కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట | Sakshi
Sakshi News home page

కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట

Published Sat, Jan 27 2024 3:14 PM

Relief For Sebi And NSDL In Karvy Stock Broking Case - Sakshi

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్‌ చేశాయి.

ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!

ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్‌ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్‌ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement