లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi

లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

Jun 20 2024 9:18 AM | Updated on Jun 20 2024 4:14 PM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 23,539కు చేరింది. సెన్సెక్స్‌ 116 పాయింట్లు పుంజుకుని 77,456 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 85.16 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం, నాస్‌డాక్‌ 0.03 శాతం  లాభాల్లోకి చేరాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతోపాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీల స్థిరంగా కదలాడేందుకు దోహదం చేశాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్‌ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే..ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు విశ్వసిస్తున్నాయి. బుధవారం ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.7,908 కోట్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.7,107  కోట్ల విలువచేసే షేర్లును కొనుగోలు చేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement