రసాయనాలు (5), కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ (3), ఫార్మా (4), విద్య (1), ఎలక్ట్రానిక్స్ (8), ఫుడ్ ప్రాసెసింగ్ (2), సమాచార, ప్రసారంతో సహా రంగాలకు చెందినవి (1), యంత్ర పరికరాలు (1), పెట్రోలియం, సహజ వాయువు (1), విద్యుత్ (1), సేవల రంగం (11) ఉన్నాయని మంత్రి వివరించారు. 193 ప్రతిపాదనల విషయంలో తిరస్కరించడమో, మూసివేయడమో లేక ఆయా దేశాలు ఉపసంహరించుకోవడమే జరిగిందన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 ఏప్రిల్లో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుండి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ముందస్తు అనుమతిని కేంద్రం తప్పనిసరి చేసింది. భారత్ సరిహద్దు దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మియన్మార్, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. చదవండి: భారత్పై ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు! ఇక బాదుడేనా? -
నోటిఫికేషన్ కూడా వచ్చేసింది..ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తాజాగా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకూ ఎల్ఐసీలో ఎఫ్డీఐలను అనుమతిస్తూ నోటిఫై చేసింది. గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
ఎల్ఐసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపీవో దిశగా దూసుకెళ్తున్న బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీలో ఆటోమేటిక్ రూట్లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)లకు కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపిందని సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సంస్థలో వాటాను పాక్షికంగా విక్రయించడం, తాజా ఈక్విటీ మూలధనాన్ని పెంచడం ద్వారా ఐపీవోతో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లను లిస్టింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్కు వేదికగా నిలిచిన ఎల్ఐసీ 5 శాతం వాటాను (31.6 కోట్లకుపైగా షేర్లు) రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో మార్చిలో ప్రారంభం కానుంది. సంస్థ ఉద్యోగులు, పాలసీదార్లకు ఫ్లోర్ ప్రైస్పై తగ్గింపు లభిస్తుంది. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అతి పెద్దదిగా నిలవనుంది. లిస్టింగ్ పూర్తి అయితే సంస్థ మార్కెట్ విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్ర శ్రేణి కంపెనీలతో పోల్చవచ్చు. చదవండి: చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
భారత్కు భారీ ఎఫ్డీఐలు: గోయల్
న్యూఢిల్లీ: భారత్కు భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వస్తున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎఫ్డీఐలు 62 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. గడచిన ఏడు సంవత్సరాలుగా ఎఫ్డీఐల విషయంలో భారత్ మంచి ఫలితాలు సాధించిందని, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021– బహుళజాతి సంస్థలు (ఎన్ఎన్సీ) అనే అంశంపై ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. యూఏఈ, ఆస్ట్రేలియాలతో త్వరలో ఎఫ్టీఏలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్టీఏ)లపై గోయల్ మాట్లాడుతూ, యుఏఈ, ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇజ్రాయెల్, జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్)) గ్రూప్తో సహా పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. రానున్న 60 నుంచి 100 రోజుల్లో యూఏఈ, ఆస్ట్రేలియాలతో ఎఫ్టీఏలకు సంబంధించి కీలక అవగాహనలకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు బహుళజాతి కంపెనీలు భారత్ను స్థావరంగా ఎంచుకోవాలని, తద్వారా అధిక వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు పొందాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎఫ్టీఏ కింద, రెండు భాగస్వామ్య దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తాయి. లేదా తొలగిస్తాయి. సేవలలో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, పెట్టుబడులను పెంచుకోడానికి కూడా ఆయా దేశాలు నిబంధనలను సరళీకరిస్తాయి. -
ఎగుమతుల్లో కొత్త రికార్డులు సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయులను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే సర్వీసుల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వెరసి ఇటు వస్తువులు, అటు ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదు చేయగలమని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలోకి 27 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయని మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 62 శాతం ఎగిశాయని వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందని, లాక్డౌన్ విధించిన ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వ్యవస్థకు ఎటువంటి అంతరాయాలూ ఏర్పడకుండా సేవలు అందించిందని మంత్రి చెప్పారు. దేశ ఎకానమీ వేగంగా కోలుకుంటోందనడానికి అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.3 లక్షల పైగా నమోదు కావడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్కి ఉన్న సానుకూల అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్ను నెగెటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి మార్చిందని మంత్రి చెప్పారు. మెరుగైన ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. -
టెలికంలో 100 శాతం ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: టెలికం సేవల రంగంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మంగళవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020లో జారీ చేసిన ప్రెస్ నోట్ 3లోని నిబంధనలు దీనికి వర్తిస్తాయని పేర్కొంది. దీని ప్రకారం భారత్తో సరిహద్దులున్న దేశాల ఇన్వెస్టర్లు, లేదా అంతిమంగా ప్రయోజనాలు పొందే వారు సరిహద్దు దేశాలకు చెందినవారైతే మాత్రం దేశీయంగా టెలికంలో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా టెలికం రంగంలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్డీఐలకు ఆటోమేటిక్ విధానం అమలవుతోంది. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలను గట్టెక్కించేందుకు ఇటీవల ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎఫ్డీఐల పరిమితిని కూడా కేంద్రం 100 శాతానికి పెంచింది. మరోవైపు, టెల్కోలు సమరి్పంచాల్సిన పనితీరు, ఆర్థిక బ్యాంక్ గ్యారంటీ పరిమాణాన్ని 80 శాతం మేర తగ్గిస్తూ టెలికం శాఖ (డాట్) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్సు నిబంధనల సవరణ నోట్ను జారీ చేసింది. దీని ప్రకారం టెల్కోలు తాము తీసుకునే లైసెన్సు కింద అందించే ప్రతి సర్వీసుకు రూ. 44 కోట్ల పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. పాత నిబంధన ప్రకారం ఇది రూ. 220 కోట్లుగా ఉండేది. అలాగే కొత్త నిబంధన ప్రకారం ప్రతి సర్కిల్కు గరిష్టంగా రూ. 8.8 కోట్ల ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో ఇది రూ. 44 కోట్లుగా ఉండేది. కోర్టు ఆదేశాలు లేదా వివాదానికి సంబంధించి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలకు ఇది వర్తించదు. తాజా సవరణతో టెల్కోలకు ఊరట లభించనుంది. గ్యారంటీల కింద బ్యాంకులో తప్పనిసరిగా ఉంచే మొత్తంలో కొంత భాగం చేతికి అందడం వల్ల నిధులపరంగా కాస్త వెసులుబాటు ఉంటుంది. -
ఎఫ్డీఐల రాకలో 62 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) రాకలో 62 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 16.92 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు రాగా, ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్డీఐ ఈక్విటీల రాక 112 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 9.61 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్డీఐ ఈక్విటీల రాకలో ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరిశ్రమ 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సేవారంగం 10 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీలో 87 శాతం కర్ణాటక నుంచే నమోదైంది. తొలి నాలుగు నెలల్లో మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీల్లో కర్ణాటకకు 45 శాతం, మహారాష్ట్రకు 23 శాతం, ఢిల్లీకి 12 శాతం వచ్చాయి. ఎఫ్డీఐ ఈక్విటీల రాకలో టాప్–10 రాష్ట్రాలు.. మహారాష్ట్ర (27 శాతం), గుజరాత్ (25), కర్ణాటక (20), ఢిల్లీ (11), తమిళనాడు (4), హరియాణా (3), జార్ఖండ్ (3), తెలంగాణ (2), పంజాబ్ (1), పశ్చిమ బెంగాల్ (1శాతం)తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. 8వ స్థానంలో నిలిచిన తెలంగాణకు తొలి మూడు నెలల్లో రూ. 4,226 కోట్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్య మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఎఫ్డీఐల రాకలో తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్కు ఈ కాలంలో రూ. 2,577 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణకు రూ. 17,709 కోట్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయి. చదవండి: చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి -
భారత్కు ఎఫ్డీఐలు కీలకం, వచ్చే మూడేళ్లలో 75 వేల మంది రిక్రూట్
వాషింగ్టన్: భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) కీలకమని డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్, అమెరికా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో పలువురు ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. తాము నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,200 మంది వ్యాపార దిగ్గజాల్లో అయిదింట రెండొంతుల మంది.. ఇండియాలో అదనంగా పెట్టుబడులు పెట్టడం లేదా తొలిసారిగా ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి కనపర్చినట్లు ఒక ఇంటర్వ్యూలో రంజన్ చెప్పారు. విదేశీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని ఆయన వివరించారు. ‘కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్లోకి రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు వచ్చాయి. 5 లక్షల కోట్ల ఎకానమీగా ఎదగాలన్న భారత్ లక్ష్యం సాకారం కావడానికి విదేశీ పెట్టుబడులు కీలకం. అంతే కాదు ఇది సాధించతగిన లక్ష్యమే అన్నది నా అభిప్రాయం‘ అని రంజన్ వివరించారు. ఆకర్షణీయమైన అంశాలు.. సుశిక్షితులైన నిపుణులు, ఆర్థిక వృద్ధి (ముఖ్యంగా దేశీయంగా) వంటి అంశాలు ఎఫ్డీఐలను ఆకర్షించేందుకు అనువైన అంశాలుగా ఉంటున్నాయని తమ సర్వేలో తేలినట్లు రంజన్ వివరించారు. ఇన్వెస్టర్లకు భారత్ ఎగుమతి హబ్గా ఉపయోగపడటంతో పాటు దేశీ మార్కెట్ కూడా అందుబాటులో ఉండటం ముఖ్యమని ఆయన చెప్పారు. అయితే, భారత్లో వ్యాపారం చేయడమంటే సవాళ్లతో కూడుకున్న వ్యవహారమనే అభిప్రాయం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు సహా పలు ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు, సంస్కరణలపై అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని రంజన్ అభిప్రాయపడ్డారు. కస్టమర్ల డిజిటైజేషన్, అనుమతుల ప్రక్రియ, ఉత్పత్తికి ప్రోత్సాహకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తమకు అంతగా తెలియదని జపాన్లో 16 శాతం మంది, సింగపూర్లో 9 శాతం మంది వ్యాపార దిగ్గజాలు చెప్పారని ఆయన వివరించారు. ‘ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనుల గురించి ఇన్వెస్టర్లలో సరైన అవగాహన ఉండటం లేదు‘ అని రంజన్ చెప్పారు. భారత ప్రభుత్వ విధానాలు కచ్చితంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సహాయపడే విధంగానే ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రాపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం సానుకూలాంశమని పేర్కొన్నారు. భారత్లో 75వేల నియామకాలు.. వచ్చే మూడేళ్లలో భారత్లో 75 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు రంజన్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం డెలాయిట్కు అంతర్జాతీయంగా మొత్తం 3,45,000 మంది సిబ్బంది ఉండగా.. దేశీయంగా 65,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఆ మూడు రంగాలే కీలకం, భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు!
న్యూఢిల్లీ: సరిహద్దులను పంచుకుంటున్న దేశాల నుంచి ప్రధానంగా మూడు శాఖలకు అధిక స్థాయిలో పెట్టుబడి ప్రతిపాదనలు వస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్– ఐటీ, పరిశ్రమలు– అంతర్గత వాణిజ్యం, భారీ పరిశ్రమల్లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) ప్రతిపాదనలు లభిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2020 ఏప్రిల్లో ప్రభుత్వం పొరుగు దేశాల నుంచి పెట్టుబడుల విషయంలో ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశీ కంపెనీల టేకోవర్ అవకాశాలను అడ్డుకునే యోచనతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. జాబితాలో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా కంపెనీలు దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా మారింది. పొరుగు దేశాల నుంచి లభిస్తున్న ఎఫ్డీఐ ప్రతిపాదనల్లో ప్రధానంగా భారీ యంత్రాలు, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ట్రేడింగ్, వాణిజ్యం, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ తయారీ రంగాలున్నట్లు ప్రభుత్వ అధికారి వివరించారు. చదవండి: భారత్పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
2026-27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా భారత్..!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల(దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి 8 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.588 లక్షల కోట్లు) తాజా గ్రీన్ఫీల్డ్ పెట్టుబడులు అవసరమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్ విశ్లేషించింది. గ్రీన్పీల్డ్ పెట్టుబడి అంటే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ)లో ఒక విధానం. ఈ విధానంలో ఒక పేరెంట్ కంపెనీ వివిధ దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందుకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెడుతుంది. భారత్లో ఈ తరహాలో భారీ పెట్టుబడుల ఆవశ్యకతను డెలాయిట్ ఇచ్చిన తాజా నివేదికలో వివరించింది. కోవిడ్-19 సవాళ్లలోనూ దేశానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని డెలాయిట్ పేర్కొంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశావహ పరిస్థితిని, ఆర్థిక మూలాలకు పటిష్టతను అందించిందని వివరించింది. 2020-21లో ఈక్విటీ, రీ-ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, క్యాపిటల్సహా రికార్డు స్థాయిలో 81.72 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ ముందస్తు ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోల్చితే ఇవి 10 శాతం అధికం కావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్లలోని బహుళజాతి కంపెనీలకు చెందిన 1,200 మంది వ్యాపార వేత్తల అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే అధ్యయనం రూపొందింది. (చదవండి: తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా ఉందని నివేదిక పేర్కొంటూ, నిపుణులైన కార్మిక శక్తి, ఎకానమీ వృద్ధి అవకాశాలు దీనికి కారణమని తెలిపింది. భారత్లో మరిన్ని సంస్కరణల ఆవశ్యకత అవసరమని పేర్కొన్న నివేదిక, తద్వారా దేశానికి మరింత భారీ స్థాయిలో ఎఫ్డీఐలను ఆకర్షించవచ్చని వివరించింది. -
టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: చాలా కాలం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి ఊరట కలిగించే కీలకమైన ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి టెలికామ్ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నేడు జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను టెలికామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుంది అని అన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలపై నేడు హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.(చదవండి: జెట్ ఎయిర్వేస్: టేకాఫ్కు సిద్ధం!) భవిష్యత్ వేలంలో స్పెక్ట్రం కాలవ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నట్లు తెలిపారు. టెలికాంలో 100 శాతం ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. టెలికాం రంగంలో ఆటగాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. -
గతిశక్తి స్కీముతో ఇన్ఫ్రాకు ఊతం
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రాబోయే గతిశక్తి స్కీముతో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించగలదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనితో రవాణా వ్యయాలు తగ్గి, సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయని .. భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యామ్చామ్) 29వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. రహదారి రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) భారత్ అనుమతిస్తోందని, ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని అమెరికాకు చెందిన బీమా, పెన్షన్ ఫండ్లను ఆహా్వనించారు. రూ. 100 లక్షల కోట్ల గతి స్కీమును ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్లో అమల్లోకి తేనున్నారు. జాతీయ ఇన్ఫ్రా పైప్లైన్ (ఎన్ఐపీ) విధివిధానాల రూపకల్పనకు గతిశక్తి మాస్టర్ప్లాన్ తోడ్పడుతుందని గడ్కరీ చెప్పారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగడంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. -
భారత్పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
భారత్లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్లో న్యూస్ ఆపరేషన్స్ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్డౌన్తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ ఎఫ్డీఐ ప్రతిపాదనకు ఓకే!
న్యూఢిల్లీ: యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ రూ.15,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రతిపాదనకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉద్దేశించి యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ (కెనడా పెన్షన్ ఫండ్కు అనుబంధ విభాగం) ఈ భారీ ఎఫ్డీఐ ప్రతిపాదనను చేసింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాటా యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్కు బదలాయింపు కూడా పెట్టుబడుల్లో భాగంగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన నేషనల్ మోనిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) విధానానికి, ఉపాధి కల్పనకు తాజా ఎఫ్డీఐ ప్రతిపాదన భారీ మద్దతునిస్తుందని ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
మేలో విదేశీ పెట్టుబడుల హైజంప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2021) మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) భారీగా ఎగసినట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 203 శాతం జంప్చేసి 12.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,980 కోట్లు) లభించినట్లు తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ఎఫ్డీఐలు 10 శాతం వృద్ధితో 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ప్రోత్సాహంపై విభిన్న పరిశ్రమల సమాఖ్యలతో సమావేశం సందర్భంగా గోయల్ ఈ విషయాలు వెల్లడించారు. -
ప్రైవేటీకరణ దిశగా కేంద్రం జోరు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాటలో కేంద్రం తన స్పీడ్ పెంచింది. ఈ దిశలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) కేంద్రం గురువారం అనుమతినిచ్చింది. దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. ఇక ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ బుధవారమే ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆయిల్, గ్యాస్ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్ రెండవ అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది. ‘‘ఆయిల్, సహజ వాయువు రంగాలకు సంబంధించి ఎఫ్డీఐ విధానానికి కొత్త క్లాజ్ను జోడించడం జరిగింది. దీని ప్రకారం, వ్యూహాత్మక విక్రయాలకు సూత్రప్రాయ ఆమోదం పొందిన సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్లో (కఠిన ఆమోదాలు అవసరం లేని) అనుమతించడం జరుగుతుంది’’ అని డీపీఐఐటీ (పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ) ఒక నోట్లో పేర్కొంది. విదేశీ కంపెనీల ఆసక్తి.. బీపీసీఎల్లో ప్రభుత్వ పూర్తి వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసిన 3 కంపెనీల్లో రెండు విదేశీ కంపెనీలే. ప్రభుత్వం నుంచి 52.98% వాటాను కొనుగోలు చేసే సంస్థ, టేకోవర్ నిబంధనల ప్రకారం ఇతర వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వవచ్చు. బీపీసీఎల్ కొనుగోలు రేసులో వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్వేర్డ్ క్యాపిటల్స్ అనుబంధ విభాగం థింక్ గ్యాస్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకూ 49 శాతమే! 2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్ చేస్తున్న చమురు రిఫైనర్లో ఎఫ్డీఐ పరిమితి 26% నుంచి 49%కి పెరిగింది. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే, ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా! ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. చిన్న విమానాశ్రయాలు షురూ..! దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్సభ గురువారం ఆమోదముద్ర వేసింది. పెగాసస్, రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చా లేకుండా పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
భారత్కు 64 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు
ఐక్యరాజ్యసమితి: కరోనా ప్రతికూల సవాళ్లలోనూ భారత్ 2020లో 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించింది. 2019తో పోల్చితే 25 శాతం పైగా (51 బిలియన్ డాలర్ల నుంచి) పెరిగినట్లు వివరించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. తద్వారా అత్యధిక ఎఫ్డీఐలు ఆకర్షించిన ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఈ పటిష్ట ప్రధాన అంశాలు మధ్యకాలికంగా దేశాన్ని ‘‘ఆశావాదం దృక్పథం’’లో ఉంచుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) 2021 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ నివేదిక పేర్కొంది. దేశ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పరిశ్రమ భారీ ఎఫ్డీఐలను ఆకర్షించినట్లు వివరించింది. దేశం ఎఫ్డీఐల ఆకర్షణ దీర్ఘకాలిక ధోరణిగా ఉంటుందని విశ్లేషించింది. ప్రత్యేకించి ఐసీటీ పరిశ్రమలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అంచనావేసింది. భారత్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రస్తావిస్తూ, తయారీ, ఎగుమతి ఆధారిత పెట్టుబడుల పురోగతికి ఇది ఊతం ఇస్తుందని అభిప్రాయడపింది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని అంచనావేసింది. ప్రపంచవ్యాప్తంగా డౌన్... మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్డీఐలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదిక వివరించింది. 2019తో పోల్చితే 2020లో ప్రపంచంలో ఎఫ్డీఐల విలువ 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్లకు పడిపోయినట్లు ఐరాస పేర్కొంది. మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్కు మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలిపింది. ఈ పరిశ్రమలో ఎఫ్డీఐలు 22% పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇక దక్షిణాసియాలో ఎఫ్డీఐలు 20% వృద్ధితో 71 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించింది. కాగా దక్షిణాసియా నుంచి ఎఫ్డీఐలు 12 శాతం పడిపోయి 12 బిలియన్ డాలర్లకు పరిమితమయినట్లు తెలిపింది. భారత్లో పెట్టుబడులు భారీగా పడిపోవడం దీనికి కారణమని తెలిపింది. అయితే 2021లో భారత్లో పెట్టుబడులు స్థిరీకరణ సాధిస్తాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. కాగా చైనాకు ఎఫ్డీఐలు 2020లో 6 శాతం పెరిగి 149 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. -
కేంద్రం చర్యతో ప్రైవేటు పరం కానున్న మరో సంస్థ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశకు మరో అడుగు ముందుకు పడింది. చమురు, గ్యాస్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిగా 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించే ప్రతిపాదనలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా నోట్ను రూపొందించింది. ఈ ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే భారత రెండో అతిపెద్ద చమురు రంగ సంస్థ బీపీసీఎల్ను ప్రైవేటుపరం చేయడానికి దారులు సుగమం కానుంది. తాజా పరిణామం ప్రకారం .. అంతకుముందే బీపీసీఎల్ను ప్రైవేటుపరం చేసే దానిలో భాగంగా అస్సాంలోని నూమాలీగడ్ రిఫైనరీ నుంచి బీపీసీఎల్ వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదాతో బీపీసీఎల్లోని 52.98 శాతం వాటాను పూర్తిగా ప్రైవేటుపరం కానుంది . బీపీసీఎల్ కంపెనీను సొంతం చేసుకొవడానికి ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ వేదాంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్డీలపై అభిప్రాయాలను సేకరించిన తరువాత కేంద్ర మంత్రి వర్గ అనుమతి కోరనుంది. ప్రస్తుతం, పెట్రోలియం శుద్ధిలో 49 శాతం ఎఫ్డిఐలకు మాత్రమే అనుమతి ఉంది. చదవండి: ‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్బై! -
చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లు..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఈక్విటీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 19 శాతం బలపడ్డాయి. దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ సంస్కరణలు, పెట్టుబడి అవకాశాలు, బిజినెస్లకు సరళ వాతావరణం ఇందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలియజేసింది. ఈక్విటీ, ఆర్జనలను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడులతో కలిపి మొత్తం ఎఫ్డీఐలు 10 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. వెరసి చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది(2019–20)లో ఇవి 74.39 బిలియన్ డాలర్లు మాత్రమే. వీటిలో ఈక్విటీ ఎఫ్డీఐలు 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశాలవారీగా చూస్తే... దేశీ ఎఫ్డీఐలలో 29 శాతం వాటాతో సింగపూర్ టాప్ ర్యాంకులో నిలవగా.. యూఎస్ 23 శాతం, మారిషస్ 9 శాతం చొప్పున వాటాను ఆక్రమించాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల విషయంలో కేంద్ర తీసుకున్న విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడుల అనుకూలత, సులభతర వ్యాపార నిర్వహణ తదితర అంశాలు ఇందుకు సహకరించినట్లు వాణిజ్య శాఖ వివరించింది. వెరసి ప్రపంచ ఇన్వెస్టర్లకు ప్రాధాన్య దేశంగా భారత్ నిలుస్తున్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. రంగాలవారీగా..: ఎఫ్డీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న రంగాలలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 44 శాతం వాటాతో అగ్రపథాన నిలవగా.. నిర్మాణం(మౌలిక సదుపాయాలు) 13 శాతం, సరీ్వసుల రంగం 8 శాతం చొప్పున జాబితాలో చేరాయి. రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్కు 37 శాతం పెట్టుబడులు లభించగా.. 27 శాతం వాటాతో మహారాష్ట్ర రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో కర్ణాటక 13 శాతం ఎఫ్డీఐలను సాధించింది. -
ట్రూజెట్కు కొత్త భాగస్వామి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్ ప్రయాణంలో మరో మైలురాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) రూపంలో కంపెనీలోకి భారీ నిధులు వచ్చిచేరనున్నాయి. ట్రూజెట్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్లో 49 శాతం వాటా కొనుగోలుకు యూఎస్కు చెందిన ఇంటరప్స్ ముందుకొచ్చింది. అయితే వాటా కింద ఎంత మొత్తం పెట్టుబడి చేస్తున్నదీ ఇరు కంపెనీలూ వెల్లడించలేదు. త్వరలోనే ఈ డీల్ పూర్తి కానుంది. టర్బో మేఘా ఎయిర్వేస్ను ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు, పౌర విమానయాన రంగంలో కొత్త అవకాశాల అన్వేషణకు ఈ నిధులను వెచ్చిస్తామని ఎంఈఐఎల్ గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్, ఇంటరప్స్ చైర్మన్ పాలెపు లక్ష్మీ ప్రసాద్ సంయుక్తంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 21 కేంద్రాలు.. హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ 2015 జూలైలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉడాన్ పథకం ఆసరాగా మెట్రోలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను అనుసంధానిస్తూ విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరుతోపాటు విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతితోసహా 21 కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 28.2 లక్షల మంది ట్రూజెట్లో ప్రయాణించారు. సంస్థ ఖాతాలో ఏడు విమానాలు వచ్చి చేరాయి. ఏటీఆర్–72 రకం ఎయిర్క్రాఫ్ట్స్ను కంపెనీ వినియోగిస్తోంది. హైదరాబాద్–ఔరంగాబాద్ సెక్టార్లో ట్రూజెట్ మాత్రమే సర్వీసులను నడుపుతోంది. కాగా, లక్ష్మీ ప్రసాద్ గతంలో హైదరాబాద్లో చార్టర్డ్ అకౌంటెంట్గా సేవలందించారు. 1997లో యూఎస్లో అడుగుపెట్టారు. గతేడాది ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. -
బీమాకు పెట్టుబడుల ధీమా!
న్యూఢిల్లీ: దేశీయంగా బీమా కంపెనీలకు పెట్టుబడులపరమైన తోడ్పాటు లభించేలా ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు పార్లమెంటు సోమవారం ఆమోదముద్ర వేసింది. వాయిస్ వోట్ ద్వారా లోక్సభలో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటిదాకా జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా చట్టం 1938ని సవరిస్తూ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ (సవరణ) బిల్లు 2021కి రాజ్యసభ గతవారమే ఆమోదముద్ర వేసింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐ పరిమితిని పెంచడం .. బీమా కంపెనీలు మరిన్ని నిధులు సమీకరించుకునేందుకు, ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తోందని, తమంతట తాము నిధులు సమీకరించుకోవాల్సిన ప్రైవేట్ సంస్థలకు ఎఫ్డీఐల పరిమితి పెంపుతో కొంత ఊతం లభించగలదని ఆమె తెలిపారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ సిఫార్సులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో బీమా రంగంలో 26 శాతంగా ఉన్న ఎఫ్డీఐ పరిమితిని 2015లో 49%కి పెంచగా.. తాజాగా దాన్ని 74 శాతానికి పెంచినట్లు తెలిపారు. కంపెనీలకు కోవిడ్ కష్టాలు.. సాల్వెన్సీ మార్జిన్ల నిర్వహణకు (జరపాల్సిన చెల్లింపులతో పోలిస్తే అసెట్స్ నిష్పత్తి) సంబంధించి బీమా కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు. ‘బీమా సంస్థలు.. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు.. నిధుల సమీకరణపరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కష్టాలు దీనికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకలాపాల వృద్ధికి అవసరమైన పెట్టుబడులు రాకపోతే పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎఫ్డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది‘ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఏడు ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో మూడు కంపెనీల్లో సాల్వెన్సీ మార్జిన్లు నిర్దేశించిన స్థాయికన్నా తక్కువ ఉన్నాయని మంత్రి చెప్పారు. అయితే, వాటికి కావాల్సిన అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా అవి ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం తగు సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఏయూఎం.. 76 శాతం అప్.. 2015 నుంచి బీమా రంగంలోకి రూ. 26,000 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయని, నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) పరిమాణం గడిచిన అయిదేళ్లలో 76 శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా కంపెనీల సంఖ్య 53 నుంచి 68కి పెరిగిందని, గత అయిదేళ్లలో 6 కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయని వివరించారు. బీమా సంస్థల్లో 74% ఎఫ్డీఐలనేది గరిష్ట పరిమితి మాత్రమేనని, ఆయా కంపెనీలు దీన్ని కచ్చితంగా ఆ స్థాయికి పెంచుకోవాలనేమీ లేదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2021–22 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐని పెంచేలా సీతారామన్ ప్రతిపాదన చేశారు. బిల్లులో ప్రత్యేకాంశాలు.. ► బీమా సంస్థలు.. పాలసీదారుల సొమ్మును భారత్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు తీసుకెళ్లేందుకు కుదరదు. లాభాల్లో కొంత భాగాన్ని భారత్లోనే అట్టే ఉంచాలి. ► బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్మెంట్లో కీలక సభ్యులు స్థానిక భారతీయులే ఉండాలి. డైరెక్టర్లలో కనీసం 50 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. ఇన్ఫ్రా కోసం నాబ్ఫిడ్ బిల్లు.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ (డీఎఫ్ఐ) ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్ఫిడ్) బిల్లు 2021ని సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటయ్యే డీఎఫ్ఐ రాబోయే కొన్నేళ్లలో రూ. 3 లక్షల కోట్ల దాకా నిధులు సమీకరించవచ్చు. తద్వారా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ కింద దాదాపు 7,000 ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ఇది తోడ్పడనుంది. మరోవైపు, మైనింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ఉద్దేశించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2021ని ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఆమోదించింది. -
టాప్ 8లో తెలంగాణ: 9 నెలల్లో 6,466 కోట్ల ఎఫ్డీఐలు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ఆకర్షణలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 9 నెలల కాలానికి మొత్తం రూ. 6,466 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఇవి దేశంలోని మొత్తం ఎఫ్డీఐల రాకలో 2 శాతం. అక్టోబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు మొత్తంగా రూ.11,331.61 కోట్లు వచ్చాయి. ఇది మొత్తం ఎఫ్డీఐల్లో 2.4 శాతంగా ఉంది. అక్టోబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తం రూ.5,54,613.65 కోట్ల మేర ఎఫ్డీఐలు దేశంలోకి వచ్చాయి. ఇందులో 31.92 శాతంతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.1,77,052 కోట్ల మేర ఆ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. రూ.1,53,351 కోట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఎఫ్డీఐలలో మహారాష్ట్ర వాటా 27.65 శాతంగా ఉంది. అలాగే రూ.78,159 కోట్లు ఆకర్షించి కర్ణాటక మూడో స్థానంలో, రూ. 59,830 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో, రూ.19,733 కోట్లతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయి. రూ.1,975.74 కోట్ల ఎఫ్డీఐలతో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో నిలిచింది. సర్వీస్ సెక్టార్లోనే అత్యధికం.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, నాన్–ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్, పరిశోధన-అభివృద్ధి, కొరియర్, టెక్నాలజీ, టెస్టింగ్ అండ్ అనాలిసిస్ తదితర సేవలు అందించే ఈ రంగానికి 16 శాతం ఎఫ్డీఐలు రాగా ఆ తరువాత కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరిశ్రమలోకి 13 శాతం పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరిశ్రమలోకి ఏకంగా రూ.1,81,470 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రంగాల తరువాత వరుసగా టెలి కమ్యూనికేషన్లు (7 శాతం), ట్రేడింగ్ (6 శాతం), భవన నిర్మాణ రంగం (5 శాతం), ఆటో పరిశ్రమ (5 శాతం), మౌలికవసతుల నిర్మాణ రంగం (5 శాతం), రసాయనాలు (4 శాతం), ఫార్మా (3 శాతం), హోటల్, టూరిజం (3 శాతం) రంగాలు నిలిచాయి. -
బీమాపై ‘విదేశీ’ ముద్ర
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) 74 శాతానికి పెంచే ప్రతిపాదనను బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. మన దేశంలో బీమా ఉత్పత్తుల విస్తరణ ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కాకపోతే ఎఫ్డీఐ పెంపు అనంతరం కూడా బీమా కంపెనీల బోర్డుల్లో మెజారిటీ డైరెక్టర్లు, యాజమాన్యంలో కీలకమైన వ్యక్తులు అందరూ భారతీయులే ఉండాలన్న ‘కంపెనీ నిర్మాణాన్ని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. బీమా చట్టం 1938ను సవరించడం ద్వారా బీమా కంపెనీల్లో ఎఫ్డీఐ పరిమితిని ప్రస్తుత 49% నుంచి 74%కి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. తగిన రక్షణలతో విదేశీ యాజమాన్యాన్ని, నిర్వహణను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని చివరిగా 2015లో అప్పటి వరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం జరిగింది. మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తుల వ్యాప్తి జీడీపీలో 3.6 శాతంగా ఉండగా, ప్రపంచ సగటు 7.13 శాతంతో పోలిస్తే తక్కువలో ఉండడం గమనార్హం. అదే సాధారణ బీమా విషయంలో ప్రపంచ సగటు 2.88 శాతం అయితే, మన దేశంలో మాత్రం వ్యాప్తి 0.94 శాతంగానే ఉంది. -
ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా.. ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణతో పాటు ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టసవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.(చదవండి: లైవ్ అప్డేట్స్: దిగి రానున్న వెండి, బంగారం ధరలు) ‘‘ఇన్సూరెన్స్ యాక్ట్-1938కు సవరణలు చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నా. తద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమవుతుంది. నిబంధనలను అనుసరించి విదేశీ యాజమాన్యం పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయి’’ అని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. I propose to amend the Insurance Act 1938 to increase the permissible FDI limit from 49% to 74% in insurance companies and allow foreign ownership & control with safeguards: Finance Minister Nirmala Sitharaman. #Budget2021 pic.twitter.com/c9WHDH4CQ2 — ANI (@ANI) February 1, 2021 బడ్జెట్ బూస్టింగ్ మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్తో స్టాక్మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది. -
డీల్ స్ట్రీట్లో డాన్.. రిలయన్స్
ముంబై: కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. రిలయన్స్ కారణంగా భారీ డీల్స్ కుదిరాయంటున్న ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే..., ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డీల్స్ 7 శాతం వృద్ధితో 8,000 కోట్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం 1,268 లావాదేవీలు జరిగాయి. ► దీంట్లో మూడో వంతుకు పైగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించిన డీల్స్ ఉన్నాయి. ► రిలయన్స్కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో 1,020 కోట్ల డాలర్లు సాధించింది. ఇక రిటైల్ విభాగం కూడా వేల కోట్ల ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను ఆకర్షించింది. ► ఈ ఏడాది జరిగిన మొత్తం డీల్స్లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ వాటా దాదాపు సగంగా ఉంది. ఇక ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) లావాదేవీలు గత ఏడాది మాదిరిగానే 3,820 కోట్ల డాలర్ల రేంజ్లో ఉన్నాయి. ► ఈ ఏడాది ఆరంభంలో టెలికం రంగంలో భారీ డీల్స్ వచ్చాయి. ఆ తర్వాత కరోనా కల్లోలం చెలరేగడంతో పలు సంస్థల తమ ఒప్పందాలను వాయిదా వేశాయి. పలు పీఈ ఫండ్స్ కూడా వేచి చూసే ధోరణిని అవలంభించాయి. ► దేశీయ డీల్స్ పరంగా చూస్తే, రిలయన్స్ రిటైల్–ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందమే పెద్దది. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ 330 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ► విదేశీ సంస్థల డీల్స్ ఈ ఏడాది 11 శాతం పెరిగాయి. రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటా కోసం ఫేస్బుక్ సంస్థ 570 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. లాక్డౌన్ కాలంలో జరిగిన అతి పెద్ద డీల్ ఇదే. ► ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి 3,000 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ)లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఎఫ్డీఐలతో పోల్చితే ఇది 15 శాతం అధికం. ► రిలయన్స్ వల్లనే అధికంగా పీఈ డీల్స్ జరిగాయి. ఫేస్బుక్, టీపీజీ, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ తదితర పీఈ ఫండ్స్, సావరిన్ ఫండ్స్ రిలయన్స్ జియోలో 980 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాది పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇది 66 శాతానికి సమానం. రిలయన్స్ రిటైల్ వెంచర్లో 510 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ 1,500 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇది రికార్డ్ స్థాయి. ► ఈ ఏడాది అత్యధిక నిధులు ఆకర్షించిన రంగంగా టెలికం నిలిచింది. ఈ రంగంలోకి మొత్తం 1,120 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక రిటైల్ రంగంలో 650 కోట్ల డాలర్లు, టెక్నాలజీ రంగంలో 600 కోట్ల డాలర్లు, ఫార్మాలో 250 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► వాటాలను విక్రయించి వివిధ సంస్థల నుంచి పీఈ సంస్థలు వైదొలగడం గత ఐదేళ్లలోనే అత్యంత కనిష్టానికి ఈ ఏడాది పడిపోయింది. స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉండటమే దీనికి కారణం. ఈ వాటాల విక్రయం పరంగా చూస్తే, మొత్తం 420 కోట్ల డాలర్ల విలువైన 136 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది డీల్స్తో పోల్చితే 56 శాతం తక్కువ. (విలువ పరంగా) -
డీటీహెచ్ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్
న్యూఢిల్లీ: డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్ ‘‘భారత్లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. 8 శాతానికి తగ్గింపు నూతన నిబంధనల కింద లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎస్ఎమ్ఎస్), కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్వేర్ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది. సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి ‘‘మంత్రి ప్రకాశ్ జవదేకర్కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్ నాగ్పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి. కేబుల్ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ పరిధిలోనే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్పాల్ చెప్పారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... ► మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ► ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్లో 137 కోట్ల డాలర్లు, మారిషస్లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. ► ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. ► 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్డీఐలను ఆకర్షించాయి. ► గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
కరోనా కల్లోలంలోనూ ఎఫ్డీఐల జోరు..!
న్యూఢిల్లీ: భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ)జోరు కొనసాగుతోందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఎఫ్డీఐలు 13% వృద్ధితో 4,000 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం నెలకొన్నా, మ న దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం ఆ గలేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ సీఐఐ నిర్వహిం చిన భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. పూర్తి సహకారం.. భారత్లో వివిధ రంగాల్లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందిగా విదేశీ ఇ న్వెస్టర్లను గోయెల్ ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పూర్తి సహకారం అందిస్తామన్నారు. మరిన్ని సంస్కరణలు... భారత్ మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఫిన్లాండ్ విదేశీ వాణిజ్య మంత్రి విల్లె టపియో స్కిన్నారి వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్, భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాకారం కావడం కోసం ఒక గడువును నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయమై వీలైనంత త్వరగా సంప్రదింపులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఒప్పందం విషయమై 2013 నుంచి ప్రతిష్టంభన నెలకొన్నది. తొమ్మిది రంగాల్లో నిషేధం అన్ని రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో వంద శాతం ఎఫ్డీఐలను అనుమతిస్తున్నామని గోయెల్ పేర్కొన్నారు. టెలికం, మీడియా, ఫార్మా, బీమా, రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం అవసరమని వివరించారు. లాటరీ వ్యాపారం, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, చిట్ ఫండ్స్, నిధి కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, పొగాకు ఉపయోగించే సిగరెట్లు, సిగార్లు తయారు చేసే వ్యాపారాలు... వీటిల్లో ఎఫ్డీఐలపై నిషేధం ఉందని వివరించారు. -
చైనాకు చెక్ పెట్టెందుకు మరో నిర్ణయం
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చైనీస్ యాప్లను నిషేధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలు 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి(ఎఫ్డీఐ)ని పాటించాల్సి ఉంటుందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. సదరు సంస్థ సీఈఓ ఒక భారతీయ పౌరుడై ఉండాలి. 60 రోజులకు పైగా పనిచేసే విదేశీ ఉద్యోగులందరికీ సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం ఉంటుందంటూ ప్రభుత్వం కొన్ని నియమాలను సూచించింది. 26 శాతం ఎఫ్డీఐ నియమాన్ని కఠినతరం చేయడం ద్వారా దేశంలోని డిజిటల్ మీడియాలో పెట్టుబడులు పెడుతున్న చైనా, ఇతర విదేశీ కంపెనీలపై పట్టు సాధించడానికి ప్రభుత్వానికి వీలవుతుంది. డైలీ హంట్, హలో, యుఎస్ న్యూస్, ఒపెరా న్యూస్, న్యూస్డాగ్ వంటివి ప్రస్తుతం దేశంలో ఉన్న కొన్ని చైనీస్, విదేశీ నియంత్రిత-డిజిటల్ మీడియా సంస్థలు. ఇవి 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేయాలని భావిస్తోంది. ప్రింట్ మీడియా తరహాలో, డిజిటల్ మీడియా ద్వారా వార్తలు ప్రస్తుత వ్యవహారాలను అప్లోడ్ చేయడానికి / ప్రసారం చేయడానికి ప్రభుత్వ మార్గంలో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డిఐ) కేంద్ర క్యాబినెట్ 2019 ఆగస్టులో ఆమోదించింది. ఇప్పుడు, అలాంటి కంపెనీలు అన్ని "ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో వారి ఎఫ్డీఐని 26 శాతం స్థాయికి సమలేఖనం చేయవలసి ఉంటుంది" అని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తెలిపింది. ఇందుకు గాను ఒక సంవత్సరం సమయం ఇవ్వబడింది. ఈ నిర్ణయం యొక్క కొన్ని అంశాలపై వివరణ కోరుతూ వాటాదారుల నుంచి పలు విన్నపాలు వచ్చాయని డీపీఐఐటీ తెలిపింది. కొంతమంది నిపుణులు, పరిశ్రమకు చెందిన వ్యక్తులు తమ రిజర్వేషన్ల స్పష్టతకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారని తెలిపింది. (చదవండి: భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి) ఈ క్రమంలో డీపీఐఐటీ "తగిన సంప్రదింపుల తరువాత, ప్రభుత్వ మార్గం ద్వారా 26 శాతం ఎఫ్డీఐని అనుమతించే నిర్ణయం" రిజిస్టర్ చేయబడిన, భారతదేశంలో ఉన్న లేదా భారతీయ సంస్థలకు చెందిన కొన్ని "వర్గాలకు వర్తిస్తుందని" స్పష్టం చేసింది. అవి ఏవి అనగా - ప్రస్తుత వ్యవహారాలను అప్లోడ్ / స్ట్రీమింగ్ చేసే వెబ్సైట్లు, యాప్ప్, ఇతర ప్లాట్ఫామ్లలో వార్తలు, వార్తలను నేరుగా లేదా పరోక్షంగా డిజిటల్ మీడియా సంస్థలకు లేదా న్యూస్ అగ్రిగేటర్లకు వార్తలను సేకరించడం, రాయడం, పంపిణీ చేయడం చేసేవి; సాఫ్ట్వేర్ / వెబ్ యాప్స్, వార్తా వెబ్సైట్లు, బ్లాగులు, పాడ్కాస్ట్లు, వీడియో బ్లాగులు వంటి వివిధ వనరులను ఉపయోగించి వార్తలను సేకరించి వార్తా విషయాలను ఒకే చోట కలిపే వాటికి ఇవి వర్తిస్తాయి అని తెలిపింది.(చదవండి: ఆర్థిక రికవరీకి విదేశీ పెట్టుబడులు అవసరం) స్వావలంబన,బాధ్యతాయుతమైన డిజిటల్ న్యూస్ మీడియా పర్యావరణ వ్యవస్థను స్థాపించే లక్ష్యంతో ఈ నియమాలు తీసుకువచ్చారు. సంస్థ బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు భారత పౌరులుగా ఉండటం వంటి కొన్ని షరతులకు కంపెనీ కట్టుబడి ఉండాలి; చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక భారతీయుడే ఉండాలి. ఈ నిర్ణయం భారతీయ ప్రయోజనాలకు పక్షపాతం లేని నిజమైన ఎఫ్డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి వచ్చే నకిలీ వార్తలు సమాచార ముప్పు ఉన్నందున ఈ నియమాల ద్వారా భారతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత లభిస్తుంది. -
ఆర్థిక రికవరీకి విదేశీ పెట్టుబడులు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్కు రూ.50–60 లక్షల కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ పెట్టుబడులను మౌలికరంగ ప్రాజెక్టుల రూపంలో, ఎంఎస్ఎంఈ రంగాల్లోకి తీసుకురావడం ద్వారా కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి నిధులు అవసరం. అవి లేకుండా ఆర్థిక వ్యవస్థ చక్రాలు వేగాన్ని అందుకోలేవు. కనీసం రూ.50–60 లక్షల కోట్లు అయినా కావాలి. హైవేలు, విమానాశ్రయాలు, జలమార్గాలు, రైల్వేలు, లాజిస్టిక్ పార్క్లు, మెట్రో, ఎంఎస్ఎంఈ రంగాలు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవు. ఎంఎస్ఎంఈ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్డీఐ అవసరం ఉంది. హైవేలలో విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దుబాయి, అమెరికా ఇన్వెస్టర్లతో సంప్రదింపులు కూడా నడుస్తున్నాయి’’ అని తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటోందంటూ.. మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పెద్ద ఎత్తున నిధులను తీసుకురాగలదని, మరింత మందికి ఉపాధి కల్పించడంతోపాటు, ఆర్థిక రంగ ప్రోత్సాహంపై దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. -
పెట్టుబడులకు ‘ఉద్దీపన’
న్యూఢిల్లీ: ఆర్థిక రంగాన్ని కోవిడ్–19 ప్రభావం నుంచి గట్టెక్కించడానికి ‘స్వయం సమృద్ధి భారతం’పేరిట రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్లో భాగంగా తాము మరిన్ని సంస్కరణలకు తెరతీయబోతున్నట్లు స్పష్టంచేసింది. 4 రోజులుగా ప్యాకేజీలో అంశాల్ని వెల్లడిస్తూ వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... శనివారం పలు రం గాల్లో సంస్కరణలను ప్రకటించారు. బొగ్గు గనుల తవ్వకంతో సహా, రక్షణ ఉత్పత్తుల తయారీ, అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగం, విమా నాశ్రయాల నిర్వహణల్లో ప్రయివేటుకు స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని విద్యుత్ పంపిణీ సంస్థల్ని కూడా ప్రైవేటుకు అప్పగించనున్నట్లు స్పష్టంచేశారు. తాజా ప్రకటనపై వామపక్షాలు మండిపడ్డాయి. ధనికుల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం కోవిడ్ మాటున ఆ ఎజెండాను బయటకు తీసిందంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తుల్ని పంచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారన్నారు. ఇక ప్రభుత్వం వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. పిల్లలు దెబ్బతిన్నపుడు తల్లిదండ్రులు ఆదుకోవాలి తప్ప వడ్డీకి అప్పులిస్తామని చెప్పకూడదన్నారు. పెట్టుబడులకు ఇక వేగంగా అనుమతి ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులకు వేగంగా అనుమతులివ్వటానికి కార్యదర్శుల సాధికార బృందం ద్వారా ఫాస్ట్ట్రాక్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ విధానాన్ని తీసుకొచ్చినట్లు నిర్మలా సీతా రామన్ గుర్తుచేశారు. ‘‘ప్రతి శాఖలో ప్రాజెక్టు డెవలప్మెంట్ సెల్ పెట్టాం. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు పెట్టుబడిదారులు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంచడమే ఈ సెల్ ఉద్దేశం. కొత్త పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలకు ర్యాంకులిస్తున్నాం. ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఐఎస్) పరిధిలోకి 3,376 పారిశ్రామిక ఎస్టేట్లు/సెజ్లను తీసుకొచ్చాం. అన్ని ఇండస్ట్రియల్ పార్కులకు 2020–21లో ర్యాంకులు ఇస్తాం’’అని వివరించారు. త్వరలో మరో 6 విమానాశ్రయాల వేలం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం కింద మరో 6 విమానాశ్రయాలను అతి త్వరలో వేలం వేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. బిడ్డింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని చెప్పారు. మొత్తం 12 విమానాశ్రయాలను వేలం వేయడం ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి రూ.13,000 కోట్ల పెట్టుబడులు రాబట్టనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా అమృత్సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్పూర్, తిరుచ్చీ ఎయిర్పోర్టులను వేలం వేయడానికి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. కేంద్రం గత ఏడాది లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి ఎయిర్పోర్టులకు వేలం నిర్వహించింది. మూడో దశలో ఇంకో 6 ఎయిర్పోర్టులను వేలం వేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్వోకు హబ్గా ఇండియా ఎయిర్క్రాఫ్ట్ మెయింటనెన్స్, రిపేర్, ఓవర్హాల్కు (ఎంఆర్వో) భారత్ను కీలక గమ్య స్థానంగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘దీనిద్వారా పౌర విమానాలే కాదు! రక్షణ విమానాలు సైతం ప్రయోజనం పొందుతాయి. ఈ నిర్ణయం వల్ల విమానాల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అంతిమంగా ప్రయాణిలపై చార్జీల భారం తగ్గుతుంది. ఎంఆర్వోకు భారత్ను హబ్గా మార్చడానికి అవసరమైన సామర్థ్యాలు, మానవ వనరులు మన దగ్గరున్నాయి’’అని చెప్పారామె. భారత గగనతలంపై తొలగనున్న ఆంక్షలు! పౌర విమానాల అవసరాలకు గాను దేశంలో మరింత గగనతలాన్ని స్వేచ్ఛగా వాడుకునేలా నిబంధనలను సడలించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ‘‘ప్రస్తుతం వివిధ కారణాల దృష్ట్యా దేశ గగనతలంలో 60 శాతం మాత్రమే పౌర విమానయానానికి అందుబాటులో ఉంది. దీని వల్ల ప్రయాణించాల్సిన దూరం పెరుగుతోంది. అందుకని మిగిలిన గగనతలాన్ని కూడా వాడుకునేలా నిబంధనలను సడలించనున్నాం. దీనివల్ల దూరం తగ్గి ఇంధనం, సమయం ఆదా అవుతాయి. అలా చేయటంవల్ల భారత విమానయాన రంగానికి ఏటా రూ.1,000 కోట్ల మేర లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నాం’’అని మంత్రి తెలియజేశారు. అంతరిక్ష కార్యక్రమాల్లోకి ప్రైవేట్ సంస్థలు భారత అంతరిక్ష ప్రయోగాలు, కార్యక్రమాల్లో ప్రైవేట్ సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించినట్లు నిర్మల వెల్లడించారు. శాటిలైట్ల ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవల్లో ప్రైవేట్ భాగస్వామ్యానికి చోటు కల్పిస్తామన్నారు. ప్రైవేట్ సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇస్రో సదుపాయాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. భవిష్యత్తులో కొత్త గ్రహాల అన్వేషణ, అంతరిక్ష ప్రయాణాలు వంటి ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలాగే క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడిన వారికి తక్కువ ఖర్చుతో చికిత్స అందించడానికి వీలుగా మెడికల్ ఐసోటోపుల ఉత్పత్తికి పీపీపీ విధానంలో రీసెర్చ్ రియాక్టర్ను నెలకొల్పనున్నట్లు చెప్పారు. ఢిల్లీ, ముంబై సహా కొన్ని ప్రాంతాల్లో డిస్కమ్లను ఇప్పటికే ప్రైవేటీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటు పరం చేయనున్నట్లు ప్రభుత్వ తాజా ప్రకటనతో జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి అధిక జనాభా గల ప్రాంతాలకు ఎక్కువ ప్రైవేట్ సంస్థలు పోటీపడే అవకాశం కనిపిస్తోంది. ఇక దాద్రా నగర్ హవేలీ, డామన్ –డియూ, అండమాన్ –నికోబార్, లడఖ్, లక్షదీవుల వంటి ప్రాంతాలు తక్కువ జనాభా ఉన్నవి. నిజానికి డిస్కమ్లు రాష్త్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. కాబట్టే కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కమ్లను ప్రయివేటీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సోషల్ ఇన్ఫ్రా... ప్రయివేటుకు సాయం సామాజిక మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసే ప్రయివేటు కంపెనీలకిచ్చే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను (వీజీఎఫ్) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికోసం రూ.8,100 కోట్లను అందజేయనున్నట్లు తెలిపారు. ‘‘సోషల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు మనగలగటం కష్టమవుతోంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులకిచ్చే వీజీఎఫ్ మొత్తాన్ని ప్రాజెక్టు వ్యయంలో 30 శాతానికి పెంచుతున్నాం. ఇతర ప్రాజెక్టులకు మాత్రం ప్రస్తుతం ఇస్తున్న 20 శాతం కొనసాగుతుంది’’అని తెలియజేశారు. ‘బొగ్గు’ మైనింగ్కు ఊతం.. దేశంలో బొగ్గు రంగంలో ‘ప్రైవేట్’ను ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. వాణిజ్య స్థాయిలో బొగ్గు మైనింగ్ కార్యకలాపాలకు ఊతమిస్తామన్నారు. ‘దీంతో ఈ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. బొగ్గు మైనింగ్కు సంబంధించి ప్రస్తుత ఫిక్స్డ్ ధర విధానం బదులుగా ఇకపై రెవెన్యూ షేరింగ్ పద్ధతి అమల్లోకి వస్తుంది’ అని అన్నారు. 50 బొగ్గు బ్లాకులను బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామన్నారు. ‘బొగ్గు ఉ త్పత్తిలో స్వావలంబన సాధించడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ప్ర భుత్వ లక్ష్యాలు. బొగ్గు రంగంలో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’ అని చెప్పారు. ‘రక్షణ’లో ఎఫ్డీఐలు.. 74 శాతానికి రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు తెచ్చేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమి తిని పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘రక్షణ ఉత్పత్తుల తయారీ విషయంలో ప్రస్తుతం 49% ఎఫ్డీఐలను అనుమతిస్తున్నాం, దీన్ని ఇకపై 74శాతానికి పెంచు తాం. అదే సమయంలో కొన్ని ఆయుధాల దిగుమతులను నిషేధించబోతున్నాం. వీటిని దేశీ సంస్థల నుంచే కొనుగోలు చేస్తాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని విడిభాగాలను ఇకపై మనదేశంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రక్షణ దిగుమతుల వ్యయం తగ్గిపోతుంది’’అని ఆర్థిక మంత్రి వివరించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు మరింత చురుగ్గా పనిచేయడానికి వాటి కార్పొరేటీకరణ ఉత్తమ మార్గమని చెప్పారామె. తద్వారా అవి స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేటీకరణ అంటే ప్రైవేటీకరణ కాదని స్పష్టంచేశారు. -
పేటీఎం, జొమాటోలకు ఎఫ్డీఐ షాక్!?
సాక్షి, న్యూఢిల్లీ: చైనా పెట్టుబడులపై భారత ప్రభుత్వం దృష్టి సారించిన వేళ స్టార్టప్ కంపెనీలు కష్టాల్లో పడనున్నాయి. ముఖ్యంగా దేశంలో వివిధ రంగాల్లోసేవలందిస్తున్న యూనికార్న్, పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, డ్రీమ్ 11 లాంటి కంపెనీలకు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుడులపై స్వీకరిస్తున్న వీటికి మూలధన కొరత ఏర్పడే అవకాశం వుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను భారత ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇకపై ఈ పెట్టుబడులు భారత ప్రభుత్వ అనుమతికి లోబడి వుంటాయని స్పష్టం చేసింది. భారతీయ కంపెనీల్లో అవకాశవాద పెట్టుబడులు, స్వాధీనాలను అరికట్టే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు అని భారత ప్రభుత్వం శనివారం జారీచేసిన ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది కొత్త పెట్టుడుల కోసం చైనా పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్న కంపెనీలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని పలువురు పెట్టుబడిదారులు, స్టార్టప్ కంపెనీ ఫౌండర్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే 33 శాతం వ్యూహాత్మక చైనీస్ పెట్టుడులను కలిగి ఉన్నతమలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది వుండదనీ యునికార్న్ వ్యవస్థాపకుడు వ్యాఖ్యానించారు. తాజాపరిణామాలపై ఇతర స్టార్టప్ కంపెనీలు ఇంకా స్పందించలేదు. భవిష్యత్తు పెట్టుబడులు నిలిచిపోవడం, లేదా పెట్టుబడుల సమీకరణ జాప్యం కావచ్చని తెలిపారు. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ)పై కొత్త నియమాలు డబ్ల్యుటిఒ సూత్రాలను విరుద్ధమని స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని సవరించాలని చైనా సోమవారం తెలిపింది. చైనా కంపెనీల వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడులు 2019 లో 3.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2018లో 2 బిలియన్ డాలర్లుగా వుంది. ముఖ్యంగా చైనా ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా గ్రూప్, దాని అనుబంధ యాంట్ ఫైనాన్షియల్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసున్ ఆర్జెడ్ క్యాపిటల్ యునికార్న్స్తో సహా పెద్ద సంఖ్యలో భారతీయ స్టార్టప్లలో అనేక వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులను కురిపించాయి. పేటిఎమ్, జోమాటో, బిగ్బాస్కెట్, పాలసీబజార్, ఉడాన్, ఓయో హోటల్స్, ఓలా, డ్రీం 11 వీటిల్లో ప్రముఖంగా వున్నాయి. దీంతో అమెరికాను వెనక్కి నెట్టి మరీ వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకానమీలోకి దూసుకొచ్చింది. మరోవైపు చైనానుంచి భారత సంస్థలకు వచ్చే పెట్టుబడులన్నీ ఇకపై ప్రభుత్వ అనుమతికి లోబడి వుంటాయని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. అలాగే భారత స్టాక్ మార్కెట్లోకి వచ్చిన చైనా పెట్టుబడులపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరా తీస్తోంది. విదేశీ పెట్టుబడుల వివరాలను సమర్పించాలని ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్ల నుంచి వచ్చిన ఉక్కువగా దృష్టి పెట్టాలని సెబీ కేంద్రం కోరింది. దీంతోపాటు వేరే ఏవైనా కంపెనీలు తమకు చైనాలో ఉన్న సంస్థల ద్వారా ఇండియా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయా అనేది కూడా చూడమని సెబీని ప్రభుత్వం ఆదేశించింది. హెచ్డీఎఫ్సీలో చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) వాటా మార్చి క్వార్టర్లో 0.8 శాతం నుంచి 1.01 శాతం పెంచుకుంది. చైనా బ్యాంక్ ఈ వాటాను ఓపెన్ మార్కెట్ పర్చేజ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి
బీజింగ్ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా సహా పొరుగుదేశాలు 'ఆవకాశవాద టేకోవర్'లకు పాల్పడకుండా భారత్ కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. (కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!) అయితే ఎఫ్డీఐల విషయంలో భారత్లో కొత్తగా చోటుచేసుకున్న మార్పులు డబ్ల్యూటీఓ సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని చైనా పేర్కొంది. పక్షపాతంలేకుండా, స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యం వంటి డబ్ల్యూటీఓ సూత్రాలకు భారత్ నిర్ణయం పూర్తి వ్యతిరేఖమని సోమవారం చైనా తెలిపింది. కొత్త నియమనిబంధనలతో చైనా పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం పడనుందని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. వివక్ష పూరిత నూతన విధానాలను భారత్ మారుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమంగా చూడాలని ఆయన కోరారు.(డ్రాగన్ దేశానికి ట్రంప్ హెచ్చరిక) -
భారతి ఎయిర్టెల్కు గ్రీన్ సిగ్నల్, భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్కు భారీ ఊరట లభించింది. భారతీ ఎయిర్టెల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుకోవడానికి టెలికాం విభాగం (డాట్) ఆమోదం తెలిపింది. ఇంతకుముందు అనుమతించిన 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు అనుమతి లభించిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలో కంపెనీ మంగళవారం తెలిపింది. జనవరి 23 తేదీలోపు రూ. 35,586 కోట్ల బకాయిలను చెల్లించడానికి ముందు ఈ ఆమోదం లభించడం గమనార్హం. ఇందులో రూ .21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904 కోట్లు స్పెక్ట్రం బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన భారతి టెలికాం సుమారు రూ 4,900 కోట్ల విదేశి పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతికోసం వేచి చూస్తోంది. నిధుల సమీకరణలో భాగంగా భారతి టెలికాం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని విదేశీ సంస్థల ద్వారా సుమారు రూ 4,900 కోట్ల పెట్టుబడిని సేకరించనుంది. కాగా ఎఫ్డీఐ దరఖాస్తును కేంద్ర టెలికాం శాఖ తిరస్కరించింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్టెల్ తమ సంస్థలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ రెండోసారి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. -
అధికంగా మనకే రావాలి!
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అత్యధికంగా ఆకర్షించే దేశంగా భారత్ నిలవాల్సి ఉందని కేంద్ర ఐటీ, సమాచార, ఎల్రక్టానిక్స్ మంత్రి రవి శంకర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎఫ్డీఐలను ఆకర్షించడానికి ఏంచేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మన దేశంలో డిజిటల్గా అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. యాపిల్ తదితర విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి మార్కెట్, ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉండే విధానాలను అవలంబిస్తున్నామని వివరించారు. ఇక్కడ జరిగిన ఇన్వెస్ట్ డిజికామ్ 2019లో ఆయన ప్రసంగించారు. పన్నులు తగ్గించాం.... కంపెనీలకు అనుకూలమైన విధానాలనే అనుసరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని ప్రసాద్ పేర్కొన్నారు. కంపెనీలు ఆశించిన విధానాలను, సదుపాయాలను కలి్పంచడానికి సదా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తయారీ రంగంలో కంపెనీలు నెలకొల్పేవారికి ఇటీవల కార్పొరేట్ పన్నులు తగ్గించామని, ఈ తగ్గింపుతో పన్నుల విషయంలో వియత్నాం, థాయ్లాండ్ సరసన నిలిచామని వివరించారు. అగ్రస్థానం చేరుకోవాలి..: ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆరి్థక వ్యవస్థగా భారత్ నిలిచిందని ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎఫ్డీఐలను ఆకర్షిస్తున్న తొమ్మిదో దేశంగానే ఉన్నామని, ఈ విషయంలో అగ్రస్థానానికి చేరాల్సి ఉందని వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సి ఉందని చెప్పారు. 6,400 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు గత కొన్నేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు పెరుగుతోందని ప్రసాద్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 6,400 కోట్ల డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమమైన కంపెనీలను ఆకర్షించడానికి పన్నుల్లో, ఇతర నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేశామని పేర్కొన్నారు. మరెంతో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డేటా అనేది కీలకమైన వృద్ధి అంశాల్లో ఒకటని, డేటా ఎనలిటిక్స్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదగాల్సి ఉందని పేర్కొన్నారు. -
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్
గోదావరిఖని(రామగుండం): సుదీర్ఘకాలం తర్వాత సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలోని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతోపాటు అన్ని జాతీయ సంఘాలు పిలుపు మేరకు ఒక్క రోజు సమ్మె ప్రారంభమైంది. కార్మికులు విధులకు గైర్హాజరై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో సింగరేణి యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. విధలకు హాజరయ్యే కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ అరకొరగానే కార్మికులు విధులకు హాజరయ్యారు. బొగ్గు గనుల వద్ద బందోబస్తు సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె ప్రకటించడంతో బొగ్గు గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే కార్మికులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ హెచ్చరించారు. గనుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా.. బొగ్గు పరిశ్రమల్లో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఈ నెల 24న సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో మంగళవారం బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోనుంది. గతంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె పిలుపునిస్తే, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వ్యతిరేకించేది. బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఇటీవల నిర్ణయించాయి. సమ్మెకు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కూడా సమ్మెకు మద్దతు పలకడంతో సింగరేణిలో సమ్మె సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వరాష్ట్రంలో తొలిసారి మద్దతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీబీజీకేఎస్ సమ్మెలో పాల్గొనాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చి జాతీయ సంఘాల సమ్మెకు మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి కార్మికులు పలుమార్లు సమ్మె చేశారు. సకలజనుల సమ్మెలో సుదీర్ఘంగా 35 రోజులు పాల్గొని కార్మికులు తమ పోరాట స్ఫూర్తిని నిరూపించుకున్నారు. గతేడాది జూన్ నెలలో జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన్పటికీ, టీబీజీకేఎస్ దానికి దూరంగా ఉండడంతో సింగరేణిలో కొంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతోంది. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో కార్మికవర్గానికి జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతునివ్వకుంటే కార్మికవర్గంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జాతీయ సంఘాలకు టీబీజీకేఎస్ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.73 కోట్ల ఉత్పత్తికి విఘాతం.. సింగరేణిలో రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. మొన్నటి వరకు గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురువడంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తరుచూ విఘాతం ఏర్పడింది. సాధారణంగా వర్షాకాలం యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిని కుదించుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా యాజమాన్యం ప్రణాళిక రూపొందించుకుంది. సింగరేణిలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు 292.53 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంలో ఇదే కాలంతో పోలుచకుంటే 23.41 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా జరిగినప్పటికీ, మిగతా ఆరు మాసాల కాలంలో 407.47 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. ప్రస్తుతం వర్షాలతో ఉపరితల గనుల్లో నెలకు సగటున 49 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరు నెలల కాలంలో నెలకు 68 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు రెండున్నర లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తేనే వార్షిక లక్ష్యం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, సగటున 1.8 లక్షల ఉత్పత్తి జరుగుతోంది. సమ్మె జరిగితే రూ.50 కోట్ల మేర సింగరేణి యాజమాన్యానికి, రూ.23 కోట్లమేర సింగరేణి కార్మికులు జీతాల రూపంలో నష్టపోనున్నారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికుల వేతనాలు కలిపి దాదాపు రూ.73 కోట్ల నష్టం జరుగనుంది. సమ్మెలోకి వెళ్లనున్న 48 వేల మంది కార్మికులు సింగరేణిలో మొత్తం 48,019 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–1, 2, 3, ఏఎల్పీ డివిజన్లలో సింగరేణిలోనే అత్యధికంగా 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమ్మెలో పాల్గొనాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్లు పిలుపునిచ్చాయి. దీనికి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ మద్దతునిస్తోంది. మరో జాతీయ కార్మిక సంఘమైన బీఎంఎస్ ఈ నెల 23 నుంచి 27 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. భాజపాకు అనుకూలంగా వ్యవహరించే బీఎంఎస్ సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడంతో కోలిండియాలోనూ 24న సమ్మె ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో సింగరేణిలో కార్మికుల సమ్మె సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్లు ఇవే... బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐలను) నిలిపివేయాలి. కోల్ ఇండియా మొత్తం విడదీయకుండా ఒకే కంపెనీగా ఉంచాలి. బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. నిలుపుదల చేసిన రిక్రూట్మెంట్లను వెంటనే చేపట్టాలి. సింగరేణిలో ఉన్న ఖాళీలను ఇంటర్నల్ కార్మికులతో భర్తీ చేయాలి. లాభాల్లో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలి. కారుణ్య నియామకాలు కార్మికులందరికీ వర్తింపజేయాలి. హైకోర్టు తీర్పు ప్రకారం రెండు సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్న కార్మికులు అన్ఫిట్ అయినా వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలి. -
ఇక ఐఫోన్ల ధరలు దిగి వచ్చినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సర్కార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధలను సడలించింది. దీంతో అమెరికా, చైనా టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. ప్రధానంగా భారత వినియోగదారులకు విలాసవంతమైన ఆపిల్ ఫోన్లపై ఉన్న మోజు ఎక్కువే. తాజాగా ఎఫ్డీఐ నిబంధనల సవరణల నేపథ్యంలో ఇకమీద ఆపిల్ ఉత్పత్తులు తక్కువ ధరలకే కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఆపిల్ లాంటి కంపెనీలు సొంత ఆన్లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు చేపట్టే వెసులు బాటు లభించనుంది. ఆపిల్ కంపెనీ, ఐ ఫోన్లు, వాచ్లు, మాక్బుక్స్, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ఇప్పటి వరకు థర్డ్పార్టీ సంస్థలపై ఆధారపడిన సంగతి తెలిసిందే. కానీ, సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో ప్రభుత్వం ఇటీవల ఎఫ్డీఐ నిబంధనల్ని సరళతరం చేసిన నేపథ్యంలో ఆపిల్ భారత మార్కెట్లోకి దూసుకు రానుంది. విదేశీ కంపెనీలకు 30 శాతం ప్రొడక్ట్లను ఇక్కడే తయారు చేయాలనే షరతు విధించింది గతంలో. కానీ భారత ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం దీనికి కొంత సడలింపు ఇచ్చింది. అంటే వార్షికంగా 30 శాతం అనే నిబంధనను సవరించి..ఇకపై ఐదేళ్లకు సగటున 30శాతం సమీకరించినా సరిపోతుందని తెలిపింది. అలాగే ఆన్లైన్ విక్రయాలకు కూడా అనుమతినిచ్చింది. ఇంకా, ఐదేళ్ల ఎగుమతులను పరిగణనలోకి తీసుకునే ప్రస్తుత పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు. సింగిల్-బ్రాండ్ రిటైల్లో ఎఫ్డిఐ కోసం దరఖాస్తు చేసుకున్న బ్రాండ్లు ఆన్లైన్ రిటైల్ సేల్స్ను ప్రారంభించవచ్చు. అయితే రెండేళ్లలో ఫిజికల్ స్టోర్ను తెరవాల్సి వుంటుంది. ఈ నిర్ణయంతో ఆపిల్లాంటి దిగ్గజ కంపెనీలు దేశంలో తమ మార్కెట్ను మరింత పెంచుకునేందుకు అవకాశం లభించినట్టే. ఈ క్రమంలోఅతి త్వరలోనే ఆపిల్ భారత్లో తన తొలి ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించనుందట. దీంతోపాటు వచ్చే ఏడాది నాటికి ఆపిల్ ముంబైలో తన రిటైల్ స్టోర్ను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా భారతదేశంలో 140 రిటైల్ దుకాణాల ద్వారా తన ఫోన్లను విక్రయిస్తున్న ఆపిల్ ఎగుమతుల విషయంలో సుమారు 1.2శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది -
కొత్త ఎఫ్డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం
సాక్షి, ముంబై: భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను రూపొందిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో మంచి సఖ్యతతో మెలగాలనుకుంటోంది. చిల్లర వర్తకంలో నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తద్వారా మీకు కోట్లాది వినియోగదారులనిస్తాం, మాకు ఉద్యోగాలివ్వండి అనే ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పాటించాలనుకుంటోందని పలువురు ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక మాంద్యం వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఆరు నెలల్లోనే వారికి అందించనుంది. గతంలో 30 శాతం ఇక్కడి వనరులనే ఉపయోగించాలనే నిబంధన ఉండేది, కానీ ఇప్పుడు ఆ నిబంధనను సడిలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా ఈ నిబంధన అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్కు వరంగా మారనుంది. ఖర్చులు ఎక్కువగా ఉండడంతో గతంలో ఆపిల్ భారత్ వైపు మొగ్గుచూపలేదు.అలాగే ప్రస్తుతం భారత్లో రియల్మీ, ఒప్పో, శాంసంగ్ స్మార్ట్ఫోన్లు మెరుగైన అమ్మకాలను సాధిస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నించగా సంకీర్ణ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు, ఆరోపణల నేపథ్యంలో యూపీఏ-2 అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఐకియా సంస్థ పన్నెండేళ్ల క్రితం అనుమతులు పొందినా నిబంధనల కారణంగా 2018లో మాత్రమే తమ స్టోర్లను ప్రారంభించ గలిగింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా వియత్నాం వైపు మొగ్గు చూపగా, అమెరికా తమ కార్యకలాపాలను భారత్లో నిర్వహించే విధంగా నూతన రిటైల్ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యువకులు ఎక్కువగా ఉన్న మన దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న మూడు రంగాలలో వస్త్ర, ఎలక్ట్రానిక్స్, ఆటో పరిశ్రమలు ముందున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా బహుళ జాతీయ కంపెనీలు వ్యాపార వ్యూహాలను రచిస్తున్నాయి. చదవండి : ఎఫ్డీఐ 2.0 కేబినెట్ కీలక నిర్ణయాలు : ఎఫ్డీఐ నిబంధనల సడలింపు -
ఎఫ్డీఐ 2.0
న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అలాగే, సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3–4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు.. ‘‘ఎఫ్డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్ ఎఫ్డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్ నిర్ణయాల ఉద్దేశంగా పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతించడం వల్ల దేశీ తయారీ వృద్ధి చెందుతుందన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్లైన్ విక్రయాలతో లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్ తెలిపారు. డిజిటల్ న్యూస్ మీడియా డిజిటల్ మీడియాకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మంచి ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రింట్ మీడియా తరహాలోనే... ఇకపై డిజిటల్ మీడియాలో వార్తలు, కరెంట్ అఫైర్స్ అప్లోడింగ్, స్ట్రీమింగ్ విభాగంలోకి ప్రభుత్వ అనుమతితో 26 శాతం వరకు ఎఫ్డీఐలు ప్రవేశించొచ్చు. ప్రింట్ మీడియాలో ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 26 శాతం ఎఫ్డీఐకి అనుమతి ఉంది. అలాగే, బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ సేవల్లోనూ ప్రభుత్వ అనుమతితో 49 శాతం ఎఫ్డీఐలకు ప్రవేశం ఉంది. బొగ్గు రంగంలోకి ఇలా... ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్ మైనింగ్లోకి ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్ వాషరీ, క్రషింగ్, కోల్ హ్యాండ్లింగ్ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డీఐలను తెచ్చుకోవచ్చు. ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్లు ఎఫ్డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014–15 నుంచి 2018–19 వరకు దేశంలోకి 286 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. అంతకుముందు 5 ఏళ్లలో వచ్చిన 189 బిలియన్ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018–19లో వచ్చిన 64.37 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్డీఐలు కావడం గమనార్హం. యాపిల్, వన్ప్లస్లకు ప్రయోజనం దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించడం వల్ల మొబైల్ హ్యాండ్సెట్ రిటైల్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని, యాపిల్, వన్ప్లస్, ఒప్పో వంటి సంస్థలు సొంత దుకాణాలు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది. పెట్టుబడులు పెరుగుతాయ్: హెచ్అండ్ఎం ‘‘ హెచ్అండ్ఎం గత 30 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి సమీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ కోసం సమీకరించేవి కూడా ఇకపై 30 శాతం స్థానిక సమీకరణ కింద పరిగణించడం ఆహ్వానించతగినది. ఇది భారత్లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. విదేశీ కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’ అని హెచ్అండ్ఎం భారత మేనేజర్ జానే ఎనోలా పేర్కొన్నారు. ప్రోత్సాహకరం: ఐకియా ‘‘సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి స్థానిక ఉత్పత్తుల సమీకరణ నిబంధనను ప్రభుత్వం సులభతరం చేయడాన్ని ఐకియా ఇండియా ఆహ్వానిస్తోంది. సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని ఐకియా ఇండియా పేర్కొంది. -
కేబినెట్ కీలక నిర్ణయాలు : ఎఫ్డీఐ నిబంధనల సడలింపు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను వెలువరించింది. మందగమనంలో ఆర్థిక వృద్ధిని చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా నాలుగు రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ) నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్డీఐలు కొద్దిగా మందగించాయి. అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ వెల్లడించారు. ప్రధానంగా బొగ్గు తవ్వకాలు, సంబంధిత ప్రాసెసింగ్ కార్యకలాపాలు ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం పెట్టుబడులకు అనుమతి వుంటుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కాంట్రాక్ట్ మాను ఫ్యాక్చరింగ్ రంగంలో 100 శాతం, డిజిటల్ మీడియాలో 26శాతం, బ్రాడ్కాస్టింగ్ సర్వీసుల్లో 49 శాతం పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే సింగిల్ బ్రాండ్ రిటైల్ లో ఎఫ్డీఐ కోసం స్థానిక సోర్సింగ్ నిబంధనలు (30 శాతం స్థానికంగా కొనుగోళ్లు తప్పనిసరి) సడలించినట్టు గోయల్ చెప్పారు. అలాగే ఆన్లైన్ సేల్స్కు అనుమతినిచ్చామన్నారు. అయితే మల్టీ బ్రాండ్ రీటైల్ లో పెట్టుబడుల గురించి కేబినెట్లో చర్చించలేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జవదేకర్ తెలిపారు. రూ. 24,375 కోట్ల పెట్టుబడితో 2021-22 నాటికి 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 529 కాలేజీల్లో 70,978 సీట్లు అందుబాటులో ఉన్నాయని, తాజా నిర్ణయంతో 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా లభించనున్నాయని కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఎగుమతులకు ప్రభుత్వం 6,268 కోట్ల సబ్సిడీని ఇవ్వనుంది. ఈ రాయితీ నేరుగా రైతు ఖాతాకు బదిలీ అవుతుందనీ, చక్కెర సీజన్ 2019-20లో మిగులు నిల్వలను ఖాళీ చేయడానికి తమ చక్కెర ఎగుమతి విధానం సహాయపడుతుందని జవదేకర్ చెప్పారు. భారతదేశంలో 162 లక్షల టన్నుల చక్కెర నిల్వ ఉంది, అందులో 40 లక్షల టన్నులు బఫర్ స్టాక్గా ఉంటుందన్నారు. దీంతోపాటు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ కూటమి (సిడిఆర్ఐ) ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 సెప్టెంబర్ 23 న న్యూయార్క్లో జరిగే యుఎన్ క్లైమేట్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీడీడిఆర్ఐని ప్రారంభించనున్నట్లు జవదేకర్ ప్రకటించారు. -
రికార్డుస్ధాయిలో ఎఫ్డీఐ వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్డీఐ విధానాన్ని సరళీకరించడంతో పాటు సంస్కరణల వేగంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి అత్యధికంగా రూ 4.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐటీ) నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో భారత్కు వచ్చిన ఎఫ్డీఐ రూ 4.2 లక్షల కోట్లుగా నమోదైంది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎఫ్డీఐ భారత్కు తరలివచ్చిందని, గత ఐదేళ్లుగా భారత్ రూ 18 లక్షల కోట్ల ఎఫ్డీఐని ఆకర్షించిందని డీపీఐటీ 2018-19 వార్షిక నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్డీఐ పాలసీని సరళీకరించడంతో పాటు సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా దేశంలోకి పెద్ద ఎత్తున ఎఫ్డీఐ వెల్లువెత్తుతోందని చెబుతున్నారు. మెరుగైన వృద్ధి రేటు సాధించేందుకు, వివిధ రంగాల్లో ఉత్తేజం నింపేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపకరిస్తాయి. -
రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్!
న్యూఢిల్లీ: రూపాయి అప్రతిహత పురోగమనం కొనసాగుతోంది. సోమవారం వరుసగా ఆరవ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో 57 పైసలు లాభపడింది. 68.53 వద్ద ముగిసింది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది. 2018 ఆగస్టు 1వ తేదీన రూపాయి ముగింపు 68.43. అప్పటి తర్వాత రూపాయి మళ్లీ తాజా స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. శుక్రవారం రూపాయి ముగింపు 69.10. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ ఎక్సే్చంజ్లో 68.92 వద్ద పటిష్టంగా రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 68.45న కూడా చూసింది. కారణాలను విశ్లేషిస్తే... ►ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేం ద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు ►డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం. ►దీనితో ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న విశ్లేషణలు. ►వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు. ►డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి. ►అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. బుధవారం సమీక్ష సందర్భంగా రేటు పెంపు ఉండదన్న విశ్లేషణలు. ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్చంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేస్తోందన్న వార్త. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 14 డాలర్లకుపైగా పెరగడంతో మళ్లీ రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా అయితే కష్టమే... రూపాయి వేగవంతమైన రికవరీ, ఈ పరిస్థితుల్లో వచ్చే ఒడిదుడుకులు ఆందోళన కలిగించే అంశమే. ఒడిదుడుకుల నిరోధానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. మారకపు విలువ అనిశ్చితి దేశీయ కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకూ కారణమవుతుంది. ఇది ఎగుమతిదారులకేకాదు. దిగుమతిదారులకూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది. రూపాయి మరింత పెరిగితే ఎగుమతులు పెరగాలన్న కేంద్ర విధానానికీ విఘాతం కలిగిస్తుంది. ఇప్పటికే సతమతమవుతున్న ఎగుమతుల రంగానికి ఇది ఒక పెద్ద సవాలే. ఇతర పోటీ కరెన్సీలతో భారత్ ఎగుమతులు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటాయి. – గణేశ్ గుప్తా, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఆసియా కరెన్సీల్లోనే ఉత్తమ పనితీరు.. ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరు కనబరిచింది. వాణిజ్యలోటు సానుకూల స్థితి, విదేశీ నిధుల ప్రవాహం దీనికి కారణం. ఈ నెలల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 2.4 బిలియన్ డాలర్లు ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెట్టారు. దీనితో భారత్ మార్కెట్లో వారి నికర కొనుగోళ్లు 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నెల్లో రూపాయి డినామినేటెడ్ బాండ్లలో వారి హోల్డింగ్స్ 833 మిలియన్ డాలర్లు పెరిగాయి. – వీకే శర్మ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ -
‘సింగిల్’ రిటైలర్ల నిబంధనల సడలింపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్ను పంపింది. ప్రతిపాదనల ప్రకారం.. యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు 200 మిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తెచ్చిన పక్షంలో ఆఫ్లైన్ స్టోర్స్ ఏర్పాటుకన్నా ముందు ఆన్లైన్ స్టోర్స్ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్లలోగా ఈ సంస్థలు ఆఫ్లైన్ స్టోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు.. ఆఫ్లైన్ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాతే ఆన్లైన్ అమ్మకాలు జరిపేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి సోర్సింగ్ నిబంధనలను సడలించే అంశం కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదనల్లో ఉంది. ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న కాలవ్యవధిని 6–10 ఏళ్ల దాకా పొడిగించవచ్చు. -
రెండో రోజుకు చేరిన రక్షణ రంగ ఉద్యోగుల సమ్మె
సాక్షి, విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధాలను వ్యతిరేకిస్తూ రక్షణ రంగ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. రక్షణ రంగ సంస్థల్లో ఎఫ్డీఐల అనుమతిని వ్యతిరేకించడంతోపాటు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు రక్షణ రంగ ఉద్యోగ సంఘాలకు చెందిన 3 ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. నావల్ డాక్ యార్డ్లోని విజయ్నగర్ గేట్ వద్ద ఉద్యోగులు, కార్మికులు మీటింగ్ ఏర్పాటుచేసుకుని నిరసన తెలుపుతున్నారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఈ సమ్మెకు సంఘీభావం తెలిపింది. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు కె.శ్రీనివాసరావు, విజయప్రకాష్, ఐఎన్సీఈ నేత బి.శ్రీనివాసరెడ్డి, ఎన్సీఆర్ యూనియన్ నేత పి.నాగేశ్వరరావు, సీఐటీయూ నేత జగ్గునాయుడు, ఆలిండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి రెడ్డి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
2030 నాటికి చైనా తరువాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ, ఐబీసీ వల్ల 2030 నాటికి చైనా తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్. సాహూ అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేని కంపెనీ లను పునరుద్ధరించేందుకు పరిష్కార నిపుణు లు (ఆర్పీ) ప్రయత్నించాలని, తద్వారా ఆ కంపెనీని నమ్ముకుని ఉన్న ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేసినట్లు అవుతుందని సాహూ అన్నారు.రుణ పరిష్కార ప్రణాళికల తయారీ విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరించాలని, రుణదాతల కమిటీ ముందు కేవలం ఒక రుణ పరిష్కార ప్రణాళి కనే ఉంచకుండా, దీర్ఘ కాలంగా ప్రయోజనం చేకూర్చే రుణ ప్రణాళికలను సైతం ఆ కమిటీ ముందు ఉంచాలని కోరారు.స్వయంగా రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించే వెసులు బాటును దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న కంపెనీకి సైతం కల్పించాలని, తద్వారా కంపెనీ పునరుద్ధరణకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ఇండియా (సిపీ) ఆధ్వ ర్యంలో శనివారం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్టసీ కోడ్ (ఐబీసీ) అమలులో ఎదురవు తున్న ఇబ్బందులపై ఈ సమావేశం చర్చిం చింది. ఇందులో సిపీ అధ్యక్షుడు సుమంత్ బత్రా, సిపీ హైదరాబాద్ కన్వీనర్ వీవీఎస్ఎన్ రాజులతో పాటు పలువురు న్యాయవాదులు, కంపెనీ సెక్రటరీలు, చార్టెర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ, 2016లో వచ్చిన ఐబీసీ వల్ల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఈ కోడ్ వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. జీఎస్టీ, ఐబీసీ వల్ల 2030 నాటికి చైనా తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని తెలిపారు. ఈ కోడ్ వల్ల దివాలా కంపెనీలకు, బ్యాంకు లకు మేలు జరుగుతుందని, దివాలా కంపెనీ ని ఇతరులు టేకోవర్ చేసేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే బ్యాంకులకు సైతం రుణాలు వసూలు అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఐబీసీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. దివాలాలో ఉన్న కంపెనీలను కొందరు బినామీలు చేజిక్కించుకుంటున్నా రని, దీనికి అడ్డుకట్టవేయాలని కోరారు. ఐబీసీలో పలు అంశాలపై స్పష్టత లోపించిం దని, వీటినీ అధిగమించినప్పుడే ఐబీసీ లక్ష్యం నెరవేరుతుందని వారు అభిప్రాయపడ్డారు. -
దేశీ ఈ కామర్స్ సంస్థలకూ అవే నిబంధనలు...
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్డీఐ) కూడిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించిన నిబంధనలను దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ అమలు చేయడం ద్వారా, అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడకుండా నిరోధించాలని అఖిల భారత వర్తకుల సంఘం (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన విధానాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించిన విధానంపై వాణిజ్య శాఖ పనిచేస్తుండగా... త్వరలోనే దాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సీఏఐటీ లేఖ రాయడం గమనార్హం. ‘‘నూతన విధానంలో పేర్కొన్న ఎఫ్డీఐ నిబంధనలు దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ వర్తింపజేయాలి. అనైతిక వ్యాపార ధోరణలను అనుసరించకుండా నిరోధించాలి. వాటిని ఇతర ఈ కామర్స్ సంస్థలతో సమానంగా చూడాలి’’ అని సీఏఐటీ కోరింది. ఈ రంగానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కొన్ని సంఘాలు ఎఫ్డీఐ నిబంధనలను తప్పుబడుతున్నాయని, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని కోరింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి విదేశీ ఈ కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫామ్లపై, తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా, ప్రత్యేకమైన మార్కెటింగ్ ఒప్పందాలతో ఉత్పత్తులను మార్కెట్ చేయకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే త్వరలోనే ఈ–కామర్స్లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్న రిలయన్స్ వంటి సంస్థలకు ఈ పరిణామం లాభించవచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తింపజేయాలని వర్తకుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
ప్రధాని మోదీ విదేశీయానం ఖర్చు 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయా నానికి రూ.2,021 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను ప్రధాని సందర్శించారని వివరించారు. ప్రధాని పర్యటనల కారణంగా భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2014–18 సంవత్సరాల మధ్య ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో ఎఫ్డీఐలు అత్యధికంగా వచ్చే మొదటి పది దేశాలు కూడా ఉన్నాయన్నారు. 2014లో 30,930.5 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్డీఐలు పర్యటనల ఫలితంగా 2017 నాటికి 43,478.27 మిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. యూపీఏ–2 హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు 2009–14 సంవత్సరాల మధ్య రూ.1,346 కోట్లని వీకే సింగ్ పేర్కొన్నారు. -
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు తగ్గుముఖం
ముంబై: దేశీయ కంపెనీల విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది జూలై నెలలో 36 శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్బీఐ గణాంకాలను పరిశీలిస్తే... భారత కంపెనీల విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది జూలైలో 1.39 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో మన కంపెనీల విదేశీ పెట్టుబడులు 2.17 బిలియన్ డాలర్లు. విదేశీ సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లపై కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటాయి. రుణాల రూపంలో, ఈక్విటీ, గ్యారంటీల రూపంలో ఈ మేరకు సర్దుబాటు చేస్తుంటాయి. సెరమ్ ఇనిస్టిట్యూట్ నెథర్లాండ్స్లోని తన సబ్సిడరీ కోసం 187.9 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. స్టెరిలైట్ టెక్నాలజీస్, ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో పెట్టుబడులు 2.07 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
ఎఫ్డీఐల్లో మారిషస్ మళ్లీ టాప్!!
న్యూఢిల్లీ: భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు కేంద్రంగా మారిషస్ మళ్లీ అగ్రస్థానంలో నిల్చింది. 2017–18లో మొత్తం ఎఫ్డీఐలు స్వల్పంగా 36.31 బిలియన్ డాలర్ల నుంచి 37.36 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో మారిషస్ నుంచి 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇవి 13.38 బిలియన్ డాలర్లు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుంచి పెట్టుబడులు 6.52 బిలియన్ డాలర్ల నుంచి 9.27 డాలర్లకు పెరగ్గా, నెదర్లాండ్స్ నుంచి ఎఫ్డీఐలు 3.23 బిలియన్ డాలర్ల నుంచి 2.67 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గతేడాది ఎఫ్డీఐలకు సంబంధించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం తయారీ రంగంలోకి 7.06 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇవి 11.97 బిలియన్ డాలర్లు. అయితే, కమ్యూనికేషన్స్ సర్వీసుల్లోకి మాత్రం పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్ల నుంచి 8.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అటు రిటైల్, హోల్సేల్ వ్యాపారాల విభాగంలోకి విదేశీ పెట్టుబడులు కూడా 2.77 బిలియన్ డాలర్ల నుంచి 4.47 బిలియన్ డాలర్లకు ఎగియగా, ఆర్థిక సేవల రంగంలోకి ఎఫ్డీఐలు 3.73 బిలియన్ డాలర్ల నుంచి 4.07 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కార్పొరేట్ల ఆదాయాలు, వినియోగదారుల డిమాండ్ మెరుగుపడుతున్న సంకేతాల నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని అసోచాం తెలిపింది. -
ఏపీలో తగ్గిపోయిన విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు
-
పెట్టుబడులపై కట్టుకథలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ప్రభుత్వ పెద్దలు జనం చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. మరోవైపు వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) ఆకర్శించడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకంజలోనే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎఫ్డీఐలు ఏకంగా 43 శాతం మేర తగ్గిపోయాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టుకోవడంలో పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు ఊహించని విధంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఎఫ్డీఐల విషయంలో ఏడాది కాలంలోనే కర్ణాటక 300 శాతం, తమిళనాడు 56 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా ఈ గణాంకాలను వెల్లడించింది. 2017–18లో వివిధ రాష్ట్రాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆర్బీఐ ఒక నివేదిక రూపొందించింది. దీన్ని రెండు రోజుల క్రితం పార్లమెంట్కు సమర్పించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్శిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి బోర్డు(ఈడీబీ) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకు సాధించామని దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్పై ఆసక్తి చూపకపోవడం అధికార వర్గాలను కలవరపరుస్తోంది. సంప్రదింపులతోనే సరి భారీగా పెట్టుబడులు సాధించుకోస్తామంటూ గత నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికార యంత్రాంగం పలు దేశాల్లో పర్యటించింది. 40 దేశాల నుంచి రూ.లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతున్నాయంటూ టీడీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే, సంప్రదింపులు జరిపిన విదేశీ పెట్టుబడిదారులు ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. వారంతా పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. 2017–18లో కర్ణాటక రాష్ట్రానికి 2.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అధికంగా వచ్చాయి. మొత్తం ఎఫ్డీఐలు 8.58 బిలియన్ డాలర్లకు చేరాయి. తమిళనాడులో ఎఫ్డీఐలు 3.47 బిలియన్ డాలర్లకు చేరాయి. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగినప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం విశేషం. ఆంధ్రప్రదేశ్ మాత్రం గతేడాదితో పోలిస్తే 43 శాతం ఎఫ్డీఐలను కోల్పోయింది. రాష్ట్రానికి గతేడాది 3.37 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఈ ఏడాది 1.25 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ‘హోదా’ లేదనే పెట్టుబడులు వెనక్కి విశాఖపట్నంలో 2015లో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును భారీ ఎత్తున నిర్వహించింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కలిసి రూ.కోట్లు పెట్టి ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తొలుత కొందరు ముందుకొచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గమనించిన తర్వాత వెనుకడుగు వేశారు. అనుమతుల మంజూరీలో అవినీతి వల్లే వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల కూడా పెట్టుబడిదారులు ఏపీపై ఆసక్తి చూపడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, మార్కెటింగ్ సదుపాయాలున్న పొరుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం.. ‘‘కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయి. అందుకే పెట్టుబడిదారులు అటువైపు ఆకర్శితులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పు డిప్పుడే మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. పెట్టుబడిదారులు అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వెళ్తారు. ఎఫ్డీఐలను ఆకర్శించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. – కృష్ణకిషోర్, సీఈవో, ఈడీబీ -
ఏపీకి సింగపూరే స్ఫూర్తి
సాక్షి, అమరావతి: సంక్షోభాన్ని సానుకూలంగా మలుచుకుని అభివృద్ధి చెందిన సింగపూర్ దేశం తమకెంతో స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి లీక్వాన్ యూనివర్సిటీలో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. సింగపూర్కు, ఆంధ్రప్రదేశ్కు సారూప్యం ఉందని.. విభజనతో సింగపూర్ బాలారిష్టాలను ఎదుర్కొని అధిగమించినట్లే ఏపీని విభజన గాయాల నుంచి క్రమంగా కోలుకునే స్థాయికి తీసుకొచ్చామన్నారు. అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలన్న తమ లక్ష్య సాధనకు ఎల్కేవై ఇన్స్టిట్యూట్ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో నిలిచామని, వ్యాపార సానుకూలతలో ప్రథమ స్థానంలో ఉన్నామని సీఎం చెప్పారు. తమ హయాంలో ఏపీలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతున్నదని ఆహారశుద్ధి పరిశ్రమలైన మోండెలెజ్, పెప్సీ, ఐటీసీ, ఇతర చిన్న తరహా కంపెనీల రూపంలో భారీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తిరుపతి నగరాన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక హబ్గా తీర్చిదిద్దుతున్నామని, మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఫ్యాక్స్కాన్కు తిరుపతి సమీపంలో భారీ ఉత్పాదక సదుపాయ ప్రాంగణం ఉందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతాంగ శ్రేయస్సుకు, పచ్చదనం విస్తరణకు భారీస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. ఏపీ రెండో స్వగృహంగా, స్వస్థలంగా భావించి పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అనంతరం ఎల్కేవై స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదరగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, ప్రొఫెసర్ డానీ దానిపై సంతకాలు చేశారు. సింగపూర్ తరహా ఇళ్లు సింగపూర్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిటీ సొల్యూషన్స్ ఎగ్జిబిషన్ చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ తరహా ఇళ్లను రాష్ట్రంలోనూ కట్టాలని.. అక్కడి జీవ వైవిధ్య అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అమలుచేయాలని అధికారులకు సూచించారు. కాగా, సింగపూర్ పర్యటనలో ఆయన ప్రపంచ నగరాల ప్లీనరీ సెషన్లో ‘పట్టణీకరణ నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అనే అంశంపై మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో అందరి భాగస్వామ్యం కోరుతున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా తాగునీటికే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకూ తగినంత నీటిని ఇవ్వగలిగే పరిస్థితిని తీసుకొచ్చామని, కరువు ఛాయలను తరమికొట్టామని చెప్పారు. సమస్యలను పరిష్కరించాలి: శ్రీలంక ప్రధాని సమావేశంలో పాల్గొన్న శ్రీలంక ప్రధాని విక్రమ్ రణిల్ సింఘే మాట్లాడుతూ.. నగరాలు ఇప్పుడు సంపద సృష్టించే వనరులుగా ఉన్నాయని, తద్వారా ఇవి భారీ అంతర్గత వలసలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. నగరవాసులు కాలుష్యంతో కూడిన గాలి, నీరు, వాతావరణ సమస్యలను ఎదుర్కొంటున్నారని, వీటితో పాటు నేరాలు పెరిగిపోవడం కూడా వారికి ముప్పుగా మారిందని, ఈ అడ్డంకులన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాలు వాతావరణ మార్పు, అసమాన వృద్ధి, పేదరికం వంటి సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి వున్నాయని సింగపూర్ ఉప ప్రధాని థర్మన్ షణ్ముగరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్ భవనాలు పరిశీలించిన బృందం సీఎం సారథ్యంలో సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణతోపాటు మరో 26 మంది భవన నిర్మాణ ప్రతినిధులు సోమవారం అక్కడ నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను సందర్శించి వాటిల్లో ఆధునిక సాంకేతికతను పరిశీలించారు. అంతేకాక, సింగపూర్లోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ అధికారులతో సమావేశమయ్యారు. -
మోదీ సర్కార్కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఈజీ బిజినెస్, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పెట్టుబడులు దేశానికి రానున్నాయని ఊదరగొట్టిన బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్విస్ బాంకుల్లో భారీతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్న వార్త నరేంద్ర మోదీ సర్కారును ఇరుకున పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ డిపాజిట్లన్నీ అక్రమం కాదు...పూర్తి నివేదిక అనంతరం వివరాలు వెల్లడవుతాయంటూ డ్యామేజ్ కంట్రోల్లో పడిన కేంద్రానికి తాజాగా మరో షాక్ తగిలింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)ల వృద్ది రేటు భారీగా పడిపోయింది. 2017 సంవత్సరంలో అయిదేళ్ల కనిష్టాన్ని నమోదు చేశాయి. భారత్లో 2017-18లో ఎఫ్డీఐలు కేవలం మూడు శాతం వృద్ధితో 44.85 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు భారీ పెరుగుదలను నమోదుచేశాయి. ఎఫ్డీఐ అవుట్ ఫ్లో 48వేలకోట్ల రూపాయలతో పదేళ్ళ ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2017-18లో ఎఫ్డీఐ పెట్టుబడుల వృద్ధిరేటు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయివద్ద 44.85 బిలియన్ డాలర్లకు చేరింది. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2013-14ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 8 శాతం పెరిగాయి. 2012-13లో 38 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాల కింద విదేశీ పెట్టుబడులను 8 శాతం పెంచింది. ఎన్డీఏ ఆధ్వర్యంలో 2014-15లో 27శాతం, తర్వాతి సంవత్సరంలో 29 శాతం ఉండగా, 2016-17లో అది కేవలం 8.67 శాతం మాత్రమే పుంజుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు 2017-18 సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లో గరిష్ట స్థాయిల వద్ద రికార్డ్ పెట్టుబడులు సాధించింది. పెట్టుబడులు 44.8 బిలియన్ డాలర్ల వద్ద ఇంతకుముందెన్నడూ లేని వృద్ధిని నమోదు చేశాయి. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దేశంలో పెట్టుబడులను పునరుద్ధరించడంతో పాటు, దేశంలో వ్యాపారం చేయడం మరింత సులభంచేయాలని నిపుణులు చెబుతున్నారు. డాలరు మారకంలో 7శాతం క్షీణించి ఇప్పటికే బలహీనంగా దేశీయ కరెన్సీపై ఇంత భారం వేయనుందని హెచ్చరించారు. గత రెండు సంవత్సరాలలో దేశీయ పెట్టుబడుల రేటులో క్షీణత కనిపించిందనీ, ఇదే కోవలో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయని జెఎన్యూ ప్రొఫెషర్ విశ్వజిత్ ధార్ తెలిపారు. దేశీయ ఆర్థికస్థితిని, విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు ప్రతిబింబిస్తాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, దేశీయ పెట్టుబడులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎఫ్డీఐ పెట్టుబడుల రేటు క్షీణతకు కస్టమర్, రిటైల్ రంగాలలో ఎఫ్డీఐ తక్కువగా ఉండడానికి ప్రధానంగా విదేశీ పెట్టుబడుల విధానంలో అనిశ్చితి, సంక్లిష్టత కారణమని చెప్పవచ్చని డెలాయిట్ ఇండియా భాగస్వామి అనిల్ త్రేరెజా వ్యాఖ్యానించారు. నిబంధనలను సడలించడంలో, సందిగ్ధతలను తొలగించడంలో ప్రభుత్వం గణనీయమైన కృషిని చేపట్టినప్పటికీ, ప్రపంచ వినియోగదారుల మరియు రిటైల్ కంపెనీలు ఇప్పటికీ భారత్లో పెట్టుబడులవైపు నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడవుతున్నాయని ఆయన అన్నారు. బిజినెస్ చేయడం సులభతరం చేయడానికి ర్యాంకింగ్ను పెంచడం, విదేశీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా ఉండాలన్నారు. -
62 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి రూ. 61.96 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 60 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది సుమారు 3 శాతం అధికం. ఈక్విటీల్లోకి వచ్చిన నిధులు, రీ ఇన్వెస్ట్ చేసిన ఆదాయాలు, ఇతరత్రా పెట్టుబడులు అన్నీ ఇందులో ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సరళీకృత విధానాలు మొదలైనవి ఇందుకు దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది. అంతక్రితం నాలుగేళ్లలో వచ్చిన 152 బిలియన్ డాలర్లతో పోలిస్తే గడిచిన నాలుగేళ్లలో విదేశీ పెట్టుబడులు 222.75 బిలియన్ డాలర్లకు పెరిగాయని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. ప్రభుత్వం గత నాలుగేళ్లలో డిఫెన్స్, వైద్య పరికరాలు, నిర్మాణ రంగం, రిటైల్, పౌర విమానయానం తదితర రంగాలల్లో ఎఫ్డీఐ నిబంధనలను సడలించింది. మరోవైపు, యూఎన్సీటీఏడీ నివేదికలోని అంశాలు మాత్రం డీఐపీపీ లెక్కలకు విరుద్ధంగా ఉన్నాయి. 2016లో భారత్లోకి వచ్చిన 44 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలతో పోలిస్తే 2017లో ఇవి 40 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. యూఎన్సీటీఏడీ నివేదిక వచ్చిన మర్నాడే ప్రభుత్వం ఈ గణాంకాలు వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.