Karvy
-
కార్వీ గ్రూప్ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు
కార్వీ గ్రూపునకు చెందిన కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (కేఐఎస్ఎల్) రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను కేఐఎస్ఎల్ నిర్వహిస్తోంది. గతేడాది మార్చిలో సెబీ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించింది. కానీ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగడం లేదని గుర్తించింది. వ్యాపార బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన సాధనా సంపత్తి లేదని కూడా నిర్థారించింది. సంస్థ డైరెక్టర్ ఒకరు సెక్యూరిటీస్ మార్కెట్ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పాటు మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన ఇతర నియమ నిబంధనలు సైతం పాటించడం లేదని, పైగా రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేయడానికి ఫీజు చెల్లించలేదని తేలింది. తత్ఫలితంగా ఈ సంస్థకు ఉన్న సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తున్నట్లు ‘సెబీ’ వెల్లడించింది. ఇదీ చదవండి: అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు -
కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో సెబీ, ఎన్ఎస్డీఎల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్ఎస్డీఎల్ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్లో సవాల్ చేశాయి. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్ఎస్డీఎల్ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. -
కార్వీ కేసులో సెబీకి నాలుగు వారాల గడువు: శాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం స్పష్టం చేసింది. శాట్ మునుపటి ఆర్డర్ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్లకు (ఎన్ఎస్డీఎల్) ఆర్డర్ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్ఎస్డీఎల్ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్ బ్యాంక్కు అనుమతించింది. 2023 డిసెంబర్ 20 నాటి శాట్ ఆర్డర్పై డిసెంబర్ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్ దాఖలు చేసింది. -
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
కార్వీ మాజీ అధికారుల బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ - సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) క్లయింట్ల నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి రూ. 1.80 కోట్లు రాబట్టేందుకు కార్వీ గ్రూప్ మాజీ అధికారులైన ముగ్గురి బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వీరిలో మాజీ వీపీ (ఫైనాన్స్, అకౌంట్స్) కృష్ణ హరి జి., మాజీ కాంప్లయెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు ఉన్నారు. వీరి ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతి ఉంటుంది. క్లయింట్ల సెక్యూరిటీలను వారికి తెలియకుండా తనఖా పెట్టి కేఎస్బీఎల్ దాదాపు రూ. 2,033 కోట్ల మేర నిధులు సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది మే నెలలో సెబీ కృష్ణ హరికి రూ. 1 కోటి, రాజుకి రూ. 40 లక్షలు, శ్రీకృష్ణకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. వడ్డీలు, ఇతర వ్యయాలతో సహా మొత్తం సుమారు రూ. 1.8 కోట్లు కట్టాలంటూ గత నెల డిమాండ్ నోటీసులు జారీ చేసింది. -
సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను బ్రోకరేజ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) రిజిస్ట్రేషన్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. కేఎస్బీఎల్ క్లయింట్ల నిధులను గ్రూప్ కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేసుకుందని, అలాగే రూ. 2,700 కోట్ల విలువ చేసే క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి దాదాపు రూ. 2,033 కోట్ల నిధులు సేకరించిందని బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో సెబీ పేర్కొంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్వర్త్ గురించి తెలుసా? ఆయా క్లయింట్లకు నిధులు, సెక్యూరిటీలను తిరిగి ఇవ్వకపోగా.. ఖాతాల మదింపు విషయంలో ఫోరెన్సిక్ ఆడిటర్లకు సరిగ్గా సహకరించలేదని కూడా తెలిపింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఇప్పటికే కేఎస్బీఎల్ను డిఫాల్టరుగా ప్రకటించి, బహిష్కరించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ పేర్కొంది. క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను కార్వీ, దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ గత నెలలో నిషేధం విధించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) ఇలాంటి మరిన్ని బిజినెస్వార్తలు, ఇతరఅప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కార్వీ మాజీ ఉద్యోగులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు.. కార్వీ గ్రూప్నకు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మొత్తం రూ.1.9 కోట్ల జరిమానా విధించింది. వీరిలో కేఎస్బీఎల్ ఎఫ్అండ్ఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ జి.కృష్ణ హరి, కాంప్లియెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు, కార్వీ స్టాక్ బ్రోకింగ్ అనుబంధ కంపెనీ కేడీఎంఎస్ఎల్ ఎండీ వి.మహేశ్ ఉన్నారు. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సెబీ వీరిని ఆదేశించింది. కంపెనీ చేసిన తప్పులకు సహకరించిన, కుమ్మక్కైన కేఎస్బీఎల్కు చెందిన కీలక వ్యక్తులపై సెబీ న్యాయ విచారణను ప్రారంభించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. -
కార్వీ ప్రమోటర్లపై 7 ఏళ్ల సెబీ నిషేధం
-
హైకోర్టులో ‘కార్వీ’కి ఊరట
సాక్షి, హైదరాబాద్: కార్వీ గ్రూప్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ ఎడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి హైకోర్టు సింగిల్ జడ్జి రెండు నెలల సమయం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం అప్పీల్ను కొట్టివేసింది. ఖాతాదారులకు చెందిన షేర్లను తాకట్టు పెట్టి రుణం పొంది వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలపై కార్వీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ... షేర్లు, భూములు, భవనాలు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను జప్తు చేయడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సంస్థ సీఎండీ పార్థసారథి సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి... ఈడీ ఎడ్జుడికేటింగ్ అథారిటీ ఆస్తుల జప్తు నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి 2 నెలల సమయం ఇచ్చారు. ఈ తీర్పును తప్పుబడుతూ ఈడీ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అథారిటీ 180 రోజుల్లో రిపోర్టు అందజేయాల్సి ఉంటుందని, అదనంగా సమయం ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సమయ వెసులుబాటు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన రెండు నెలల గడువు మరో వారంలో ముగియనుండగా ఇప్పడు సవాల్ చేయడాన్ని తప్పుబడుతూ అప్పీల్ను కొట్టివేసింది. -
హైదరాబాద్: కార్వీ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
కార్వీ కేసులో ‘షాక్’ ఎక్స్చేంజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) కేసులో సంచలనం. స్టాక్ ఎక్స్చేంజీలకు షాక్ తగిలేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీల దుర్వినియోగాన్ని గుర్తించే విషయంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వైఫల్యాన్ని సెబీ ఎత్తి చూపింది. ఈ మేరకు బీఎస్ఈకి రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. 95,000లకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల సెక్యూరిటీలను కేవలం ఒక డీమ్యాట్ ఖాతా నుండి తాకట్టు పెట్టి కార్వీ దుర్వినియోగం చేసిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీలను తాకట్టు పెట్టి కేఎస్బీఎల్, గ్రూప్ కంపెనీలు 8 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.851.43 కోట్ల రుణం పొందాయి. నిస్సందేహంగా ఖాతాదారుల సెక్యూరిటీలను అనధికారికంగా తాకట్టు పెట్టడం ద్వారా కేఎస్బీఎల్ దుర్వినియోగానికి పాల్పడిందని సెబీ స్పష్టం చేసింది. నష్టానికి కార్వీదే బాధ్యత..: ‘పెట్టుబడిదారులకు, అలాగే రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్టంతో సహా.. సొంతం కాని సెక్యూరిటీలను తాకట్టు పెట్టడం వల్ల కలిగే నష్టానికి కేఎస్బీఎల్ బాధ్యత వహిస్తుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సభ్యుడిగా ఉండటంతో స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ పర్యవేక్షణలో కార్వీ ఉంది. ఎక్స్చేంజీల వైఫల్యం ఉంది. ఫలితంగా కేఎస్బీఎల్లో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించడం జరిగింది. ఈ విషయంలో స్టాక్ ఎక్స్చేంజీలు జవాబుదారీగా ఉండాలి’ అని సెబీ తన ఉత్తర్వుల్లో ఘాటుగా స్పందించింది. జూన్ 2019 నుండి కార్వీలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సెబీ సంయుక్తంగా తనిఖీ నిర్వహించాయి. -
కార్వీ స్కాంలో కొత్త మలుపు
-
కార్వీ సంస్థ షేర్లను ఫ్రీజ్ చేసిన ఈడీ
-
కార్వీకి భారీ షాక్: 700 కోట్ల షేర్లు ఫ్రీజ్
సాక్షి,హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథికి భారీ షాక్ తగిలింది. కార్వీకి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఫ్రీజ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల షేర్లు ఫ్రీజ్ చేశారు. రూ.3 వేల కోట్ల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రోజురోజుకు ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్లను ఫ్రీజ్ చేసింది. సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి అధికారులు..వీటితో పాటు ఎండీ పార్ధసారథి ఆస్తుల జప్తు, ఇద్దరు కుమారుల ఆస్తుల్ని ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. కాగా, ఇటీవల కార్వీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని విచారించింది. -
హైదరాబాద్ : కార్వీ కార్యాలయంలో ఈడీ తనిఖీలు
-
హైదరాబాద్ కార్వీ కార్యాలయంలో ఈడీ తనిఖీలు
-
Karvy Case: ‘కార్వీ ’ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ.. ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని జైల్లో విచారించింది. తాజాగా బుధవారం ఏకకాలంలో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఉన్న కార్వీ, అనుబంధ సంస్థల కార్యాలయాలతోపాటు ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురు నిందితుల ఇళ్లల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ తదితర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కార్వీ 9 షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంపై కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. అటు బెంగళూరు పోలీసులు సైతం తమ వద్ద నమోదైన కేసు విచారణ వేగవంతం చేశారు. ఆ కేసులో పార్థసారథిని మూడు రోజులు విచారించనున్నారు. రూ.3 వేల కోట్ల స్కాం కార్వీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణ హరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజ, రిస్క్ హెడ్గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ గురజాడ శ్రీకృష్ణలను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీíÙయల్ రిమాండ్లో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచి్చన పవర్ ఆఫ్ అటారీ్నని తనకు అనువుగా మార్చుకున్న పార్థసారథి తదితరులు భారీ స్కామ్కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలిక జప్తుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: పంజాబ్కు ‘కార్వీ’ పార్థసారథి -
బెంగళూరు పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి
-
కార్వీలో బయటపడ్తున్న కొత్త స్కాంలు
-
‘కార్వీ’ చుట్టూ ఈడీ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఆ సంస్థ చైర్మన్ సి.పార్థసారథితోపాటు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణహరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజలను ప్రశ్నించింది. హైదరాబాద్, సైబరాబాద్ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ రెండు కమిషనరేట్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మేర మోసం చేశారంటూ సికింద్రాబాద్కు చెందిన మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటంతో చంచల్గూడ జైల్లోనే విచారిస్తున్నారు. వారంపాటు పార్థసారథిని ప్రశ్నించడానికి అనుమతి కోరగా మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆది, సోమవారాల్లో ఆయనను ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా విచారించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారుల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను బట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పవర్ ఆఫ్ అటార్నీని అనువుగా మార్చుకొని... కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు మదుపరులు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని పార్థసారథి తనకు అనువుగా మార్చుకుని భారీ స్కామ్కు తెగబడ్డారు. మదుపరుల అను మతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. అవన్నీ తమవే అంటూ చూపించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి కొలట్రల్ సెక్యూరిటీ(తనఖా)గా పెట్టి దాదాపు రూ.వెయ్యి కోట్లు అప్పు గా తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి, వాటి అభివృద్ధి–విస్తరణలకు వినియోగించాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ సంస్థల్లోకి మళ్లించి భారీగా మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన వివరాల కోసమే పార్థసారథిని ప్రశ్నించి సమగ్ర వాంగ్మూలం నమోదు చేస్తోంది. కోర్టు అనుమతితో మిగిలిన నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలికంగా జప్తు చేయనుంది. -
కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్పై కార్వీ ఛైర్మన్ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవీ చదవండి: Bigg Boss: బాస్లకే బాస్ అసలైన బిగ్బాస్ ఇతనే కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే.. -
కార్వీ స్కాం విచారణకు రంగంలోకి దిగిన టీం
-
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదు
-
కార్వీ ఎండీ పార్థసారథి కేసులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి కేసులో సీసీఎస్ పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. కార్వీ అక్రమాలను సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు సమాచారం. అలా పార్థసారథి దాదాపు రూ. 1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. దీంతో పాటు కార్వీ తెలంగాణ లోని బ్యాంక్ల వద్దనే రూ. 3000 కోట్ల స్కాం చేసినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే మరో నీరవ్, మాల్యాలా కార్వి ఫ్రాడ్ కూడా పెద్ద స్కాంగా పరిగణించవచ్చు. కాగా కార్వీ ఆస్తుల మొత్తాన్ని పార్థసారధి బ్యాంకుల్లో కుదువ పెట్టారు. దీనికి సంబంధించి బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కార్వి సంస్థ రుణం పొందిన 6 అకౌంట్లు ను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన అధికారులు.. అందులో దాదాపు రూ. 13 కోట్ల లిక్విడ్ క్యాష్ను గుర్తించారు. కాగా రెండు రోజుల క్రితం పార్థసారథి కస్టడీ ముగియగా.. విచారణ కోసం సీసీఎస్ పోలీసులు ఆయనను మరో రెండ్రోజలు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. -
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
-
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
సాక్షి,హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథిని పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని విచారించనున్నారు. ప్రస్తుతం పార్థసారథి చంచల్గూడ జైలులో రిమాండ్లో వున్నారు. కాగా రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసులు ఆగస్టు 19న అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్డీఎఫ్సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్లో రూ.137 కోట్లు, హెచ్డీఎఫ్సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. చదవండి:Telangana Schools Reopen: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే -
కార్వీ సీఎండీ పార్థసారథి కేసు: సీసీఎస్కు పెరుగుతున్న బాధితుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: కార్వీ సీఎండీ పార్థసారథి కేసులో(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పార్థసారథిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో (సీసీఎస్) పోలీసులు ప్రత్యేక పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున సీసీఎస్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మదుపరుల పెట్టుబడితో కలిపి రూ. 2 వేల కోట్లకు స్కాం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. చదవండి: కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్ -
కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్బీఎల్ సంస్థ.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. ఆయా ఖాతాల్లో క్లయింట్ల షేర్లతో పాటు నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం వరకు రుణం పొందొచ్చు. దీన్ని అనువుగా మార్చుకుని మదుపరుల అనుమతి లేకుండా డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి పార్థసారథి మార్చుకున్నారు. ఆ షేర్లను కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టి దాదాపు రూ.680 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాలను తమ సొంత కంపెనీల్లోకి మళ్లించడం, రుణాలు చెల్లించి షేర్లను తిరిగి మదుపరుల ఖాతాల్లోకి పంపడం ఏళ్లుగా సాగింది. షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ.. అలాగే వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.720 కోట్లనూ ఇదే పంథాలో మళ్లించడం, తిరిగి జమ చేయడం చోటు చేసుకున్నాయి. ఇలా తమ ఖాతాల్లోని షేర్లు, నగదు దారి మళ్లినట్లు మదుపరులకు తెలియకుండా కార్వీ సంస్థ జాగ్రత్త పడింది. వారి అనుమతి లేకుండా ఈ వ్యవహారాలు నెరపినా వర్చువల్ ఖాతాలో మాత్రం ఆ షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ మోసం చేసింది. ఇదే పంథాలో షేర్లను తనఖా పెట్టిన కేఎస్బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు.. 2019– 20ల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, హెచ్డీఎఫ్సీ నుంచి రెండు విడతల్లో రూ.347 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి వాటి అభివృద్ధికి వినియోగించాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన పార్థసార«థి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లోకి మళ్లించారు. తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను, నగదును కార్వీ సంస్థ మళ్లిస్తున్న విషయం గుర్తించిన కొందరు మదుపరులు సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో 2019లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన సెబీ అవకతవకలు జరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే 2020లో కేఎస్బీఎల్ ఎక్కడా స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధించింది. అప్పటికే ఈ సంస్థ అధీనంలో ఉన్న డీమ్యాట్ ఖాతాలను వేర్వేరు సంస్థలకు బదిలీ చేయించింది. ఆ సందర్భంలో కార్వీ సంస్థలు ఆయా బ్యాంకులకు తాకట్టు పెట్టిన షేర్లను వాటి అనుమతి లేకుండానే మదుపరుల ఖాతాలకు బదిలీ చేసేశారు. దీంతో బ్యాంకు రుణాలపై ష్యూరిటీ లేకుండాపోవడంతో పాటు చెల్లింపులు ఆగిపోయాయి. పార్థసారథికి కోర్టు రిమాండ్... సెబీ నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన నేపథ్యం లో కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. గురువారం జూబ్లీహిల్స్లోని నివా సంలో పార్థసారథిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం పార్థసారథిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో మరికొందరూ నిందితులుగా ఉన్నారని చెబుతున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై 2019లో స్టాక్ మార్కెట్ కుంభ కోణం బయటపడింది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.2 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం బయటపడే దాకా ఈ సంస్థ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సేవలు అందించింది. వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని, క్లయింట్ల నిధులు, షేర్లను అక్రమంగా తన ఖాతాలోకి బదలాయించుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా తీసుకున్న వాటిలో సుమారు రూ.1,096 కోట్ల మొత్తాన్ని కార్వీ రియల్టీ సంస్థకు మళ్లించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. -
రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగవేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ ఎండీ పార్థసారధి అరెస్టయ్యారు. రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసుల గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్డీఎఫ్సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్లో రూ.137 కోట్లు, హెచ్డీఎఫ్సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. కార్విపై గతంలో సెబీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను ఎండీ పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్కు తరలించారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ఒక్క డ్యాన్స్తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏకు 321 సీట్లు!
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, దేశవ్యాప్తంగా కరోనా, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ.. ఇలా అసాధారణ వరుస సవాళ్లను ఎదుర్కొన్న ఏ ప్రభుత్వ ప్రజాదరణ అయినా సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్ను దాటి 43% ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం. అయితే, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్ తక్కువగానే ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. మోదీపై విశ్వాసం కరోనాపై పోరుకు అనూహ్య లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు.. తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. ఎంఓటీఎన్ సర్వేలో పాల్గొన్నవారిలో 74% మంది మోదీ ప్రధానిగా అత్యుత్తమ పనితీరు చూపారని ప్రశంసించారు. వరుసగా ఏడో సంవత్సరం అధికారంలో ఉన్న నేతకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం అరుదైన విషయమే. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రధాని రేసులోనూ మోదీ చాలా ముందున్నారు. దేశ అత్యుత్తమ ప్రధానిగా 38% రేటింగ్తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. తరువాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారీ వాజ్పేయి(18%), ఇందిరాగాంధీ(11%), జవహర్లాల్ నెహ్రూ(8%), మన్మోహన్ సింగ్(7%) ఉన్నారు. అయితే, దక్షిణ భారత్లో మోదీ హవా, బీజేపీ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రధానిగా మోదీ పాపులారిటీ దక్షిణ భారతదేశంలో 63 శాతం ఉంది. ముస్లింలలో 38% మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన రెండు గొప్ప విజయాలుగా సర్వే తేల్చినవి ఆరెస్సెస్ అజెండాకే సంబంధించినవి కావడం విశేషం. -
మరో వివాదంలో కార్వీ కన్సల్టెన్సీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరో వివాదంలో చిక్కుకుంది. పవర్ ప్లాంట్ షేర్ల వ్యవహారంలో గోల్మాల్ బయటపడింది. పవర్ ప్లాంట్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్వీ యజమాని పార్థసారథిపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్స్టేషన్కు పిలిచి పార్థసారథిని ఆదివారం విచారించారు. సీఆర్పీసీ 41 కింద ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించారు. ఇదిలాఉండగా.. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కూడా కార్వీ బ్రోకింగ్ సర్వీసెస్పై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. చదవండి: (కార్వీ తరహా మోసాలకు చెక్) అలా ఎలా రుణాలిచ్చేశారు? -
కార్వీ తరహా మోసాలకు చెక్
ముంబై: భవిష్యత్తులో కార్వీ తరహా మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ చీఫ్ అజయ్ త్యాగి చెప్పారు. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కార్వీ బ్రోకింగ్ సర్వీసెస్పై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నెల 14 నాటికి కార్వీ సంస్థ చెల్లించాల్సిన బకాయిలు రూ.1,189 కోట్లుగా ఉన్నాయని త్యాగి పేర్కొన్నారు. ఈ విషయమై కార్వీకి నోటీసులు జారీ చేశామని వివరించారు. తమ కంపెనీల్లో ఒక దాంట్లో వాటా విక్రయ ప్రయత్నాలు చేస్తున్నామని, అది పూర్తవ్వగానే ఈ బకాయిలను చెల్లిస్తామని, మార్చి కల్లా అన్ని బకాయిలను చెల్లిస్తామని కార్వీ వెల్లడించిందని వివరించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్ సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సెబీ బోర్డ్ ఆమోదించింది. సంతృప్తికరంగానే... ఈ నెలలోనే సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. తన హయాంలో పారదర్శకంగా, సంప్రదింపుల పద్ధతిలోనే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించామని, అధికారం చెలాయించడానికి ప్రయత్నించలేదని అజయ్ త్యాగి పేర్కొన్నారు. తన హయాం సంతృప్తికరంగానే గడిచిందని తెలిపారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్ కీలక నిర్ణయాలు ఇవీ..., ►కంపెనీల్లో చైర్మన్, ఎమ్డీ పోస్ట్ల విభజన విషయంలో పలు ఆచరణాత్మక, పరిపాలనా పరమైన సమస్యలున్నాయి. అందుకే ఈ పోస్ట్ల విభజనకు గడువును మరో రెండేళ్లు (2020, ఏప్రిల్ వరకూ) పొడిగించారు. ►స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ల పునః వర్గీకరణపై మరింత కసరత్తు జరుగుతోంది. త్వరలోనే మార్గదర్శకాలను వెల్లడించనున్నది. ►ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం మదుపు సలహాదారుల(ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల) అర్హతలను మరింత కఠినతరం చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఫీజులపై గరిష్ట పరిమితిని నిర్దేశించనున్నది. -
కార్వీ వ్యాపార పునర్వ్యవస్థీకరణ
హైదదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసులుకింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కమోడిటీల ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తదితర వ్యాపారాలను ఆరి్థక సేవల విభాగం కింద చేర్చనున్నట్లు కార్వీ వివరించింది. అలాగే, డేటా మేనేజ్మెంట్ సేవలు, డేటా అన లిటిక్స్, మార్కెట్ రీసెర్చ్, అనుబంధ వ్యాపారాలు.. ఆర్థికేతర విభాగం పరిధిలో ఉంటాయని పేర్కొంది. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపింది. ఆరి్థక సేవల వ్యాపార విభాగం గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది నియమితులైనట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్లో సుమారు మూడు దశాబ్దాలపైగా అనుభవం ఉన్న చతుర్వేది సారథ్యంలో సంస్థ కొత్త శిఖరాలు అధిరోహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చతుర్వేది గతంలో ధనలక్ష్మి బ్యాంక్, రిలయన్స్ ఏఎంసీ, ఐసీఐసీఐ, ఎస్సెల్ గ్రూప్ తదితర సంస్థల్లో పనిచేశారు. కార్వీ బ్రాండ్ను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా నిధుల సమీకరణతో సంస్థను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని చతుర్వేది తెలిపారు. -
బజాజ్ ఫైనాన్స్ స్వాధీనంలోకి ‘కార్వీ డేటా’ షేర్లు
న్యూఢిల్లీ: కార్వీ గ్రూప్ సంస్థకి ఇచ్చిన రుణాలు రాబట్టుకునే క్రమంలో కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ (కేడీఎంఎస్ఎల్) తనఖా ఉంచిన 24 లక్షల షేర్లను స్వాధీనం చేసుకున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఇది కేడీఎంఎస్ఎల్ పెయిడప్ క్యాపిటల్లో 10 శాతం వాటాకు సమానం. గ్రూప్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) తీసుకున్న రుణాల కోసం కేడీఎంఎస్ఎల్ ఈ షేర్లను తనఖా ఉంచింది. వీటి ముఖ విలువ రూ. 10. 2008లో ఏర్పాటైన కేడీఎంఎస్ఎల్ సంస్థ .. ఐటీ సేవలు అందిస్తోంది. 2018–19లో కంపెనీ టర్నోవరు రూ. 1,274 కోట్లు. -
కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్ సీడ్ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు పేరుకుపోవడం కార్వీ ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు ఒకరిని చూసి ఒకరు కార్వీపై ఫిర్యాదులు చేస్తున్నారు. తన ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను బ్యాంకు ఖాతాకు మళ్లించాల్సిందిగా కోరితే, సర్వర్ సమస్య అంటూ దాటవేస్తున్నారని దీపక్ ముంద్రా అనే ఇన్వెస్టర్ ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు కోరినా సర్వర్ సమస్య అంటున్నారని, కారీ్వలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోరినా చెల్లింపులు జరపడం లేదని, కార్వీ చర్యలతో నమ్మకం కోల్పోయామని పుణే ఇన్వెస్టర్ బందియా షా ఆవేదన వ్యక్తం చేశారు. కార్వీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, సాయం చేయాలంటూ సెబీని కోరారు. 20 రోజులుగా వెంటపడుతున్నా స్పందించడం లేదంటూ ఎంకేఆర్ అనే ఇన్వెస్టర్ ఆరి్థక శాఖకు విన్నవించారు. వందకుపైగా కాల్స్ చేసినా ఫలితం లేదని గీతేష్ యోలే అనే ఇన్వెస్టర్ ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ‘భారత్లో అసలేం జరుగుతోంది. బీఎంఏ దారిలో కార్వీ’ అని ట్వీట్ చేశారు. -
‘సిప్’లు ఆగటం లేదు!
స్టాక్మార్కెట్ సూచీలిపుడు గరిష్ట స్థాయిలకు 5–6% దూరంలో ఉన్నాయి. అలాగని షేర్లూ అదే స్థాయిలో ఉన్నాయని చెప్పలేం. బ్లూచిప్లతో సహా మిడ్, స్మాల్ క్యాప్... ఇలా చాలా షేర్లు వాటి ఏడాది కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. కొన్నయితే జీవితకాల కనిష్ట స్థాయిల్లోనూ ఉన్నా యి. మరి ఇలాంటపుడు మ్యూచ్వల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితేంటి? వాళ్ల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదంటారు కార్వీ స్టాక్ బ్రోకింగ్ థర్డ్ పార్టీ ఉత్పత్తుల హెడ్ డి.జయంత్ కుమార్. ‘‘ఫండ్ల పనితీరు... ఆ మార్కెట్ను బట్టేకదా ఉంటుంది? కాకపోతే నేరుగా ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసినవారు మరింత ఎక్కువగా నష్టపోయి ఉంటారు. ఫండ్ల ఇన్వెస్టర్లకు పరిమిత నష్టాలొచ్చాయి’’ అన్నారు . ఒకటి రెండేళ్లుగా సిప్ ఇన్వెస్టర్లూ నష్టాలు చూస్తుండటం నిజమేనని, డెట్ ఫండ్లు కూడా నష్టాలిచ్చాయని అంగీకరించారు. ‘‘గత రెండేళ్లుగా మార్కెట్లలో ఇండెక్స్ ఆధారిత కొన్ని షేర్లు పెరుగుతున్నాయి తప్ప విస్తృత స్థాయిలో మార్కెట్ పెరగటమనేది లేదు. అందుకే సిప్ ఇన్వెస్టర్లూ నష్టాలు చూస్తున్నారు’’ అని చెప్పారాయన. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివిధ అంశాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే... – సాక్షి, బిజినెస్ ప్రతినిధి ఒకప్పటితో పోలిస్తే సిప్ ఇన్వెస్టర్లలో పరిణితి పెరిగింది. గతంలో మార్కెట్లు పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్ చేయటం... తగ్గుతున్నపుడు ఆపేయటం చేసేవారు. ఇపుడు అలాకాదు. తగ్గుతున్నపుడు చేస్తేనే తరవాత మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే వారిపుడు సిప్ను కొనసాగిస్తున్నారు. కార్వీ పరిధిలోనైతే దాదాపు 15 లక్షల ఎంఎఫ్ ఖాతాలున్నాయి. కాకపోతే అందులో క్రియాశీలకంగా ఉండేవి 3 లక్షల వరకూ ఉంటాయి. మాకు 260 బ్రాంచీలు ఉండటంతో ఆయా ఖాతాల్ని ఫాలో అప్ చేయటం, సిప్ పద్ధతిని ఎంచుకోమని సలహా ఇవ్వటం వంటివి చేస్తున్నాం. కార్పొరేట్ క్లయింట్లకు ఇన్వెస్టర్ ఎడ్యుకేష¯Œ సదస్సులూ నిర్వహిస్తున్నాం. కార్వీని ఎంచుకున్న వారికి... నిజానికి బ్యాంకులతో సహా పలు సంస్థలు మ్యూచ్వల్ ఫండ్లలో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. కాకపోతే కొన్ని సంస్థలు కొన్ని ఫండ్లనే సూచించటం జరుగుతోంది. మేం థర్డ్ పార్టీ కనక అన్ని ఫండ్లనూ ప్రమోట్ చేస్తాం. పైపెచ్చు మా సంస్థకున్న పటిష్ఠమైన రీసెర్చ్ విభాగం, ఫండ్ మేనేజర్లతో టచ్లో ఉండి వాటి మంచిచెడులు తెలుసుకోవటం మా కస్టమర్లకు ఉపయోగపడతాయి. ఆయా ఫండ్లు వివిధ కంపెనీల్లో ఏ మేర ఇన్వెస్ట్ చేశాయో తెలుస్తుంది కనక.. అది మా కస్టమర్లకు కలిసి వస్తుంది. డైరెక్ట్ ఫండ్లతో పోలిస్తే... థర్డ్ పార్టీ ద్వారా కాకుండా నేరుగా ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి రెండు ఫండ్లు ఎంచుకుని వాటిలో 10–15 ఏళ్లు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫండ్స్ పనితీరు ఆధారంగా మార్పులు చేసుకోవాలనుకునే వారికి ఇది కరెక్ట్ కాదు. మా ఇన్వెస్టర్ల వరకూ వస్తే... మేం 6 నెలలు లేదా ఏడాదికోసారి సమీక్షిస్తాం. వారి వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్ చూసి.. వారితో మాట్లాడతాం. తగు సూచనలు చేస్తాం. క్వాలిఫైడ్ సలహాదారుల అవసరం ఉంది... ప్రస్తుతం దేశంలో ఇన్వెస్టర్లు మెల్లగా పెరుగుతున్నారు. కాకపోతే వారికి సరైన సూచనలిచ్చే క్వాలిఫైడ్ అడ్వయిజర్ల అవసరం చాలా ఉంది. ఎందుకంటే మ్యూచ్వల్ ఫండ్ల వరకూ వచ్చేసరికి రీసెర్చ్ చేసి ఏ ఫండ్ బాగుంటుందో సూచించే సంస్థలున్నాయి. కానీ ఈ రీసెర్చ్లో పోస్ట్మార్టం మాత్రమే ఉంటుంది. అంటే గత పనితీరు ఆధారంగానే వీళ్లొక అంచనాకు వస్తారు. మళ్లీ గత పనితీరు భవిష్యత్తుకు కొలమానం కాదని కూడా చెబుతారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే వ్యవస్థ లేదు. ఈక్విటీలా అలాంటి వ్యవస్థ రావాలి. బ్రోకింగ్ ఖాతాలకూ సూచనలు!! ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే తమ బ్రోకింగ్ ఖాతాదారులకు ప్రత్యేక సూచనలిస్తున్నట్లు కార్వీ ప్రయారిటీ ప్రొడక్ట్ హెడ్ రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘వీటిలో ఎఫ్అండ్ఓ, ఇంట్రాడే, మార్జిన్ ట్రేడింగ్ వంటివి మేం సిఫారసు చెయ్యటం లేదు. ఖాతాల్లో డైవర్సిఫికేషన్ సూచిస్తున్నాం. వ్యాపారం బాగుండి, సహేతుకమైన స్థాయిలో డెట్ టు ఈక్విటీ ఉండే కంపెనీలను సూచిస్తున్నాం. మార్కెట్లు మరీ దారుణంగా ఉంటే ఏడాదిలో గరిష్టంగా 15% వరకూ రిస్క్ ఉంటుందని చెబుతున్నాం. ఆ రిస్క్కు సిద్ధపడిన వారికే ఈ సేవలు అందిస్తున్నాం. కస్టమర్ల రిస్క్ ప్రొఫైల్ను బట్టే ఈ బ్రోకింగ్ ఖాతాలను హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ కూడా కార్వీకి ఉన్న పటిష్ఠమైన రీసెర్చ్ విభాగం మా కస్టమర్లకు ఉపయోగపడుతుంది’’ అని ఆయన వివరించారు. -
2019 హంగ్!
-
కరాటే ప్లేయర్ డింపుల్కు కార్వీ ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడలో ప్రతిభ కనబరుస్తోన్న క్రీడాకారిణి సూరపనేని డింపుల్ను ప్రోత్సహించేందుకు కార్వీ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలోని లాస్వెగాస్లో త్వరలో జరుగనున్న ఓపెన్, జూనియర్ ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్లో డింపుల్ 65 కేజీల మహిళల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నేపథ్యంలో ఆమె శిక్షణ కోసం కార్వీ సంస్థ ఆర్థిక సహాయం అందించింది. బుధవారం కార్వీ ఎండీ ఎం. యుగంధర్ ఆమెకు లక్ష రూపాయల చెక్ను అందించారు. గతంలో మలేసియాలో జరిగిన నైట్ ఇంటర్నేషనల్ కరాటే కప్లో డింపుల్ స్వర్ణాన్ని సాధించింది. జాతీయ స్థాయిలోనూ పలు టోర్నీల్లో విజేతగా నిలిచిన డింపుల్... 13 ఏళ్ల వయసులోనే కరాటే షోడాన్ టైటిల్ను సాధించింది. ప్రస్తుతం విజయవాడలో బీఈ కంప్యూటర్స్ చదువుతోంది. -
వచ్చే ఐదేళ్లు సెన్సెక్స్ సగటున 25 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో వచ్చే ఐదారేళ్లు ఈక్విటీలు ఏడాదికి సగటున 20 నుంచి 25 శాతం లాభాలను అందించే అవకాశం ఉందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేసింది. అంచనాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే 2020 నాటికి సెన్సెక్స్ కీలకమైన 1,00,000 పాయింట్లను దాటుతుందని కార్వీ పీఎంఎస్ హెడ్ వేణు గోయల్ తెలిపారు. అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా అన్ని అంశాలు ఈక్విటీ మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి, రానున్న కొద్ది సంవత్సరాలు సెన్సెక్స్ కంపెనీల ఆదాయం 20 నుంచి 25 శాతం వృద్ధి ఉంటే, అది సెన్సెక్స్ ఈపీఎస్కి 15 నుంచి 17 రెట్లకు సమానమని, ఈ విధంగా చూసినా సెన్సెక్స్ లక్ష మార్కును సులభంగా దాటుతుందన్నారు. 2012-13లో సెన్సెక్స్ కంపెనీల ఆదాయంలో 5 శాతం వృద్ధి ఉంటే అది 2013-14కి 10 శాతానికి చేరిందని, అది ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని కార్వీ తన నివేదికలో పేర్కొంది. అత్యాశ కాదు.. ఐదేళ్లలో సగటున 20 నుంచి 25 శాతం రాబడిని ఆశించడం అత్యాశ కాదని, అంతర్జాతీయ మార్కెట్లలో పలు సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కార్వీ ఆ నివేదికలో పేర్కొంది. ముఖ్యం గా 1980వ దశకంలో డౌజోన్స్ వ్యవహరించిన తీరుకు ఇప్పటి మన మార్కెట్లకు చాలా సామీప్యం ఉంది. 1982లో 777 పాయింట్ల వద్ద ఉన్న డౌజోన్స్ కేవలం ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగి 2,742 పాయింట్లకు చేరింది. 1987లో భారీ పతనం తర్వాత 1990 వరకు ఒక పరిమిత శ్రేణిలో కదిలింది. ఆ తర్వాత ప్రారంభమైన ర్యాలీ ఆగకుండా పదేళ్లు కొనసాగి డౌజోన్స్ 11,750 పాయింట్లకు పెరిగింది. అంటే 18 ఏళ్లలో డౌజోన్స్ ఇన్వెస్టర్లకు 1,500%కిపైగా లాభాలను అందించింది. ఇప్పుడు మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని కార్వీ తన నివేదికలో పేర్కొంది. అన్ని శుభ సూచనలే.. ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 6 శాతానికి చేరుకొని అది రానున్న కాలంలో 8 శాతానికి చేరుతుందని కార్వీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, సేవల రంగాల వృద్ధి బాగుంటుందని, దీనికి వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తోడైతే తయారీ రంగం కూడా గాడిలో పడుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలతో పెట్టుబడులు ఊపందుకుంటాయని పేర్కొంది. ఇప్పటికే 2013లో ఎఫ్ఐఐలు 20 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ఈ ఏడాది మరింత అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెట్టుబడుల వాతావరణం మెరుగవుతుండటం, అమెరికా, యూరోప్ ఆర్థిక వ్యవస్థలు వృద్ధిబాటలో పడుతుండటం ఇలా అన్ని ఈక్విటీలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిం టినీ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నట్లు కార్వీ పేర్కొంది.