లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Oct 28 2024 3:52 PM | Updated on Oct 28 2024 4:30 PM

Stock Market Closing Update

సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 602.75 పాయింట్ల లాభంతో 80,005.04 వద్ద, నిఫ్టీ 158.35 పాయింట్ల లాభంతో 24,339.15 వద్ద నిలిచాయి. గత వారం భారీ నష్టాల్లో అడుగులు వేసిన స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది.

శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐచర్ మోటార్స్, విప్రో, కెనరా బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement