
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 79,454.47 వద్ద, నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 24,008.00 వద్ద నిలిచాయి.
ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, మయూర్ యూనికోటర్స్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ, ప్లాటినం ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నవకర్ అర్బన్స్ట్రక్చర్, చెంబాండ్ కెమికల్స్, సీపీ క్యాపిటల్, ముత్తూట్ మైక్రోఫిన్, ఏజీఐ ఇన్ఫ్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).